- పూజకు కూర్చున్న వ్యక్తి తప్పనిసరిగా ఉతికిన వస్త్రాలు లేదా పట్టువస్త్రాలు ధరించాలి.
- ఎరుపు రంగు వస్త్రాలు శ్రేష్ఠం
- పురుషులు తప్పనిసరిగా ప్రతిరోజూ తలస్నానం చేయాలి
- నవరాత్రి దీక్ష స్వీకరిస్తే కనుక తొమ్మిది రోజులూ క్షుర కర్మ చేయించుకోకూడదు.
- నేలపైన మాత్రమే నిద్రించాలి. బ్రహ్మచర్యం పాటించాలి
- మద్యమాంసాదులు ముట్టుకోకూడదు. అబద్ధం ఆడకూడదు.
- చేపట్టిన పూజా కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతమైనది అని నమ్మకంతో, భక్తితో ముందుకు సాగిపోవాలి.
తొలిరోజునే అఖండ దీపం వెలిగించాలి. ఉదయవేళలోనే దీపారాధన, కలశస్థాపన చేయాలి. రాత్రిపూట పూజలు చేసేవారు కూడా తొలిరోజు ఉదయవేళలోనే దీపారాధన, కలశస్థాపన చేయవలసి ఉంటుంది. అఖండ దీపారాధనలో రెండు పెద్ద ప్రమిదలు తీసుకుని ఒకదానిలో ఒకటి ఉంచాలి. అందులో మూడు వత్తులు వేయాలి. దీపాన్ని తూర్పు వైపు వెలిగే విధంగా పెట్టాలి. దీపం తూర్పు వైపు వెలిగితే శాంతి చేకూరుతుంది. ఉత్తరం వైపు ధనధాన్యవృద్ధి కలుగుతుంది. పడమటివైపు శత్రుపీడ, అనారోగ్యం కలుగుతాయి. దక్షిణం వైపు పెట్టే దీపాన్నియమ దీపం అని పిలుస్తారు. మొత్తంమీద తూర్పు ఉత్తరం దిక్కులలో దీపాన్ని వెలిగేలా ఉంచితే విధాలా మంచిది. దీక్ష కొనసాగినన్ని రోజులూ అఖండదీపం కొండెక్కకుండా చూసుకోవాలి. రాత్రింబవళ్లు దీపాన్ని చూసుకుంటూ ఉండడం కష్టం అనుకునేవారు అఖండ దీపాన్ని వెలిగించకపోవడం మంచిది. ప్రతివారూ తప్పనిసరిగా అఖండదీపం వెలిగించాలన్న నియమం లేదు. ప్రతిసారి పూజా ప్రారంభంలో దీపారాధన చేసినా సరిపోతుంది.
Comments
Post a Comment