Namakkal Anjaneya Temple: శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం - నామక్కల్
తమిళనాడు రాష్ట్రంలో నామక్కల్ జిల్లా నామక్కల్ లోని ఆంజనేయస్వామి దేవాలయం చాలా ప్రసిద్ది చెందింది. ఇక్కడ ఉండే నిలువెత్తు ఆంజనేయ స్వామి దాదాపు 20అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆంజనేయ స్వామి ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహ స్వామికి చేతులు జోడిస్తూ దాస్యభావాన్ని ప్రకటిస్తుంటారు. ఈ ఆంజనేయ స్వామి గర్భగుడికి పైకప్పు లేదు.
ఈ విగ్రహం స్వయంభువు అయినందునే రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారని అందువల్లే పైన కప్పు వేయడానికి వీలుకాలేదని చెపుతుంటారు. ఈ స్వామిని దర్శించడం వల్ల శత్రుశేషం,గ్రహ దోషం వంటి ఎలాంటి సమస్యలు ఉండవని భక్తుల నమ్మకం.
ఈ దేవాలయం సుమారు 1500 ఏళ్ల నాటిది. స్వామి వారి విగ్రహం సుమారు 18అడుగుల పై మాటే ఉంటుంది.
ఆంజనేయుడి కన్ను లక్ష్మీ నరసింహ స్వామి పాదాలతో (పాద పద్మాలు) సరళ రేఖలో ఉంటుంది. ఆంజనేయుడి విగ్రహం ఇక్కడి కోటకు రక్షకునిగా ఉంటుందని, అక్కడి ప్రజలను శత్రువుల నుండి రక్షిస్తుందని చెబుతుంటారు స్థానికులు. ఆంజనేయుడు స్వామి యొక్క పాదపద్మాలను దర్శించుకోవడాన్ని నేటికీ గరుడాళ్వార్ సన్నిథి నుండి గమనించవచ్చు. కమలాలం చెరువు మెట్ల మీద ఆంజనేయ స్వామి పాదముద్రలను గమనించవచ్చు.
నామగిరి హిల్స్కు ఇరువైపులా ఉన్న గుహలో నరసింహస్వామి, రంగనాథ స్వామి ఆలయాలున్నాయి. స్వామికి ప్రతి ఏడాది మార్గశిర నెల తొలి నక్షత్రం రోజున జయంతి వేడుకలను నిర్వహిస్తారు.
Comments
Post a Comment