Mehandipur Balaji Temple: మెహందీపూర్ బాలాజీ ఆలయం - రాజస్థాన్
రాజస్థాన్ ఆరావళి పర్వతాల సమీపం నడుమ దౌసా అనే జిల్లాలో ఉందీ మెహందీపూర్ బాలాజీ ఆలయం.
రాజస్థాన్ నుంచి మాత్రమే కాదు..ఆ చుట్టుపక్క రాష్ట్రాల నుంచి మెహందీపూర్ బాలాజీ దర్శనానికి వస్తుంటారు. వేల సంవత్సరాలకు ముందు ఓ భక్తుడికి ఆంజనేయుడు బాలుడి రూపంలో కనిపించి తన జాడ చెప్పాడట.ఆ భక్తుడు ఎంత వెతికినా హనుమంతుడు కనిపించకపోవడంతో మళ్లీ కఠినమైన సాధన చేశాడట..అప్పుడు మరోసారి కలలో కనిపించి తాను వెలసిన ప్రదేశం గురించి స్పష్టత నిచ్చాడట.అప్పుడు ప్రతిష్టితమైన వాయుపుత్రుడు నిత్యం పూజలందుకుంటున్నాడు.
స్వామి బాలహనుమంతుడిగా వెలిసిన ఈ ప్రదేశంలోనే మరో రెండు విగ్రహాలు దర్శించుకోవచ్చు. శివుని ఉగ్రరూపమైన భైరవుని సూచించే విగ్రహం ఒకటి...దుష్టశక్తులకు రాజుగా భావించే ‘ప్రేతరాజు’ విగ్రహం మరొకటి. వేల ఏళ్ల క్రితమే ఇక్కడ పూజలు మొదలైనాకానీ...ఆంజనేయుడి అసాధారణ మహిమలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దుష్టశక్తులతో బాధలు పడేవారు, మానసికరోగులు, మూర్ఛరోగులు, సంతాన సమస్యలతో బాధపడుతున్నవారు మెహందీపూర్ బాలాజీ ఆశీస్సులు పొందితే పరిష్కార మార్గం దొరుకుతుందని భక్తుల నమ్మకం.
ఉగ్రుడైన స్వామి వారి పాదాలదగ్గర నిత్యం నీరు ప్రవహిస్తుంటుంది. ఆ నీటినే భక్తులకు తీర్థంగా ఇస్తారు. మానసిక రోగులు ఈ తీర్థం తాగితే మార్పు మొదలవుతుందంటారు.
నిత్యం భక్తులతో కళకళలాడే ఈ ఆలయం హనుమాన్ కి అత్యంత ప్రీతికరమైన మంగళవారం, శనివారాల్లో మరింత రద్దీ ఉంటుంది.
Comments
Post a Comment