Skip to main content

మన పండుగలు సంస్కృతీ ప్రతిబింబాలు

మానవ జీవితం ముఖ్యంగా ప్రకృతిపై ఆధారపడి వుంటుంది. ఈ ప్రకృతిలోని మార్పులను జ్యోతిషశాస్త్రం ఆధారంగా గుర్తించి, గ్రహ నక్షత్రాదుల ప్రభావాలను పరిశీలిస్తూ, కాలానుగతికమైన పండుగలను ధర్మశాస్త్రం నిర్ణయిస్తుంది. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవడం పండుగల ఏర్పాటులో ముఖ్యమైన ఉద్దేశం. నోములు, వ్రతాలు, ఉత్సవాలు, పర్వాలు, పండుగలు అంటూ వాటికి మనం పేర్లు పెట్టుకుంటున్నాం. ఈ దేశంలో సంవత్సరం మొత్తం ఏదో రూపంలో ఏదో ఒక పర్వం నిర్వహిస్తూనే వుంటారు.



పండుగలు జరుపడంలో మహిళల దే ప్రముఖ పాత్ర. మహిళలు  అధికసంఖ్యలో ఐకమత్యంతో పాల్గొని చురుకుగా చేసే పండుగల్లో బోనాలు, బతుకమ్మ, గొబ్బెమ్మ లు అగ్రస్థానంలో నిలుస్తాయ. శ్రావణమంగళ, శుక్రవారాల్లో నోచే నోములకూ ప్రముఖస్థానమే. 

మాసాలపరంగా ఆలోచిస్తే మన పండుగల్లో మొట్టమొదటి చైత్రశుద్ధ పాడ్యమినాడు నిర్వహించే 'ఉగాది' పండుగ. తెలుగువారికే ఇది ప్రత్యేకమైన పండుగ. ఈరోజు ఆరు రుచులతో కూడుకున్న వేపపువ్వు పచ్చడిని ఆరగించిన తర్వాతనే మిగిలిన పనులు ప్రారంభిస్తాము. ప్రకృతికి నమస్కరించే తెలుగువారి మొదటి పండుగ ఇది.

సంక్రాంతి తెలుగువారు నిర్వహించుకునే మరో ప్రత్యేకమైన ప్రకృతికి అనుగుణమైన ఉత్సవం. సూర్యుని సంక్రమణాన్ని అందులోను ఉత్తరాయంన్ని ఆనందించే పండుగ ఇది. ఆంధ్ర, తెలంగాణలోను ముగ్గులతో గృహ ప్రాంగణం అలంకరించుకోవడం, గంగిరెద్దుల సంబరాలు, కోళ్ల పందేలు, పతంగులు ఏగరేయడం చేస్తారు. పత్తి, నూనె, నెయ్యి, జీలకర్ర వంటి వస్తువులతో నోములు నోచుకుంటారు. భోగి మంటలు, గోదా కళ్యాణాలు, కనుమనాడు పశువులకు పూజ చేయడం తెలుగువారి సంప్రదాయంలోని వైశిష్ట్యం. శ్రావణ మాసంలో పూర్ణిమనాడు చేసుకునే ఉత్సవం రాఖీ పూర్ణిమ సోదరులకు వారి చెల్లెళ్లకు రాఖీలు కట్టి ఆత్మీయతను పంచుకుంటారు. ఇది కుటుంబ వాతావరణంలో ఆనందాన్ని, అనుబంధాన్ని పెంచడంవల్ల ఈ పండుగకు విశేషమైన గుర్తింపు తెలుగువారికి కూడా ఏర్పడింది.

హోళికోత్సవం ప్రకృతికి సంబంధించిన మరో గొప్ప ఉత్సవం. దీనిని వసంతోత్సవం అంటారు. రంగులు చల్లుకోవడం, ముందురోజు కామదహనం వుంటుంది. కాముడు అంటే మన్మథుని భావాలను అంటే కోరికలను దహనం చేసే విధానం ఈ పండుగలోని అంతరార్థం. ఈ పండుగలు కాక మిగిలిన పండుగల్లో పూర్తిగా దైవభావన మిళితమై వుంటుంది. శ్రీరామనవమి, హనుమత్ జయంతి, నృసింహ జయంతి, తొలి ఏకాదశి, వ్యాసపూర్ణిమ (గురుపూర్ణిమ), వినాయకచవితి, దసరా నవరాత్రి ఉత్సవాలు, దీపావళి, కార్తీక దీపోత్సవాలు, దత్త జయంతి, ముక్కోటి ఏకాదశి, రథసప్తమి మొదలైన ఉత్సవాలన్నీ దైవాలకు అనుబంధంగా నిర్వహించుకునే పండుగలు.

శ్రీరామనవమి చైత్రశుద్ధ నవమినాడు తెలంగాణలోని భద్రాచలంలో కళ్యాణోత్సవం, తెలుగు ప్రాంతాల్లో వాడవాడలా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. వసంత నవరాత్రుల చివరి రోజున శ్రీరాముని పూజించడం, ఆయన భావాలు స్వీకరించడం ఈ పండుగలో ముఖ్య ఉద్దేశం. హనుమత్ జయంతి చైత్ర పూర్ణిమనాడు నిర్వహిస్తారు.

వైశాఖ మాసంలో శుద్ధ చతుర్దశి నాడు నృహింహ జయంతి తెలుగు ప్రాంతాల్లో ముఖ్యంగా తెలంగాణలో అత్యధికంగా నృసింహ క్షేత్రాలుండడంవల్ల దేవాలయాలలో నిర్వహిస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణు దర్శనం చేస్తున్నారు. పవిత్ర నదుల్లో స్నానాలు చేయడం ఉపవాసాలుండడం తెలుగువారు నిర్వహిస్తున్న విధి. ఆషాఢ పూర్ణిమనాడు వ్యాసపూర్ణిమను గురుపూర్ణిమగా నిర్వహించి తమ గురువులను సన్మానిస్తూ, సాయిబాబా, దత్తాత్రేయ, దక్షిణామూర్తి, హయగ్రీవ స్వాములకు పూజలు నిర్వహిస్తారు.

ఆషాఢమాసంలో తెలంగాణలో బోనాల ఉత్సవాన్ని నిర్వహించి గ్రామదేవతలైన అమ్మవార్లకు నైవేద్యంగా భోజనాన్ని, తొట్టెలను సమర్పించడం పోతురాజు విన్యాసాలు నిర్వహిస్తారు. స్ర్తిలు సామూహికంగా బోనం కుండలను తలపై పెట్టుకుని వాటిపైన దీపాలు వుంచుకుని అమ్మవారికి గుడికి వెళతారు. శ్రావణమాసంలో స్ర్తిలు మంగళవారాల్లో మంగళగౌరీ వ్రతాలు, రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలను ఆనందంగా జరుపుకుంటారు. ఈ మాసంలో వనభోజనలకు వెళ్లే సంప్రదాయం కూడా వున్నది.

భాద్రపద మాసంలో శుద్ధ చవితినాడు వినాయకచవితి ఉత్సవాన్ని తెలుగు ప్రాంతాల్లో వైభవంగా నిర్వహిస్తారు. బాల గంగాధర్ తిలక్ ప్రభావంతో స్వాతంత్య్ర సమర కాలం నుంచి వాడవాడల్లో గణపతి హోమాలు, అన్నదానాలు భజనలు ఈ ఉత్సవంలో నిర్వహిస్తున్నారు. అనంత పద్మనాభ చతుర్దశినాడు వినాయక నిమజ్జనం కూడా ప్రత్యేక ఉత్సవంగా చేస్తున్నారు.

భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో పితృపక్షాలు నిర్వహించడం సంప్రదాయం. అమావాస్యనాడు మరణించిన పెద్దలకోసం అనేక రూపాల్లో బ్రాహ్మణులకు దానధర్మాలు ఆచరించే సంప్రదాయం తెలుగువారిలో కొనసాగుతున్నది. భాద్రపద మాసంలో అమావాస్యనాడే తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగ ఆడే సంప్రదాయం కనిపిస్తుంది. పుష్పాలతో బతుకమ్మను తయారుచేసి, దానిపై పసుపుతో గౌరమ్మను చేసిపెట్టి అందరూ ఒకచోట చేరి మధ్యలో వుంచి చుట్టూ తిరుగుతూ చేసే ఉత్సవం తెలంగాణకు తలమానికమైన పండుగ ఇది. ఒకరకంగా అరోమా థైనపీ (పుష్పవాసనలతో కూడిన వైద్యం. భాద్రపద అమావాస్య నుంచి ఆశ్వీజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) వరకు పండుగ నిర్వహిస్తారు. తొమ్మిదవ నాడు సద్దుల బతుకమ్మగా భావనచేసి 9 రకాల సద్దులను (పిండి వంటలను) నైవేద్యంగా సమర్పిస్తారు. గౌరమ్మకు స్వాగతం, వీడుకోలు ఈ తొమ్మిది రోజుల్లో చెబుతారు.

ఆశ్వీజ మాసం ప్రారంభం నుంచి తొమ్మిది రోజులు శరన్నవరాత్రులు తెలుగు ప్రాంతాల్లో నిర్వహించి చాలామంది దీక్షాపరులై అమ్మవారిని వేర్వేరు రూపాల్లో పూజిస్తారు. చండీహోమాలు, ఆయుధ పూజ, సామూహిక అన్నదానాలు, పదవరోజు పాలపిట్ట దర్శనం, జమ్మి చెట్టుకు పూజ చేస్తారు.

శివునికి ప్రీతికరమైన కార్తీక మాసంలో అభిషేకాదులు, దీపోత్సవాలు అన్ని ప్రాంతాల్లో ఆధ్యాత్మిక చైతన్య మాసంగా నిర్వహిస్తారు. గురువు ప్రాదాన్యం విస్తరించడంవల్ల దత్తాత్రేయ జయంతిని మార్గశిర పౌర్ణమి నాడు కోరల పూర్ణిమగా చేస్తారు. ఈరోజు దత్త ఆరాధన చేస్తారు. కొన్ని వంటకాలను కుక్కలకోసం చేసి పెడితే నరక బాధలుండవని ఒక భావన. జంతువులపై చూపే ప్రేమ కూడా ఈ పండుగలో అంతర్భాగమే.

కాల పరిణగణనలో తెలుగువారిది చాంద్రమానం. వైకుంఠ ఏకాదశి సౌరమానం ప్రకారం జరిపే పండుగ. ధనుర్మాసం మొదలైన తర్వాత శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా నిర్ణయిస్తారు. ఇది మార్గశిరంలో, పుష్యంలోగాని వస్తుంది. వైష్ణవులకు, రామానుజ, మాధ్వ మతస్తులకు ఇది చాలా ముఖ్యమైనది. ఉత్తర ద్వారం నుంచి వైకుంఠవాసుడైన విష్ణువు యొక్క రూప దర్శనంవల్ల మోక్షప్రాప్తి అనే భావనవల్ల ఈ పర్వదినాన్ని భక్తితో జరుపుకుంటారు. మాఘమాసంలో శ్రీపంచమి, రథసప్తమి, భీష్మైకాదశి, శ్రీపంచమిన అమ్మవారు పుట్టినరోజుగా భావించగా, రథసప్తమినాడు సూర్యునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భీష్మైకాదశినాడు విష్ణుపూజలు చేస్తారు. ఇక ఈ మాసంలో నిర్వహించే ఉత్సవం మహాశివరాత్రి. తెలుగువారు భక్తి శ్రద్ధలతో, ఉపవాసాలతో, రుద్రాభిషేకాలతో, జాగారాలతో శివుని కళ్యాణాలను నిర్వహిస్తారు.

ప్రకృతికి అనుగుణంగా జీవించడం, మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు దైవపూజలు నిరంతరం చేస్తుండడం, అందరితో ఆనందంగా గడపడం, అందరికీ పండుగల సమయాల్లో ఆహారాదులు, ధనం, వస్తువులను పంచుకుంటూ వుండడం, ఉన్నతిని కోరుకుంటూ వుండడం తెలుగువారి పండుగల నిర్వహణలో ముఖ్య ఉద్దేశం. ఆ ఆనందాన్ని మరింతగా కొనసాగిస్తూ, వానిలోని చిన్నచిన్న దోషాలను పరిహరిస్తూ ముందుకు వైజ్ఞానికంగా కొనసాగాలని ఆశిద్దాం.

Comments

Popular posts from this blog

Dwaraka Tirumala Brahmotsavam: శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు 2024 తేదీలు - ద్వారకా తిరుమల

ద్వారకాతిరుమలలో  ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. స్వయంభువ మూర్తి వైశాఖమాసంలో వెలిసినందువల్ల ఒకసారి.... ఆశ్వయుజ మాసంలో రామానుజులు ప్రతిష్ఠ చేసినందువల్ల రెండోసారి బ్రహ్మోత్సవం జరుగుతుంది. రెండు బ్రహ్మోత్సవాల్లోనూ శ్రీస్వామివారికి, అమ్మవారికి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. 2024 తేదీలు  అక్టోబరు 13 - గజ వాహన సేవ అక్టోబరు 14 - ధ్వజారోహణ, శేష వాహన సేవ  అక్టోబరు 16 - సూర్యప్రభ వాహన సేవ, ఎదురుకోలు  అక్టోబరు 17 - తిరు కల్యాణ మహోత్సవం, గరుడ వాహన సేవ అక్టోబరు 18 - రథోత్సవం  అక్టోబరు 19 - చక్రవారి, ధ్వజావరోహణం  అక్టోబరు 20 - ద్వాదశ కోవెల ప్రదక్షిణ, పుష్పయాగం, పవళింపు సేవ 

Kojagara Purnima: కోజాగరి పూర్ణిమ

ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్ష పూర్ణిమ కోజాగరి పూర్ణిమ. ఈనాడు ఆచరించే వ్రతానికి కోజాగరి పూర్ణిమవ్రతం, కోజాగరి వ్రతం అని పేర్లు. శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రియమైన ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల దారిద్ర్యాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు, సకల సంపదలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. ఆశ్వయుజ పూర్ణిమనాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని శిరస్నానం చేసి శ్రీమహాలక్ష్మీదేవిని పూజించాలి. తిరిగి సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత మరాలా లక్ష్మీ దేవినే పూజించి పాలు, పంచదార, ఏలకుల పొడి, కుంకుమపువ్వు వేసి వండిన క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించి దానిని తీసుకువెళ్లి ఆరుబయట వెన్నెలలో కొద్దిసేపు ఉంచాలి. తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ వ్రతంలో రాత్రి జాగరణ చేయాలని నియమం. జాగరణ సమయంలో పాచికలు లేదా గవ్వలను ఆడుతూ గడపలెను. ఆశ్వయుజ పూర్ణిమనాడు రాత్రి లక్ష్మీదేవి భూలోకంలో తిరుగుతూ ఎవరైతే జాగరణ చేస్తూ ఉంటారో వారికి సర్వసంపదలను ప్రసాదిస్తుందని కథనం. ఈ విధంగా జాగరణ చేసి మరునాడు పునఃపూజ చేసి వ్రతాన్ని ముగించాలి. ఈ విధంగా కోజాగరి పూర్ణిమను జరుపుకోవడం వల్ల లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు లభిస్తాయి. పూర్వం ఈ వ్

Dasara: దసరా, విజయదశమి

  ఆశ్వయుజ శుద్ధ దశమి విజయదశమిగా చెప్పబడుతోంది. దీనికే అపరాజిత దశమి, దసరా అని కూడా పేర్లు. అపరాజిత అంటే పరాజయం లేనిది అని అర్థం.  ఈ రోజున ఏ పనిని ప్రారంభించినా అందులో తప్పక విజయం లభిస్తుంది.అందుకే యిది విజయదశమిగా ప్రసిద్ధి చెందింది.  దేవీనవరాత్రులలో కలశాన్ని స్థాపించి, దీక్షతో వున్నవారు ఈ దశమిరోజున ఉద్వాసన చెప్పాలి. ఇక 'దశాహరాత్రం' అనే సంస్కృత పదాలకి ఏర్పడ్డ “దశహరం" అనే వికృతి రూపంనుండి వచ్చిన పేరే దసరా. ఈ రోజున అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. ఈ రోజు సాయంత్రం జమ్మిచెట్టును దర్శించి పూజించాలి. సాధారణంగా గ్రామాలలో సామూహికంగా ఈ శమీపూజ చేస్తుంటారు. ఈ శమీపూజ చేయడం వల్ల అనుకున్న పనులలో 'విజయం' తప్పక లభిస్తుందంటారు. విజయదశమి రోజున ప్రత్యేకంగా విజయకాలాన్ని కూడా పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రవణానక్షత్రం, దశమి తిధి వున్న విజయదశమి రోజున సంధ్యాకాలం దాటిన తర్వాత వుండే సమయాల్ని పురాణాలు విజయకాలమని పేర్కొంటున్నాయి. ఒకవేళ శ్రవణం నక్షత్రం లేకపోయినా దశమి తిథిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని దాన్ని విజయముహూర్తంగా భావించాలని స్కాందపురాణం చెబుతోంది. ఈ సమయంలో అ

Papankusha Ekadasi: పాపాంకుశ ఏకాదశి

ఆశ్వయుజమాసంలో శుక్ల పక్ష ఏకాదశిని పాపాంకుశ ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ వ్రతం ఆచరించేవారికి సంపద, మంచి ఆరోగ్యం లభిస్తాయి. కాబట్టి దీనిని అత్యంత ముఖ్యమైన ఏకాదశిగా పరిగణిస్తారు.  ఈ ఏకాదశి వ్రతం పాటిస్తే గత పాపాలనుండి విముక్తులవుతారు.  ఈ రోజున ఉపవాసం చేస్తే అనేక అశ్వమేధ యజ్ఞాలు, సూర్య యజ్ఞాలు చేయడం ద్వారా పొందిన ప్రయోజనాలకు సమానమని విశ్వసిస్తారు. ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి, ఉపవాసం ఉండాలి. ఏకాదశి వ్రతం ఆచరించే సమయంలో ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా జాగ్రత్తపడాలి, అబద్ధాలు చెప్పకూడదు, జాగారం చేయాలి.  'విష్ణు సహస్రనామం' పారాయణ చేయాలి ఈ రోజు దానధర్మాలు  చేయడం అత్యంత ప్రతిఫలదాయకం అన్నం, వస్త్రాలు, ధనాన్ని దానం చేయాలి. ఇలా స్వర్ణ ప్రాప్తి కలుగుతుంది. పురాణాల ప్రకారం, క్రోధనుడు అనే వేటగాడు వింధ్యాచల్ పర్వతాలపై నివసించేవాడు. అతని జీవితాంతం చెడు పనులు చేస్తుండేవాడు. ప్రశాంతమైన జీవితాన్ని గడపమని ఎవరూ అతనికి నేర్పించలేదు. క్రోధనుడు వయస్సు పెరుగుతున్నాకొద్ది తన మరణం గురించి భయపడటం ప్రారంభించాడు. తన పాపాలు. చెడు పనుల కారణంగా మరణానంతరం తను అనుభవించే బాధ గురించి చాలా ఆందో

Human Duties: మానవ ధర్మములు

1. ఉదయం నిద్రనుండి లేచినపుడు కుడి ప్రక్కకు తిరిగి లేవండి ఆరోగ్యం. 2. లేచిన వెంటనే రెండు అరచేతులు చూస్తూ॥ కరాగ్రే వసతేలక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేస్థితే గౌరి ప్రభాతే కరదర్శనం" అని అనుకోండి. 3. కుడికాలు మంచంమీద నుండి క్రింద పెడుతూ “సముద్ర వసనేదేవి పర్వతస్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శక్షమస్వమే” అని భూమాతకు నమస్కరించండి 4. లేచిన వెంటనే కప్పుకున్న దుప్పటిని, ప్రక్క బట్టలను అన్నింటినీ చక్కగా మడతపెట్టండి. తదుపరి కాలకృత్యాలు పూర్తి చేయండి. 5. ఉదయాన్నే ముందురోజు రాత్రి రాగిపాత్రలో పోసిఉంచిన నీరు త్రాగండి. 6. వ్యాయామం (నడక) కనీసం ఉదయం 9 ని॥ల నడవండి. 7. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి సర్మడే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అనుకుంటూ చన్నీటి స్నానం చేయండి. 8. సూర్యునకు ఎదురుగా గాని, నడుస్తూగాని దంతధావన చేయరాదు. 9. మూత్రవిసర్జన సూర్య, చంద్రులకు ఎదురుగా చేయరాదు. 10. స్నానానికి చన్నీటి స్నానం ఉత్తమమైనది. 11. తెల్లవారు ఝామున 4-5 గంటల మధ్య చేసే స్నానం ఋషి స్నానం 5-6 గంటల మధ్య చేసే స్నానం దైవ స్నానం 6-7 గంటల మధ్య చేసే స్నానం మానవ స్నానం 7-8 గంటల మధ్య చేసే స్నానం రాక్షస స్నానం 12. చన్

Aswayuja Purnima: ఆశ్వయుజ పూర్ణిమ, కౌముది పూర్ణిమ

  ఆశ్వయుజ పూర్ణిమ నాడు చంద్రుడు అశ్వినీ నక్షత్రంతో కలిసి ఉంటాడు.సౌర మానంలో దీన్నే తులాపూర్ణిమ అంటారు. ఈ తులామాసంలో జగన్మాతను ఆరాధించాలి. ఈ రోజున అధికమైన కాంతి కలిగిన వెన్నల ఉంటుంది.అందుకే దీనిని కౌముది పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు ధ్యానం చేస్తే  సాధకుని మనస్సు సంకల్ప వికల్పాలకు అతీతమవుతుంది. శివశక్తి సామరస్యాన్ని దర్శించే సామర్ధ్యం పెంపొందుతుంది. ఈ రోజున కౌముద్యుత్నవము, అక్షక్రీడ కోజాగర్తి వ్రతము. లక్ష్మీపూజ, ఇంద్రపూజ, కుబేరపూజ, చంద్ర పూజ చేయాలి. లక్ష్మీ, కుబేరుడు, ఇంద్రులను రాత్రి సమయంలో పూజిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి. ఈ రోజు లక్ష్మి అనుగ్రహం కోసం గవ్వలాట(అక్ష క్రీడ) ఆదుకోవాలి. జాగరణ వ్రతం చేయాలి, జాగరణలో వున్నవారిని లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఆవు పాలతో ఆరుబయట వెన్నెల్లో క్షీరాన్నం తయారుచేస్తారు.  ప్రకాశవంతమైన చంద్రుని అమృత కిరణాలు ఆ పాయసంలోకి నేరుగా ప్రసరిస్తాయి. దానిని లక్ష్మీదేవికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. దీనివల్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వృద్ధి పొందుతాయి.  ఆశ్వయుజ పూర్ణిమ నాడు గొంతెమ్మరూపంలో ఉన్న కుంతీదేవిని ఆరాధించే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది.  ఈ రోజున దానం

Theerthams in Tirumala: తిరుమలగిరులలో 66 కోట్ల తీర్థాలు..

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవంగా శ్లాఘించబడే శ్రీ వేంకటేశ్వరస్వామి శేషపర్వతం యొక్క ముఖభాగాన్ని వేంకటాద్రి అని, మధ్యభాగాన్ని నృసింహాద్రి అని, వెనుక భాగాన్ని శ్రీశైలంగా పురాణాలు అభివర్ణిస్తున్నాయి. ఈ శేషగిరులు అనేకానేక వృక్షసంపదకు, జీవసంపదకు, జంతుకోటికి ఆలవాలమే కాకుండా అనేకానేక పుణ్యతీర్థాలు కలిగి జలసంపదకు కూడా నిలయంగా ఉంటుంది.  తిరుమలగిరులలో 66 కోట్ల తీర్థాలు! ”పుణ్యతీర్థ” మనగా శుభము కలుగజేయు జలమని భావం. అట్టి పుణ్యతీర్థములు తిరుమల పర్వతశ్రేణుల్లో 66 కోట్లున్నవని బ్రహ్మపురాణం, స్కంధపురాణము తెలుపుచున్నవి. అయితే ఈ తీర్థములను ధర్మరతి, జ్ఞాన, భక్తి వైరాగ్య, ముక్తిప్రద తీర్థములు నాలుగుగా విభజించడమైనది. వీనిలో ముఖ్యమైనవి ఈ విధంగా ఉన్నాయి. ధర్మరతిప్రద తీర్థములుః- ఈ తీర్థముల దగ్గర నివసించిన లేక స్నానమాచరించిన లేక సేవించిన ధర్మాసక్తి కలుగునని పురాణములు తెలుపుచున్నవి. వీటి సంఖ్య 1008 గా నిర్దేశించడమైనది. జ్ఞానప్రద తీర్థములుః- ఈ తీర్థ జలములను సేవిస్తే జ్ఞానయోగం ప్రాప్తి కలుగునని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇవి 108 కలవు. అవి  1.⁠ ⁠మను తీర్థము 2. ఇంద్ర 3. వసు 4. రద్ర(11) 5. ఆదిత్య (1

Ganesh Deeksha: గణపతి దీక్ష

సాధారణంగా లోకంలో ఎన్నో దీక్షలున్నాయి. కాని అన్నింటిలోనూ గణపతి దీక్ష అత్యంత సులభసాధ్యమైనది, అన్నివేళల్లో అందరూ సులభంగా ఆచరించదగినది. ఎక్కువ నియమ నిబంధనలు లేకుండా, ఏ ఇబ్బందులూ కష్టాలూ లేకుండా బాలల నుంచి వృద్ధుల వరకూ, స్త్రీ, పురుషులందరూ చేయగలిగినది. గణపతి దీక్షను వినాయకుడి ఆలయంలో ఒక శుభముహూర్తాన స్వీకరించాలి. దీక్ష తీసుకునే రోజు అభ్యంగ స్నానమాచరించి గణపతి ముందు రెండు చేతులు జోడించి, ‘ఓ గణేశా! ఈ రోజు నుంచి నీ దీక్షావ్రతాన్ని అవలంబించి యథాశక్తి నిన్ను సేవిస్తాను. దీక్షా సమయంలో ఏ విధమైన విఘ్నాలూ కలగకుండా నా కోరికను నెరవేర్చి నీ అనుగ్రహాన్ని ప్రసాదించ’మని ప్రార్థించుకోవాలి.   బంగారు రంగుతో మెరుస్తూ ఉన్న కొత్త వస్త్రాలను లేదా లేత ఎరుపురంగు వస్త్రాలు ధరించాలి   గణపతి చిహ్నంతో ఉన్న ఒక మాల,కంకణం  ధరించాలి. దీక్షను స్వీకరించే ముందు – ఆదిదేవ గణాధ్యక్ష! త్వదనుగ్రహకారకం!దీక్షాం స్వీకృత్యత్వతేవాం కరోమీప్సిత సిద్ధయే!  అనే దీక్షా మంత్రాన్ని పఠిస్తూ మాలను మెడలో ధరించాలి. చేతికి కంకణాన్ని ధరించాలి. మన కోరికను అనుసరించి 3, 5, 11, 21, 41 రోజులు లేదా శుద్ధ చవితి నుంచి బహుళ చవితి వరకు లేదా బహుళ చవితి నుంచి శ