Posts

Showing posts from July, 2024

Ishta Kameswari Temple: శ్రీ ఇష్టకామేశ్వరి దేవి ఆలయం - శ్రీశైలం

నల్లమల అడవుల్లో ఉన్న ఇష్ట కామేశ్వరి ఆలయం గురించి అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. మహిమాన్వితమైన ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప దేశంలో మరెక్కడా ఇలాంటి ఆలయం కనిపించదు. అందరికీ ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శన భాగ్యం దొరకదు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప అమ్మవారి దర్శనం చేసుకోలేమని భక్తుల నమ్మకం.  అతి కొద్ది మంది మాత్రమే ఇష్ట కామేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్తారు. అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఎలాంటి కోరికలు అయిన నెరవేరుతాయి అన్ని నమ్మకం. అందుకు మన మనసులో కోరికను అమ్మవారికి చెప్పి అమ్మవారి నుదుటన బొట్టు పెట్టాలి. మన చేతితో అమ్మవారి నుదురు తాకగానే నిజంగా మనిషి నుదురులాగా మెత్తగా తగిలి అనిర్వచనీయమైన అనుభూతితో ఒళ్ళు జలదరిస్తుంది. ఒకప్పుడు ఇష్ట కామేశ్వరి అమ్మవారి ఆలయం చేరుకోడానికి సరైన దారి కూడా ఉండేది కాదు. కొండల మీద జీపు ప్రయాణం అత్యంత ప్రమాదంతో కూడిన సాహసం. అందుకే పూర్వం అడవుల్లోని సిద్ధులచే అమ్మవారు పూజలందుకునేది. ఇప్పుడు కొంత మెరుగైన రవాణా సౌకార్యాలు అందుబాటులోకి వచ్చాక సామాన్య భక్తులు కూడా ఇష్ట కామేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లి తమ కోరికలు అమ్మవారికి నివేదించి ఆ అమ్మ అన...

Kondagattu Hanuman Temple: శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం - కొండగట్టు

Image
  తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ దర్శనం సకల కార్యసిద్ధి కలిగిస్తుంది అని భక్తుల నమ్మకం.  ఈ ఆలయానికి 300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని సంతానం కోరుకునే వారు సందర్శిస్తే చక్కని సంతానం పొందుతారు. స్థల పురాణం  ఈ ఆలయ స్థల పురాణం పరిశీలిస్తే త్రేతా యుగంలో రామ రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోగా, హనుమ లక్ష్మణుని కోసం సంజీవని తేవడానికి బయలుదేరుతాడు. హనుమ సంజీవనిని తీసుకొని వచ్చేటప్పుడు మార్గమధ్యలో అనగా ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశం అయిన ముత్యంపేట గ్రామం వద్ద కొంత భాగము విరిగిపడిందట. ఆ భాగాన్నే కొండ గట్టుగా ప్రస్తుతంగా పిలుస్తున్నారు. సుమారు 400 సంవత్సరాల క్రితం సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చినప్పుడు అతడి ఆవుల మందలోని ఒక ఆవు తప్పిపోయిందట. సంజీవుడు ఆ అవును వెతుకుతూ అలసి సేద తీరడానికి ఒక చింత చెట్టు కింద విశ్రమించాడంట. అప్పుడు అతడికి స్వప్నంలో ఆంజనేయస్వామి సాక్షాత్కరించి తానిక్కడ కోరంద పొదలో ఉన్నానని, తనకు ఎండ, వాన, ముళ్ల నుంచి రక్షణ కల్పించమని చెబుతారట. అలాగే సంజీవుని ఆవు జాడ కూడా తెలిపి అదృశ్యమయ్యాడట. వెంటనే ...

Adi Krittika: ఆడి కృత్తిక

Image
  ఆషాడ మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చే రోజుని ఆడి కృత్తికగా జరుపుకుంటారు. ఇది సుబ్రమణస్వామికి  అత్యంత ప్రీతికరమైన రోజు. ఇది తమిళనాడులో ఎంతో విశేషంగా జరుపుకునే పండుగ.  తమిళులకు ఏ మాసమైన పౌర్ణమి రోజుతో మొదలవుతుంది, కనుక ఆషాడ పౌర్ణమి నుండీ వారికి ఆషాడ మాసం మొదలు అవుతుంది. దక్షిణాయనానికి ముందు వచ్చే కృత్తిక గనుక దీనిని ఆది కృత్తిక అనీ, ఆషాడ మాసంలో వచ్చేది కనుక ఆడి కృత్తిక అనీ కూడా అంటుంటారు. ఈ రోజు సుబ్రమణ్యస్వామి ఆరాధనకు అత్యంత శ్రేయస్కరమైనది.  ఏమి చేయాలి  ? ఈ రోజున సుర్యోదయానికంటే ముందే నిద్ర లేచి శుచియైన తరువాత చలిమిడితో ఆవు నేతితో దీపారాధన చేయాలి. స్వామికి ప్రసాదం నివేదించాలి. సుబ్రహ్మణ్యుని స్తోత్రాలు, సుబ్రహ్మణ్య జన్మ వృతాంతం చదువుకుని, సాయంత్రం వరకూ ఉపవసించి,సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని తరువాత ప్రసాదం స్వీకరించాలి. ఈ రోజు సుబ్రమణ్య స్వామి ఆలయాన్ని దర్శించాలి. ఈ రోజు మనకు వున్నంతలో దానం చేసిన మంచిది. ఈ రోజు సుబ్రహ్మణ్యుని ఆలయాలలో విశేష అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. సంతానం కోరుకునే వారు ఈ రోజు సుబ్రహ్మణ్యుని మొక్కి కావిళ్లు ఎత్తుతారు. కావిళ్లు ఎత్తలేని వారు ...

Nadipudi Subramanya Swamy Temple: శ్రీ సుబ్రమణ్య స్వామి వారి ఆలయం - నడిపూడి

Image
  ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ఉన్న నడిపూడి గ్రామంలో ఈ ఆలయం. ఇక్కడ స్వామి వారు సర్ప రూపంలో దర్శనం ఇవ్వడం విశేషం. ఈ ఆలయంలో స్వామి  స్వయంభువుగా వెలసినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. 1973 సంవత్సరంలో ఈ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమము, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు సర్ప రూపంలో నాశికా త్రయంబకం నుంచి గోదావరి నదిలో ప్రయాణం చేస్తూ ఋషుల తపస్సులు, పండితుల వేద ఘోషతో నిత్యం విరాజిల్లే వశిష్ట గోదావరి నదీ ఒడ్డుకు చేరుకున్నారు. కొంతకాలం గడిచిన తర్వాత శ్రీ స్వామి వారు ఒక భక్తునికి స్వప్నంలో కనిపించి తనకు గ్రామోత్సవము జరిపించమని, గ్రామోత్సవము జరిపించిన ఆ పల్లకి ఎక్కడ ఆగిపోతుందో ఆ ప్రదేశంలోనే తనని ప్రతిష్టించమని ఆజ్ఞాపించారు. అప్పుడు ఆ భక్తుడు గ్రామస్తుల సహకారంతో స్వామి వారి కోరిక ప్రకారం అరటి దొప్పలతో పల్లకి తయారు చేసి స్వామి వారిని గ్రామంలో ఊరేగించి, పల్లకి ఆగిన చోట ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు స్వయంభువుగా ఈ ఆలయం నందు కొలువై ఉన్నారు. ఎంతో ప్రసిద్...

Kamika Ekadasi: కామిక ఏకాదశి

Image
  ఆషాడ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకుంటారు ఈ ఏకాదశి మనసులోని కోరికలను  సిద్దిపచేస్తుంది. ఈ రోజు విష్ణుభగవానుడిని ఆరాధించి , తులసి దళాలతో పూజలు చేస్తారు. గంగాతీరం, కాశీ, నైమిశారణ్యం, పుష్కరం వంటి తీర్థస్నానలోని వసించి అక్కడ స్నానం చేయడం వల్ల కలిగే ఫలితం కేవలం ఈ రోజు విష్ణు ఆరాధనతో లభిస్తుంది. కేదారనాథ్ లో , కురుక్షేత్రంలో లేదా సూర్యగ్రహణం రోజు చేసే స్నానం వలన లభించినట్టు ఫలితం ఈ రోజు శ్రీకృష్ణుని ఆరాధన వల్ల లభిస్తుంది. ఈ రోజు తులసీదేవికి నమస్కరించి నెయ్యతో దీపారాధన చేసేవాని పుణ్యాన్ని చిత్రగుప్తుడైన లెక్కించలేదు. ఈ రోజు తులసి దర్శనం సర్వపాపహరం. తులసికి స్నానం చేయించడం ద్వారా మనిషికి యమధర్మరాజు భయం పోతుంది. బ్రహ్మహత్యా లేదా భృణహత్య వంటి ఘోరమైన పాపాలు ఈ వ్రతం ఆచరించటం వల్ల నశిస్తాయి. ఈ రోజు ఉపవసించడం వల్ల సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేయడంతో సమానం అని చెప్తారు. ఈ రోజు రాత్రి జాగరణం చేసిన వారు మళ్ళీ జన్మనెత్తే అవసరం ఉండక మోక్షం పొందుతారు అని విష్ణుమూర్తి, నారద మహామునితో చెప్పినట్లు పురాణం కధనం. ఈ ఏకాదశి మహిమను వినేవాడు లేదా చదివాడు నిశ్చయంగా విష్ణుల...

Veerabhadra Temple: శ్రీ వీరభద్ర స్వామి ఆలయం - పట్టిసీమ

Image
  పట్టిసీమలో అతి పురాతనమైన శివక్షేత్రంగా అలరారుతోంది వీరభద్రస్వామి ఆలయం. పవిత్ర గోదావరి నదిలో స్నానం చేసి ఇక్కడ స్వామిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరతాయని అంటారు. పెళ్ళికానివారు ఆలయ ప్రధాన మండపంలో ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయని భక్తుల నమ్మకం. అలా కుదిరినవారు తరువాత స్వామికి మొక్కులు చెల్లించడం ఇక్కడ సంప్రదా యంగా వస్తోంది. అలాగే సంతానం లేని మహిళలు ఇక్కడున్న అనిస్త్రీ, పునిస్త్రీ దేవతలను దర్శించుకుని పక్కనే ఉన్న చెట్టుకు ముడుపు కడతారనీ అంటారు. వీరభద్రుడు భద్రకాళీ సమేతంగా దర్శన మిచ్చే ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా భూనీలా సమేత భావనారాయణస్వామి కొలువై ఉంటే... కనకదుర్గ, మహిషాసుర మర్దిని గ్రామ దేవతలుగా భక్తులు పూజలు అందుకోవడం విశేషం.  స్థలపురాణం తండ్రి దక్షుడు చేసిన అవమానం భరించలేక సతీదేవి అగ్నికి ఆహుతి అవుతుంది. అది విన్న పరమేశ్వరుడు. ప్రళయతాండవం చేస్తూ తన జటాఝూటం నుంచి ఒక జడను తీసి నేలకు కొట్టడంతో అందులోంచి వీరభద్రుడు బయటకొచ్చా దట. దక్షుడి యాగాన్ని ధ్వంసం చేసి, అతడి శిరస్సును ఖండించమని వీరభద్రుడిని పరమేశ్వరుడు ఆదేశించాడట. ఈశ్వరుడు చెప్పినట్లుగా చేసిన వీ...

Aragonda Anjaneya Temple: శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం - అర్ధగిరి

Image
చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ ఆలయమైన కాణిపాకానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో అరగొండ వీరాంజనేయ స్వామి ఆలయం నెలకొని ఉంది.  ఈ ఆలయంలోని హనుమను పూజిస్తే అనేక రకాల అనారోగ్యాలు నశించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు.  త్రేతా యుగంలో రామ-రావణుల యుద్ధం సమయంలో రావణాసురుని కుమారుడు ఇంద్రజిత్తుని శరాఘాతానికి లక్ష్మణుడు మూర్చిల్లుతాడు. ఆ సమయంలో శ్రీరాముని ఆజ్ఞ మేరకు హనుమంతుడు సంజీవని మూలికలు తేవడానికి వాయువేగంతో హిమాలయాలకు వెళ్తాడు. సంజీవని పర్వతానికి చేరుకున్న హనుమ మూలికలు గుర్తించలేక ఏకంగా సంజీవని పర్వతాన్ని పెకిలించుకుని తీసుకు వస్తుండగా మార్గమధ్యంలో ఓ ప్రదేశంలో సంజీవని పర్వతం నుంచి అర్ధ భాగం విరిగి పడిపోతుంది. ఆ ప్రదేశమే ఇప్పటి అరగొండ. అర కొండ పడింది కాబట్టి అర కొండ అని పేరొంది కాలక్రమేణా అరగొండగా మారిందని ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. సంజీవని పర్వతం విరిగి పడిన ప్రాంతంలో భూమి నుంచి జలధారలు ఉబికి వచ్చి ఆ ప్రాంతంలో ఒక కొలను ఏర్పడింది. అదే సంజీవరాయ తీర్ధంగా ప్రసిద్ధి చెందింది. సంజీవరాయ తీర్ధంలో సంజీవకరణి, విషల్యకరణి అనే మహిమాన్విత వనమూలికలు, ఔషధాలు కలిసి ఉండడం వలన ఆ తీర్ధంలో నీట...

Khasi Mayukhaditya Temple: శ్రీ మయూఖాదిత్య ఆలయం - కాశీ

 కాశీ క్షేత్రంలో చూడదగిన ఆలయాలలో మయూఖాదిత్యుని ఆలయం కూడా ఒకటి. పవిత్ర గంగా నదీ తీరంలోని పంచగంగ రేవు సమీపంలో ఉంది ఈ ఆలయం. ఇక్కడ సూర్య భగవానుడు మయూఖాదిత్యునిగా పూజలందుకుంటాడు. పురాణాలు ప్రకారం పూర్వం సూర్యుడు గంగానది ఒడ్డున శివలింగాన్ని, మంగళ గౌరీ దేవిని ప్రతిష్ఠించి పూజించాడు. సూర్యుని తపస్సుకు మెచ్చిన పరమశివుడు అమ్మవారితో పాటు ప్రత్యక్షమై, 'మయూఖాదిత్యుడు' అనే వరాన్ని ప్రసాదించాడు. తాను ప్రతిష్టించిన శివుని మంగళ గౌరి దేవిని పూజిస్తూ సూర్యుడు కాశీలోని ఉండిపోయాడు. ప్రత్యక్ష భగవానుడు అయిన సూర్యుడు ఒకే చోట ఉండిపోతే లోకాలన్నీ చీకటిలో ఉండిపోకుండా సూర్యుని మయూఖాలు అంటే కిరణాలు మాత్రమే లోకంలో వెలుగులు విరజిమ్మాయి. అందుచేతనే శివుడు సూర్యునికి 'మయూఖాదిత్యుడు' అనే వరాన్ని ప్రసాదించాడు. కాశీలోని మయూఖాదిత్యుని దర్శించిన వారికి జీవితంలో దారిద్య్ర బాధలుండవని సాక్షాత్తూ ఆ పరమ శివుడే వారం ఇచ్చాడు. అందుకే కాశీకి వెళ్లిన వారు తప్పకుండా మయూఖాదిత్యుని దర్శించి పూజించాలి. కాశీకి వెళ్లిన వారు విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణాదేవి దర్శన అనంతరం సూర్య దేవాలయాలను దర్శించుకోవాలి. ముఖ్యంగా దారిద్య...

Varad Vinayaka Temple: శ్రీ వరద వినాయక స్వామి ఆలయం - మహద్

Image
అష్టవినాయక దేవాలయాల్లో నాలుగోది వరద వినాయక క్షేత్రం. ఇది మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా కర్జాత్ సమీపంలోని ఖలాపూర్ తాలూకాలో ఉన్న మహ్ద్ గ్రామంలో ఉంది. ఇది స్వామివారు  స్వయంభు.  పూర్వం ఈ ప్రాంతాన్ని పరిపాలించే రుక్మాంగదుడు అనే రాజు వేటకై వెళ్లి అలసిపోయి దాహము తీర్చుకొనుటకు వాచకవి అనే ముని ఆశ్రమమునకు వెళ్లెను. ఆ సమయంలో మునీశ్వరుడు నదీ స్నానానికి వెళ్తూ, తాను తిరిగి వచ్చే వరకు రాజును ఆశ్రమంలోనే కూర్చోమని చెప్పి వెళ్తాడు. ముని పత్ని ముకుంద ఆశ్రమంలో కూర్చుని ఉన్న రుక్మాంగదుని చూసి మోహిస్తుంది. రుక్మాంగదుడు మహా శీలవంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు. ముని పత్ని కోర్కెను అతను సున్నితంగా తిరస్కరిస్తాడు. అందుకు ముని పత్ని కోపించి, అతనిని కుష్టు రోగివి కమ్మని శపిస్తుంది. శాపగ్రస్తుడైన రుక్మాంగదుడు కుష్టు రోగ నివారణకై నారద మునీంద్రుని ఉపదేశానుసారం, గణపతిని ధ్యానించి, పూజించి, రోగ విముక్తుడవుతాడు. ఇక్కడ ముని పత్నియైన ముకుందకు, రుక్మాంగదుని శపించినా కూడా అతనిపై మోహము వీడలేదు. ఇది గ్రహించిన ఇంద్రుడు రుక్మాంగదుని రూపంలో వచ్చి ముకుంద కోర్కెను తీరుస్తాడు. ఫలితంగా ముకుంద ఒక మగ బిడ్డకు జన్మ ఇస్తుంది. ఆ...

Nanjangud Temple: శ్రీ నంజుండేశ్వర స్వామి ఆలయం - నంజన్‌గూడు

Image
  దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన నంజుండేశ్వర క్షేత్రం కర్ణాటకలోని మైసూరుకు దగ్గరలో ఉన్న నంజున్​గఢ్ జిల్లాలో ఉంది. ఇక్కడి శివుడిని శ్రీకంఠీశ్వరుడు అని పిలుస్తారు. కన్నడ భాషలో నంజ అంటే విషం, నంజుంద అంటే విషాన్ని స్వీకరించిన వాడు అనే అర్థం వస్తుంది. క్షీర సాగర మధనంలో వెలువడిన కాలకూట విషాన్ని స్వీకరించి, ఆ విషాన్ని తన కంఠంలోనే నిలుపుకొని శివుడు గరళకంఠుడయ్యాడు. ఆ నీలకంఠ శివుడే ఇక్కడ నంజుండేశ్వరుడిగా పూజలందుకున్నాడని విశ్వాసం. ఈ ఆలయాన్ని దర్శిస్తే దీర్ఘకాలిక వ్యాధులే కాదు మొండి రోగాలు కూడా నయమవుతాయని విశ్వాసం. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న కపిల నదిలో స్నానం చేసి వచ్చి నంజున్ దేశ్వరునికి 'ఉరుల్' అనే సేవ చేసుకుంటే ఎలాంటి వ్యాధి అయినా క్రమంగా తగ్గుముఖం పడుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి సమీపంలో పరశురామ క్షేత్రం ఉంది. పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లి శిరస్సు ఖండించిన తర్వాత ఆ మానసిక వ్యాధితో ఆసేతు హిమాచలం పర్యటించినా దొరకని మనశ్శాంతి ఈ క్షేత్రంలో అడుగు పెట్టగానే పొందాడట. అందుకే ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. నంజుండేశ్వరుడి దర్శనానికి వచ్చే భక్తులు మ...

Ekadasi Importance: ఏకాదశి మహిమ | ఏకాదశి రోజు ఏమి చేయాలి | ఏకాదశి రోజు ఏమి తినాలి | ఏకాదశి వ్రత ఫలితాలు

Image
  ఏకాదశి తిధి పరమ పవిత్రమైనదిగా వర్ణించబడింది,ఈ వ్రతాన్ని ఆచరించడం పరమశ్రేష్ఠమైన కార్యం.దీనిని ఆచరించిన వారికీ పునర్జన్మ ఉండదు అని, వైకుంఠలోకం ప్రాప్తిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ప్రతినెలలో రెండు ఏకాదశీలు వస్తాయి, అంటే ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశీలు, అధిక మాసమైతే ఇరవై ఆరు ఏకాదశీలు సంభవిస్తాయి. ఈ వ్రతాన్ని అందరు ఆచరించవచ్చు. 80 ఏళ్లు దాటిన వృద్దులు, చిన్న పిల్లలు, అనారోగ్యంతో బాధపడే వారు ఈ వ్రతాన్ని ఆచరించక పోయిన దోషం లేదు.  ఏకాదశిని హరివాసరం, మాధవ తిధి అనే పేర్లుతో కూడా పిలుస్తారు. ఈ వ్రత ముఖ్యప్రయోజనం సమస్త ఇంద్రియాల ద్వారా శ్రీహరిని సంపూర్తిగా ప్రసన్నుని చేయడమే.ఈ రోజు ఉపవాసము చేయాలి అంటే అర్ధము "దగ్గరగా వసించడము".  వ్రత విధానం   ముందురోజు అనగా దశమినాటి రాత్రిపూట ఉపవాసం ఉండాలి. తెల్లవారుజామునే బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి, ఇతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఇంట్లో పూజ చేసి ఆలయం దర్శించాలి. ఏకాదశి వ్రత మహత్యం తప్పక చదవాలి లేదా వినాలి. ఈరోజు ఉపవాసం ఎంత ముఖ్యమో ద్వాదశి రోజు (అంటే పక్క రోజు)ఉపవాసాన్ని ముగించడం అంతే ముఖ్యం.దానికి సమయాలు ఉంటాయి. ద్వాదశి రోజు వరి, గోధుమల...

Arupadiveedu: ప్రసిద్ధి చెందిన సుబ్రమణ్యస్వామి ఆరు క్షేత్రాలు

Image
తప్పక దర్శించవలసిన సుబ్రమణ్యస్వామి ఆరు ఆలయాలు   పళని పూర్వం శివుడు, 'గొప్ప జ్ఞానఫలం- 'నీవే' అని సుబ్రహ్మణ్యస్వామితో అన్నాడు. తమిళంలోని 'ఫలం నీ' అనే పేరు కాలక్రమంలో పలనిగా మారింది. అదే పళని క్షేత్రం. ఒకసారి నారదుడు అమూల్యమైన జ్ఞానఫలాన్ని తీసుకుని కైలాసానికి వెళ్లాడు. దానిని ముక్కలు చేయకుండా తినమని కోరాడు. పార్వతి ఆ ఫలాన్ని కుమారులకు ఇవ్వాలనుకుంది. "ఎవరైతే ముందుగా ఈ భూప్రదక్షిణం చేసివస్తారో వారికే ఈ ఫలం యిస్తాను' అని పార్వతీదేవి పలుకడంతోనే సుబ్రహ్మణ్యస్వామి తన వాహనమైన నెమలిని అధిరోహించి బయలుదేరాడు. వేగంగా ప్రయాణించలేని వినాయకుడు ఆలోచించి, తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసి భూప్రదక్షిణ ఫలాన్ని, నారదుడిచ్చిన జ్ఞానఫలాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. దాంతో అలిగిన సుబ్రహ్మణ్యస్వామి కైలాసం వదలి, ప్రస్తుతం పళని వున్న కొండపైకి వచ్చి కొలువుదీరినట్లు స్థలపురాణం చెబుతోంది. పళనిలో ఆలయం ఉన్న శివగిరి కొండ సుమారు 485 అడుగుల ఎత్తు. 695 మెట్లమార్గం ద్వారా, రోప్ వే లేదా రైలు మార్గాల్లో కొండ మీదికి చేరుకోవచ్చు. విశాలమైన ప్రాంగణంలో వివిధ మండపాలు కలిగిన ఈ ఆలయ ప్రధాన గర్భాలయంలో ...

Chaturmas 2024: చాతుర్మాస దీక్ష 2024 తేదీలు

Image
  ఆషాఢమాసానికి సంబందించిన అంశాలలో చాతుర్మాస్య వ్రతం ఎంతో ముఖ్యమైనది. చాతుర్మాసం అంటే నాలుగు నెలలు అని అర్ధం తొలి ఏకాదశిగా పిలవబడే ఆషాడ శుద్ధ ఏకాదశి నుండి చాతుర్మాస వ్రతం ఆరంభమవుతుంది. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువు పాలసముద్రంలో యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. ఈ విధంగా శయనించిన విష్ణువు నాలుగు నెలలు తరువాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు యోగనిద్ర నుండి మేల్కొంటాడు. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజు మొదలైన చాతుర్మాస వ్రతం కార్తీక శుద్ధ ద్వాదశి రోజు ముగుస్తుంది. విష్ణువు శయనించిన నాలుగు నెలలు చాతుర్మాస్యం ఆచరించబడుతుంది. భగవంతుని మీద మనసును లగ్నం చేయడమే ఈ వ్రతం ముఖ్య ఉద్దేశం. స్కాందపురాణం, భవిష్యపురాణం, బ్రహ్మవైవర్త పురాణం ఈ వ్రత విధానాన్ని పేర్కొంటున్నాయి. వరాహపురాణంలో ఈ వ్రత ప్రాశస్త్యం వివరించబడింది. సన్యాసులు,యతులు ఒక చోటనే వుంటూ దీక్షతో అనుష్ఠాలను కొనసాగిస్తారు.  గృహస్తులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.  ఈ నాలుగు నెలలు దేశం లో సుభిక్షముగా  వానలు కురుస్తాయి.నేల బురద మయమవుతుంది . ఇలాంటి తేమ వాతావరణం వ్యాధులను కలిగించే సూక్ష్మ క్రిముల వ్యాప్తికి అనువుగా ఉంటుంది . చాతుర్మాస్య వ్ర...

Tholi Ekadasi: తొలి ఏకాదశి | శయన ఏకాదశి

Image
  ఆషాడ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా చెబుతారు. ఈ ఏకాదశినే పలు గ్రంధాలు ప్రధమ ఏకాదశిగా చెబుతున్నాయి. ఈ రోజున విష్ణుమూర్తి పాలసముద్రంలో యోగ నిద్రకు ఉపక్రమించడం చేత, ఈ ఏకాదశి ఎంతో విశేషమైన పర్వంగా చెప్పబడింది. ఈ రోజు శేషశయ్య పై శయనించి ఉన్న విష్ణుమూర్తి చిత్రపటాన్ని పూజించి ఏకాదశి వ్రతం ఆచరించాలి. ఈ రోజు పూజలో కమలాలను వినియోగించడం మరింత ఫలదాయకం ఈ రోజున విష్ణుమూర్తి పాలసముద్రంలో శయనించడం వల్ల ఈ ఏకాదశికి శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి ఆచరించడం వల్ల జన్మజన్మలలో చేసిన పాపాలన్నీ హరింపబడి, అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఈ రోజు నుండి చాతుర్మాస్య వ్రతం ఆరంభం అవుతుంది. ఈ రోజు నుండి శ్రీహరి నిద్రకు ఉపక్రమిస్తాడు ఆ రోజు నుండి నిద్ర మేల్కొనే వరకు భక్తులు భగవతలిలలను వింటూ, కీర్తిస్తూ చాతుర్మాస్య వ్రతాన్ని పాటిస్తారు. 2024: జులై  17.

Dakshinayana Importance: దక్షిణాయన పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం చేయవలసినవి పనులు ఏమిటి?

సూర్య గమణాన్నిబట్టి మన భారతీయులు కాలాన్నిరెండు భాగాలుగా విభజించారు. భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని, దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని అన్నారు. ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం. 6 నెలలు దక్షిణాయనం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం. కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది.  ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి 15 నుంచి జూలై 16 వరకు ఉత్తరాయణం, జూలై 17 నుంచి జనవరి 14 వరకు దక్షిణాయనం అని అంటారు. కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి 6 గంటల 49 నిముషములు పుణ్యకాలంగా, 2 గంటల 16 నిమిషములు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడింది. ఆ సమయంలో స్నాన, దాన, జపాదులేవైనా అధిక ఫలితాలనిస్తాయి. ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే , దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం. ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం. అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఈ కాలంలో ఉపాసనలు చేస్తారు. అందువల్ల ఇది ఉపాసన కాలం అయ్యింది. శ్రీహరి ఆషాడ శుద్ద ఏకాదశ...

Keelapatla Konetiraya Temple: శ్రీ కోనేటిరాయ స్వామి ఆలయం - కీలపట్ల

Image
  శ్రీమహావిష్ణువు లోకకల్యాణానికై శ్రీవైకుంఠాన్ని వదలి కోనేటిరాయస్వామిగా భువిపై వెలసిన మహిమాన్విత దివ్యక్షేత్రం కీలపట్ల, చిత్తూరుజిల్లాలోని పలమనేరు సమీపంలో గంగవరం మండలంలో ఉంది. చోళ రాజులకాలంలో యుద్దసిపాయిల ముఖ్యమైన పటాలం' అటవీ ప్రాంతమైన కోటిపల్లి సమీపాన ఉండేదట. చిన్నదండు (పటాళం) ఉండే ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతాన్ని 'కీళ్పటాలం' అని పిలిచే వారు. జనవాడుకలో కీళ్పటాలం, కీళ్పట్టు, కీళ్పట్టణం-కీల పట్లగా స్థిరపడింది. కీలపట్లలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారిని బ్రహ్మమానస పుత్రుడు భృగుమహర్షి ప్రతిష్టించినాడని ప్రతీతి. జనమేజయమహారాజుకాలంలో ఈ గుడి నిర్మించబడిందని, పల్లవరాజులు, చోళరాజులు ఈ గుడిని పునర్నిర్మించినట్లు శాసనాధారాల ద్వారా తెలుస్తుంది. లక్ష్మీదేవి తన నివాసస్థానమైన వక్షఃస్థలంపై భృగుమహర్షి తన్నినందున వైకుంఠవాసునిపై ప్రణయ కలహాన్ని పూని భూలోకానికి వెళ్లింది. విష్ణువు లక్ష్మీదేవిని అన్వే షిస్తూ వైకుంఠాన్ని వదలి శ్రీవేంకటాచలానికి వేంచేశాడు. పరతత్త్వమైన శ్రియఃపతి ఆకాశరాజుకుమార్తె పద్మావతిని వివాహ మాడాడు. భక్తసంరక్షణకై లక్ష్మీపద్మావతులతో కలియుగంలో పలుచోట్ల దుష్టశిక్షణ, శిష్టరక్షణకై అర్చావతా...

History of Sabarimala: శబరిమల చరిత్ర

Image
  పూర్వం శబరిమల వెళ్లాలంటే ఎరుమేలి మార్గం ఒక్కటే శరణ్యమయ్యేది.క్రూరమృగాల భయంతో అంతా కలిసి బృందాలుగా తరలి వెళ్లేవారు.  1819 వ సంవత్సరంలో ఆలయాన్ని 70 మంది భక్తులు సందర్శించారు.అప్పటి సంవత్సరం ఆలయాదాయం కేవలం 7 రూపాయలు. 1907 వ సంవత్సరం వరకూ ఆలయం పాకల్లో ఉండేది.దాంతో ఆలయంలో మూడుసార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. 1907, 1909, 1950 సంవత్సరాల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. 1909లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో రాతితో నూతన ఆలయాన్ని నిర్మించారు. పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచి ఆలయ వైభవం ఇనుమడించింది. భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. 1950లో తిరిగి అగ్నిప్రమాదం జరిగి ప్రస్తుతం దర్శనమిచ్చే ఆలయం తయారైంది. స్వామి పంచలోహ విగ్రహ మూర్తి చెంగనూరు చెందిన అయ్యప్పన్, నీలకంఠన్ అనే శిల్పులు తయారు చేశారు. శ్రీ శంకర తాంత్రి స్వామి చేతుల మీదుగా 1951లో స్వామి ప్రతిష్ఠితుడయ్యాడు. 1935 వరకు ఆలయ నిర్వహణ తిరువాన్కూర్ మహారాజ సంస్థానాధీశుల ఆధ్వర్యంలోనే నడిచింది. 1935 లో దేవస్థానం బోర్డు  ఆధీనంలోకి వచ్చింది. అప్పట్లో ఆలయాన్ని కేవలం జ్యోతి దర్శన సమయంలో మాత్రమే తెరిచే వారు.1940 నుంచి భక్తుల సంఖ్య క...

Singirikona Temple: శ్రీ నరసింహ స్వామి ఆలయం - సింగిరికోన

Image
చిత్తూరు జిల్లాలో సింగిరికోనలొ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం అడవి ప్రాంతమైన చిన్నకొండమీద ఉంటుంది. ఇది అతి పురాతనమైన ఆలయం. ఈ స్వామి స్వయంభూ అని చెబుతారు. ఆరు అడుగుల ఎత్తులో నల్లరాతి విగ్రహాలు భక్తులకు కనువిందు చేస్తాయి. స్వామి, ఇరుపక్కల శ్రీదేవి, భూదేవి కొలువుదీరి ఉంటారు. ఇక్కడ శ్రీనరసింహస్వామి విగ్రహం నోరు తెరుచుకున్నట్లు ఉంటుంది. దానికి ఓ కథనం ఉంది. స్వామి వేటకు వచ్చి కొంచెం సేపు. అక్కడ విశ్రాంతి తీసుకున్నారట. కళ్ళు తెరిచేసరికి తెల్లవారిందిట. అప్పుడే తెల్లవారిందా అని ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని అలాగే శిలలా ఉండిపోయారట.  రోజూ ఉదయం స్వామికి పంచామృతాలతో అభిషేకం. గోపూజ మొదలైన నిత్య సేవలన్నీ చేస్తారు. ప్రతి నెలా స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజు విశేష తిరుమంజనం, సుదర్శన నారసింహ మహా యాగం శాస్త్ర ప్రకారం నిర్వహిస్తారు. ఇక్కడ పూజలు ఉదయం మంత్ర సహిత కార్యక్రమాలతో ప్రారంభం అవుతాయి.తర్వాత అర్చనలు, స్వామికి పాట రూపంలో జరుగుతాయి. అర్చక స్వామి పూజ చేయించుకునే భక్తులను కూర్చోబెట్టి చక్కగా పాడతారు. భక్తులు ఎక్కడెక్కడినుంచో, ఎన్నో ప్రయాసలు పడి నీ దర్శనానికి వచ్చారు. వారి ఇబ్బందు...

Swarna Gowri Vrat: స్వర్ణ గౌరీ వ్రతం

Image
శ్రావణ శుద్ధ తదియనాడు ఈ వ్రతం ఆచరిస్తారు. అన్యోన్య దాంపత్య జీవనానికి ఈ వ్రతం చేస్తారు స్వర్ణగౌరీ వ్రతం పేరుతో పార్వతీ పరమేశ్వరులను అరాధిస్తారు.  ఈ స్వర్ణ గౌరీ వ్రతం గురించి సాక్షాత్తు పరమశివుడు పార్వతీ దేవికి చెప్పాడని పురాణ కథనం. ఈ వ్రతం ఆచరించడం వలన మహిళల అయిదో తనం కలకాలం నిలుస్తుందని నమ్ముతారు. పూర్వం ఒక రాజు వేటకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా ఒక నది సమీపంలో ఉన్న చిన్న ఆశ్రమం వద్ద కొంతమంది మహిళలు గుమిగూడి ఉంటండటం చూశాడు. వాళ్ళ వద్దకు వెళ్లి విషయం ఏమిటని అడుగాడు. వాళ్ళు ఆ రాజుతో మేము స్వర్ణ గౌరీ వ్రతం ఆచరిస్తున్నామని, ఈ వ్రతం వల్ల ఆడవారి సౌభాగ్యం వందేళ్లు నిలుస్తుందని, వ్రతం చేసే మహిళ భర్త ఆయుష్షు పెరుగుతుందని చెబుతారు. మహారాజు వాళ్ళతో వ్రత విధానం గురించి తెలుసుకుని తిరిగి తన రాజమందిరానికి వెళ్లాడు. తన ఇద్దరు భార్యలకు స్వర్ణ గౌరీ వ్రతం గురించి చెబుతాడు. ఆ ఇద్దరిలో పెద్ద భార్య వ్రతం గురించి పట్టించుకోలేదు. కొట్టిపడేస్తుంది. చిన్న భార్య మాత్రం ఎంతో శ్రద్ధగా వ్రతం చేసుకుంటుంది. వ్రతం గురించి హేళనగా మాట్లాడిన పెద్ద భార్య కష్టాల పాలవుతుంది. భక్తిశ్రద్ధలతో వ్రతం చేసుకున్న చిన్న భార్య సుఖ...

Vaikanasa Agamam: విఖనస మహర్షి - శ్రీ వైఖానస ఆగమ శాస్త్రం

Image
  తిరుమలతో సహా దాదాపు కొన్ని వైష్ణవ ఆలయాలలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు  జరుగుతాయి అని మనకు తెలుసు. అసలు వైఖానస ఆగమ శాస్త్రం అంటే ఏమిటి ? క్లుప్తంగా చూదాం. కలియుగంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తపస్సు, యజ్ఞయాగాలు సాధ్యం కాదు అని శ్రీ మహావిష్ణు భావన. అర్చామూర్తిగా  అవతరిస్తున తనకు చేయవలసిన అర్చనలు, నిత్యపూజలు నివేదనలు సులభతరమైన పద్ధతిలో నియమ నిబంధనలను రూపొందించి ఓ గ్రంధరూపం ఇవ్వవలిసింది అని బ్రహ్మను కోరాడు శ్రీ మహావిష్ణువు. అంతటి మహత్కార్యాన్ని చేపట్ట గలిగే శక్తి తనకు లేదు అని బ్రహ్మ శ్రీ మహావిష్ణువుకు విన్నవించాడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు తన సంకల్పాన్ని సాకారం చేసుకోవడం కోసం తన మానసం నుండి ఓ మహానుభావుడిని ఉద్బవింపజేసాడు, ఆయనే విష్ణు మానసపుత్రుడు విఖనస మహర్షి.  విఖనస మహర్షి శ్రావణమాసం, శుక్ల పక్షం, పౌర్ణమి, శ్రావణ నక్షత్రం రోజున నైమిశారణ్యంలో ఆవిర్భవించాడు. విఖనస మహర్షి ద్వారా ఉద్బవించింది కనుక ఈ శాస్త్రం వైఖానస ఆగమం అయింది.  శ్రీ మహావిష్ణువు ఆదేశం ప్రకారం విఖనస మహర్షి మరో నలుగురు ఋషులను శిష్యులుగా చేసుకొని వారి సహాయంతో ఈ కార్యాన్ని సాధించాడు.  అత్ర...

Dharmapuri Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం - ధర్మపురి

Image
శ్రీ యోగానంద లక్ష్మీ నారసింహస్వామి క్షేత్రం అత్యంత పురాతనమైనది. నవనారసింహక్షేత్రాలలో ఒకటి. పురాతనమైన ఈ క్షేత్రం గూర్చిన ప్రస్తావన క్రీ.శ. 928 కాలంలో ఉంది. పద్మపురాణం, నారాయణ శతకం వంటి ప్రముఖ గ్రంథా లలో ఈ క్షేత్రం గూర్చి ప్రశంసలు కన్పిస్తాయి. గర్భగుడిలో విభిన్న రూపాలతో ఉండే ఇద్దరు నారసింహులను దర్శించుకోవచ్చు. మొదటిది | పురాతనకాలంలో అనగా క్రీ.శ 1448లో ప్రతిష్టించబడినది. ఈ విగ్రహాన్ని పాత నారసింహస్వామి అనీ, ఆ తరువాత క్రొత్తగా అనగా క్రీ.శ.1725లో ప్రతిష్టించబడిన విగ్రహాన్ని కొత్త నారసింహస్వామి అనీ వ్యవహరిస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీలక్ష్మీదేవి వేరే వేదికపై నెలకొని ఉంటుంది. స్థలపురాణం ప్రకారం హిరణ్యకశిపుని వధించిన అనంతరం ఉగ్రరూపంలో ఉన్న నారసింహుడిని శాంతింప చేయటానికి బ్రహ్మదేవుడు కఠోరమైన తపస్సును చేయనారంభించాడు. అదే సమయంలో తన కోసం తపమాచరిస్తున్న తన భక్తుడిని కూడా నారసింహుని ప్రసన్నుని చేయటానికి తపస్సు చేయమని చెప్పాడు. ఇంకా ఆ రాజుతో ఒక యజ్ఞం కూడా చేయిస్తాడు. వీరి తపములతో నరసింహస్వామి ప్రసన్నుడై వీరికి సాక్షాత్కరించి వీరి కోరికపై ఇక్కడ స్వయంభువుగా వెలిసాడని పురాణ గాథ. ధర్మవర్మ పాలించే ప్రాంతం క...

Pancharatra Agamam: పాంచరాత్ర ఆగమం

పంచ అంటే ఐదు, రాత్ర అంటే రోజులు అని అర్ధం. భగవంతుడు ఐదురోజులపాటు నాగరాజు అయిన గరుత్మంతుడు, అనంతుడు, విష్వక్సేనమూర్తి, చతుర్ముఖబ్రహ్మ, పరమేశ్వరుడు అనే ఐదుగురికి ఉపదేశించినవి కావున దీనికి పాంచరాత్రఆగమం అనేపేరు వచ్చింది. ఇది శ్రీవైష్ణవ పూజావిధానం. ఇది మనుషుల అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. లోకంలో ప్రతి జీవి పునరావృత్తిరహిత శ్రీవైకుంఠానికి చేరి శాశ్వతమైన ఆనందం పొందేందుకు పాంచరాత్రం దోహదపడుతుంది. హయవదనుడనే రాక్షసుడు వేదాలకు నిధి అయిన బ్రహ్మనుండి తస్కరించి సముద్రగర్భానికి వెళ్ళి దాక్కున్నప్పుడు వేదక్రతువులు జరగక దేవతలశక్తులు తగ్గిపోసాగాయి. అప్పుడు అయిదురాత్రులపాటూ దేవర్షులంతా కలిసి మంత్రం లేనందువలన (వేదాలు లేవు కనుక మంత్రం లేదు) తంత్రంతో పూజచేశారు. ఆవిధంగా విష్ణువు శక్తిమంతుడై మత్స్యావతారం దాల్చి హయవదనుణ్ణి చంపి వేదాలను రక్షించాడు. తిరిగి హయగ్రీవమూర్తిగా మారి వాటిని బ్రహ్మకు ఉపదేశించాడు. అలా వేదాలు పోయి మరలా తిరిగివచ్చిన వ్యవధి అయిదురాత్రులలో భగవదారాధన వైదిక పద్ధతిలోకాకుండా తంత్రంలో జరిగింది. అందువలన ఆ పంచరాత్రుల పేరుమీద పాంచరాత్రం అని ఈ ఆగమశాస్త్రానికి పేరు రావడం జరిగింది. ఈ...

Udaya Kaleswara Swamy Temple: శ్రీ గంగ పార్వతి దేవి సమేత ఉదయ కాళేశ్వర స్వామి ఆలయం - గండవరం

Image
ఈ ఆలయం నెల్లూరుకు ఉత్తర భాగాన, కావలికి వెళ్లే  మార్గమధ్యంలో నెల్లూరుకు 16 కి.మీ.దూరంలో ఉంది. పూర్వం భగీరథుడు గంగను ఈ భూమి మీదకు రప్పిం చడం కోసం, తపస్సు చేసి పరమశివుడిని మెప్పించి, స్వామివారి తేజోరూపాన్ని లింగరూపంగా ప్రసాదించమని కోరాడు. అతని కోరిక మేరకు పరమశివుడు తన తేజో రూపమైన లింగాన్ని భగీరథుడికి ప్రసాదించాడు. ఆ దివ్యతేజో లింగాన్ని ఇస్తూ "భగీరథా! గంగ భువికి ధారగా వచ్చినచో, ఈ భూప్రపంచమంతా కల్లోలమౌతుంది. అందుచేత, ఈ తేజో లింగరూపాన్ని భూమియందు ప్రతిష్టించి, గంగను ప్రార్థిస్తే, ఆమె నా శిరస్సు మీద ధారగా పడుతుంది. ఆ జలాన్ని నీకు ప్రసాదంగా ఇస్తానని" చెప్పాడు. అలా లింగాన్ని సంపాదించిన భగీరథుడు పరమేశ్వరుడు చెప్పిన విధంగానే లింగాన్ని భూమియందు ప్రతిష్ఠించి గంగను ప్రార్ధించాడు. ఆ ప్రార్ధనకు మెచ్చిన గంగ భూమికి తరలి వచ్చి శివుని శిరస్సుపై దారగాపడెను. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఈశ్వరుడు అగ్ర హించి, "భగీరథా! నీవు నా తేజోలింగరూపాన్ని అపవిత్రం చేశావని" చెప్పాడు. భగీరథుడు ఆశ్చర్యపోయి "స్వామీ! నేను చేసిన తప్పు ఏమిటని" అడిగాడు. అప్పుడు శివుడు "గంగ భూమికి వచ్చే సమయంలో వాయు...

Narayanavanam Venkateswara Swamy Temple: శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారు ఆలయం - నారాయణవనం

Image
శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారు, శ్రీ పద్మావతీ అమ్మ వారు నెలకొని ఉన్న దివ్యక్షేత్రం నారాయణవనం. ఆకాశరాజు కుమార్తె శ్రీపద్మావతీదేవిని శ్రీనివాసుడు పరిణయమాడిన పరమపవిత్రస్థలం ఇది. ఈ దివ్యక్షేత్రం తిరుపతికి 34 కి.మీ దూరంలో తిరుపతి- మద్రాసు మార్గంలో పుత్తూరుకు 5 కి.మీ. దూరంలో ఉంది. శ్రీనివాసుడు వేటకై వచ్చి నారాయణవనోద్యానంలో చెలికత్తెలతో విహరించుచున్న పద్మావతిని చూచి, మోహించి వివాహం చేసుకున్నాడు. కాబట్టి దీనికి నారాయణపురమని పేరొచ్చింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు పద్మావతిని వివాహమాడుటకై వరునిగా ఆవిర్భవించినందు వల్ల ఈ క్షేత్రం నారాయణవనంగా నేటికీ పిలువబడుచున్నది. ఈ ఆలయప్రాభవ, ప్రాశస్త్యాలగురించి శ్రీ వేంకటా చలమాహాత్మ్యంలో వివరించబడింది. ఇక్కడి ఆలయాన్ని ఆకాశ రాజు కట్టించినట్లు భక్తుల విశ్వాసం. శ్రీ వీరనరసింగ దేవయాదవరాయలు (1205- 1245) జీర్ణోద్ధరణ చేశారు. పెనుగొండ వీరప్పన్న నారాయణ వరంలో శ్రీ కల్యాణవేంకటేశ్వర స్వామివారి ఆలయంను క్రీ.శ. 1541-42 సం||ల కాలంలో పునఃనిర్మించినట్లు పేర్కొనబడినది. 1967వ సం|| ఏప్రిల్ నెల 29వ తేదీన ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధీనంలోనికి వచ్చింది. శ్రీ కల్యాణ వేంకటేశ...