జ్యేష్ట బహుళ ఏకాదశికే యోగిని ఏకాదశి అని పేరు. ఈ ఏకాదశి మహిమ బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడింది. ఈ ఏకాదశి మహిమను శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు వివరించాడు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. భయాలు తొలగిపోయి దైర్యం సిద్ధిస్తుంది. కొన్ని వేలమంది బ్రాహ్మణులకు సంతర్పణ చేయగా వచ్చే ఫలం కేవలం ఈ యోగిని ఏకాదశి వ్రతం వలన కలుగుతుంది. ఇది మనిషి యొక్క సమస్తపాపాలను నశింపచేసి అమిత పుణ్యాన్ని చేకూరుస్తుంది. యోగిని ఏకాదశి మహిళ పురుష భేదం లేకుండా పిల్లలు, పెద్దలు అందరూ ఆచరించవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ వ్రతం ఆచరించడం వలన మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చునని శాస్త్రవచనం. యోగిని ఏకాదశి పూజా విధానం యోగిని ఏకాదశి రోజు సూర్యోదయానికి పూర్వమే తలారా స్నానం చేసి శుచియై పూజా మందిరం శుభ్రం చేసుకొని లక్ష్మీనారాయణుల విగ్రహాలకు కానీ చిత్రపటాలకు కానీ గంధం కుంకుమలతో బొట్లు పెట్టి సుందరంగా అలంకరించాలి. ఆవు నేతితో దీపారాధన చేయాలి. చామంతి, గులాబీ, మల్లెపూలతో లక్ష్మీనారాయణులను అర్చించాలి. ఏకాదశి పూజలో ముఖ్యంగా తులసి దళాలను సమర్పించాలి. తులసి లేని పూజ అసంపూర్ణం అవుతుంది. ఆవు నేతి...
జ్యేష్ఠ మాసంలో లో కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అంటారు. జ్యేష్ఠ అమావాస్య పూర్వీకులను స్మరించుకోవడానికి, గౌరవించుకోవడానికి, వారి నుండి ఆశీస్సులు పొందడానికి మంచి రోజు. పూజలు, దానం మొదలైన అనేక కార్యక్రమాలతో పాటు పిండ ప్రదానం లేదా తర్పణం ఇవ్వడం జ్యేష్ఠ అమావాస్య నాడు పితృదేవతల పట్ల గౌరవాన్ని ప్రదర్శించడానికి చేస్తారు. ఇలా చేయడం వలన పితృదేవతలు ప్రశాంతంగా ఉండగలుగుతారు. జ్యేష్ఠ అమావాస్య రోజు శివుడిని పూజించడం వలన ప్రతికూలతలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతుంది. ఈరోజున ఉపమా కలుగుతుంది. ఉపవాసం ఆత్మ శుద్ధి కలుగుతుంది. కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున పవిత్ర నదులు, జలాశయాలలో స్నానం చేయాలి. ఇలా చేస్తే పాపాలు తొలగిపోతాయి, జ్యేష్ఠ అమావాస్య రోజున వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం, ఆనందకరమైన వైవాహిక జీవితం గడపడానికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారు. పెళ్లికాని అమ్మాయిలు కూడా తాము కోరుకున్న వరుడిని పొందడానికి ఈ రోజున రావి చెట్టును పూజించడం, సావిత్రి కథను చదువుతారు లేదా వింటారు. ఈ రోజున పవిత్ర నది లేదా ఆలయ ప్రాంతాన సంధ్యా సమయంలో దీప దానం చేయాలి. రావి చెట్టు ముందు దీపం...
శివ పార్వతుల సంవాదం పరమ శివుడు పార్వతితో "పార్వతి! మాఘమాసంలో శుద్ధ దశమి రోజు శ్రీహరిని పూజించినవారు చక్రవర్తి అవుతారు. ఆ పూజా విధానం వివరిస్తాను ఆలకింపు" అంటూ ఇలా చెప్పసాగెను. మాఘ శుద్ధ దశమి పూజా విధానం మాఘ శుద్ధ దశమి రోజు సూర్యోదయంతోనే నదీ స్నానం చేసి నదీతీరంలో కానీ స్వగృహంలో కానీ మంటపాన్ని ఏర్పాటు చేసి, ఆ మంటపాన్ని గోమయంతో అలంకరించి అష్టదళ పద్మం వేసి దానిపై కలశం ఉంచి కలశం మధ్యలో లక్ష్మీనారాయణ ప్రతిమను ప్రతిష్టించి, పీఠం మధ్యలో సాలగ్రామం ఉంచి తులసి దళాలతో, మేలుజాతి పుష్పరకాలతో లక్ష్మీనారాయణుని షోడశోపచారాలతో పూజించాలి. అనంతరం పాయసం, భక్ష్యభోజ్యాలు నివేదించాలి. బ్రాహ్మణులకు బియ్యం, బెల్లం, ఉప్పు దానం ఇవ్వాలి. తరువాత పూజాక్షితలను శిరస్సున ధరించి భక్తితో మాఘ పురాణం శ్రవణం చేయాలి. ఇలా చేసినవారికి జన్మాంతర పాపాలు నశిస్తాయి. అలాగే ఈ వ్రతమును చేస్తున్న వారికి ధనసహాయం చేసినవారికి కూడా ఉత్తమగతులు కలుగుతాయి. పూర్వం ఈ వ్రతం చేస్తుండగా చూసి ఓ కుక్క చక్రవర్తిగా ఎలా మారిందో వివరిస్తాను వినుము' అంటూ శివుడు పార్వతికి ఈ కథను వినిపించసాగాడు. కుక్క చక్రవర్తిగా మారిన కథ పూర్వం సమస్త శాస్త్...
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోటకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో సామర్లకోట నుంచి అనవర్తికి వెళ్లే మార్గంలో బిక్కవోలు ఉంది. 9-10 శతాబ్దాలలో ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన చాళుక్యరాజుల రాజధాని నగరంగా బిక్కవోలు విరాజిల్లింది. ఈ సమయంలో బిక్కవోలుకు బిరుదాంకినవోలు, బిరుదాంకపురం అనే పేర్లు ఉండేవని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. బిరుదాంకినవోలు అనేది కాలక్రమంలో ప్రజల వాడుకలో మార్పు చెంది బిక్కవోలు అయింది. స్థల పురాణం పూర్వం ఈ ప్రాంతంలో ఒక మోతుబరి రైతు నివసిస్తుండేవాడు. వ్యవసాయం, పశుపాలన వంటి వృత్తులను నిర్వహిస్తూ పరోపకారం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాదు. ఆయనకు ఆవులమంద ఒకటి ఉండేది. దానిని పశువుల కాపరి ఒకడు, ప్రతిరోజు పచ్చిక బయళ్లకు తోలుకొని పోయి మేపుకుని వస్తూ ఉండేవాడు. అందులో ఒక అవు మంద నుంచి విడిపోయి.. కొంతదూరం గడ్డి మేస్తూ వెళ్లి ఒక ఎత్తైన ప్రాంతానికి చేరుకొని పాలు జారవిడిచి తిరిగి మండలో వచ్చి కలిసేది, సాయంత్రం ఇల్లు చేరిన ఆవు ప్రతిరోజు పాలు ఇవ్వకపోవడంతో రైతుకు అనుమానం కలిగి ఆవును గమనించవలసినదిగా పశువుల కాపరికి తెలిపాడు. పశువుల కాపరి మరునాడు మేతకు ఆవులను తోలుకొని పోయి గమనించసాగ...
గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షుల సంవాదం రాక్షసులతో జరిగిన యుద్ధంలో ఓడిపోయిన దేవతలు ఇంద్రుడు ఆచూకీ తెలుసుకోడానికి మునీశ్వర్ల సూచన మేరకు మాఘస్నానం చేసి మాఘవ్రతాన్ని ఆచరించారు. వారి వ్రతానికి సంతృప్తి చెందిన ఆ శ్రీహరి శంఖచక్ర గదాధరుడై దేవతలకు దర్శనమిస్తాడు. అపుడు దేవతలు శ్రీహరిని అనేక విధాలుగా కొనియాడుతారు. తమ దీనావస్థను శ్రీహరికి విన్నవించిన దేవతలు దేవతలు ఆ హరిని "ఓ శ్రీహరీ! పూర్వం ఆదిశేషువు తన వేయి ముఖములతో నిన్ను ప్రార్ధించి నీకు శయ్యగా మారాడు. అలాగే శేషువుకు శత్రువు అయిన గరుత్మంతుడు తన స్వామి భక్తితో నూరు యుగములు తపస్సు చేసి నీకు వాహనంగా మారాడు. నీ కరుణ అంతులేనిది. మేము దేవతలం. రాక్షసులతో జరిగిన యుద్ధంలో ఓడిపోయి విచారంతో ఉన్నాం. ఇప్పుడు ఇంద్రలోకంలో ఇంద్రుడు లేదు. ఇంద్రుడు ఎక్కడున్నాడో తెలియదు. నిన్ను శరణు వేడుతున్నాం. ఇంద్రుడు ఎక్కడున్నాడో తెలిపి మమమ్మల్ని ఉద్ధరించుము. మమ్మల్ని రాక్షసుల నుంచి రక్షింపుము అని వేడుకుంటున్న దేవతలను చూసి అపారమైన కరుణతో ఆ శ్రీహరి దేవతలతో ఇలా అన్నాడు. దేవతలకు ఇంద్రుని సమాచారం చెప్పిన శ్రీహరి దేవతలు చేసిన స్తోత్రాలకు ప్రసన్నుడైన ఆ శ్రీహరి దేవతలతో "దే...
గృత్స్నమద మహర్షి, జహ్ను మహర్షుల సంవాదం గృత్స్నమదమహర్షి, జహ్ను మహర్షితో "జహ్నువు! సకల శాస్త్రాలు చదివిన విప్రుడు దుష్ట సాంగత్యం వలన ఎంతటి కష్టాలను అనుభవించాడో తెలిపే కిరాతుని కథను చెబుతాను జాగ్రత్తగా వినుము" అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. కిరాతుని కథ పూర్వం కళింగ దేశంలో ఒక కిరాతుడు ఉండేవాడు. వాడు పరమ క్రూరుడు. ప్రతిరోజూ ఆయుధాలు ధరించి అడవికి వేటకు వెళ్లి అనేక జంతువులను వేటాడి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఈ విధంగా వాడు చాలా ధనం సంపాదించాడు. ఒకనాడు కిరాతుడు అడవిలో వేటలో నిమగ్నమై ఉన్న సమయంలో వేదవేదాంగ తత్వవిద్యా విశారదుడగు ఒక విప్రుడు ఆ అటవీమార్గంలో ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ప్రయాణ బడలిక తీర్చుకోడానికి ఒక మర్రిచెట్టు నీడలో కూర్చుని ఉండెను. కిరాతుడు విప్రుని చూసి అతని వద్ద ఉన్న వస్త్రములు, దండకమండలాలు, పాదుకలు, గొడుగు మొదలగు వస్తువులను అపహరించి ఇంకా విప్రునితో ఇట్లనెను. "ఓ బ్రాహ్మణుడా! నీ వద్ద ఉన్న ధనం మొత్తం నాకు ఇవ్వు లేకుంటే ఈ కత్తితో నిన్ను చంపేస్తాను" అని బెదిరించాడు. బ్రాహ్మణ హత్య చేసిన కిరాతుడు కిరాతుని మాటలకు బ్రాహ్మణుడు "అయ్యా! నేను చాలా పేదవాడిని....
జూబ్లీహిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 5వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 25 నుండి మార్చి 7 వరకు జరుగుతాయి. ఫిబ్రవరి 25 న సా.6.30 ఈ- 8.30 వరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ ఫిబ్రవరి 26 న ఉ. 9.45 – 10.10 గం.ల మధ్య మేష లగ్నములో ధ్వజారోహణం, రాత్రి 7 – 8 గం.ల వరకు పెద్దశేష వాహనం ఫిబ్రవరి 27 న ఉ: చిన్న శేష వాహనం రా: హంస వాహనం ఫిబ్రవరి 28 న ఉ: సింహ వాహనం రా: ముత్యపు పందిరి వాహనం మార్చి 1 న ఉ – కల్పవృక్ష వాహనం రా- సర్వభూపాల వాహనం మార్చి 2 న ఉ : పల్లకి ఉత్సవం (మోహిని అవతారం) రా : గరుడ వాహనం మార్చి 3 న ఉ: హనుమంత వాహనం రా: గజ వాహనం మార్చి 4 న ఉ : సూర్య ప్రభ వాహనం రా : చంద్ర ప్రభ వాహనం మార్చి 5 న ఉ : రథోత్సవం (8 – 10 గం. మధ్య) రాత్రి: అశ్వ వాహనం మార్చి 6 న ఉ: చక్రస్నానం ( 8 – 10.15 గం.ల మధ్య) రాత్రి: 6 – 8 గం.ల మధ్య ధ్వజ అవరోహణం మార్చి 7 న సాయంత్రం 3 – 5 గం.ల మధ్యన పుష్పాయాగం ప్రతి రోజూ వాహన సేవలు ఉదయం 8 నుండి 9 గం.ల వరకు, రాత్రి 7 – 8 గం.ల వరకు
బహుళ పక్షంలో వచ్చే చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దానిని కృష్ణ అంగారక చతుర్దశిగా వ్యవహరిస్తారు. ఈ తిథికి సూర్యగ్రహణంతో సమానమైన శక్తి ఉంటుంది. సూర్యగ్రహణం రోజు స్నానం, దానం, పితృ కార్యాలు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ తిథి రోజున స్నానం, దానం చేస్తే అలాంటి ఫలితాలే కలుగుతాయని పంచాంగకర్తలు చెబుతున్నారు. కృష్ణ అంగారక చతుర్దశి రోజు రుణ విమోచన అంగారక స్తోత్రం చదివితే తీవ్రమైన అప్పులతో బాధపడుతున్నవారు ఆ బాధలనుండి ఉపశమనం పొందుతారు. చదవలేనివారు ఎవరితోనైన చదివించుకొని విన్నాకూడా ఎంత పెద్ద అప్పులైనా తీరిపోతాయి. “ఓం అం అంగారకాయ నమః" అనే మంత్రాన్ని స్మరించుకున్నా మంచి ఫలితాలుంటాయి. ఇవి పాటించినా శుభమే : కృష్ణ అంగారక చతుర్దశి రోజు స్నానం చేసే నీటిలో గంగాజలం కలిపి చేస్తే మంచిది. గంగాజలం లేకపోతే స్నానం చేసేటప్పుడు గంగను ఆవాహన చేసి స్నానం చేసినా మంచిదే. దానం చేసినా మంచి మంచి ఫలితాలుంటాయి. గ్రహ దోష తీవ్రత కూడా తగ్గుతుంది. ఆరోజున గోధుమలను దానం చేస్తే మరీ మంచిది. ఈ తిథి రోజున యమధర్మరాజుకు తర్పణం ఇచ్చినా మంచి జరుగుతుంది. సూర్యునికైనా తర్పణం ఇవ్వవచ్చు. ఈ రోజు కందులు దానం ఇస్తే సొంతింటి కల నెర...
నిత్యం మనం తినే ఆహారంలో ఐదు రకాలైన దోషాలుంటాయి.అవి.. 1.అర్ధ దోషం 2.నిమిత్త దోషం 3.స్ధాన దోషం 4.గుణ దోషం 5. సంస్కార దోషం అర్ధ దోషం సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించడమే అర్థదోషం అంటారు.. మీకు అర్థమయ్యేందుకు ఈ చిన్న కథ...ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో వచ్చి ఆ శిష్యుడికి డబ్బు మూట ఇవ్వడం చూశాడు. భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ గదిలో మూట చూసిన సాధువు మనసులో దుర్భుద్ధి కలిగింది. అందులోంచి కొంత మొత్తాన్ని తీసి తన సంచీలో దాచేసి ఆశ్రమానికి వెళ్లిపోయాడు. ఆ మర్నాడు పూజా సమయంలో తాను చేసిన దొంగతనం గుర్తొచ్చి సశ్చాత్తాపం చెందాడు. తను శిష్యుడి ఇంట్లో దోషంతో కూడిన భోజనం చేయడం వల్లే తనకా దుర్భుద్ధి కలిగిందని..ఆ ఆహారం జీర్ణమై మలంగా విసర్జించిన తర్వాత మనసు నిర్మలమైనట్టు అర్థం చేసుకున్నాడు. వెంటనే తాను తస్కరించిన డబ్బు తీసుకుని శిష్యుడి ఇంటికి వెళ్లి జరిగింది చెప్పి ఇచ్చేసి..ఆ డబ్బు ఎలా సంపాదించావని అడిగాడు. శిష్యుడు తలవంచుకుని, "నన్ను క్షమించండి, స...
Comments
Post a Comment