- భాద్రపద మాసంలోని బహుళ ఏకాదశికి ఇందిరా ఏకాదశి అని పేరు
- దీనిని ఆచరించడం ద్వారా మానవుడు తన పితృదేవతలను ఉద్ధరిస్తాడు, సమస్త పాపాలు నశిస్తాయి.
- పూర్వం ఇంద్రసేనుడు అనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించాడు
- ఏకాదశి ముందురోజు తెల్లవారుజామునే స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి.
- ఒక పూట భోజనం చేసి నేల పై పాడుకోవాలి.
- ఏకాదశి రోజు తెల్లవారుజామునే స్నానం చేసి వ్రత నియమం ప్రకారం ఉపవాసం ఉండాలి.
- మధ్యాహ్నం సాలగ్రామశిలా ఎదురుగా పితృతర్పణాలు చేయాలి.
- బ్రాహ్మణులకు భోజనము పెట్టి దక్షిణతో సంతృప్తి పరచాలి.
- చందన ఫుష్ప దూపదీప నైవేద్యాలతో విష్ణువుని అర్చించాలి.
- విష్ణు స్మరణంతో రాత్రి జాగరణ చేయాలి.
- తరువాత రోజు వ్రతపారణం చేయాలి
- ఈ ఇందిరా ఏకాదశి మహిమను చదివేవాడు, వినేవాడు సమస్త పాపవిముక్తుడై చివరకు విష్ణుపదాన్ని చేరుకుంటాడు.
పురాణాల ప్రకారం, మాహిష్మతి రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ఇంద్రసేనుడు సత్యయుగంలో విష్ణువుకు గొప్ప భక్తుడు. అతని మాహిష్మతి రాజ్యంలో అందరూ ఆనందంగా జీవించారు. అక్కడి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒకరోజు రాజు తన మంత్రులతో ఆస్థానంలో కూర్చొని చర్చిస్తుండగా, నారద ముని అతని ఆస్థానానికి వచ్చాడు. మీ రాజ్యంలో ప్రజలందరూ ప్రశాంతంగా జీవిస్తున్నారని, అయితే మీ తండ్రి తన చెడు కర్మల కారణంగా యమలోకంలో నివసించవలసి వచ్చిందని నారద మహర్షి రాజుకు తెలియజేశాడు. ఇది విన్న ఇంద్రసేనుడు ఆందోళన చెందాడు, దేవర్షి నారదుని తన తండ్రి ఆత్మ క్షేమం గురించి అడిగాడు. తన తండ్రి చేసిన పాపాలను పోగొట్టుకోవడానికి భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశినాడు తప్పక ఉపవాసం పాటించాలని మహర్షి చెప్పాడు. ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలోకూడా నారదుడు ఇంద్రసేన రాజుకు వివరించాడు. ఇందిరా ఏకాదశికి ఒక రోజు ముందు, దశమి రోజున నదిలో స్నానం చేసి, పూర్వీకులకు శ్రాద్ధం పెట్టాలి.
ఏకాదశినాడు శ్రీమహావిష్ణువును పూజించి సాయంత్రం పూట పండ్లు మాత్రమే తినాలి. ఈ వ్రతం ఆచరించడం వలన అతని తండ్రికి పుణ్యఫలం లభిస్తుందని చెప్పాడు. ఇంద్రసేన రాజు తన సోదరులతో కలిసి ఇందిరా ఏకాదశి వ్రతం ఆచరించాడు. ఫలితంగా, అతని తండ్రి మోక్షాన్ని పొందాడు. రాజు ఇంద్రసేనడు కూడా తన మరణానంతరం అతని ఆత్మ స్వర్గానికి చేరుకుంది.
2024 తేదీ: సెప్టెంబర్ 28.
Comments
Post a Comment