Skip to main content

Bhadrachalam Temple: శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం - భద్రాచలం

శ్రీరామచంద్రమూర్తి పాదధూళితో పునీతమైనదివ్యస్థలం. పవిత్రగోదావరినదీ తీరంలో పుణ్యపురాశిగా విరాజిల్లుతూ ఉన్న మహిమాన్వితపుణ్యక్షేత్రం భద్రాచలం. ఈ క్షేత్రం. ఖమ్మంజిల్లాలో ఉంది. 

భద్రాచలానికి ఒకప్పుడు దండకారణ్య మని పేరు. పితృవాక్యపాలకుడైన శ్రీరాముడు అరణ్యవాసం చేస్తూ కొంతకాలం ఈ దండకారణ్యంలో గడిపాడు. ఈ సమయంలో ఒక శిలపై విశ్రమించి, ఆ శిలను ఆశీర్వదించగా, ఆ శిల మరుజన్మలో మేరువు, మేరుదేవిదంపతులకు భద్రుడుగా జన్మించి, నారదుడినుంచి రామమంత్రోపదేశాన్ని పొంది, తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి, శ్రీరాముడు ప్రత్యక్షమై, భద్రుడికోరికపై అక్కడే కొలువుదీరినట్లు కథనం. 

బ్రహ్మపురాణం ప్రకారం పర్వతరాజు అయిన మేరువు బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. తపస్సును మెచ్చి, బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాగా మేరువు రామభక్తిపరుడైన కుమారుడిని ప్రసాదించ మని వరం కోరాడు. బ్రహ్మవరం ప్రసాదించాడు. వరంమేరకు మేరువుకు రామభక్తిపరుడైన 'భద్రుడు' కుమారుడిగా జన్మించాడు. భద్రుడు రామదర్శనం కోరి ఘోరతపస్సు చేశాడు. తపస్సును మెచ్చి శ్రీరాముడు శంఖ, చక్ర, ధనుర్భాణాలను ధరించి ప్రత్యక్షంకాగా ఆ రూపంలోనే తన శిరస్సుపై నివాసం ఉండ మని భద్రుడు వరం కోరాడు. అలా భద్రుడు శిలారూపాన్ని ధరించగా, దానిపై రాముడు కొలువుదీరినట్లు స్థలపురాణం. భద్రుడిపై రాముడు కొలువుదీరిన క్షేత్రం కనుక 'భద్రాచలం' అనే పేరు ఏర్పడింది.

క్రీ.శ.17వశతాబ్దం తొలిరోజుల్లో భద్రాచలానికి సమీపంలోని భద్రారెడ్డిపాలెం అనే గ్రామంలో 'పోకల దమ్మక్క' అనే గిరిజనమహిళ ఉండేది. రామభక్తిపరురాలైన ఆమెకు ఒకరోజు స్వప్నంలో శ్రీరాముడు సాక్షాత్కరించి, 'భద్రగిరిమీద వెతికితే తాను కనిపిస్తాను' అని పలికాడు. ఆ మరునాడు భద్రగిరిపై వెదుకగా ఇప్పుడు ఆలయం ఉన్నచోట శిలామూర్తులు దర్శనమిచ్చాయి. ఊరిపెద్దల సహాయంతో ప్రతిదినం గోదావరినీటితో అభిషేకించి, అడవిలో దొరికేపండ్లను నైవేద్యంగా అర్పించసాగింది.

ఈ స్థితిలో కుతుబ్షాహీ స్తుల్తాన్ అబుల్ హసన్ తానీషా పాలనలో పాల్వంచప్రాంతానికి తహశిల్దారుగా పని చేస్తూ ఉన్న 'కంచర్లగోపన్న'కు శ్రీరాముడు కలలో కనిపించి ఆలయం నిర్మించ మని ఆదేశించాడు. గోపన్న శ్రీరాముడికి ఆలయం, ప్రాకారం నిర్మించి, నిత్యకైంకర్యాలను ఏర్పాటు చేశాడు. ఆలయపోషణకు అవసరమైనమాన్యాలు వివిధఆభరణాలు ఏర్పాటు చేశాడు. ప్రభుత్వఅనుమతి లేకుండా చేయడంతో తానీషా గోపన్నను బంధించి, కారాగారంలో ఉంచాడు. గోపన్న జైలులో భక్తితో, ఆవేదనతో, నిష్టూరంతో, కోపంతో ఆలపించిన కీర్తనలు రామ దాసుకీర్తనలుగా పేరుపొందగా, గోపన్న 'రామదాసు' అయ్యాడు. ఒకనాటి అర్ధరాత్రి రామలక్ష్మణులు మారువేషంలో తానీషా వద్దకు వెళ్ళి, ధనాన్ని చెల్లించగా, గోపన్న జైలునుంచి విడుదల అయ్యాడు. రాముడిమహిమను తెలుసుకున్న తానీషా పాల్వంచ ప్రాంతఆదాయాన్ని ఆలయానికి కేటాయించడమే కాకుండా ప్రతిసంవత్సరం శ్రీరామనవమినాడు జరిగే సీతారాముల కల్యాణోత్సవాలకు ముత్యాల తలంబ్రాలు, మంగళసూత్రాలను తామే పంపే ఏర్పాటు చేశారు. ఈ ఆచారం నేటికీ సాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిసంవత్సరం శ్రీరామనవమి నాడు ముత్యాల తలంబ్రాలు పంపడం ఆనవాయితీ అయింది.

పవిత్రగోదావరీనదితీరాన ఉన్న ఆలయం కొంత ఎత్తులో ఉంది. ప్రధానఆలయానికి చేరుకునే ప్రధానద్వారం పైన గాలిగోపురం నిర్మింపబడింది. ప్రధానఆలయంలో అడుగిడగానే ముందుగా శ్రీఆంజనేయస్వామి దర్శనమిస్తాడు. శ్రీ ప్రపత్తి ఆంజనేయస్వామి అని ఆయనకు పేరు. ప్రధాన గర్భాలయంలో గర్భగృహంలోని మూలవిరాట్టు అయిన శ్రీరామచంద్రమూర్తి చతుర్భుజాలతో వామాంకంమీద కూర్చున్న సీతా దేవితో లక్ష్మణుడితో కలిపి భక్తులపై కరుణాకటాక్షాలు ప్రసరింప జేస్తూ కొలువుదీరి ఉన్నారు. శంఖ, చక్ర, ధనుర్బాణాలను చేతులలో ధరించి స్వామివారు దర్శనమిస్తారు. 

ఈ ప్రధానదేవతా మూర్తులతో పాటు ఆలయప్రాంగణంలో భక్తులు శ్రీ కనక వల్లీదేవి, శ్రీ కులశేఖరఆళ్వారు, బలిపీఠం, ధ్వజస్తంభంతో పాటు గట్టుమీద లక్ష్మీనరసింహస్వామి, రథశాల, జమ్మిమండపం, సంతానగోపాలస్వామి, భద్రుడిపై శిరస్సుపై గల శ్రీరాముడి పాదాలు, గోవిందరాజస్వామిఆలయం, ఏకాదశి సత్యనారాయణ స్వామిమండపం, శ్రీరంగనాయకస్వామి, విష్వక్సేనులు, శ్రీవేంకటేశ్వరస్వామి, నారదుడు, రామదాసు ధ్యానమందిరం వంటివి దర్శించవచ్చు. 

భద్రాచలానికి సుమారు 35 కిలోమీటర్లదూరంలో గల 'పర్ణశాల' తప్పక దర్శించవలసినప్రాంతం. వనవాసకాలంలో శ్రీసీతారామలక్ష్మణులు ఈ పర్ణశాలలో నివసించినట్లు ప్రతీతి. శూర్పణఖవృత్తాంతం, సీతాదేవి మాయలేడిని కోరడం, సీతాప హరణం, రావణరథంగుర్తులు వంటి ఎన్నో తార్కాణాలు ఈ పర్ణశాలలో దర్శనమిస్తాయి. సీతాదేవి ఏకాంతంగా స్నాన మాచరించిన గోదావరిపాయ నేటికీ సీతమ్మవాగుగా పిలువ బడుతూ ఉంది.

ప్రతిరోజూ పూజలు జరిగే భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిఆలయంలో శ్రీరామనవమిసందర్భంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శ్రీరామనవమిరోజు భద్రాచలంలో జరిగే శ్రీసీతారాములకల్యాణం జగత్ప్రసిద్ధి చెందింది. ధను ర్మాసం, వైకుంఠఏకాదశి, దేవీనవరాత్రుల సందర్భంగా ప్రత్యేక అలంకారాలు, పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశినాడు జరిగే వైకుంఠద్వారదర్శనం, తెప్పోత్సవాలలో భక్తులు విశేషసంఖ్యలో పాల్గొంటారు.

Comments

Popular posts from this blog

Navaratri: శరన్నవరాత్రుల్లో అఖండ దీపం ఏ రోజున వెలిగించాలి ?

  తొలిరోజునే అఖండ దీపం వెలిగించాలి. ఉదయవేళలోనే  దీపారాధన, కలశస్థాపన చేయాలి.  రాత్రిపూట పూజలు చేసేవారు కూడా తొలిరోజు ఉదయవేళలోనే దీపారాధన, కలశస్థాపన చేయవలసి ఉంటుంది. అఖండ దీపారాధనలో రెండు పెద్ద ప్రమిదలు తీసుకుని ఒకదానిలో ఒకటి ఉంచాలి. అందులో మూడు వత్తులు వేయాలి. దీపాన్ని తూర్పు వైపు వెలిగే విధంగా పెట్టాలి. దీపం తూర్పు వైపు వెలిగితే శాంతి చేకూరుతుంది. ఉత్తరం వైపు ధనధాన్యవృద్ధి కలుగుతుంది.  పడమటివైపు శత్రుపీడ, అనారోగ్యం కలుగుతాయి. దక్షిణం వైపు పెట్టే దీపాన్నియమ దీపం అని పిలుస్తారు. మొత్తంమీద తూర్పు ఉత్తరం దిక్కులలో దీపాన్ని వెలిగేలా ఉంచితే విధాలా మంచిది. దీక్ష కొనసాగినన్ని రోజులూ అఖండదీపం కొండెక్కకుండా చూసుకోవాలి. రాత్రింబవళ్లు దీపాన్ని చూసుకుంటూ ఉండడం కష్టం అనుకునేవారు  అఖండ దీపాన్ని వెలిగించకపోవడం మంచిది.  ప్రతివారూ తప్పనిసరిగా అఖండదీపం వెలిగించాలన్న నియమం లేదు.  ప్రతిసారి పూజా ప్రారంభంలో దీపారాధన చేసినా సరిపోతుంది.

Sri Chengalamma Temple: శ్రీ చెంగాళమ్మ అమ్మవారి ఆలయం - సూళ్లూరుపేట

  ప్రస్తుత కాలంలో సూళ్ళూరుపేటగా పిలుస్తున్న ఈ పట్టణానికి పూర్వనామం శుభగిరి. ఈ గ్రామానికి పడమరవైపుగా ప్రవహించే నది ఒకరోజు సాయంత్రం ఆ గ్రామంలోని పశువుల కాపర్లు నదిలో దిగి ఉల్లాసంగా స్నానం చేస్తున్నారు. ఇంతలో వారిలో ఒకతను హఠాత్తుగా సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఆ సుడిగుండం అతన్ని నది లోపలికి ఈడ్చుకుని అడుగుభాగానికి తీసుకువెళ్ళింది. సుడిగుండం నుండి బయటపడటానికి అతను విశ్వప్రయత్నం చేస్తూండగా, ఒక బండరాయి చేతికి తగిలింది ప్రాణా పాయస్థితిలో వున్న అతను ఆ బండ రాయిని గట్టిగా పట్టుకొని సుడికి ఎదురు తిరగగా ఒక్క ఉదుటన అతనికి అసరాగా వున్న బండరాయితో సహా ఒడ్డుకు విసిరి వేయబడ్డాడు. సుడిగుండంలో మునిగిన అతని కోసం స్నేహితులు అత్రుతగా వెదుకుతుండగా హఠాత్తుగా, ఒక్క ఉదుటన ఒడ్డుకు విసిరివేయబడ్డ అతడిని వారు సంభ్రమాశ్చర్యాలతో చూశారు. అతను సుడిగుండం నుండి బయటపడటానికి తనకు సహాయపడ్డ బండరాయిని గురించి స్నేహితులకు వివరించాడు. అందరూ కలసి బండరాయిని ఒడ్డుకు చేర్చి ఆ బండరాయిని పరిశీలించగా అది ఓ స్త్రీమూర్తి విగ్రహం అని తెలుసు కుని, నది ఒడ్డునే ఆ విగ్రహాన్ని పడుకో బెట్టి, తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. మరునాడు గ్రామపెద్దలు, పశువుల క

Tirumala Shanivaralu: తిరుమల శనివారాలు 2024

తమిళ మాసం అయిన పెరటాశి  మాసంలో తిరుమల శనివారాలు జరుపుకుంటారు. ఈ మాసం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వస్తుంది.  ఈ మాసంలోని శనివారాలు పవిత్రంగా భావించి విష్ణు ఆలయాలలో భక్తులు ప్రతేక్య పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలోనే తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరగడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.చాల మంది భక్తులు ఈ మాసంలో కేవలం శాకాహారం మాత్రమే స్వీకరిస్తారు. శ్రీమహావిష్ణువు శ్రీవేంకటాచలపతిగా అవతరించిన మాసమే పెరటాసి. ఈ మాసంలో శ్రవణ నక్షత్రంలో తిరుమలేశుడు అవతరించినట్లు శ్రీవేంకటాచల మహత్యం చెబుతోంది.  ప్రత్యేకించి శనివారం ఆయనకు ఎంతో ప్రీతి. పెరటాసిలో శనివారాలు నాలుగు లేక ఐదు వస్తాయి. వీటిలో మూడవ శనివారాన్ని తమిళులు చాలా విశేషంగా భావించడం ఆనవాయితీగా వస్తోంది.    ఈ మాసంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారికి  పిండి దీప సమర్పణ ఎంతో విశేషంగా జరుపుకుంటారు.  ఈ మాసంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాల  వైభవాన్ని  గురించి ఎంత చెప్పినా తక్కువే.  ప్రతి బ్రహ్మోత్సవం  తిరుమలలో విశేషంగా, వైభవంగా జరుగుతుంది. ఈ మాసంలో ముఖ్యంగా  కొంతమంది శ్రీ వైష్ణవుల తిరుమాళిగల్లో (ఇళ్ళల్లో) శనివారాలలో  శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం  పెద్ద

Navaratri Deeksha: నవరాత్రి దీక్షల్లో పాటించాల్సిన నియమాలు ఏమిటి ?

పూజకు కూర్చున్న వ్యక్తి తప్పనిసరిగా ఉతికిన వస్త్రాలు లేదా పట్టువస్త్రాలు ధరించాలి. ఎరుపు రంగు వస్త్రాలు శ్రేష్ఠం పురుషులు తప్పనిసరిగా ప్రతిరోజూ తలస్నానం చేయాలి నవరాత్రి దీక్ష స్వీకరిస్తే కనుక తొమ్మిది రోజులూ క్షుర కర్మ చేయించుకోకూడదు.  నేలపైన మాత్రమే నిద్రించాలి. బ్రహ్మచర్యం పాటించాలి  మద్యమాంసాదులు ముట్టుకోకూడదు. అబద్ధం ఆడకూడదు.  చేపట్టిన పూజా కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతమైనది అని నమ్మకంతో, భక్తితో ముందుకు సాగిపోవాలి.

Khasi Mayukhaditya Temple: శ్రీ మయూఖాదిత్య ఆలయం - కాశీ

 కాశీ క్షేత్రంలో చూడదగిన ఆలయాలలో మయూఖాదిత్యుని ఆలయం కూడా ఒకటి. పవిత్ర గంగా నదీ తీరంలోని పంచగంగ రేవు సమీపంలో ఉంది ఈ ఆలయం. ఇక్కడ సూర్య భగవానుడు మయూఖాదిత్యునిగా పూజలందుకుంటాడు. పురాణాలు ప్రకారం పూర్వం సూర్యుడు గంగానది ఒడ్డున శివలింగాన్ని, మంగళ గౌరీ దేవిని ప్రతిష్ఠించి పూజించాడు. సూర్యుని తపస్సుకు మెచ్చిన పరమశివుడు అమ్మవారితో పాటు ప్రత్యక్షమై, 'మయూఖాదిత్యుడు' అనే వరాన్ని ప్రసాదించాడు. తాను ప్రతిష్టించిన శివుని మంగళ గౌరి దేవిని పూజిస్తూ సూర్యుడు కాశీలోని ఉండిపోయాడు. ప్రత్యక్ష భగవానుడు అయిన సూర్యుడు ఒకే చోట ఉండిపోతే లోకాలన్నీ చీకటిలో ఉండిపోకుండా సూర్యుని మయూఖాలు అంటే కిరణాలు మాత్రమే లోకంలో వెలుగులు విరజిమ్మాయి. అందుచేతనే శివుడు సూర్యునికి 'మయూఖాదిత్యుడు' అనే వరాన్ని ప్రసాదించాడు. కాశీలోని మయూఖాదిత్యుని దర్శించిన వారికి జీవితంలో దారిద్య్ర బాధలుండవని సాక్షాత్తూ ఆ పరమ శివుడే వారం ఇచ్చాడు. అందుకే కాశీకి వెళ్లిన వారు తప్పకుండా మయూఖాదిత్యుని దర్శించి పూజించాలి. కాశీకి వెళ్లిన వారు విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణాదేవి దర్శన అనంతరం సూర్య దేవాలయాలను దర్శించుకోవాలి. ముఖ్యంగా దారిద్య

Paiditali Sirimanotsavam 2024: శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం 2024 - విజయనగరం

విజయనగరం పైడిమాంబ ఉత్తరాంధ్ర ప్రజలకు ఇలవేల్పు. పైడిమాంబ సిరిమానోత్సవానికి దేశ విదేశాల నుంచి లక్షలాది భక్తులు విచ్చేస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి పదహారురోజుల పాటు పైడితల్లి అమ్మవారి ఉత్సవం కన్నులపండువగా జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో విజయదశమి తరువాత వచ్చే మంగళవారంనాడు నిర్వహించే సిరిమానోత్సవం ప్రధానం. పైడితల్లి అమ్మవారికి తొలి సిరిమానోత్సవాన్ని 1758లో నిర్వహించారు. 50 అడుగులు పొడవుండే సిరిమానుకు చివర... అమ్మవారి రూపంలో పూజారి కూర్చునే విధంగా ఆసనం ఏర్పాటు చేస్తారు. సిరిమానును ఒకబండిపై అమర్చుతారు. ముత్తైదువలు సిరిమానుకి పసుపు కుంకుమలు పూసి.. నూతన వస్త్రాలు చుట్టబెట్టి పళ్లగెలలు కడతారు. సిరిమానుపై అధిష్టించిన పైడితల్లి తిరువీధుల్లో విహరిస్తూ ముమ్మారు కోటశక్తికి ప్రణమిల్లుతుంది. సిరిమానోత్సవం ప్రధానంగా రైతుల ఉత్సవం. అమ్మవారి వద్ద ఉంచిన విత్తనాలు రైతులందరికీ ఇస్తారు. బెస్తవారి వల, ఈటెలు - బల్లేలు, తెల్లఏనుగు వంటివి సిరిమానోత్సవం చూడదగిన విశేషాలు. సిరిమానోత్సవం తరువాత మంగళవారంనాడు పెద్ద చెరువులో తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఆ తరువాత వచ్చే మంగళవారం రాత్రి ఉయ్యాల కంబాలతో పదహారు రోజుల ఉత్సవం పూ

Indira Ekadasi: ఇందిరా ఏకాదశి

భాద్రపద మాసంలోని బహుళ ఏకాదశికి ఇందిరా ఏకాదశి అని పేరు దీనిని ఆచరించడం ద్వారా మానవుడు తన పితృదేవతలను ఉద్ధరిస్తాడు, సమస్త పాపాలు నశిస్తాయి. పూర్వం ఇంద్రసేనుడు అనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించాడు ఏకాదశి ముందురోజు తెల్లవారుజామునే స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. ఒక పూట భోజనం చేసి నేల పై పాడుకోవాలి. ఏకాదశి రోజు తెల్లవారుజామునే స్నానం చేసి వ్రత నియమం ప్రకారం ఉపవాసం ఉండాలి. మధ్యాహ్నం సాలగ్రామశిలా ఎదురుగా పితృతర్పణాలు చేయాలి. బ్రాహ్మణులకు భోజనము పెట్టి దక్షిణతో సంతృప్తి పరచాలి. చందన ఫుష్ప దూపదీప నైవేద్యాలతో విష్ణువుని అర్చించాలి. విష్ణు స్మరణంతో రాత్రి జాగరణ చేయాలి. తరువాత రోజు వ్రతపారణం చేయాలి ఈ ఇందిరా ఏకాదశి మహిమను చదివేవాడు, వినేవాడు సమస్త పాపవిముక్తుడై చివరకు విష్ణుపదాన్ని చేరుకుంటాడు. పురాణాల ప్రకారం, మాహిష్మతి రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ఇంద్రసేనుడు సత్యయుగంలో విష్ణువుకు గొప్ప భక్తుడు. అతని మాహిష్మతి రాజ్యంలో అందరూ ఆనందంగా జీవించారు. అక్కడి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒకరోజు రాజు తన మంత్రులతో ఆస్థానంలో కూర్చొని చర్చిస్తుండగా, నారద ముని అతని ఆస్థానానికి వచ్చాడు. మీ రాజ్యంలో ప్

Bikkavolu Ganapati Temple: శ్రీ లక్ష్మి గణపతి ఆలయం - బిక్కవోలు

  ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోటకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో సామర్లకోట నుంచి అనవర్తికి వెళ్లే మార్గంలో బిక్కవోలు ఉంది. 9-10 శతాబ్దాలలో ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన చాళుక్యరాజుల రాజధాని నగరంగా బిక్కవోలు విరాజిల్లింది. ఈ సమయంలో బిక్కవోలుకు బిరుదాంకినవోలు, బిరుదాంకపురం అనే పేర్లు ఉండేవని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. బిరుదాంకినవోలు అనేది కాలక్రమంలో ప్రజల వాడుకలో మార్పు చెంది బిక్కవోలు అయింది. స్థల పురాణం పూర్వం ఈ ప్రాంతంలో ఒక మోతుబరి రైతు నివసిస్తుండేవాడు. వ్యవసాయం, పశుపాలన వంటి వృత్తులను నిర్వహిస్తూ పరోపకారం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాదు. ఆయనకు ఆవులమంద ఒకటి ఉండేది. దానిని పశువుల కాపరి ఒకడు, ప్రతిరోజు పచ్చిక బయళ్లకు తోలుకొని పోయి మేపుకుని వస్తూ ఉండేవాడు. అందులో ఒక అవు మంద నుంచి విడిపోయి.. కొంతదూరం గడ్డి మేస్తూ వెళ్లి ఒక ఎత్తైన ప్రాంతానికి చేరుకొని పాలు జారవిడిచి తిరిగి మండలో వచ్చి కలిసేది, సాయంత్రం ఇల్లు చేరిన ఆవు ప్రతిరోజు పాలు ఇవ్వకపోవడంతో రైతుకు అనుమానం కలిగి ఆవును గమనించవలసినదిగా పశువుల కాపరికి తెలిపాడు. పశువుల కాపరి మరునాడు మేతకు ఆవులను తోలుకొని పోయి గమనించసాగాడు.

Venkatagiri Jatara: వెంకటగిరి పోలేరమ్మ జాతర 2024 తేదీలు

రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర అక్టోబర్  04, 05 తేదీల్లో జరగనుంది. వినాయక చవితి పూర్తయిన రెండు వారాలకు పోలేరమ్మ అమ్మవారి జాతర నిర్వహించడం ఆనవాయితీ. రెండు రోజులపాటు జరిగే ఈ జాతరకు వెంకటగిరిలోని ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నా స్వస్థలాలకు చేరుకుంటారు. దేశ విదేశాలనుంచి కూడా ఆ రెండురోజుల ఉత్సవాలనూ చూసేందుకు స్థానికులు తరలి వస్తారు. 2024 ముఖ్య తేదీలు  సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం మొదటి చాటింపు ఉంటుంది సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం రెండో చాటింపు ఉంటుంది.  సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం ఘటోత్సవం నిర్వహిస్తారు.  సెప్టెంబర్ 26వ తేదీ గురువారం అమ్మవారి ఉత్సవం జరుపుతారు సెప్టెంబర్ 26వ తేదీ గురువారం అమ్మవారి నిలువు, నిష్క్రమణం, నగరోత్సవంతో జాతర ముగుస్తుంది. జాతర తొలిరోజు రాత్రి అమ్మవారి మట్టి ప్రతిమను తయారు చేస్తారు, ఆ తర్వాత అమ్మగారింటినుంచి అత్తగారింటికి ఆ ప్రతిమను తీసుకొస్తారు. అక్కడ బుక్క చుక్క పెట్టి అమ్మవారి మూర్తిని దర్శనాలకు అనుమతిస్తారు. అత్తగారింటి నుంచి పోలేరమ్మ ఆలయానికి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఉంచుతారు. ఆ తర్వాత ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. అర్థరాత్రి ఈ త

Navratri Puja: నవరాత్రి పూజలను ఏ విధంగా చేసుకోవాలి ?

  నవ అంటే తొమ్మిది అని అర్థం. సంవత్సరంలో నాలుగుసార్లు నవరాత్రి దీక్ష చేయవచ్చు. అవే చైత్రం, ఆషాఢం, భాద్రపదం, ఆశ్వయుజ నవరాత్రులు. ఆశ్వయుజ మాసంలో వచ్చేవాటిని దేవీ నవరాత్రులు అంటారు. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి నవమి వరకూ శరన్నవరాత్రులను పాటిస్తారు. శరన్నవరాత్రులు హస్తా నక్షత్రం తో ఆరంభమై శ్రవణ నక్షత్రం పూర్తి కావడం విశేషం. ఈ తొమ్మిది రోజుల్లో ఆచార సంప్రదాయాల మేరకు అమ్మవారిని యధాశక్తి పూజించవచ్చు. అమ్మవారిని తొమ్మిది రోజులూ అర్చించడంతో పాటు తొమ్మిది అలంకారాలతో తొమ్మిది రూపాల్లో దర్శింప చేస్తారు.