Skip to main content

History of Sabarimala: శబరిమల చరిత్ర

 

  • పూర్వం శబరిమల వెళ్లాలంటే ఎరుమేలి మార్గం ఒక్కటే శరణ్యమయ్యేది.క్రూరమృగాల భయంతో అంతా కలిసి బృందాలుగా తరలి వెళ్లేవారు. 
  • 1819 వ సంవత్సరంలో ఆలయాన్ని 70 మంది భక్తులు సందర్శించారు.అప్పటి సంవత్సరం ఆలయాదాయం కేవలం 7 రూపాయలు.
  • 1907 వ సంవత్సరం వరకూ ఆలయం పాకల్లో ఉండేది.దాంతో ఆలయంలో మూడుసార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి.
  • 1907, 1909, 1950 సంవత్సరాల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. 1909లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో రాతితో నూతన ఆలయాన్ని నిర్మించారు. పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టించారు.
  • అప్పటి నుంచి ఆలయ వైభవం ఇనుమడించింది. భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. 1950లో తిరిగి అగ్నిప్రమాదం జరిగి ప్రస్తుతం దర్శనమిచ్చే ఆలయం తయారైంది.
  • స్వామి పంచలోహ విగ్రహ మూర్తి చెంగనూరు చెందిన అయ్యప్పన్, నీలకంఠన్ అనే శిల్పులు తయారు చేశారు. శ్రీ శంకర తాంత్రి స్వామి చేతుల మీదుగా 1951లో స్వామి ప్రతిష్ఠితుడయ్యాడు.
  • 1935 వరకు ఆలయ నిర్వహణ తిరువాన్కూర్ మహారాజ సంస్థానాధీశుల ఆధ్వర్యంలోనే నడిచింది. 1935 లో దేవస్థానం బోర్డు  ఆధీనంలోకి వచ్చింది.
  • అప్పట్లో ఆలయాన్ని కేవలం జ్యోతి దర్శన సమయంలో మాత్రమే తెరిచే వారు.1940 నుంచి భక్తుల సంఖ్య క్రమేపీ పెరిగింది. దీంతో మండల పూజల సమయంలో కూడా ఆలయాన్ని తెరవడం మొదలుపెట్టారు.
  • 1945 నాటికి భక్తుల సంఖ్య అధికం కావడంతో విషు, పంక్తుల ఉత్సవం. ఓణం సందర్భాల్లో కూడా ఆలయాన్ని తెరిచే వారు.
  • 1950 తరువాత నుంచి మాస పూజల కోసం మాస ఆరంభంలో తెరిచే వారు. మొదట్లో మూడు రోజులు తెరిచిన ఆలయాన్ని ప్రస్తుతం ప్రతినెల 5 రోజులు తెరుస్తున్నారు. ఈ సమయంలో కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. 
  • 1984 వరకూ ఆలయం ముందున్న పదునెట్టాంబడి రాతి మెట్లతోనే ఉండేది. భక్తులు తాము దర్శనం చేసుకునే సంవత్సరాన్ని బట్టి ఆ సంఖ్యకు తగిన విధంగా మెట్లపై కొబ్బరి కాయలు కొట్టేవారు. అందువల్ల రాతి మెట్లు కొంతమేరకు దెబ్బతిన్నాయి. భక్తులు ఎక్కేందుకు ఇబ్బందిగా కూడా ఉండేది.
  • దాంతో 1985లో పదునెట్టాంబడి పంచలోహ తాపడం చేశారు. కొబ్బరికాయలను మెట్లకు ఇరువైపులా కొట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు.పదునెట్టాంబడి పై కప్పు ఏర్పాటు చేశారు.
  • 1985 నుంచి భక్తులకు వసతి సౌకర్యాలు పెరిగాయి. 90లో మధ్య శబరిమల, పంబా మార్గంలో కాంక్రీటు రోడ్డు వేశారు.
  • 2000 వ సంవత్సరంలో ఒక భక్తుడు స్వామి గర్భాలయానికి బంగారు రేకులతో తాపడం చేయించాడు.

Comments

Popular posts from this blog

Kojagara Purnima: కోజాగరి పూర్ణిమ

ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్ష పూర్ణిమ కోజాగరి పూర్ణిమ. ఈనాడు ఆచరించే వ్రతానికి కోజాగరి పూర్ణిమవ్రతం, కోజాగరి వ్రతం అని పేర్లు. శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రియమైన ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల దారిద్ర్యాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు, సకల సంపదలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. ఆశ్వయుజ పూర్ణిమనాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని శిరస్నానం చేసి శ్రీమహాలక్ష్మీదేవిని పూజించాలి. తిరిగి సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత మరాలా లక్ష్మీ దేవినే పూజించి పాలు, పంచదార, ఏలకుల పొడి, కుంకుమపువ్వు వేసి వండిన క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించి దానిని తీసుకువెళ్లి ఆరుబయట వెన్నెలలో కొద్దిసేపు ఉంచాలి. తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ వ్రతంలో రాత్రి జాగరణ చేయాలని నియమం. జాగరణ సమయంలో పాచికలు లేదా గవ్వలను ఆడుతూ గడపలెను. ఆశ్వయుజ పూర్ణిమనాడు రాత్రి లక్ష్మీదేవి భూలోకంలో తిరుగుతూ ఎవరైతే జాగరణ చేస్తూ ఉంటారో వారికి సర్వసంపదలను ప్రసాదిస్తుందని కథనం. ఈ విధంగా జాగరణ చేసి మరునాడు పునఃపూజ చేసి వ్రతాన్ని ముగించాలి. ఈ విధంగా కోజాగరి పూర్ణిమను జరుపుకోవడం వల్ల లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు లభిస్తాయి. పూర్వం ఈ వ్

Vadapalli Temple Brahmotsavam: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2024 తేదీలు - వాడపల్లి

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తూర్పుగోదావరి జిల్లాలో వెలసింది. ఈ ఆలయం ఏడు శనివారాలు నోముకు ప్రసిద్ధి. 2024 తేదీలు స్వామి వారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 21 నుండి వైభవంగా జరగనున్నాయి. అక్టోబర్ 21 - ధ్వజారోహణం, శేష వాహన సేవ, వాసుదేవ అలంకరణ  అక్టోబర్ 22 - మహా పుష్పయాగం, సహస్ర దీపాలంకరణ సేవ, హంస వాహన సేవ అక్టోబర్ 23 - శ్రీనివాస కళ్యాణం, కోదండరామ అలంకరణ, హనుమంత వాహన సేవ అక్టోబర్ 24 - తోమాల సేవ, సుదర్శన హోమం, యోగనరసింహ అలంకరణ, సింహ వాహన సేవ అక్టోబర్ 25 - అష్టదళపాదపద్మ ఆరాధన, మలయప్ప అలంకరణ, గరుడ వాహన సేవ అక్టోబర్ 26 - సుప్రభాత సేవ, శ్రీ కృష్ణ అలంకరణ, సూర్యప్రభ వాహన సేవ, మోహిని అలంకరణ, చంద్రప్రభ వాహన సేవ అక్టోబర్ 27 - తిరుప్పావడ సేవ, రాజాధిరాజా అలంకరణ, గజ వాహన సేవ అక్టోబర్ 28 - లక్ష కుంకుమార్చన, చూర్ణోత్సవం, కల్కి అలంకరణ, అశ్వ వాహన సేవ అక్టోబర్ 29 - పూర్ణాహుతి, చక్ర స్నానం, ఏకాంత సేవ 

Karthika Masam: కార్తిక మాసంలో తప్పకుండా చేయాల్సిన పనులేవి?

  సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. కార్తికమాసంలో చంద్రకిరణాలు సోకిన నీటితో స్నానం చేయడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది. నదీస్నానం ఉత్తమం. ఆరుబయట చంద్రకిరణాలు సోకిన నీటితో అయినా స్నానం చేయవచ్చు. అనారోగ్య కారణాల వల్ల స్నానం చేయడం కుదరకపోతే శివుణ్ణి మనసులోనే స్మరించి మానసస్నానం అయినా చేయాలి. దేవుని వద్ద దీపం వెలిగించాలి. కార్తికమాసంలోనే కాకుండా ఏడాది పొడవునా దేవుని వద్ద రెండుపూటలా దీపం వెలిగించడం ఉత్తమం. కార్తికంలో దీపారాధన చేస్తే ఏడాది పొడవునా చేసిన ఫలితం లభిస్తుంది.  కార్తిక పౌర్ణమినాడైనా దీపారాధన తప్పనిసరిగా చేయాలి.  ఉన్నంతలో లేనివారికి దానం చేయాలి. మానవసేవయే మాధవసేవగా భావించాలి. పవిత్రమాసాల్లో చేసిన దానాలకు రెట్టింపు ఫలితం వస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. కార్తిక పురాణంలో చెప్పిన విశేషాలను వినాలి,స్మరించుకోవాలి.   కార్తికంలో శివునికి ప్రధానంగా లక్షమారేడు దళాలతో సమూహంగా పూజ చేస్తారు. అలాగే విష్ణుమూర్తిని కార్తిక దామోదరునిగా పూజిస్తారు. శివకేశవులిద్దరికీ ఇది ప్రీతికరమైన మాసం. పెద్ద ఉసిరి, తులసి, మామిడి, మారేడు, జమ్మి మొదలైన దేవవృక్షాలున్న వనంలో భక్తిశ్రద్ధలతో సామూహిక

Karthika Masam: కార్తీకమాసం ఈ నెలరోజులూ ఏం చేయాలి - ఏం చేయకూడదు

  కృతయుగంతో సమానమైన యుగం, వేదాలకు సమానమైన శాస్త్రం, గంగకు సమానమైన నది, కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. కార్తీక మాసం శివుడికి, మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. కార్తీక పురాణంలో కార్తీక సోమవారం,  జ్వాలాతోరణం  మహాశివుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే  బలి పాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువు  ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తాయి. కార్తీక పురాణం లో కూడా మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుడి ప్రాముఖ్యతను, ఆఖరి 15 అధ్యాయాలు శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తాయి.  కార్తీక మాసంలో ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు స్నానం కార్తీక మాసంలో సూర్యుడు తులా రాశిలో ఉండటం వల్ల నదిలో నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం ఆచరించడం వల్ల శరీరానికి శక్తి కలిగి ఆరోగ్యంగా ఉంటారు. పురాణాల పరంగా కార్తీక నెలరోజులూ సూర్యోదయానికి ముందు నదీస్నానం చేస్తే సకల పాపాలు నశిస్తాయని అంటారు. దీపం ‘దీపం జ్యోతి పరబ్రహ్మం.. దీప జ్యోతి జనార్దన.. దీపో మేహరతు పాపం.. సంధ్యాదీపం నమోస్తుతే!’.దీపమే పరబ్రహ్మం. దీపంలో లక్ష్మీ దేవి ఉందనీ.. దీపం నుంచి వచ్చే తేజస్సులో బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు ఉన్నారనీ పురాణాలు చెబుతున్నాయి. అజ్ఞానం అనే అం

Dwaraka Tirumala Brahmotsavam: శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు 2024 తేదీలు - ద్వారకా తిరుమల

ద్వారకాతిరుమలలో  ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. స్వయంభువ మూర్తి వైశాఖమాసంలో వెలిసినందువల్ల ఒకసారి.... ఆశ్వయుజ మాసంలో రామానుజులు ప్రతిష్ఠ చేసినందువల్ల రెండోసారి బ్రహ్మోత్సవం జరుగుతుంది. రెండు బ్రహ్మోత్సవాల్లోనూ శ్రీస్వామివారికి, అమ్మవారికి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. 2024 తేదీలు  అక్టోబరు 13 - గజ వాహన సేవ అక్టోబరు 14 - ధ్వజారోహణ, శేష వాహన సేవ  అక్టోబరు 16 - సూర్యప్రభ వాహన సేవ, ఎదురుకోలు  అక్టోబరు 17 - తిరు కల్యాణ మహోత్సవం, గరుడ వాహన సేవ అక్టోబరు 18 - రథోత్సవం  అక్టోబరు 19 - చక్రవారి, ధ్వజావరోహణం  అక్టోబరు 20 - ద్వాదశ కోవెల ప్రదక్షిణ, పుష్పయాగం, పవళింపు సేవ 

Tula Sankranti: తులా సంక్రాంతి

సూర్యుడు ప్రతి నెలా ఒక్కో రాశిలో ప్రవేశిస్తుంటాడు. అక్టోబర్ నెలలో సూర్యుడు కన్యారాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. తులా సంక్రమణం జరిగిన నెల రోజులు పరమ పవిత్రంగా, శుభకరంగా భావిస్తారు. ఈ మాసంలో పగటికాలం తగ్గుతూ, రాత్రి కాలం పెరుగుతూ వస్తుంది. తులా సంక్రమణం రోజు నదీ స్నానం చేయడం శ్రేష్ఠం. అందులోనూ కావేరీ నదిలో స్నానం చేస్తే ఇంకా మంచిది. తులా సంక్రాంతిని గర్భాన సంక్రాంతి అని కూడా పిలుస్తారు.ఒక మహిళ తన బిడ్డకు జన్మనిచ్చిన గర్వంతో సంతోషించినట్లు, రైతులు తమ వరి పొలాల్లో పండించిన పంటకు, సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే తులా సంక్రాంతిని గర్భాన సంక్రాంతి అని కూడా పిలుస్తారు. ప్రత్యేకంగా ఒడిశా, కర్ణాటకలలో తులా సంక్రమణం విశేషంగా జరుపుకుంటారు. తులా సంక్రమణం రోజున లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తే ఆ సిరుల తల్లి అనుగ్రహంతో ఏడాది పొడవునా పంటలు బాగా పండి ఆహారానికి కొరత ఉండదని రైతుల విశ్వాసం. ఈ పర్వదినాన రైతుల కుటుంబాలు లక్ష్మీదేవికి గోధుమ ధాన్యాలు, కూరగాయల మొక్కల కొమ్మలతో పాటు తాజా వరి ధాన్యాలు, తాటి కాయలు, పసుపు, కుంకుమ, గంధం, గాజులు లాంటి మంగళ ద్రవ్యాలను సమర్పించి పంటల

Aswayuja Purnima: ఆశ్వయుజ పూర్ణిమ, కౌముది పూర్ణిమ

  ఆశ్వయుజ పూర్ణిమ నాడు చంద్రుడు అశ్వినీ నక్షత్రంతో కలిసి ఉంటాడు.సౌర మానంలో దీన్నే తులాపూర్ణిమ అంటారు. ఈ తులామాసంలో జగన్మాతను ఆరాధించాలి. ఈ రోజున అధికమైన కాంతి కలిగిన వెన్నల ఉంటుంది.అందుకే దీనిని కౌముది పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు ధ్యానం చేస్తే  సాధకుని మనస్సు సంకల్ప వికల్పాలకు అతీతమవుతుంది. శివశక్తి సామరస్యాన్ని దర్శించే సామర్ధ్యం పెంపొందుతుంది. ఈ రోజున కౌముద్యుత్నవము, అక్షక్రీడ కోజాగర్తి వ్రతము. లక్ష్మీపూజ, ఇంద్రపూజ, కుబేరపూజ, చంద్ర పూజ చేయాలి. లక్ష్మీ, కుబేరుడు, ఇంద్రులను రాత్రి సమయంలో పూజిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి. ఈ రోజు లక్ష్మి అనుగ్రహం కోసం గవ్వలాట(అక్ష క్రీడ) ఆదుకోవాలి. జాగరణ వ్రతం చేయాలి, జాగరణలో వున్నవారిని లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఆవు పాలతో ఆరుబయట వెన్నెల్లో క్షీరాన్నం తయారుచేస్తారు.  ప్రకాశవంతమైన చంద్రుని అమృత కిరణాలు ఆ పాయసంలోకి నేరుగా ప్రసరిస్తాయి. దానిని లక్ష్మీదేవికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. దీనివల్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వృద్ధి పొందుతాయి.  ఆశ్వయుజ పూర్ణిమ నాడు గొంతెమ్మరూపంలో ఉన్న కుంతీదేవిని ఆరాధించే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది.  ఈ రోజున దానం

Dasara: దసరా, విజయదశమి

  ఆశ్వయుజ శుద్ధ దశమి విజయదశమిగా చెప్పబడుతోంది. దీనికే అపరాజిత దశమి, దసరా అని కూడా పేర్లు. అపరాజిత అంటే పరాజయం లేనిది అని అర్థం.  ఈ రోజున ఏ పనిని ప్రారంభించినా అందులో తప్పక విజయం లభిస్తుంది.అందుకే యిది విజయదశమిగా ప్రసిద్ధి చెందింది.  దేవీనవరాత్రులలో కలశాన్ని స్థాపించి, దీక్షతో వున్నవారు ఈ దశమిరోజున ఉద్వాసన చెప్పాలి. ఇక 'దశాహరాత్రం' అనే సంస్కృత పదాలకి ఏర్పడ్డ “దశహరం" అనే వికృతి రూపంనుండి వచ్చిన పేరే దసరా. ఈ రోజున అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. ఈ రోజు సాయంత్రం జమ్మిచెట్టును దర్శించి పూజించాలి. సాధారణంగా గ్రామాలలో సామూహికంగా ఈ శమీపూజ చేస్తుంటారు. ఈ శమీపూజ చేయడం వల్ల అనుకున్న పనులలో 'విజయం' తప్పక లభిస్తుందంటారు. విజయదశమి రోజున ప్రత్యేకంగా విజయకాలాన్ని కూడా పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రవణానక్షత్రం, దశమి తిధి వున్న విజయదశమి రోజున సంధ్యాకాలం దాటిన తర్వాత వుండే సమయాల్ని పురాణాలు విజయకాలమని పేర్కొంటున్నాయి. ఒకవేళ శ్రవణం నక్షత్రం లేకపోయినా దశమి తిథిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని దాన్ని విజయముహూర్తంగా భావించాలని స్కాందపురాణం చెబుతోంది. ఈ సమయంలో అ

Jonnawada Temple: శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం - జొన్నవాడ

  శ్రీ పొట్టిశ్రీ రాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళ్లెం మండలం జొన్నవాడ గ్రామంలో పవిత్ర పెన్నానధి తీరాన ఈ ఆలయం కొలువైంది.  త్రేతాయుగంలో కశ్యపమహర్షి ఈ ప్రాంతంలో యజ్ఞం చేసినట్లు కథనం. కశ్యప మహర్షి యజ్ఞవాటిక కనుక ఆ అర్థం వచ్చే జన్నవాడ అనే పేరు ఈ ప్రాంతానికి ఏర్పడింది. అది కాలక్రమంలో జొన్నవాడ అయినట్లు స్థలపురాణం వెల్లడిస్తోంది. స్థలపురాణం పూర్వం కశ్యపమహర్షి వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ పెన్నానది తీరంలోని వేదాద్రికి చేరుకొని ఆ ప్రాంతంలో ఒక యజ్ఞాన్ని చేయదలచి యజ్ఞ వాటికను నిర్మించుకుని యజ్ఞం చేయడం ప్రారంభించాడు.ఈ విధంగా కశ్యపమహర్షి యజ్ఞం చేయడం పూర్తికాగాన ఆ యజ్ఞవాటిక నుంచి పరమేశ్వరుడు ఉద్భవించి క్రీ మల్లికార్జునస్వామిగా పూజలందుకున్నాడు. కైలాసంలో పరమ శివుడు లేకపోవడంతో పార్వతీదేవికి దిక్కుతోచలేదు. చివరకు పరమేశ్వరుడు భూలోకంలో ఉన్న విషయం తెలుసుకున్న పార్వతీదేవి భూలోకానికి చేరుకుంది. పార్వతీదేవిని చూసిన పరమేశ్వరుడు ఈ జొన్నవాడ  నేను వదిలిపెట్టను కనుక నువ్వు కూడా ఇక్కడే ఉండి పూజలందుకుంటూ ఉండు అని పలికాడు. అందుకు అంగీకరించిన పార్వతీదేవి శ్రీకామాక్షితాయిగా కొలువుదీరినట్లు స్థలపురాణ కథనం. కాగా ప్రచా

Thungabhadra River: తుంగభద్ర నది

రామాయణ కాలంలో తుంగభద్రే పంపానదిగా పేరుపొందింది. ఇది కృష్ణా నదికి ముఖ్యమైన ఉపనది. కర్ణాటకలోని పడమటి కనుమలలో తుంగ, భద్ర అనే రెండు నదులు జన్మించి ఒకటిగా ప్రవహించి కృష్ణానదిలో కలుస్తాయి. దక్షిణ భారతదేశ మధ్యయుగ చరిత్రలో స్వర్ణయుగాన్ని స్థాపించిన విజయనగర సామ్రాజ్యం తుంగభద్ర ఒడ్డునే వెలిసింది. శృంగేరి, హంపి, మంత్రాలయం లాంటి పుణ్యక్షేత్రాలు ఈ నది ఒడ్డున వెలిశాయి. తుంగభద్ర ప్రస్థానం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా కూడ్లి వద్ద తుంగ, భద్ర నదుల సంగమస్థలం ఉంది. పశ్చిమ కనుమలలో పుట్టిన ఆ రెండు నదులూ కూడ్లి వద్దనే ఏకమౌతాయి. అక్కడి నుండి శృంగేరి పీఠం, హంపిల మీదుగా తుంగభద్ర కర్నూలు జిల్లా కౌతాలం మండలం మేళగనూరు వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తరువాత మంత్రాలయం. మీదుగా ప్రవహించి కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం మీదుగా, మహబూబ్నగర్ జిల్లాలోని అలంపూర్ (తెలంగాణ) వద్ద కృష్ణా నదిలో కలిసిపోతుంది. తుంగభద్రా నది మీద కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట వద్ద ఆనకట్ట నిర్మితమైంది. పురాణాల ప్రకారం తుంగభద్ర ఆవిర్భావ కథ వరాహావతార కాలంలో కనిపిస్తుంది. హిరణ్యాక్షుని సంహరించిన తరువాత శ్రీమహావిష్ణువు బాగా అలిసిపోయాడు. కర్ణాటకల