Tiruchendur: సుబ్రమణ్య స్వామి శూరసంహారం చేసిన ప్రదేశం
కార్తికేయుడు భక్తుల హృదయాల్లో జ్ఞానజ్యోతులను వెలిగిస్తాడని, గుహునిగా కొలువుదీరి ముక్తిని ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
తారకాసురుడి సోదరుడు శూరపద్ముడు సుబ్రహ్మణ్యుడితో యుద్ధానికి తలపడ్డాడు. తిరుచెందూర్ వద్ద కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి షష్టి వరకూ ఆరు రోజులు జరిగిన యుద్ధంలో కుమారస్వామి అసురగణాలను హతమార్చగా శూరపద్ముడు మామిడిచెట్టు రూపం ధరించాడు. వేలాయుధం ఆ చెట్టును రెండుగా చీల్చగా అతడి రాక్షసగుణాలు అంతరించాయి. చీలిన చెట్టు భాగాల్లో ఒకటి నెమలిగా, మరొకటి కోడిపుంజుగా మారి శరవణభవుణ్ణి శరణువేడాయి. సుబ్రమణ్యస్వామి కోడిపుంజును ధ్వజంగా, నెమలిని వాహనంగా స్వీకరించి తరింపచేశాడు. భక్తితో శరణువేడితే దుష్టులను సైతం స్వామి క్షమిస్తాడని నిరూపిస్తుందీ వృత్తాంతం, శూర సంహారానికి గుర్తుగా తిరుచెందూర్లో కార్తిక షష్ఠినాడు ఉత్సవాన్ని, దేవసేనతో స్వామి కల్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుకను తిలకించడానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు.
Comments
Post a Comment