Posts

Showing posts from June, 2024

Singotam Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం - సింగోటం

Image
తెలంగాణ రాష్ట్రంలో  నరసింహస్వామి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో సింగోటం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఒకటి. మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ మండల కేంద్రానికి 10 కి.మీ. దూరంలో ఉన్న సింగవట్నం అనే గ్రామంలో శ్రీలక్ష్మీనృసింహస్వామిదేవాలయం ఎంతో ప్రఖ్యాతిగలది. సింగవట్నమే ఇప్పుడు సింగోటం. శ్రీలక్ష్మీనరసింహస్వామివారు ఈ క్షేత్రంలో లింగాకారంలో స్వయంభువుగా వెలిసారు. శివకేశవులకు భేదం లేదన్నట్టుగా రాతిలింగంపై త్రిపుండ్రాలు, ఊర్ధ్వపుండ్రం గుర్తులు ఉండడం ఇక్కడివిశేషం. శ్రీ లక్ష్మీనరసింహస్వామివారు సింగోటంలో వెలియడానికి 600 సంవత్సరాలక్రితం నాడు జరిగిన ఒక చారిత్రకగాథ ప్రచారంలో ఉంది. జటప్రోలును పరిపాలిస్తున్న సురభి వంశీయులపాలనలో ఈ గ్రామం ఉండేది. సురభి వంశీయులలో పదకొండవతరంవాడైన సింగమ భూపాలుడు పాలిస్తున్నకాలంలో జరిగినకథ ఇది. ఒకరోజు సింగవట్నం గ్రామానికి చెందిన ఒక యాదవుడు తనపొలంలో నాగలిదున్నుతూ ఉండగా ఆ నాగలి కొనకు ఒకరాయి తగిలింది. ఎంతప్రయత్నించినా నాగలి ముందుకు కదలలేదు. అప్పుడు అతడు ఆ రాయిని తీసి, ఒడ్డున పెట్టి, తిరిగి వచ్చి, నాగలితో పొలం దున్నుతూన్నాడు. ఆ రాయి దొర్లుకుంటూ వచ్చి, మళ్లీ నాగలికి అడ్డు పడింది. ర

Bedi Anjaneya Temple: శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం - తిరుమల

Image
తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయానికి సన్నిధిలో శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో కొలువైన స్వామికి బేడి ఆంజ నేయస్వామి అని పేరు. అంజనాద్రి పర్వతంపై అల్లరిగా తిరుగుతూ ఉన్న ఆంజనేయ స్వామి కాళ్ళకు, చేతులకు బేడీలు తగిలించి ఎక్కడికీ కదలకుండా శ్రీవేంకటేశ్వర స్వామికి ఎదురుగా ఆంజనేయ స్వామిని, ఆయన తల్లి అంజనాదేవి నిలబెట్టినట్లు కథనం. అందువల్లనే ఈయనకు బేడి ఆంజనేయస్వామి అనిపేరు. ఈ ఆలయంలో రోజూ పూజలు, నివేదనలు జరుగుతాయి. ప్రతి ఆదివారం ఉదయం స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ప్రతి నెలా పునర్వసు నక్షత్రం రోజున శ్రీసీతారామ లక్ష్మణులు ఊరేగింపుగా ఈ ఆలయానికి విచ్చేస్తారు.

Shani Shinganapur Temple: శని శింగణాపూర్ ఆలయం

Image
మహారాష్ట్రలోని ఆహ్మద్ నగర్ జిల్లాలో ఉంది శింగనాపూర్ గ్రామం. ఇక్కడ శనిశ్చరుని ఆలయం చాలా ప్రాచూర్యం పొందింది. అది కాకుండా ఈ ఊరిలోని ఏ ఇంటికీ కూడా ప్రధాన ద్వారానికి తలుపులు ఉండవు. ఇళ్లకే కాదు షాపులకు కూడా తలుపులు, గొళ్లాలు ఉండవు. అలాగే ఇక్కడి ఆలయాలకు కూడా తలుపులు ఉండవు. అక్కడి శనిశ్వరుడి ఆలయానికైతే ఏకంగా పైకప్పే ఉండదు. ఇక్కడ శనీశ్వరుడు స్వయంభూగా నల్లనిరాయి రూపంలో వెలిశాడని నమ్మకం గొర్రెల కాపరులు ఈ శనీశ్వరుని కనుగొన్న రోజు రాత్రి ఒక గొర్రెల కాపరి కలలో శనీశ్వరుడు కనిపించి తనను ఎలా సంతుష్టుడిని చెయ్యాలో, ఎలా ఆరాధించాలో విధివిధానాలను వివరించడాడని చెబుతారు. కొన్ని ప్రత్యేక నియమాలను, విధులను శనీశ్వరుడు స్వయంగా ఆ గొర్రెల కాపరికి వివరించాడట. అప్పుడు ఆ కాపరి ’మరి ఆలయ నిర్మాణం చేపట్టాలా‘ అని శనీశ్వరుని అడిగినపుడు ఆలయానికి పైకప్పు అవసరం లేదని ఆయన చెప్పాడట. ఈ అనంత నీలాకాశమే తనకు పైకప్పు అని చెప్పినట్టు స్థల పురాణం. అందుకే ఇక్కడి మూలవిరాట్టు తలమీద పై కప్పు లేకుండా ఆవరణలో ఉంటుంది. ఈ ఆలయానికి కిలోమీటరు పరిధిలో ఉన్న ఏ వ్యాపారస్థలానికైనా, ఇంటికైనా సరే ప్రధాన ద్వారానికి తలుపులు గడియలు ఉండవు. ఎందుకంటే శనీశ్

Mehandipur Balaji Temple: మెహందీపూర్ బాలాజీ ఆలయం - రాజస్థాన్

Image
రాజస్థాన్ ఆరావళి పర్వతాల సమీపం నడుమ దౌసా అనే జిల్లాలో ఉందీ మెహందీపూర్ బాలాజీ ఆలయం.  రాజస్థాన్ నుంచి మాత్రమే కాదు..ఆ చుట్టుపక్క రాష్ట్రాల నుంచి మెహందీపూర్ బాలాజీ దర్శనానికి వస్తుంటారు.  వేల సంవత్సరాలకు ముందు ఓ భక్తుడికి ఆంజనేయుడు బాలుడి రూపంలో కనిపించి తన జాడ చెప్పాడట.ఆ భక్తుడు ఎంత వెతికినా హనుమంతుడు కనిపించకపోవడంతో మళ్లీ కఠినమైన సాధన చేశాడట..అప్పుడు మరోసారి కలలో కనిపించి తాను వెలసిన ప్రదేశం గురించి స్పష్టత నిచ్చాడట.అప్పుడు ప్రతిష్టితమైన వాయుపుత్రుడు నిత్యం పూజలందుకుంటున్నాడు.   స్వామి బాలహనుమంతుడిగా వెలిసిన ఈ ప్రదేశంలోనే మరో రెండు విగ్రహాలు దర్శించుకోవచ్చు. శివుని ఉగ్రరూపమైన భైరవుని సూచించే విగ్రహం ఒకటి...దుష్టశక్తులకు రాజుగా భావించే ‘ప్రేతరాజు’ విగ్రహం మరొకటి. వేల ఏళ్ల క్రితమే ఇక్కడ పూజలు మొదలైనాకానీ...ఆంజనేయుడి అసాధారణ  మహిమలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దుష్టశక్తులతో బాధలు పడేవారు, మానసికరోగులు, మూర్ఛరోగులు, సంతాన సమస్యలతో బాధపడుతున్నవారు మెహందీపూర్ బాలాజీ ఆశీస్సులు  పొందితే పరిష్కార మార్గం దొరుకుతుందని భక్తుల నమ్మకం. ఉగ్రుడైన స్వామి వారి పాదాలదగ్గర నిత్యం నీరు ప్రవహిస్తుంటుంది. ఆ 

Ganga Snan: కాశీ గంగ స్నాన మహత్యం (స్కాంద పురాణం)

Image
   కలిదోషాల్ని పరిహరించటంలో గంగానదితో సమానమైన తీర్థం మరొకటి లేదు. అలాగే ముక్తిని ప్రదానం చేసే దివ్యక్షేత్రాలలో కాశీ క్షేత్రాన్ని మించిన క్షేత్రం లేదు. గంగానదిలో తిథివార నక్షత్ర నియమాలు లేకుండానే స్నానం చేయవచ్చు. కాశిలో ఉన్న గంగని సేవించినవాడు, గంగా దేవికి మందిరాన్ని నిర్మించినవాడు సమస్త సుఖభోగాల్ని పొందుతాడు. గంగాదేవిని స్మరించినా, ఆమె మహిమని విన్నా, వినిపించినా వారికి గంగాస్నానఫలం దక్కుతుంది. పితృదేవతల్ని ఉద్దేశించి వారి పేర్లు స్మరిస్తూ గంగలోని నీళ్ళతో ఏ శివలింగానికి  అభిషేకం చేసినా, వారి పితరులకి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. గంగాజలంతో సూర్యుడికి అర్హ్యాలు సమర్పిస్తే ఆరోగ్యం పెంపొందుతుంది. గంగాస్నానం చేసే వారి జోలికి యమదూతలు ఎప్పుడూ రారు. కాశీలోని గంగా తీరంలో గోదానం, భూదానం, సువర్ణదానం, అన్నదానం చేసిన వారికి పునర్జన్మ ఉండదు. మకరసంక్రమణం, ఉత్తర, దక్షిణాయనాలు, సూర్య చంద్రగ్రహణాలు తదితర పర్వదినాలలో కాశీ గంగలో చేసే స్నానం అనంతమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. జ్యేష్ఠమాసం శుద్ధ దశమీ హస్తానక్షత్రం ఉన్న రోజు గంగాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆ రోజు దశహర గంగాస్తోత్రాన్ని శ్రద్ధగా పఠించి గంగాస్

Human Duties: మానవ ధర్మములు

Image
1. ఉదయం నిద్రనుండి లేచినపుడు కుడి ప్రక్కకు తిరిగి లేవండి ఆరోగ్యం. 2. లేచిన వెంటనే రెండు అరచేతులు చూస్తూ॥ కరాగ్రే వసతేలక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేస్థితే గౌరి ప్రభాతే కరదర్శనం" అని అనుకోండి. 3. కుడికాలు మంచంమీద నుండి క్రింద పెడుతూ “సముద్ర వసనేదేవి పర్వతస్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శక్షమస్వమే” అని భూమాతకు నమస్కరించండి 4. లేచిన వెంటనే కప్పుకున్న దుప్పటిని, ప్రక్క బట్టలను అన్నింటినీ చక్కగా మడతపెట్టండి. తదుపరి కాలకృత్యాలు పూర్తి చేయండి. 5. ఉదయాన్నే ముందురోజు రాత్రి రాగిపాత్రలో పోసిఉంచిన నీరు త్రాగండి. 6. వ్యాయామం (నడక) కనీసం ఉదయం 9 ని॥ల నడవండి. 7. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి సర్మడే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అనుకుంటూ చన్నీటి స్నానం చేయండి. 8. సూర్యునకు ఎదురుగా గాని, నడుస్తూగాని దంతధావన చేయరాదు. 9. మూత్రవిసర్జన సూర్య, చంద్రులకు ఎదురుగా చేయరాదు. 10. స్నానానికి చన్నీటి స్నానం ఉత్తమమైనది. 11. తెల్లవారు ఝామున 4-5 గంటల మధ్య చేసే స్నానం ఋషి స్నానం 5-6 గంటల మధ్య చేసే స్నానం దైవ స్నానం 6-7 గంటల మధ్య చేసే స్నానం మానవ స్నానం 7-8 గంటల మధ్య చేసే స్నానం రాక్షస స్నానం 12. చన్

Bhadrachalam Temple: శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం - భద్రాచలం

Image
శ్రీరామచంద్రమూర్తి పాదధూళితో పునీతమైనదివ్యస్థలం. పవిత్రగోదావరినదీ తీరంలో పుణ్యపురాశిగా విరాజిల్లుతూ ఉన్న మహిమాన్వితపుణ్యక్షేత్రం భద్రాచలం. ఈ క్షేత్రం. ఖమ్మంజిల్లాలో ఉంది.  భద్రాచలానికి ఒకప్పుడు దండకారణ్య మని పేరు. పితృవాక్యపాలకుడైన శ్రీరాముడు అరణ్యవాసం చేస్తూ కొంతకాలం ఈ దండకారణ్యంలో గడిపాడు. ఈ సమయంలో ఒక శిలపై విశ్రమించి, ఆ శిలను ఆశీర్వదించగా, ఆ శిల మరుజన్మలో మేరువు, మేరుదేవిదంపతులకు భద్రుడుగా జన్మించి, నారదుడినుంచి రామమంత్రోపదేశాన్ని పొంది, తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి, శ్రీరాముడు ప్రత్యక్షమై, భద్రుడికోరికపై అక్కడే కొలువుదీరినట్లు కథనం.  బ్రహ్మపురాణం ప్రకారం పర్వతరాజు అయిన మేరువు బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. తపస్సును మెచ్చి, బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాగా మేరువు రామభక్తిపరుడైన కుమారుడిని ప్రసాదించ మని వరం కోరాడు. బ్రహ్మవరం ప్రసాదించాడు. వరంమేరకు మేరువుకు రామభక్తిపరుడైన 'భద్రుడు' కుమారుడిగా జన్మించాడు. భద్రుడు రామదర్శనం కోరి ఘోరతపస్సు చేశాడు. తపస్సును మెచ్చి శ్రీరాముడు శంఖ, చక్ర, ధనుర్భాణాలను ధరించి ప్రత్యక్షంకాగా ఆ రూపంలోనే తన శిరస్సుపై నివాసం ఉండ మని భద్రుడు వరం కోరాడు. అ

Ahobilam Temple: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం - అహోబిలం

Image
అహోబిలం... ప్రసిద్ధి గాంచిన ఈ పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని  కర్నూలు జిల్లాలోని 'నంద్యాల' నుండి 42 కి. మీ దూరంలో ఉంది. నవనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన ఈ క్షేత్రం క్రీ.శ.1398లో స్థాపితమైనదవటం విశేషం. ఈ క్షేత్రం అతిపురాతనమైనదని నృసింహ పురాణం ప్రకారం వెల్లడవుతోంది. 108 దివ్యక్షేత్రాలలో మొదటిది తిరుమల కాగా రెండవది అహోబిలం. స్వామి యొక్క తొమ్మిది రూపాలు ఇక్కడ ఒకేచోట నెలకొని ఉండటం ఈ ఆలయ ప్రాముఖ్యత అని చెప్పుకోవచ్చు. అయితే దిగువ అహోబిలం, ఎగువ అహోబిలంగా స్వామి రెండు ప్రదేశాలలో దర్శనమిస్తారు. దిగువ అహోబిలంలో స్వామి సమీపంలోనే భార్గవ, యోగానంద, ఛత్రవట నారసింహులు దర్శనమిస్తారు. ఇంక ఎగువ అహోబిలమునకు సమీపంలో వరాహ, కారంజ, మాలోల, జ్వాలా, పావన నారసింహలు దర్శనమిస్తారు.  నృసింహ పురాణం ప్రకారంగా ఈ ప్రదేశమునందే తన భక్తుడైన ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుని బారినుంచి రక్షించుటకు స్వామి స్తంభం నుంచి ఉగ్రాకారమైన నృసింహ ఆకారంలో ఉద్భవించాడు. ఇప్పటికీ ఉగ్రస్తంభం అక్కడ కనిపిస్తుంది.  ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు భైరవుడు. నల్లమల కొండలపై నెలకొన్నది అహోబిలం. నల్లమల కొండలు శేషుని ఆకారమనీ, శేషుని శిరస్సుపై తిరుమల

Subramanya Swamy Temple: మట్టిని ప్రసాదంగా ఇచ్చే సుబ్రమణ్య స్వామి ఆలయం

Image
మృత్తికా ప్రసాదం అంటే ప్రసాదరూపంగా మట్టిని ఇచ్చే దేవాలయం మన దేశంలో ఒక్కటే ఉంది. అన్ని దేవాలయాల్లో ప్రసాదంగా భక్తులకు విభూది, కుంకుమ, చందనం తదితరాలను ఇస్తే, కర్నాటకలోని కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి వెళ్ళితే అక్కడి దేవాలయంలో భక్తులకు వల్మీక మృత్తిక (పుట్టమన్ను) ను ప్రసాదరూపంలో అందిస్తారు. ఉడిపి సమీపంలో ఉన్న నాగబనగహళ్లి పట్టణంలో ఉండే ఈ దేవాలయంలో ఇచ్చే మృత్తికా ప్రసాదం అత్యంత పవిత్రమైంది. మహిమాన్వితమైంది.  మృత్తికా ప్రసాదాన్ని ఎవరు ధరిస్తారో వారికి నాగుల భయం ఉండదు. నాగ దేవతల అనుగ్రహం ఉంటుంది. ఎవరైతే పాములను చూసి భయపడతారో, ఎవరికైతే కలలో పాములు ఎక్కువగా కనబడుతుంటాయో అటువంటి వారు మృత్తికా ప్రసాదాన్ని ధరిస్తే సర్పాల భీతి తొలగిపోతుంది. ఆడపిల్లలు ఒక చిటిక మృత్తికను మరో చిటికెడు పసుపును స్నానం చేసే నీటిలో వేసి స్నానం చేసి, తరువాత శ్రీ సుబ్రహ్మణ్యుడికి నేతి దీపాన్ని వెలిగిస్తే వివాహం త్వరగా అవుతుంది. నోటిపళ్ళను కొరుకుతూండటం, కిందపడి కొట్టుకోవడం, ఒకేవైపు తదేకంగా చూస్తూండటం, అదే పనిగా ఏడుస్తూండటం చేసే చిన్నపిల్లల నుదుటన మృత్తికను బొట్టుగా పెడితే వారు ఆరోగ్యంగా ఎదుగుతారు. అనారోగ్యంతో బాధ

Hemavathi Siddeshswara Temple: శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం

Image
విగ్రహరూపంలో పరమేశ్వరుడు పూజలందుకునే  ఆలయాలు ఏపీలో రెండున్నాయి. వాటిలో ఒకటి చిత్తూరు జిల్లా గుడిమల్లం అయితే మరొకటి సత్య సాయి జిల్లా అమలాపురం మండలం హైమావతి గ్రామంలో ఉంది. హైమావతి పేరు కాలక్రమేణా హేమావతిగా మారింది.  క్రీ.శ. 9-10 శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో శివుడు విగ్రహరూపంలో సిద్ధాసనంలో కూర్చుని ఉంటాడు. గర్భగుడిలో ఉన్న పరమేశ్వరుడి విగ్రహం 5.5 అడుగులు. హేమావి క్షేత్రానికి నోలంబుల రాజుల కాలంలో హేంజేరు అని మరో పేరు ఉండేది. ఈ ప్రాంతాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని సుమారు 32 వేల గ్రామాలను నోలంబ రాజులు పాలించేవారనీ ఇక్కడున్న శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. 32 వేల గ్రామాలంటే...ప్రస్తుతం ఉన్న అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటూ కర్ణాటకలోని తూముకురు, చిత్రదుర్గం, కోలార్, తమిళనాడులో  సేలం, ధర్మపురి జిల్లాల్లో గ్రామాలున్నీ పాలించేవారు.  నోలంబ రాజుల్లో ముఖ్యుడైన రాజమహేంద్రుడికి సంతానం లేదు. ఎన్నో పూజలు హోమాలు చేశారు. ఓరోజు రాజమహేంద్రుడి కలలో కనిపించిన పరమేశ్వరుడు..తన విగ్రహం ప్రతిష్టిస్తే సంతాన ప్రాప్తి ఉంటుందని, రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెప్పాడు. కలలో శివుడు చెప్పినట్టే విగ్రహం ప్రతిష్టించాడు. ఈ ఆల

Kokilavan Shani Temple: కోకిలా వన్ శని దేవాలయం

Image
ఉత్తరప్రదేశ్ లోని మథుర సమీపంలో కోసికలాన్ లో ప్రసిద్ధ శని దేవ్ దేవాలయం ఉంది. దీనిని కోకిలవన్ ధామ్ అని కూడా పిలుస్తారు. శని దోషం నుంచి బయటపడేందుకు అత్యంత ప్రభావవంతమైన కోకిలవన్ శనిదేవ్ ని దర్శిస్తారు. ఈ దేవాలయాన్ని బాబా బర్ఖండికి అకింతం చేశారు. దట్టమైన అడవుల్లో ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయం బర్సానాకు సమీపంలో ఉంది. పురాణాల ప్రకారం, ఈ ప్రాంతంలో శ్రీక్రిష్ణుడు కోకిల రూపంలో శనికి దర్శనమివ్వడంతో ఈ ఆలయాన్ని కోకిల వనం అని పిలుస్తారు. బ్రిజ్మండల్ లో జన్మించిన శ్రీకృష్ణుడిని దేవతలందరూ అభినందించారు. ఈ దేవతల్లో శనిదేవుడు కూడా ఉన్నారు. అయితే కృష్ణుడి తల్లి యశోద శనిదేవుడిని చూడకుండా అడ్డుకుంటుంది. శనిదేవుడి వక్రదృష్టితో శ్రీకృష్ణుడిపై పడుతుందేమోనని యశోద ఆందోళనపడుతుంది. యశోద ప్రవర్తనతో నిరాశ చెందిన శనిదేవుడు కృష్ణుడిని శాంతింపజేయడానికి ద్వాపరయుగంలో కఠోర తపస్సు చేశారు. శనిదేవుడి తపస్సుకు సంతోషించిన కృష్ణుడు కోకిల రూపంలో ప్రత్యక్షమయ్యాడు. నందగావ్ పక్కనే ఉన్న కోకిల వనమే తన వనమని కృష్ణుడు చెప్పాడు. కోకిలవనంకు వచ్చిన శనిదేవుడిని మొక్కుకునే ప్రతిఒక్కరికి శనిదేవుడితోపాటు కృష్ణుడు అనుగ్రహం లభిస్తుందని కృష్ణుడు చెబుతా

Lord Vinayaka: వినాయక స్వామి ప్రత్యేకతలు

Image
  వినాయకుడు అనేపదానికి 'అణచువాడు' అని అర్ధం అంటే విఘ్నాలను అణచి వేయనట్టి దైవమని అర్థంచేసుకోవాలి. వినాయకునికి కావలసిన ఉదారత, ఉష్ణలత, విద్య, విజ్ఞానం, నేర్పు, విజ్ఞత, వివేకం, విచక్షణ, చతురత మొదలైన విశిష్ట లక్షణాలు గల దైవమే వినాయకుడు. ఆకృతిని బట్టి కొన్ని పేర్లు, ఆధిపత్యాన్ని అనుసరించి కొన్ని పేర్లు గణపతికి కలిగినప్పటికీ ప్రధానంగా ఈదైవం గణాలకు నాయకుడు. వినాయకుడు తన భక్తులను త్వరగా అనుగ్రహించి, సుఖసంతోషాలను ప్రసాదిస్తాడు. వినాయకుడు సస్యకారకుడు. మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని పూజించిన అనంతరం, పొలాల్లో ఉంచితే పొలాలు సస్యశ్యామలమవుతాయని ప్రతీతి.  గణనాధుడు సఫలత్వ శక్తికి అధిష్ఠానదేవత. కనుకనే తొలిపూజలందే వేల్పుగా గుర్తించారు. అలా చేయడం వల్ల తలపెట్టిన కార్యాలు ఫలవంతమై సకల సౌభాగ్యాలు పొందగలుగుతారు. గణనాధునికి కొబ్బరి నూనెతో దీపారాధన శ్రేష్ఠం వినాయకునికి కుడుములు, ఉండ్రాళ్ల, లడ్లు, చెరుకుగడలు, అరటిపండ్లు, నారికేళ (కొబ్బరి) ఫలాలు, మాదీఫలాలు, గారెలు, అప్పములు ప్రీతికరమైనవి.

Famous Rivers: మనదేశంలో అత్యంత పవిత్రంగా కొలిచే 10 నదులు

Image
భారతదేశంలోని 10 అత్యంత పవిత్రమైన, దైవంగా భావించి పూజింపబడే నదుల గురించి తెలుసుకుందాం. గంగ నది  గంగా నది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన నదులలో ఒకటి.  హిమాలయాల్లో ఉద్భవించి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. హిందూ మతంలో గంగను గంగా దేవతగా పూజిస్తారు. హిందువులకు అత్యంత పవిత్రమైన నది. గోదావరి  గోదావరి నది దక్షిణ భారతదేశంలో అతి ముఖ్యమైన నది. ఈ నది హిందువులకు పవిత్రమైనది. దీనిని దక్షిణ భారతదేశంలోని దక్షిణ గంగ లేదా వృద్ధ గౌతమి అని కూడా పిలుస్తారు. గోదావరి ఒడ్డున అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో త్రయంబక్ కొండలలో పుట్టింది. ఇది చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించిన తర్వాత బంగాళాఖాతంలో కలుస్తుంది.  యమున యమునా నది భారతదేశంలోని మూడవ పవిత్ర నది. గంగానదికి ఉపనది. హిమాలయాలలోని యమునోత్రి నుండి ఉద్భవించి అలహాబాద్‌లోని త్రివేణి సంగమంలో కలుస్తుంది. యమున నది ఒడ్డున ఢిల్లీ, ఆగ్రా,  మధుర నగరాలు  ఉన్నాయి. నర్మదా  నర్మదా నది భారతదేశంలోని పది పవిత్ర నదులలో ఒకటి. ఇది మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్‌లోని మైకాల్ శ్రేణుల్లో జ

Dont's after Sunset: సూర్యాస్తమయం తర్వాత చేయకూడదని పనులు

Image
  సూర్యాస్తమయం తర్వాత చేయకూడని కొన్ని పనులు  సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళు కొన్ని పద్ధతులను, నియమాలను పద్ధతిగా ఆచరిస్తుంటారు. వాటిని పాటించాలని తర్వాతి తరానికి చెబుతుంటారు. సూర్యుడు అస్తమించిన తర్వాత లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టే సమయంగా భావిస్తారు. ఆ సమయంలో చీపురుతో ఇల్లు శుభ్రం చేస్తే ఆ ఇంట్లో సంతోషం పాటూ లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్లిపోతుందని భావిస్తారు. అందుకే లైట్లు వేశాం కదా ఇల్లు ఊడ్చొద్దు అని చెబుతారు. అయితే సూర్యస్తమయానికి ముందు ఇల్లు శుభ్రం చేయడం చాలా మంచిది..ఇలా చేస్తే ఈ ఇంట్లో శుభం జరుగుతుంది. నిత్యం తులసిని పూజించే ఇళ్లలో లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని...సాయంత్రం పూట తులసిని తాకడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని నమ్మకం. అందుకే సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను తాకడం నిషిద్ధం. సంధ్యాసమయంలో నిద్రపోవడం వల్ల దేవతల ఆశీర్వచనాలు ఉండకపోగా రాక్షస బుద్ధి పెరుగుతుంది. ఈ సమయంలో నిద్ర ఆరోగ్యపరంగా కూడా చెడు ప్రభావం చూపిస్తుంది. సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో దుష్ట శక్తుల ప్రభావం పెరుగుతుంది..అలాంటి సమయంలో ఇల్లంతా వెలుగుతో నిండి ఉంటే నెగిటివ్ ఎనర్జీ దరిచేరదు. అందుకే సంధ్యాసమయంలో ఇంటిన

Varjyam: వర్జ్యం అంటే ఏమిటి ?

Image
  వర్జ్య కాలం అంటే విడువ తగిన కాలం, అశుభ సమయం. అంటే వర్జ్యం వున్న సమయాన్ని విడిచిపెట్టాలని శాస్త్రం చెబుతోంది. వర్జ్యంలో ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడంగానీ, శుభకార్యాలకి బయలుదేరడం కాని చేయకూడదు. వర్జ్యంలో దైవకార్యాలు గానీ, శుభకార్యాలుగాని చేయకూడదని అంటూ వుంటారు కాబట్టి, ఆ సమయంలో దైవారాధనకి సంబంధించిన అన్ని పనులతో పాటు, శక్తి కొద్ది దానం కూడా చేయవచ్చని శాస్త్రం చెబుతోంది. వర్జ్యం వున్నప్పుడు దైవనామస్మరణ , పారాయణం ,  స్తోత్ర పఠనం , సంకీర్తన ,  భజనలు మొదలైనవి చేయవచ్చని శాస్త్రం చెబుతోంది. ఈ విధంగా చేయడం వలన వర్జ్యం కారణంగా కలిగే దోషాలు ఏమైనా వుంటే అవి తొలగిపోతాయనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

Kamakshi Deepam: కామాక్షీ దీపం దాని వైశిష్ట్యం

Image
  కామాక్షీ దీపం అంటే దీపపు ప్రమిదకు గజలక్ష్మీ చిత్రం ఉంటుంది.  ఈ దీపాన్ని గజలక్ష్మీ దీపం అనికూడా అంటారు. దీపాన్ని వెలిగించినపుడు ఆ దీపపు వెలుగులో కామాక్షీ దేవి నిలిచి ఉంటుంది. కాబట్టే దీన్ని కామాక్షీ దీపం అంటారు. ఇక కామాక్షి దేవి ప్రత్యేకత గురించి చెప్పుకుంటే సర్వదేవతలకూ శక్తినిచ్చే శక్తి కామాక్షిదేవికి ఉంటుందని ప్రతీతి.  కామాక్షీ దేవి కోవెల లేదా గుడి తెల్లవారుఝామున అన్ని దేవాలయాలకన్నా ముందే తెరుస్తారు. ఆ తరువాత రాత్రి పూట దేవాలయాలన్నీ మూసిన తరువాత మూసివేస్తారు.  ఇకపోతే ఈ కామాక్షి దీపం స్వయానా అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు.  అలాంటి కామాక్షీ దీపం వెలిగే ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో తులతూగుతుంది. కామాక్షి దీపం వెలకట్టలేనిది, పవిత్రమైనది. అఖండ దీపాన్ని పెట్టదలచుకున్నప్పుడూ గృహప్రవేశం చేస్తున్నప్పుడూ తప్పనిసరిగా కామాక్షి దీపాన్ని ఉపయోగిస్తారు.  కామాక్షీ దీపము కేవలం ప్రమిదను మాత్రమేకాకుండా అమ్మవారి రూపునూ కలిగి ఉంటుంది. అంటే అమ్మవారి ప్రతిమ  ఈ దీపం మీద ఉంటుంది.  ప్రతిష్టలలో, గృహప్రవేశాలలో కామాక్షీ దీపాన్ని దీపారాధనకు ఉపయోగించడం ఎంతో శ్రేష్టమని శాస్త్రం.  కామాక్షీ దీపం వెలిగించినప్పుడు తప్పనిసరి

Namakkal Anjaneya Temple: శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం - నామక్కల్

Image
తమిళనాడు రాష్ట్రంలో నామక్కల్ జిల్లా నామక్కల్ లోని ఆంజనేయస్వామి దేవాలయం చాలా ప్రసిద్ది  చెందింది.  ఇక్కడ ఉండే నిలువెత్తు ఆంజనేయ స్వామి దాదాపు 20అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆంజనేయ స్వామి ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహ స్వామికి చేతులు జోడిస్తూ దాస్యభావాన్ని ప్రకటిస్తుంటారు. ఈ ఆంజనేయ స్వామి గర్భగుడికి పైకప్పు లేదు. ఈ విగ్రహం స్వయంభువు అయినందునే రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారని అందువల్లే పైన కప్పు వేయడానికి వీలుకాలేదని  చెపుతుంటారు. ఈ స్వామిని దర్శించడం వల్ల  శత్రుశేషం,గ్రహ దోషం వంటి ఎలాంటి సమస్యలు ఉండవని భక్తుల నమ్మకం. ఈ దేవాలయం సుమారు 1500 ఏళ్ల నాటిది. స్వామి వారి విగ్రహం సుమారు 18అడుగుల పై మాటే ఉంటుంది.  ఆంజనేయుడి కన్ను లక్ష్మీ నరసింహ స్వామి పాదాలతో (పాద పద్మాలు) సరళ రేఖలో ఉంటుంది.  ఆంజనేయుడి విగ్రహం ఇక్కడి కోటకు రక్షకునిగా ఉంటుందని, అక్కడి ప్రజలను శత్రువుల నుండి రక్షిస్తుందని చెబుతుంటారు స్థానికులు. ఆంజనేయుడు స్వామి యొక్క పాదపద్మాలను దర్శించుకోవడాన్ని నేటికీ గరుడాళ్వార్ సన్నిథి నుండి గమనించవచ్చు. కమలాలం చెరువు మెట్ల మీద ఆంజనేయ స్వామి పాదముద్రలను గమనించవచ్చు. నామగిరి హ

Arunachala Puja: అరుణాచలేశ్వరుని పూజ ఫలం, ఏ తిధిలో స్వామికి ఏ నైవేద్యం సమర్పించాలి (స్కాంద పురాణం)

Image
  అరుణాచలం వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే పాపాలు తొలుగుతాయి అని నమ్ముతారు. మరి స్వామివారికి  ఎలా పూజ చేయాలి ? ఏమి నైవేద్యం సమర్పించాలి తెలుసుకుందాం. ఆదివారం నాడు స్వామిని ఎర్ర కలువలతో పూజిస్తే సార్వభౌమత్వం సిద్ధిస్తుంది. సోమవారం నాడు కరవీరపుష్పాలతో, కస్తూరీకుసుమాలతో పూజించినవారికి సత్యలోక ప్రాప్తి కలుగుతుంది. గురువారం నాడు అరుణాచలేశ్వరుణ్ణి తెల్ల తామరలతో అర్చిస్తే సిద్దులతో కూడిన  జనోలోకానికి వెళతారు  శుక్రవారం నాడు చంపక పుష్పాలు అరుణగిరినాథుణ్ణి పూజించినవాడికి బ్రహ్మర్షులతో నిండిన తపోలోకంలో నివసించే అవకాశం దక్కుతుంది. శనివారం నాడు జాజీ, మల్లికా పుష్పాలతో స్వామిని అర్చిస్తే మహాపాపాలు చేసిన వాడైనా సరే యమలోకాన్ని చూడడు. తిథులు - నైవేద్యాలు పాడ్యమినాడు అరుణాచలేశ్వరుడికి పాయసాన్ని నివేదించిన వాడికి ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. విదియనాడు దధ్యోదనం స్వామికి నివేదిస్తే వారికి భోగభాగ్యాలు లభిస్తాయి. తదియనాడు అరుణగిరీశ్వరుడికి అపూపాలు నివేదన చేసిన వారు జీవితాంతం దృఢమైన శరీరంతో ఆరోగ్యంగా ఉంటారు. చతుర్ధినాడు పూర్ణకుంభాలు స్వామికి సమర్పించినవాడు సకల కామ్యాలనీ సిద్ధింప చేసుకుంటాడు. పంచమినాడు పులగా

Arunachala Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణ మహత్యం (స్కాంద పురాణం )

Image
  ప్రదక్షిణ అంటే ప్ర - బలంగా పాపాల్ని కొట్టి తరిమేసేది ద - సకల కోరికలనీ తీర్చేది క్షి - కర్మ ఫలితాలని క్షీణింప చేసేది ణ - ముక్తి ప్రదాయకమైనది అని అర్థం. కైలాసవాసుడైన పరమేశ్వరుడు అగ్నిలింగంగా అరుణాచలం రూపంలో భూమిమీద వెలిసాడు. ఆ దివ్య పర్వతం చుట్టూ ఎంతో మంది దేవతలు పరివేష్టించి ఉన్నారు. జన్మాంతరాల్లో చేసిన పాపాలు అన్ని కూడా ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే నశించిపోతాయి. కోటి అశ్వమేధయాగాలు, కోటి వాజపేయ యాగాలు చేస్తే వచ్చే ఫలితం, సర్వతీర్థాలలో స్నానం చేస్తే వచ్చే ఫలితం, కేవలం ఒక్కసారి అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కలుగుతుంది.  ఎంత నికృష్ట జన్మ ఎత్తిన వారికైనా సరే, అరుణగిరి ప్రదక్షిణ ముక్తిని ప్రసాదిస్తుంది.ఆ గిరికి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేసేవారు, సకల యజ్ఞాలు చేసిన ఫలం పొందుతారు. అరుణాచల ప్రదక్షిణ కోసం వెళ్ళేవారు ఒక్క అడుగు వేసినంత మాత్రాన్నే భూలోకాన్ని, రెండో అడుగుతో అంతరిక్షాన్ని, మూడో అడుగుతో స్వర్గాన్ని పొందుతారు. అలాగే మొదటి అడుగుతో మానసికంగా చేసిన పాపం, రెండవ అడుగుతో వాక్కుద్వారా చేసిన పాపం, మూడో అడుగుతో శరీరం ద్వారా చేసిన పాపం తొలగిపోతుంది. ఒక్కడుగుతో సకల పాపాలూ నశిస్తాయి. రెండో అడ

Lord Shiva: తత్పురుషం,అఘోరం, సద్యోజాతం, వామదేవం - శివతత్వం ఏం చెబుతోంది

Image
  దేవుళ్లంతా నిత్య అంలంకరణలో కనిపిస్తారు కానీ శివుడు మాత్రం ఎప్పుడూ అలా కనిపించడు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే శంకరుడు కూడా సర్వాలంకార భూషితుడే. కానీ ఒక్కో రూపంలో ఒక్కోలా కనిపిస్తాడు. ఆ రూపాలే  తత్పురుషం, అఘోరం, సద్యోజాతం, వామదేవం, ఈశానం. తత్పురుషం తేజోవంతుడిగా, ధ్యానంలో కూర్చుని, ప్రశాంతంగా కనిపిస్తూ..తూర్పుముఖంగా కూర్చుని ఉండే ఆ ముఖాన్ని తత్పురుషం అంటారు. ఇలా కనిపించే శివుడు కేవలం దేవతలకు మాత్రమే దర్శనమిస్తాడట. ఈ రూపానికి పూజలందించేది కూడా దేవతలే అంటారు. అఘోరం దిగంబంరంగా, నల్లని కాటుకతో, శరీరం అంతా బూడిదతో...అత్యంత భయంకరంగా ఉండే రూపాన్ని అఘోరం అని పిలుస్తారు. కపాలాలనే కుండలాలుగా ధరించి, త్రినేత్రం తెరిచి శవాలవైపు  చూస్తూ కనిపిస్తాడు శివుడు. ఈ రూపాన్ని దర్శించుకునేది, పూజించేది కేవలం అఘోరాలే. భూతప్రేతాలను అదుపులో ఉంచి మనల్ని కాపాడే అఘోర రూపం భయంకంపితంగా ఉంటుంది.  సద్యోజాతం శివుడంటే లింగరూపమే. నిత్యం ఆలయాల్లో పూజలు జరిగేది శివలింగానికే. అభిషేక ప్రియమైన ఈ రూపాన్ని సభ్యోగాతం అంటారు. లింగ రూపంలో ఉన్న శివయ్యను యోగులు, సిద్ధులు ఎక్కువగా పూజిస్తారు.  వామదేవం పరమేశ్వరుడు కూడా అలంకార ప్రియుడే అన

Lingashtakam: లింగాష్టకం అర్ధం తెలుగులో

Image
  నిరాకారుడిగా కొలువైన శివయ్యను ఆరాధన వెనుకున్న ఆంతర్యం,  లింగాష్టకం అర్థం బ్రహ్మ మురారి సురార్చిత లింగం (బ్రహ్మ , విష్ణు , దేవతలతో పూజలందుకున్న లింగం) నిర్మల భాషిత శోభిత లింగం ( నిర్మలమైన మాటలతో అలంకరించిన లింగం) జన్మజ దుఃఖ వినాశక లింగం ( జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం) తత్ ప్రణమామి సదా శివ లింగం ( సదా శివ లింగమా నీకు నమస్కారం !) దేవముని ప్రవరార్చిత లింగం (దేవమునులు , మహా ఋషులు పూజించిన లింగం) కామదహన కరుణాకర లింగం ( మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే శివలింగం) రావణ దర్ప వినాశక లింగం ( రావణుడి గర్వాన్ని నాశనం చేసిన శివ లింగం) తత్ ప్రణమామి సద శివ లింగం ( సదా శివ లింగమా నీకు నమస్కారం !) సర్వ సుగంధ సులేపిత లింగం ( మంచి గంధాలు లేపనాలుగా పూసిన లింగం) బుద్ధి వివర్ధన కారణ లింగం (మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం ) సిద్ధ సురాసుర వందిత లింగం (సిద్ధులు , దేవతలు , రాక్షసులు కీర్తించిన లింగం) తత్ ప్రణమామి సదా శివ లింగం (సదా శివ లింగమా నీకు నమస్కారం !) కనక మహామణి భూషిత లింగం (బంగారం , మహా మణులతో అలంకరించిన శివ లింగం) ఫణిపతి వేష్టిత శోభిత లింగం ( నాగుపాముని  అలంకారంగా చ

Lord Shiva Abhishekam: శివలింగానికి ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది.

Image
శివుడు అభిషేక ప్రియుడని ప్రతి భక్తుడికీ తెలుసు. నీటితో, పంచామృతాలతో, పుష్పాలతో, విభూదితో ఇలా రకరకాల అభిషేకాలు చేస్తుంటారు. మరి వేటితో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం పొందుతారో తెలుసా.. ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం ఆవు పాలు  - సర్వ సుఖాలతో వర్థిల్లుతారు ఆవు పెరుగు - ఆరోగ్యం, బలం ఆవు నెయ్యి  - ఐశ్వర్యాభివృద్ధి చెరకు రసం (పంచదార)- దుఃఖ తొలగిపోతుంది, ఆకర్షణ పెరుగుతుంది తేనె  - తేజస్సు వృద్ధి చెందుతుంది భస్మ జలం  - పాపాలు నశిస్తాయి  సుగంధోదకం - పుత్ర లాభం  పుష్పోదకం  - భూలాభం, స్థిరాస్తి కొనుగోలు చేస్తారు బిల్వ జలం - భోగ భాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనె - మృత్యు దోషం తొలగిపోతుంది రుద్రాక్షోదకం - ఐశ్వర్యం పెరుగుతుంది సువర్ణ జలం - దరిద్ర నాశనం అన్నాభిషేకం  - సుఖ జీవనం ద్రాక్ష రసం  - సకల కార్యాభివృద్ధి నారికేళ జలం  - సర్వ సంపద వృద్ధి ఖర్జూర రసం  - శత్రు నాశనం దూర్వోదకం (గరిక జలం)- ఆర్థిక వృద్ధి  ధవళొదకమ్ - శివ సాన్నిధ్యం పొందుతారు గంగోదకం  - సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి కస్తూరీ జలం - చక్రవర్తిత్వం, రాజసం నేరేడు పండ్ల రసం  - వైరాగ్యం  నవరత్న జలం - గృహ ప్రాప్తి మామిడి పండు రసం - దీర్ఘకాలిక

Tungnath Temple: ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం.

Image
ప్రకృతి ఒడిలో పరమేశ్వరుడిని దర్శించుకునే భాగ్యం కల్పిస్తుంది హిమాలయ ప్రాంతం. అత్యంత సాహసోపేతమైన యాత్ర ఇది. అందుకనే  సంసార బంధాల నుంచి విముక్తి చెందాలనుకునే వారికి హిమాలయాల్లో కొలువుతీరిన శంకరుడిని దర్శించుకోవాలనే కోరిక కలుగుతుంది. అలాంటి ఆలయాలలో ఒకటి తుంగనాథ్. హిమాలయాల్లోని తుంగనాథ పర్వతశ్రేణులలో భాగంగా చంద్రశిల అనే ఎత్తైన కొండ ఉంది. ఈ కొండ మీద నుంచి చూస్తే నలువైపులా మంచుపర్వతాలే కనిపిస్తాయి. ఈ ప్రశాంత వాతావరణం చూసి చంద్రుడు పరవశించిపోయాడట. ఆ పరవశంలోనే సుదీర్ఘమైన తపస్సులో మునిగిపోయాడు. అందుకే ఈ పర్వతానికి చంద్రశిల అన్న పేరు వచ్చిందని చెబుతారు.  పంచ కేదారార క్షేత్రాల్లో ఒకటి తుంగనాథ్. ఈ పంచ కేదార క్షేత్రాలు ఏర్పడడం వెనుక ఓ గాథ ఉంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు బ్రహ్మహత్యా పాతకం, దాయాదులు, బంధువులను చంపిన పాపాన్ని పోగొట్టుకోవడానకి శివుడి దర్శనానికి వెళ్లారు. అయితే భోళాశంకరుడు మాత్రం పాండవులకు తన దర్శనభాగ్యం కల్పించడు. కాశీని వదిలి ఉత్తరదిశగా హిమాలయాలకు వెళ్లిపోతాడు. పట్టువదలని పాండవులు..శివుడి దర్శనార్థం వెళతారు. అలా తిరుగుతూ తిరుగుతూ నందిరూపంలో ఉన్నాడని గుర్తిస్తారు. అప్ప

Varanasi Importance: ఆలయాల నగరి కాశీ విశిష్టత

Image
  కాశీ అంటే నిత్యం ప్రకాశించే నగరమని అర్ధం. కాశీలో మరణిస్తే పునర్జన్మ ఉండదు అని విశ్వసిస్తారు. కాశీక్షేత్రం కైలాస సమానం అని భక్తుల నమ్మకం. గంగలో పుణ్యస్నానంలో చేసిన వెంటనే కాశీవిశ్వనాధుని దర్శించుకుంటారు. కాశీలో పురాణ, చారిత్రిక నేపథ్యం కలిగిన 87 ఘాట్లు ఉన్నాయి. బ్రహ్మ దేవుడు శివానుగ్రహం కోసం పది అశ్వమేధయాగాలు నిర్వహించింది దశాశ్వమేధ ఘాట్. శివుడి కర్ణకుండలాలు పడిన ప్రదేశం మణికర్ణికా ఘాట్. ఈ ఘాట్ లోనే ఎక్కువ దహన సంస్కరాలు జరుగుతాయి. అత్యధిక ఆలయాలు కలిగిన ఘాట్ సింధియా ఘాట్. అస్సి ఘాట్, అహల్య ఘాట్, బద్రినారాయణ ఘాట్, దుర్గ ఘాట్, హనుమాన్ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, కేదార్ ఘాట్, లలిత ఘాట్, తులసి ఘాట్, వేణి మాధవ ఘాట్ వాటిలో ప్రముఖమైనవి మరియు ఎన్నో తీర్దాలు దర్శనమిస్తాయి. ప్రసిద్ధమైన దశాశ్వమేధ ఘాట్ లో ఇచ్చే గంగ హారతి కన్నుల పండుగగా ఉంటుంది. రుద్రా, నాగ ,త్రిశుల, ధూప, పంచ, నక్షత్ర హారతులు సమర్పిస్తారు. కాశీవిశ్వనాధుని ఆలయంకి సమీపంలోనే అన్నపూర్ణాదేవి దర్శనమిస్తుంది. ఈ అమ్మవారిని దర్శించుకుంటే అన్నపానాలకు లోటు ఉండదు అని భక్తుల విశ్వాసం. దీపావళి తరువాత రోజు బంగారు అన్నపూర్ణాదేవిని దర్శించవచ్చు. అష్ఠాదశ

Jyestha Masam: జ్యేష్ఠా మాసంలో విశేషమైన తిధులు

జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి : కరవీర వ్రతం ఆచరిస్తేసౌభాగ్యం కలుగుతుంది. గన్నేరుపూలతో అమ్మవారిని పూజించాలి.  జ్యేష్ఠ శుద్ధ విదియ : ఈ రోజును సోపపదము అంటారు. శ్రాద్ధకర్మలు ఆచరించాలి. జ్యేష్ఠ శుద్ధ తదియ : రంభావ్రతం చేయాల్సిన రోజిది. స్వర్ణ ప్రతిమ రూపంలో అరటిచెట్టువద్ద పార్వతీదేవిని పూజించి, వస్త్రదానం చేస్తే సంపద, సౌభాగ్యాలు కలుగుతాయి. జ్యేష్ఠ శుద్ధ చవితి : పార్వతీ మాత ఉమాదేవిగా అవతారం దాల్చిన రోజిది. ఉమాదేవి ఆరాధన చేస్తే స్త్రీలకు సౌభాగ్యవృద్ధి కలుగుతుందని బ్రహ్మపురాణ వచనం. జ్యేష్ఠ శుద్ధ షష్ఠి :  అరణ్యక గౌరీవ్రతము, వింధ్యవాసిని ఆరాధన ఆచరించిన స్త్రీలకు సౌభాగ్యం వర్ధిల్లుతుందని స్కాంద పురాణం చెబుతోంది. జ్యేష్ఠ శుద్ధ అష్టమి : శుక్లాదేవి ఆరాధన సంపత్కరం. అష్టమి రోజున పూజచేయాలి. మరునాడు నవమి తిథినాడు ఉపవాసం చేసి తిరిగి శుక్లాదేవిని, బ్రహ్మణీదేవిని పూజించాలి. జ్యేష్ఠ శుద్ధ దశమి: దీన్ని దశపాపహర దశమి అంటారు.సేతుబంధన రామేశ్వర ప్రతిష్ఠ జరిగిన రోజు. ఈ రోజున నదీస్నానము దానం చేస్తే దశవిధ పాపాలు నశిస్తాయని పురాణవచనం. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి : దీన్ని నిర్జల ఏకాదశి అంటారు. ఈ రోజు జలం కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉండ

Tirupatamma Temple: శ్రీ లక్ష్మి తిరుపతమ్మ దేవస్థానం - పెనుగ్రంచిప్రోలు

Image
తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. స్థల పురాణం వత్సవాయి మండలం గోపినేనిపాలేనికి చెందిన కొల్లా శివరామయ్య, రంగమాంబ దంపతులకు సంతానం లేదు. వెంకటేశ్వరుడి వర ప్రసాదంగా ఆ దంపతులకు తిరుపతమ్మ జన్మించింది. ఆమెకు చిన్నప్పటి నుంచే దైవభక్తి మెండు. ఆమెను పెనుగంచిప్రోలుకు చెందిన కాకాని కృష్ణయ్య వెంగమాంబ దంపతుల కుమారుడు గోపయ్య కిచ్చి పెళ్లి చేశారు. అప్పటివరకు పంటలు పండక, గోవులకు మేత లేక పెనుగంచిప్రోలు అల్లాడిపోయింది. తిరుప తమ్మ అడుగుపెట్టగానే వర్షాలు కురిసి పాడిపంటలతో గ్రామస్థులు ఆనందంగా ఉన్నారు. తిరుపతమ్మ పేరు మారుమోగింది. తట్టుకోలేని తోటికోడలు చంద్రమ్మ ఈర్ష్యా ద్వేషాలు పెంచుకుంది. గోవులు మేపేందుకు గోపయ్య అడవికి వెళ్లినప్పుడల్లా ఆమెకు కష్టాలే. తోటికోడలు పెట్టే బాధలు భర్తకు చెప్పుకోలేక ఆవేదన చెందేది. అదే సమయంలో ఆమెకు ఓ వ్యాధి సోకింది. ఇదే అదనుగా తిరుపతమ్మను తోటికోడలు చంద్రమ్మ ఇంటి నుంచి పంపేసింది. గ్రామానికి చెందిన ముదిరాజు వంశస్థురాలు పాపమాంబ తిరుపతమ్మకు సేవలు చేసింది. 'రోగం శరీరానికే కానీ నా మనసుకు కాదు. నేను ఈ శరీరాన్ని కాదు

Tiruchendur: సుబ్రమణ్య స్వామి శూరసంహారం చేసిన ప్రదేశం

Image
కార్తికేయుడు భక్తుల హృదయాల్లో జ్ఞానజ్యోతులను వెలిగిస్తాడని, గుహునిగా కొలువుదీరి ముక్తిని ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. తారకాసురుడి సోదరుడు శూరపద్ముడు సుబ్రహ్మణ్యుడితో యుద్ధానికి తలపడ్డాడు. తిరుచెందూర్ వద్ద కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి షష్టి వరకూ ఆరు రోజులు జరిగిన యుద్ధంలో కుమారస్వామి అసురగణాలను హతమార్చగా శూరపద్ముడు మామిడిచెట్టు రూపం ధరించాడు. వేలాయుధం ఆ చెట్టును రెండుగా చీల్చగా అతడి రాక్షసగుణాలు అంతరించాయి. చీలిన చెట్టు భాగాల్లో ఒకటి నెమలిగా, మరొకటి కోడిపుంజుగా మారి శరవణభవుణ్ణి శరణువేడాయి. సుబ్రమణ్యస్వామి కోడిపుంజును ధ్వజంగా, నెమలిని వాహనంగా స్వీకరించి తరింపచేశాడు. భక్తితో శరణువేడితే దుష్టులను సైతం స్వామి క్షమిస్తాడని నిరూపిస్తుందీ వృత్తాంతం, శూర సంహారానికి గుర్తుగా తిరుచెందూర్లో కార్తిక షష్ఠినాడు ఉత్సవాన్ని, దేవసేనతో స్వామి కల్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుకను తిలకించడానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు.

Kamandala Ganapathi Temple: శ్రీ కమండల గణపతి ఆలయం - చిక్ మగళూరు

Image
కర్ణాటకలోని చిక్ మగళూరు జిల్లాలోని కేశవె గ్రామంలో ఉన్న కమండల గణపతి ఆలయానికి వెయ్యేళ్ళకు పైగా చరిత్ర ఉంది. ఆ ఆలయాన్ని సందర్శించి, స్వామిని సేవించినా, ధ్యానించినా వారి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మిక. ఇక్కడ ఉన్న కమండల తీర్థం పేరిట వినాయకుడు కమండల గణపతిగా ప్రసిద్ధి చెందాడు. దట్టమైన అటవీ ప్రాంతంలో నెలకొ నెలకొన్న ఈ ఆలయం. ఆవిర్భావం గురించి వివరించే కథలు ఎన్నో ఉన్నాయి.  స్థలపురాణం  శని ప్రభావానికి గురైన పార్వతీదేవి దాని నుంచి విముక్తి కోసం తపస్సు చేయడానికి భూలోకానికి వచ్చింది. ఆమె తపస్సుకు అవరోధాలు ఏర్పడడంతో వాటిని నివారించాల్సిందిగా విఘ్ననాశకుడైన తన కుమారుడు వినాయకుణ్ణి ఆమె కోరింది. బ్రహ్మచారి రూపంలో కమండలం ధరించి వచ్చిన వినాయకుడు ఆమె తపస్సు సజావుగా సాగేలా చేశాడు. అనంతరం ఇక్కడ గణపతిని పార్వతీదేవి ప్రతిష్టించింది. పవిత్రమైన తీర్థాన్ని సృష్టించింది. దీన్ని 'కమండల తీర్థం' అని పిలుస్తారు. ఈ కమండల తీర్థమే బ్రహ్మీ నదికి జన్మస్థానం అంటారు. పార్వతీ దేవి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై, తన కమండలంలోని నీటిని ఆమెపై చిలకరించాడనీ, ఆ దివ్య జలాలే 'బ్రహ్మీ నది'గా మారాయనీ కూడా పురాణాలు చెబ

Kasapuram Anjaneya Temple: కసాపురం ఆంజనేయ స్వామి

Image
  ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తెలంగాణ, రాష్ట్రాల్లో వేలాది మంది భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్న క్షేత్రం శ్రీ కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి క్షేత్రం. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఉన్న హనుమంతుని ఆలయాలన్నింటిలోకీ పెద్దది.  ఈ క్షేత్రం అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి 5కిలోమీటర్ల దూరంలో వెలసి ఉంది.ఇక్కడ ఆంజనేయుడు నెట్టికంటి ఆంజనేయస్వామిగా కొలువుదీరాడు. నెట్టికంటి అంటే నేరుగా చూసే కన్ను కలిగిన అని అర్థం. ఇక్కడ స్వామివారి కుడివైపు భాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. అందువలన మనం కుడి కన్నును మాత్రం చూడగలం.  విజయనగర సామ్రాజ్య కాలంలో క్రీస్తుశకం 1521లో శ్రీ వ్యాసరాయుల వారు తుంగభద్ర నదీ తీరంలో ధ్యానం చేసేవాడు. ప్రతి రోజూ తాను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న ఒక రాయి పై ఆంజనేయ స్వామి రూపం చిత్రించేవాడు. అలా చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు నిజరూపం ధరించి అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు. ఇది గమనించిన వ్యాసరాయులు హనుమంతుని శక్తిని వేరోచోటకి వెళ్లనీయకుండా స్వామివారి ద్వాదశ నామాల బీజాక్షరాలతో ఒక యంత్రం తయారుచేసి అందులో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజరూపాన్ని చిత్రించారని చెబుతారు. దీంతో స్వామి ఆ యంత్రంలో బం

Hamsaladeevi Venugopala Temple: శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం - హంసలదీవి

Image
కృష్ణానది సముద్రంలో కలిసే పవిత్ర సాగరసంగమ ప్రదేశం హంసలదీవి. ఈ పవిత్ర సాగర సంగమ ప్రదేశంలో స్నానం చేస్తే కాకులు కూడా హంసలుగా మారిపోతాయన్న కథనం ఈ ప్రాంతంలో ఉంది. పూర్వకాలంలో కలుషహారిణి అయిన గంగామాత తనలో స్నానం చేసిన వారందరి పాపాలను నశింపచేస్తుండటం వలన తనకు అంటిన పాప పంకి లాన్ని పోగొట్టుకొనే మార్గం చెప్పవలసిందిగా శ్రీహరిని ప్రార్ధిం చింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన అంశతో ఉద్భ వించిన కృష్ణానది సముద్రంలో కలిసే సంగమ ప్రదేశం లో కాకి రూపంలో వెళ్లి స్నానం చెయ్యి. నీపాప తమస్సు పోయి హంసవలె మారతావని వరమిచ్చాడు. గంగాదేవి తన యందలి పాప తమస్సును కాకి వలె ధరించి కృష్ణా సాగ రసంగమ పవిత్ర ప్రదేశం లో మునిగింది. పాపప్రక్షాళన పొంది హంస వలె స్వఛ్ఛతను పొందింది. అంతటి మహిమ గల క్షేత్రం ఈ హంసల దీవి. ఎందరో మునులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ సంచరించేవారని, అటువంటి పరమహం సలు సంచరించిన ప్రదేశం కాబట్టే ఈ ప్రాంతాన్ని హంసలదీవి అన్నారని ఒక కథనం. ఈ తీర్థక్షేత్రంలో వెలసిన దైవం రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి. ఈ ఆలయం ఒక రాత్రిలో దేవతలు నిర్మించిందిగా స్థలపురాణం. దేవాలయ నిర్మాణం పూర్త యి, గాలిగోపురం నిర్మిస్తుం

Random posts