శివుడు అభిషేక ప్రియుడని ప్రతి భక్తుడికీ తెలుసు. నీటితో, పంచామృతాలతో, పుష్పాలతో, విభూదితో ఇలా రకరకాల అభిషేకాలు చేస్తుంటారు. మరి వేటితో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం పొందుతారో తెలుసా..
ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం
ఆవు పాలు - సర్వ సుఖాలతో వర్థిల్లుతారు
ఆవు పెరుగు - ఆరోగ్యం, బలం
ఆవు నెయ్యి - ఐశ్వర్యాభివృద్ధి
చెరకు రసం (పంచదార)- దుఃఖ తొలగిపోతుంది, ఆకర్షణ పెరుగుతుంది
తేనె - తేజస్సు వృద్ధి చెందుతుంది
భస్మ జలం - పాపాలు నశిస్తాయి
సుగంధోదకం - పుత్ర లాభం
పుష్పోదకం - భూలాభం, స్థిరాస్తి కొనుగోలు చేస్తారు
బిల్వ జలం - భోగ భాగ్యాలు కలుగుతాయి
నువ్వుల నూనె - మృత్యు దోషం తొలగిపోతుంది
రుద్రాక్షోదకం - ఐశ్వర్యం పెరుగుతుంది
సువర్ణ జలం - దరిద్ర నాశనం
అన్నాభిషేకం - సుఖ జీవనం
ద్రాక్ష రసం - సకల కార్యాభివృద్ధి
నారికేళ జలం - సర్వ సంపద వృద్ధి
ఖర్జూర రసం - శత్రు నాశనం
దూర్వోదకం (గరిక జలం)- ఆర్థిక వృద్ధి
ధవళొదకమ్ - శివ సాన్నిధ్యం పొందుతారు
గంగోదకం - సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి
కస్తూరీ జలం - చక్రవర్తిత్వం, రాజసం
నేరేడు పండ్ల రసం - వైరాగ్యం
నవరత్న జలం - గృహ ప్రాప్తి
మామిడి పండు రసం - దీర్ఘకాలిక వ్యాధులు నశిస్తాయి
పసుపు, కుంకుమ - మంగళ ప్రదం
విభూది - కోటి రెట్ల ఫలితం లభిస్తుంది.
Comments
Post a Comment