Singotam Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం - సింగోటం
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgVMrY4X12cEbkD6DyKcE6edN8zwtF5HzFPbYGkMsl40wIZQ6aJaotEacnlZyH7gdGZaWvhdWiG_rR2Qt7QCGFrM13WGqcOkeq7kh-TspRgGB0QlGmjwQDkesYzxYC0EUaUul8LnLheLthLVk8Q132pG6o7IBmOa96T03vIB9PdAvAa6hk0Tu3A3_dyjEtx/w640-h482/singotam%20temple%201.jpg)
తెలంగాణ రాష్ట్రంలో నరసింహస్వామి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో సింగోటం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఒకటి. మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ మండల కేంద్రానికి 10 కి.మీ. దూరంలో ఉన్న సింగవట్నం అనే గ్రామంలో శ్రీలక్ష్మీనృసింహస్వామిదేవాలయం ఎంతో ప్రఖ్యాతిగలది. సింగవట్నమే ఇప్పుడు సింగోటం. శ్రీలక్ష్మీనరసింహస్వామివారు ఈ క్షేత్రంలో లింగాకారంలో స్వయంభువుగా వెలిసారు. శివకేశవులకు భేదం లేదన్నట్టుగా రాతిలింగంపై త్రిపుండ్రాలు, ఊర్ధ్వపుండ్రం గుర్తులు ఉండడం ఇక్కడివిశేషం. శ్రీ లక్ష్మీనరసింహస్వామివారు సింగోటంలో వెలియడానికి 600 సంవత్సరాలక్రితం నాడు జరిగిన ఒక చారిత్రకగాథ ప్రచారంలో ఉంది. జటప్రోలును పరిపాలిస్తున్న సురభి వంశీయులపాలనలో ఈ గ్రామం ఉండేది. సురభి వంశీయులలో పదకొండవతరంవాడైన సింగమ భూపాలుడు పాలిస్తున్నకాలంలో జరిగినకథ ఇది. ఒకరోజు సింగవట్నం గ్రామానికి చెందిన ఒక యాదవుడు తనపొలంలో నాగలిదున్నుతూ ఉండగా ఆ నాగలి కొనకు ఒకరాయి తగిలింది. ఎంతప్రయత్నించినా నాగలి ముందుకు కదలలేదు. అప్పుడు అతడు ఆ రాయిని తీసి, ఒడ్డున పెట్టి, తిరిగి వచ్చి, నాగలితో పొలం దున్నుతూన్నాడు. ఆ రాయి దొర్లుకుంటూ వచ్చి, మళ్లీ నాగలికి అడ్డు పడింది. ర