Swarna Gowri Vrat: స్వర్ణ గౌరీ వ్రతం
శ్రావణ శుద్ధ తదియనాడు ఈ వ్రతం ఆచరిస్తారు. అన్యోన్య దాంపత్య జీవనానికి ఈ వ్రతం చేస్తారు స్వర్ణగౌరీ వ్రతం పేరుతో పార్వతీ పరమేశ్వరులను అరాధిస్తారు.
ఈ స్వర్ణ గౌరీ వ్రతం గురించి సాక్షాత్తు పరమశివుడు పార్వతీ దేవికి చెప్పాడని పురాణ కథనం. ఈ వ్రతం ఆచరించడం వలన మహిళల అయిదో తనం కలకాలం నిలుస్తుందని నమ్ముతారు.
పూర్వం ఒక రాజు వేటకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా ఒక నది సమీపంలో ఉన్న చిన్న ఆశ్రమం వద్ద కొంతమంది మహిళలు గుమిగూడి ఉంటండటం చూశాడు. వాళ్ళ వద్దకు వెళ్లి విషయం ఏమిటని అడుగాడు. వాళ్ళు ఆ రాజుతో మేము స్వర్ణ గౌరీ వ్రతం ఆచరిస్తున్నామని, ఈ వ్రతం వల్ల ఆడవారి సౌభాగ్యం వందేళ్లు నిలుస్తుందని, వ్రతం చేసే మహిళ భర్త ఆయుష్షు పెరుగుతుందని చెబుతారు. మహారాజు వాళ్ళతో వ్రత విధానం గురించి తెలుసుకుని తిరిగి తన రాజమందిరానికి వెళ్లాడు. తన ఇద్దరు భార్యలకు స్వర్ణ గౌరీ వ్రతం గురించి చెబుతాడు. ఆ ఇద్దరిలో పెద్ద భార్య వ్రతం గురించి పట్టించుకోలేదు. కొట్టిపడేస్తుంది. చిన్న భార్య మాత్రం ఎంతో శ్రద్ధగా వ్రతం చేసుకుంటుంది. వ్రతం గురించి హేళనగా మాట్లాడిన పెద్ద భార్య కష్టాల పాలవుతుంది. భక్తిశ్రద్ధలతో వ్రతం చేసుకున్న చిన్న భార్య సుఖసంతోషాలతో హాయిగా ఉంటుంది.
- ఈ వ్రతం చేసుకునే మహిళలు తెల్లవారు జామున లేచి, ఇల్లంతా శుభ్రం చేసుకుని, తలంటు స్నానం చేసి, పూజా వేదికను ఏర్పాటు చేసి, పసుపు కుంకుమలు, పూలతో అలంకరించాలి. తరువాత గౌరీ దేవి పటాన్ని లేదా గౌరీ దేవి రూపాన్ని తయారుచేసుకుని పూజా వేదిక మీద ప్రతిష్టాపన చేయాలి.
- నూలు దారంతో తోరాన్ని తయారు చేసి దానికి పదమూడు ముడులు వేసి, పసుపు రాసి దాన్ని చేతికి కట్టుకుని, గౌరీదేవికి షోడశోపచార పూజ చేయాలి.
- గౌరీ దేవికి పదహారు రకాల పూలను, పదహారు రకాల పండ్లను సమర్పించాలి అమ్మవారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పిండివంటలను నైవేద్యంగా పెట్టాలి.
- తరువాత చేతిలో అక్షింతలు తీసుకుని, స్వర్ణగౌరీ వ్రత కథను చెప్పుకుని, ఆ అక్షింతలను తలపైన వేసుకోవాలి.
- పూజ విషయంలో మంగళ గౌరీదేవి వ్రత పూజనే స్వర్ణ గౌరీ పూజలో కూడా పాటించవచ్చు.
- ఈ స్వర్ణ గౌరీ నోము పెళ్ళెన వాళ్ళు పదహారు సంవత్సరాల పాటు చేసుకుంటే సకల శుభాలు చేకూరుతాయని శాస్త్ర వచనం.
Comments
Post a Comment