Posts

Showing posts from July, 2024

Singirikona Temple: శ్రీ నరసింహ స్వామి ఆలయం - సింగిరికోన

Image
చిత్తూరు జిల్లాలో సింగిరికోనలొ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం అడవి ప్రాంతమైన చిన్నకొండమీద ఉంటుంది. ఇది అతి పురాతనమైన ఆలయం. ఈ స్వామి స్వయంభూ అని చెబుతారు. ఆరు అడుగుల ఎత్తులో నల్లరాతి విగ్రహాలు భక్తులకు కనువిందు చేస్తాయి. స్వామి, ఇరుపక్కల శ్రీదేవి, భూదేవి కొలువుదీరి ఉంటారు. ఇక్కడ శ్రీనరసింహస్వామి విగ్రహం నోరు తెరుచుకున్నట్లు ఉంటుంది. దానికి ఓ కథనం ఉంది. స్వామి వేటకు వచ్చి కొంచెం సేపు. అక్కడ విశ్రాంతి తీసుకున్నారట. కళ్ళు తెరిచేసరికి తెల్లవారిందిట. అప్పుడే తెల్లవారిందా అని ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని అలాగే శిలలా ఉండిపోయారట.  రోజూ ఉదయం స్వామికి పంచామృతాలతో అభిషేకం. గోపూజ మొదలైన నిత్య సేవలన్నీ చేస్తారు. ప్రతి నెలా స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజు విశేష తిరుమంజనం, సుదర్శన నారసింహ మహా యాగం శాస్త్ర ప్రకారం నిర్వహిస్తారు. ఇక్కడ పూజలు ఉదయం మంత్ర సహిత కార్యక్రమాలతో ప్రారంభం అవుతాయి.తర్వాత అర్చనలు, స్వామికి పాట రూపంలో జరుగుతాయి. అర్చక స్వామి పూజ చేయించుకునే భక్తులను కూర్చోబెట్టి చక్కగా పాడతారు. భక్తులు ఎక్కడెక్కడినుంచో, ఎన్నో ప్రయాసలు పడి నీ దర్శనానికి వచ్చారు. వారి ఇబ్బందులు త

Swarna Gowri Vrat: స్వర్ణ గౌరీ వ్రతం

Image
శ్రావణ శుద్ధ తదియనాడు ఈ వ్రతం ఆచరిస్తారు. అన్యోన్య దాంపత్య జీవనానికి ఈ వ్రతం చేస్తారు స్వర్ణగౌరీ వ్రతం పేరుతో పార్వతీ పరమేశ్వరులను అరాధిస్తారు.  ఈ స్వర్ణ గౌరీ వ్రతం గురించి సాక్షాత్తు పరమశివుడు పార్వతీ దేవికి చెప్పాడని పురాణ కథనం. ఈ వ్రతం ఆచరించడం వలన మహిళల అయిదో తనం కలకాలం నిలుస్తుందని నమ్ముతారు. పూర్వం ఒక రాజు వేటకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా ఒక నది సమీపంలో ఉన్న చిన్న ఆశ్రమం వద్ద కొంతమంది మహిళలు గుమిగూడి ఉంటండటం చూశాడు. వాళ్ళ వద్దకు వెళ్లి విషయం ఏమిటని అడుగాడు. వాళ్ళు ఆ రాజుతో మేము స్వర్ణ గౌరీ వ్రతం ఆచరిస్తున్నామని, ఈ వ్రతం వల్ల ఆడవారి సౌభాగ్యం వందేళ్లు నిలుస్తుందని, వ్రతం చేసే మహిళ భర్త ఆయుష్షు పెరుగుతుందని చెబుతారు. మహారాజు వాళ్ళతో వ్రత విధానం గురించి తెలుసుకుని తిరిగి తన రాజమందిరానికి వెళ్లాడు. తన ఇద్దరు భార్యలకు స్వర్ణ గౌరీ వ్రతం గురించి చెబుతాడు. ఆ ఇద్దరిలో పెద్ద భార్య వ్రతం గురించి పట్టించుకోలేదు. కొట్టిపడేస్తుంది. చిన్న భార్య మాత్రం ఎంతో శ్రద్ధగా వ్రతం చేసుకుంటుంది. వ్రతం గురించి హేళనగా మాట్లాడిన పెద్ద భార్య కష్టాల పాలవుతుంది. భక్తిశ్రద్ధలతో వ్రతం చేసుకున్న చిన్న భార్య సుఖసంతో

Vaikanasa Agamam: విఖనస మహర్షి - శ్రీ వైఖానస ఆగమ శాస్త్రం

Image
  తిరుమలతో సహా దాదాపు కొన్ని వైష్ణవ ఆలయాలలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు  జరుగుతాయి అని మనకు తెలుసు. అసలు వైఖానస ఆగమ శాస్త్రం అంటే ఏమిటి ? క్లుప్తంగా చూదాం. కలియుగంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తపస్సు, యజ్ఞయాగాలు సాధ్యం కాదు అని శ్రీ మహావిష్ణు భావన. అర్చామూర్తిగా  అవతరిస్తున తనకు చేయవలసిన అర్చనలు, నిత్యపూజలు నివేదనలు సులభతరమైన పద్ధతిలో నియమ నిబంధనలను రూపొందించి ఓ గ్రంధరూపం ఇవ్వవలిసింది అని బ్రహ్మను కోరాడు శ్రీ మహావిష్ణువు. అంతటి మహత్కార్యాన్ని చేపట్ట గలిగే శక్తి తనకు లేదు అని బ్రహ్మ శ్రీ మహావిష్ణువుకు విన్నవించాడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు తన సంకల్పాన్ని సాకారం చేసుకోవడం కోసం తన మానసం నుండి ఓ మహానుభావుడిని ఉద్బవింపజేసాడు, ఆయనే విష్ణు మానసపుత్రుడు విఖనస మహర్షి.  విఖనస మహర్షి శ్రావణమాసం, శుక్ల పక్షం, పౌర్ణమి, శ్రావణ నక్షత్రం రోజున నైమిశారణ్యంలో ఆవిర్భవించాడు. విఖనస మహర్షి ద్వారా ఉద్బవించింది కనుక ఈ శాస్త్రం వైఖానస ఆగమం అయింది.  శ్రీ మహావిష్ణువు ఆదేశం ప్రకారం విఖనస మహర్షి మరో నలుగురు ఋషులను శిష్యులుగా చేసుకొని వారి సహాయంతో ఈ కార్యాన్ని సాధించాడు.  అత్రి మహర్షి - దేవాలయంలో మూర్తులన

Dharmapuri Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం - ధర్మపురి

Image
శ్రీ యోగానంద లక్ష్మీ నారసింహస్వామి క్షేత్రం అత్యంత పురాతనమైనది. నవనారసింహక్షేత్రాలలో ఒకటి. పురాతనమైన ఈ క్షేత్రం గూర్చిన ప్రస్తావన క్రీ.శ. 928 కాలంలో ఉంది. పద్మపురాణం, నారాయణ శతకం వంటి ప్రముఖ గ్రంథా లలో ఈ క్షేత్రం గూర్చి ప్రశంసలు కన్పిస్తాయి. గర్భగుడిలో విభిన్న రూపాలతో ఉండే ఇద్దరు నారసింహులను దర్శించుకోవచ్చు. మొదటిది | పురాతనకాలంలో అనగా క్రీ.శ 1448లో ప్రతిష్టించబడినది. ఈ విగ్రహాన్ని పాత నారసింహస్వామి అనీ, ఆ తరువాత క్రొత్తగా అనగా క్రీ.శ.1725లో ప్రతిష్టించబడిన విగ్రహాన్ని కొత్త నారసింహస్వామి అనీ వ్యవహరిస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీలక్ష్మీదేవి వేరే వేదికపై నెలకొని ఉంటుంది. స్థలపురాణం ప్రకారం హిరణ్యకశిపుని వధించిన అనంతరం ఉగ్రరూపంలో ఉన్న నారసింహుడిని శాంతింప చేయటానికి బ్రహ్మదేవుడు కఠోరమైన తపస్సును చేయనారంభించాడు. అదే సమయంలో తన కోసం తపమాచరిస్తున్న తన భక్తుడిని కూడా నారసింహుని ప్రసన్నుని చేయటానికి తపస్సు చేయమని చెప్పాడు. ఇంకా ఆ రాజుతో ఒక యజ్ఞం కూడా చేయిస్తాడు. వీరి తపములతో నరసింహస్వామి ప్రసన్నుడై వీరికి సాక్షాత్కరించి వీరి కోరికపై ఇక్కడ స్వయంభువుగా వెలిసాడని పురాణ గాథ. ధర్మవర్మ పాలించే ప్రాంతం క

Pancharatra Agamam: పాంచరాత్ర ఆగమం

పంచ అంటే ఐదు, రాత్ర అంటే రోజులు అని అర్ధం. భగవంతుడు ఐదురోజులపాటు నాగరాజు అయిన గరుత్మంతుడు, అనంతుడు, విష్వక్సేనమూర్తి, చతుర్ముఖబ్రహ్మ, పరమేశ్వరుడు అనే ఐదుగురికి ఉపదేశించినవి కావున దీనికి పాంచరాత్రఆగమం అనేపేరు వచ్చింది. ఇది శ్రీవైష్ణవ పూజావిధానం. ఇది మనుషుల అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. లోకంలో ప్రతి జీవి పునరావృత్తిరహిత శ్రీవైకుంఠానికి చేరి శాశ్వతమైన ఆనందం పొందేందుకు పాంచరాత్రం దోహదపడుతుంది. హయవదనుడనే రాక్షసుడు వేదాలకు నిధి అయిన బ్రహ్మనుండి తస్కరించి సముద్రగర్భానికి వెళ్ళి దాక్కున్నప్పుడు వేదక్రతువులు జరగక దేవతలశక్తులు తగ్గిపోసాగాయి. అప్పుడు అయిదురాత్రులపాటూ దేవర్షులంతా కలిసి మంత్రం లేనందువలన (వేదాలు లేవు కనుక మంత్రం లేదు) తంత్రంతో పూజచేశారు. ఆవిధంగా విష్ణువు శక్తిమంతుడై మత్స్యావతారం దాల్చి హయవదనుణ్ణి చంపి వేదాలను రక్షించాడు. తిరిగి హయగ్రీవమూర్తిగా మారి వాటిని బ్రహ్మకు ఉపదేశించాడు. అలా వేదాలు పోయి మరలా తిరిగివచ్చిన వ్యవధి అయిదురాత్రులలో భగవదారాధన వైదిక పద్ధతిలోకాకుండా తంత్రంలో జరిగింది. అందువలన ఆ పంచరాత్రుల పేరుమీద పాంచరాత్రం అని ఈ ఆగమశాస్త్రానికి పేరు రావడం జరిగింది. ఈ

Udaya Kaleswara Swamy Temple: శ్రీ గంగ పార్వతి దేవి సమేత ఉదయ కాళేశ్వర స్వామి ఆలయం - గండవరం

Image
ఈ ఆలయం నెల్లూరుకు ఉత్తర భాగాన, కావలికి వెళ్లే  మార్గమధ్యంలో నెల్లూరుకు 16 కి.మీ.దూరంలో ఉంది. పూర్వం భగీరథుడు గంగను ఈ భూమి మీదకు రప్పిం చడం కోసం, తపస్సు చేసి పరమశివుడిని మెప్పించి, స్వామివారి తేజోరూపాన్ని లింగరూపంగా ప్రసాదించమని కోరాడు. అతని కోరిక మేరకు పరమశివుడు తన తేజో రూపమైన లింగాన్ని భగీరథుడికి ప్రసాదించాడు. ఆ దివ్యతేజో లింగాన్ని ఇస్తూ "భగీరథా! గంగ భువికి ధారగా వచ్చినచో, ఈ భూప్రపంచమంతా కల్లోలమౌతుంది. అందుచేత, ఈ తేజో లింగరూపాన్ని భూమియందు ప్రతిష్టించి, గంగను ప్రార్థిస్తే, ఆమె నా శిరస్సు మీద ధారగా పడుతుంది. ఆ జలాన్ని నీకు ప్రసాదంగా ఇస్తానని" చెప్పాడు. అలా లింగాన్ని సంపాదించిన భగీరథుడు పరమేశ్వరుడు చెప్పిన విధంగానే లింగాన్ని భూమియందు ప్రతిష్ఠించి గంగను ప్రార్ధించాడు. ఆ ప్రార్ధనకు మెచ్చిన గంగ భూమికి తరలి వచ్చి శివుని శిరస్సుపై దారగాపడెను. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఈశ్వరుడు అగ్ర హించి, "భగీరథా! నీవు నా తేజోలింగరూపాన్ని అపవిత్రం చేశావని" చెప్పాడు. భగీరథుడు ఆశ్చర్యపోయి "స్వామీ! నేను చేసిన తప్పు ఏమిటని" అడిగాడు. అప్పుడు శివుడు "గంగ భూమికి వచ్చే సమయంలో వాయు

Narayanavanam Venkateswara Swamy Temple: శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారు ఆలయం - నారాయణవనం

Image
శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారు, శ్రీ పద్మావతీ అమ్మ వారు నెలకొని ఉన్న దివ్యక్షేత్రం నారాయణవనం. ఆకాశరాజు కుమార్తె శ్రీపద్మావతీదేవిని శ్రీనివాసుడు పరిణయమాడిన పరమపవిత్రస్థలం ఇది. ఈ దివ్యక్షేత్రం తిరుపతికి 34 కి.మీ దూరంలో తిరుపతి- మద్రాసు మార్గంలో పుత్తూరుకు 5 కి.మీ. దూరంలో ఉంది. శ్రీనివాసుడు వేటకై వచ్చి నారాయణవనోద్యానంలో చెలికత్తెలతో విహరించుచున్న పద్మావతిని చూచి, మోహించి వివాహం చేసుకున్నాడు. కాబట్టి దీనికి నారాయణపురమని పేరొచ్చింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు పద్మావతిని వివాహమాడుటకై వరునిగా ఆవిర్భవించినందు వల్ల ఈ క్షేత్రం నారాయణవనంగా నేటికీ పిలువబడుచున్నది. ఈ ఆలయప్రాభవ, ప్రాశస్త్యాలగురించి శ్రీ వేంకటా చలమాహాత్మ్యంలో వివరించబడింది. ఇక్కడి ఆలయాన్ని ఆకాశ రాజు కట్టించినట్లు భక్తుల విశ్వాసం. శ్రీ వీరనరసింగ దేవయాదవరాయలు (1205- 1245) జీర్ణోద్ధరణ చేశారు. పెనుగొండ వీరప్పన్న నారాయణ వరంలో శ్రీ కల్యాణవేంకటేశ్వర స్వామివారి ఆలయంను క్రీ.శ. 1541-42 సం||ల కాలంలో పునఃనిర్మించినట్లు పేర్కొనబడినది. 1967వ సం|| ఏప్రిల్ నెల 29వ తేదీన ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధీనంలోనికి వచ్చింది. శ్రీ కల్యాణ వేంకటేశ

Random posts