Arunachala Puja: అరుణాచలేశ్వరుని పూజ ఫలం, ఏ తిధిలో స్వామికి ఏ నైవేద్యం సమర్పించాలి (స్కాంద పురాణం)

 అరుణాచలం వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే పాపాలు తొలుగుతాయి అని నమ్ముతారు. మరి స్వామివారికి  ఎలా పూజ చేయాలి ? ఏమి నైవేద్యం సమర్పించాలి తెలుసుకుందాం.


  • ఆదివారం నాడు స్వామిని ఎర్ర కలువలతో పూజిస్తే సార్వభౌమత్వం సిద్ధిస్తుంది.
  • సోమవారం నాడు కరవీరపుష్పాలతో, కస్తూరీకుసుమాలతో పూజించినవారికి సత్యలోక ప్రాప్తి కలుగుతుంది.
  • గురువారం నాడు అరుణాచలేశ్వరుణ్ణి తెల్ల తామరలతో అర్చిస్తే సిద్దులతో కూడిన  జనోలోకానికి వెళతారు 
  • శుక్రవారం నాడు చంపక పుష్పాలు అరుణగిరినాథుణ్ణి పూజించినవాడికి బ్రహ్మర్షులతో నిండిన తపోలోకంలో నివసించే అవకాశం దక్కుతుంది.
  • శనివారం నాడు జాజీ, మల్లికా పుష్పాలతో స్వామిని అర్చిస్తే మహాపాపాలు చేసిన వాడైనా సరే యమలోకాన్ని చూడడు.
తిథులు - నైవేద్యాలు
  • పాడ్యమినాడు అరుణాచలేశ్వరుడికి పాయసాన్ని నివేదించిన వాడికి ధనధాన్య సమృద్ధి కలుగుతుంది.
  • విదియనాడు దధ్యోదనం స్వామికి నివేదిస్తే వారికి భోగభాగ్యాలు లభిస్తాయి.
  • తదియనాడు అరుణగిరీశ్వరుడికి అపూపాలు నివేదన చేసిన వారు జీవితాంతం దృఢమైన శరీరంతో ఆరోగ్యంగా ఉంటారు.
  • చతుర్ధినాడు పూర్ణకుంభాలు స్వామికి సమర్పించినవాడు సకల కామ్యాలనీ సిద్ధింప చేసుకుంటాడు.
  • పంచమినాడు పులగాన్ని స్వామికి నివేదిస్తే అక్షయ భోగాలు కలుగుతాయి.
  • షష్ఠినాడు చక్కెర పొంగలిని స్వామికి నివేదించాలి. అలా చేసినవాడి సంతానం అవిచ్ఛన్నంగా కొనసాగుతుంది.
  • సప్తమి తిథినాడు నువ్వుల అన్నాన్ని అరుణగిరి నాథుడికి నైవేద్యం పెడితే మానవులు సమస్త  ఋణాల నుంచి విముక్తి పొందుతారు.
  • అష్టమినాడు రాజనాలబియ్యంతో అన్నం వండి నైవేద్యం పెడితే,రాజవశ్యం కలుగుతుంది.
  • నవమి తిథి లో గోధుమాన్నాన్ని శోణగిరినాథుడికి నివేదించాలి. అలా చేసినవారికి రాజయక్ష్మాది రోగబాధలు వుండవు.
  • దశమినాడు అన్నిరకాల కూరలు కలిపి వండిన కదంబాన్ని స్వామికి సమర్పిస్తే సకల లోక ప్రియులవుతారు.
  • ఏకాదశి తిథి నాడు అరుణాచలేశ్వరుడికి అటుకులు నైవేద్యం పెట్టాలి.తద్వారా ఆయన అభయం మానవులకి లభిస్తుంది.
  • ద్వాదశినాడు పప్పన్నం స్వామికి నివేదిస్తే కోరిన కోరికలన్నీ సిద్దిస్తాయి.
  • త్రయోదశి తిథి ఉన్నరోజు సత్తుపిండిని అరుణగిరి నాథుడికి నివేదించాలి.దానివల్ల శాంతితో కూడిన జీవితం లభిస్తుంది.
  • చతుర్దశినాడు వివిధరకాల ఫలాల్ని స్వామికి నివేదించాలి. అలా చేసినవాడు మూర్ఖుడైనా సరే మహా పండితుడౌతాడు.
  • పౌర్ణమి పర్వదినాన పనసపండుని అరుణాచలేశ్వరుడికి నైవేద్యం పెట్టాలి.అలా చేసిన వారికి కంటి జబ్బులు తొలగిపోతాయి
  • అమావాస్య నాడు కందమూలాల్ని తెచ్చి స్వామికి సమర్పించాలి. తద్వారా సమర్పించిన వాడి పితృదేవతలు సంతోషిస్తారు.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి