Skip to main content

Varad Vinayaka Temple: శ్రీ వరద వినాయక స్వామి ఆలయం - మహద్

అష్టవినాయక దేవాలయాల్లో నాలుగోది వరద వినాయక క్షేత్రం. ఇది మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా కర్జాత్ సమీపంలోని ఖలాపూర్ తాలూకాలో ఉన్న మహ్ద్ గ్రామంలో ఉంది. ఇది స్వామివారు  స్వయంభు. 

పూర్వం ఈ ప్రాంతాన్ని పరిపాలించే రుక్మాంగదుడు అనే రాజు వేటకై వెళ్లి అలసిపోయి దాహము తీర్చుకొనుటకు వాచకవి అనే ముని ఆశ్రమమునకు వెళ్లెను. ఆ సమయంలో మునీశ్వరుడు నదీ స్నానానికి వెళ్తూ, తాను తిరిగి వచ్చే వరకు రాజును ఆశ్రమంలోనే కూర్చోమని చెప్పి వెళ్తాడు.

ముని పత్ని ముకుంద ఆశ్రమంలో కూర్చుని ఉన్న రుక్మాంగదుని చూసి మోహిస్తుంది. రుక్మాంగదుడు మహా శీలవంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు. ముని పత్ని కోర్కెను అతను సున్నితంగా తిరస్కరిస్తాడు. అందుకు ముని పత్ని కోపించి, అతనిని కుష్టు రోగివి కమ్మని శపిస్తుంది. శాపగ్రస్తుడైన రుక్మాంగదుడు కుష్టు రోగ నివారణకై నారద మునీంద్రుని ఉపదేశానుసారం, గణపతిని ధ్యానించి, పూజించి, రోగ విముక్తుడవుతాడు.

ఇక్కడ ముని పత్నియైన ముకుందకు, రుక్మాంగదుని శపించినా కూడా అతనిపై మోహము వీడలేదు. ఇది గ్రహించిన ఇంద్రుడు రుక్మాంగదుని రూపంలో వచ్చి ముకుంద కోర్కెను తీరుస్తాడు. ఫలితంగా ముకుంద ఒక మగ బిడ్డకు జన్మ ఇస్తుంది. ఆ బాలునికి వాచకవి ముని "గృత్స్నమదుడు' అని నామకరణము చేసెను. గృత్స్నమదుడు ముని బాలకుడులా పెరిగి పెద్దవాడవుతాడు. ఒకనాడు అత్రి, విశ్వామిత్రుడు సహా ఇతర మునులతో గృత్స్నమదుడు ఆధ్యాత్మిక వాగ్వివాదమునకు దిగగా, వారు 'నీవు ఋషి పుత్రుడవుకావు, రుక్మాంగద రాజ పుత్రుడవు కాబట్టి నీవు ఎన్నటికీ మాతో సరి సమానం కాలేవు అని అవమానిస్తారు.

గృత్స్నమదుడు చింతాక్రాంతుడై తన తల్లియైన ముకుందను నిజము చెప్పమని అడుగగా ఆమె గృత్స్నమదుడు, రుక్మాంగద మహారాజు పుత్రుడే అని నిజం చెబుతుంది. అప్పుడు గృత్స్నమదుడు కోపగించి తన తల్లిని ముళ్ల పల్లు గల చెట్టుగా మారి అందరితో తిరస్కరింపబడుదువు గాక! అని శపిస్తాడు. ఆమె కూడా తన కుమారుని త్రిలోకాలకూ కంటకుడైన వాడూ, మహా బలపరాక్రమాలు కలిగిన రాక్షసుని కుమారుడుగా జన్మిస్తాడని ప్రతి శాపమిస్తుంది.

అంతలో ఆకాశవాణి గృత్స్నమదుడు ఇంద్రుని పుత్రుడని పలికెను. ఆ సమాచారం విని తల్లి, కుమారుడు ఆశ్చర్యపోతారు.

గృత్స్నమదుడు తన పరిస్థితికి చింతించి, పుష్పక వనానికి పోయి, కేవలం వాయువును భక్షించుచు వేయి సంవత్సరాలు విఘ్నేశ్వరుని ధ్యానిస్తూ ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి వినాయకుడు ప్రత్యక్షమై గృత్స్నమదుడు గొప్ప వేద బ్రాహ్మణుడవుగా, ద్రష్టగా కీర్తిని సంపాదిస్తాడని వరము ప్రసాదిస్తాడు. గృత్స్నమదుడు సంతోషించి, వినాయకుని అక్కడే వెలసి వాడ వినాయకుడిగా భక్తుల కోర్కెలను తీర్చమని కోరగా వినాయకుడు అంగీకరించెను.

తరువాత గృత్స్నమదుడు వినాయకునికి ఆలయమును నిర్మించి వినాయక మూర్తిని అందులో ప్రతిష్ఠ చేస్తాడు. ఈ ఆలయంలో వినాయకుని విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది. వినాయకుని తొండం ఎడమ వైపునకు తిరిగి ఉంటుంది. ఈ ఆలయంలో మూషిక, నవగ్రహ దేవతలు, శివలింగ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆలయానికి నలువైపులా నాలుగు ఏనుగు విగ్రహాలు ఉంటాయి.

వరద వినాయకుని ఆలయంలో మాఘ చతుర్థి సందర్భంగా జరిగే ప్రత్యేక పూజలో పాల్గొని ప్రసాదంగా స్వీకరించిన కొబ్బరికాయను సేవిస్తే పుత్ర సంతానం కలుగుతుందని చెబుతారు. ఈ సమయంలో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. శ్రీ గణేశ పురాణము ప్రకారం ఈ కథను విన్నవారు, చదివినవారు సకల అభీష్టములను పొంది, గణేశానుగ్రహమువలన మోక్షమును పొందుతారని తెలుస్తోంది.

ఉదయం 5.30 నుండి రాత్రి 9.00 వరకు 

ముంబై నుండి 63 కి.మీ పూణే నుండి 85 కి.మీ దూరంలో వుంది ఈ ఆలయం 

Comments

Popular posts from this blog

Kojagara Purnima: కోజాగరి పూర్ణిమ

ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్ష పూర్ణిమ కోజాగరి పూర్ణిమ. ఈనాడు ఆచరించే వ్రతానికి కోజాగరి పూర్ణిమవ్రతం, కోజాగరి వ్రతం అని పేర్లు. శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రియమైన ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల దారిద్ర్యాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు, సకల సంపదలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. ఆశ్వయుజ పూర్ణిమనాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని శిరస్నానం చేసి శ్రీమహాలక్ష్మీదేవిని పూజించాలి. తిరిగి సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత మరాలా లక్ష్మీ దేవినే పూజించి పాలు, పంచదార, ఏలకుల పొడి, కుంకుమపువ్వు వేసి వండిన క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించి దానిని తీసుకువెళ్లి ఆరుబయట వెన్నెలలో కొద్దిసేపు ఉంచాలి. తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ వ్రతంలో రాత్రి జాగరణ చేయాలని నియమం. జాగరణ సమయంలో పాచికలు లేదా గవ్వలను ఆడుతూ గడపలెను. ఆశ్వయుజ పూర్ణిమనాడు రాత్రి లక్ష్మీదేవి భూలోకంలో తిరుగుతూ ఎవరైతే జాగరణ చేస్తూ ఉంటారో వారికి సర్వసంపదలను ప్రసాదిస్తుందని కథనం. ఈ విధంగా జాగరణ చేసి మరునాడు పునఃపూజ చేసి వ్రతాన్ని ముగించాలి. ఈ విధంగా కోజాగరి పూర్ణిమను జరుపుకోవడం వల్ల లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు లభిస్తాయి. పూర్వం ఈ వ్

Dwaraka Tirumala Brahmotsavam: శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు 2024 తేదీలు - ద్వారకా తిరుమల

ద్వారకాతిరుమలలో  ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. స్వయంభువ మూర్తి వైశాఖమాసంలో వెలిసినందువల్ల ఒకసారి.... ఆశ్వయుజ మాసంలో రామానుజులు ప్రతిష్ఠ చేసినందువల్ల రెండోసారి బ్రహ్మోత్సవం జరుగుతుంది. రెండు బ్రహ్మోత్సవాల్లోనూ శ్రీస్వామివారికి, అమ్మవారికి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. 2024 తేదీలు  అక్టోబరు 13 - గజ వాహన సేవ అక్టోబరు 14 - ధ్వజారోహణ, శేష వాహన సేవ  అక్టోబరు 16 - సూర్యప్రభ వాహన సేవ, ఎదురుకోలు  అక్టోబరు 17 - తిరు కల్యాణ మహోత్సవం, గరుడ వాహన సేవ అక్టోబరు 18 - రథోత్సవం  అక్టోబరు 19 - చక్రవారి, ధ్వజావరోహణం  అక్టోబరు 20 - ద్వాదశ కోవెల ప్రదక్షిణ, పుష్పయాగం, పవళింపు సేవ 

Karthika Masam: కార్తీకమాసం ఈ నెలరోజులూ ఏం చేయాలి - ఏం చేయకూడదు

  కృతయుగంతో సమానమైన యుగం, వేదాలకు సమానమైన శాస్త్రం, గంగకు సమానమైన నది, కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. కార్తీక మాసం శివుడికి, మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. కార్తీక పురాణంలో కార్తీక సోమవారం,  జ్వాలాతోరణం  మహాశివుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే  బలి పాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువు  ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తాయి. కార్తీక పురాణం లో కూడా మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుడి ప్రాముఖ్యతను, ఆఖరి 15 అధ్యాయాలు శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తాయి.  కార్తీక మాసంలో ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు స్నానం కార్తీక మాసంలో సూర్యుడు తులా రాశిలో ఉండటం వల్ల నదిలో నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం ఆచరించడం వల్ల శరీరానికి శక్తి కలిగి ఆరోగ్యంగా ఉంటారు. పురాణాల పరంగా కార్తీక నెలరోజులూ సూర్యోదయానికి ముందు నదీస్నానం చేస్తే సకల పాపాలు నశిస్తాయని అంటారు. దీపం ‘దీపం జ్యోతి పరబ్రహ్మం.. దీప జ్యోతి జనార్దన.. దీపో మేహరతు పాపం.. సంధ్యాదీపం నమోస్తుతే!’.దీపమే పరబ్రహ్మం. దీపంలో లక్ష్మీ దేవి ఉందనీ.. దీపం నుంచి వచ్చే తేజస్సులో బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు ఉన్నారనీ పురాణాలు చెబుతున్నాయి. అజ్ఞానం అనే అం

Dasara: దసరా, విజయదశమి

  ఆశ్వయుజ శుద్ధ దశమి విజయదశమిగా చెప్పబడుతోంది. దీనికే అపరాజిత దశమి, దసరా అని కూడా పేర్లు. అపరాజిత అంటే పరాజయం లేనిది అని అర్థం.  ఈ రోజున ఏ పనిని ప్రారంభించినా అందులో తప్పక విజయం లభిస్తుంది.అందుకే యిది విజయదశమిగా ప్రసిద్ధి చెందింది.  దేవీనవరాత్రులలో కలశాన్ని స్థాపించి, దీక్షతో వున్నవారు ఈ దశమిరోజున ఉద్వాసన చెప్పాలి. ఇక 'దశాహరాత్రం' అనే సంస్కృత పదాలకి ఏర్పడ్డ “దశహరం" అనే వికృతి రూపంనుండి వచ్చిన పేరే దసరా. ఈ రోజున అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. ఈ రోజు సాయంత్రం జమ్మిచెట్టును దర్శించి పూజించాలి. సాధారణంగా గ్రామాలలో సామూహికంగా ఈ శమీపూజ చేస్తుంటారు. ఈ శమీపూజ చేయడం వల్ల అనుకున్న పనులలో 'విజయం' తప్పక లభిస్తుందంటారు. విజయదశమి రోజున ప్రత్యేకంగా విజయకాలాన్ని కూడా పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రవణానక్షత్రం, దశమి తిధి వున్న విజయదశమి రోజున సంధ్యాకాలం దాటిన తర్వాత వుండే సమయాల్ని పురాణాలు విజయకాలమని పేర్కొంటున్నాయి. ఒకవేళ శ్రవణం నక్షత్రం లేకపోయినా దశమి తిథిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని దాన్ని విజయముహూర్తంగా భావించాలని స్కాందపురాణం చెబుతోంది. ఈ సమయంలో అ

Tula Sankranti: తులా సంక్రాంతి

సూర్యుడు ప్రతి నెలా ఒక్కో రాశిలో ప్రవేశిస్తుంటాడు. అక్టోబర్ నెలలో సూర్యుడు కన్యారాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. తులా సంక్రమణం జరిగిన నెల రోజులు పరమ పవిత్రంగా, శుభకరంగా భావిస్తారు. ఈ మాసంలో పగటికాలం తగ్గుతూ, రాత్రి కాలం పెరుగుతూ వస్తుంది. తులా సంక్రమణం రోజు నదీ స్నానం చేయడం శ్రేష్ఠం. అందులోనూ కావేరీ నదిలో స్నానం చేస్తే ఇంకా మంచిది. తులా సంక్రాంతిని గర్భాన సంక్రాంతి అని కూడా పిలుస్తారు.ఒక మహిళ తన బిడ్డకు జన్మనిచ్చిన గర్వంతో సంతోషించినట్లు, రైతులు తమ వరి పొలాల్లో పండించిన పంటకు, సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే తులా సంక్రాంతిని గర్భాన సంక్రాంతి అని కూడా పిలుస్తారు. ప్రత్యేకంగా ఒడిశా, కర్ణాటకలలో తులా సంక్రమణం విశేషంగా జరుపుకుంటారు. తులా సంక్రమణం రోజున లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తే ఆ సిరుల తల్లి అనుగ్రహంతో ఏడాది పొడవునా పంటలు బాగా పండి ఆహారానికి కొరత ఉండదని రైతుల విశ్వాసం. ఈ పర్వదినాన రైతుల కుటుంబాలు లక్ష్మీదేవికి గోధుమ ధాన్యాలు, కూరగాయల మొక్కల కొమ్మలతో పాటు తాజా వరి ధాన్యాలు, తాటి కాయలు, పసుపు, కుంకుమ, గంధం, గాజులు లాంటి మంగళ ద్రవ్యాలను సమర్పించి పంటల

Human Duties: మానవ ధర్మములు

1. ఉదయం నిద్రనుండి లేచినపుడు కుడి ప్రక్కకు తిరిగి లేవండి ఆరోగ్యం. 2. లేచిన వెంటనే రెండు అరచేతులు చూస్తూ॥ కరాగ్రే వసతేలక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేస్థితే గౌరి ప్రభాతే కరదర్శనం" అని అనుకోండి. 3. కుడికాలు మంచంమీద నుండి క్రింద పెడుతూ “సముద్ర వసనేదేవి పర్వతస్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శక్షమస్వమే” అని భూమాతకు నమస్కరించండి 4. లేచిన వెంటనే కప్పుకున్న దుప్పటిని, ప్రక్క బట్టలను అన్నింటినీ చక్కగా మడతపెట్టండి. తదుపరి కాలకృత్యాలు పూర్తి చేయండి. 5. ఉదయాన్నే ముందురోజు రాత్రి రాగిపాత్రలో పోసిఉంచిన నీరు త్రాగండి. 6. వ్యాయామం (నడక) కనీసం ఉదయం 9 ని॥ల నడవండి. 7. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి సర్మడే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అనుకుంటూ చన్నీటి స్నానం చేయండి. 8. సూర్యునకు ఎదురుగా గాని, నడుస్తూగాని దంతధావన చేయరాదు. 9. మూత్రవిసర్జన సూర్య, చంద్రులకు ఎదురుగా చేయరాదు. 10. స్నానానికి చన్నీటి స్నానం ఉత్తమమైనది. 11. తెల్లవారు ఝామున 4-5 గంటల మధ్య చేసే స్నానం ఋషి స్నానం 5-6 గంటల మధ్య చేసే స్నానం దైవ స్నానం 6-7 గంటల మధ్య చేసే స్నానం మానవ స్నానం 7-8 గంటల మధ్య చేసే స్నానం రాక్షస స్నానం 12. చన్

Karthika Masam: కార్తిక మాసంలో తప్పకుండా చేయాల్సిన పనులేవి?

  సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. కార్తికమాసంలో చంద్రకిరణాలు సోకిన నీటితో స్నానం చేయడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది. నదీస్నానం ఉత్తమం. ఆరుబయట చంద్రకిరణాలు సోకిన నీటితో అయినా స్నానం చేయవచ్చు. అనారోగ్య కారణాల వల్ల స్నానం చేయడం కుదరకపోతే శివుణ్ణి మనసులోనే స్మరించి మానసస్నానం అయినా చేయాలి. దేవుని వద్ద దీపం వెలిగించాలి. కార్తికమాసంలోనే కాకుండా ఏడాది పొడవునా దేవుని వద్ద రెండుపూటలా దీపం వెలిగించడం ఉత్తమం. కార్తికంలో దీపారాధన చేస్తే ఏడాది పొడవునా చేసిన ఫలితం లభిస్తుంది.  కార్తిక పౌర్ణమినాడైనా దీపారాధన తప్పనిసరిగా చేయాలి.  ఉన్నంతలో లేనివారికి దానం చేయాలి. మానవసేవయే మాధవసేవగా భావించాలి. పవిత్రమాసాల్లో చేసిన దానాలకు రెట్టింపు ఫలితం వస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. కార్తిక పురాణంలో చెప్పిన విశేషాలను వినాలి,స్మరించుకోవాలి.   కార్తికంలో శివునికి ప్రధానంగా లక్షమారేడు దళాలతో సమూహంగా పూజ చేస్తారు. అలాగే విష్ణుమూర్తిని కార్తిక దామోదరునిగా పూజిస్తారు. శివకేశవులిద్దరికీ ఇది ప్రీతికరమైన మాసం. పెద్ద ఉసిరి, తులసి, మామిడి, మారేడు, జమ్మి మొదలైన దేవవృక్షాలున్న వనంలో భక్తిశ్రద్ధలతో సామూహిక

Aswayuja Purnima: ఆశ్వయుజ పూర్ణిమ, కౌముది పూర్ణిమ

  ఆశ్వయుజ పూర్ణిమ నాడు చంద్రుడు అశ్వినీ నక్షత్రంతో కలిసి ఉంటాడు.సౌర మానంలో దీన్నే తులాపూర్ణిమ అంటారు. ఈ తులామాసంలో జగన్మాతను ఆరాధించాలి. ఈ రోజున అధికమైన కాంతి కలిగిన వెన్నల ఉంటుంది.అందుకే దీనిని కౌముది పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు ధ్యానం చేస్తే  సాధకుని మనస్సు సంకల్ప వికల్పాలకు అతీతమవుతుంది. శివశక్తి సామరస్యాన్ని దర్శించే సామర్ధ్యం పెంపొందుతుంది. ఈ రోజున కౌముద్యుత్నవము, అక్షక్రీడ కోజాగర్తి వ్రతము. లక్ష్మీపూజ, ఇంద్రపూజ, కుబేరపూజ, చంద్ర పూజ చేయాలి. లక్ష్మీ, కుబేరుడు, ఇంద్రులను రాత్రి సమయంలో పూజిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి. ఈ రోజు లక్ష్మి అనుగ్రహం కోసం గవ్వలాట(అక్ష క్రీడ) ఆదుకోవాలి. జాగరణ వ్రతం చేయాలి, జాగరణలో వున్నవారిని లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఆవు పాలతో ఆరుబయట వెన్నెల్లో క్షీరాన్నం తయారుచేస్తారు.  ప్రకాశవంతమైన చంద్రుని అమృత కిరణాలు ఆ పాయసంలోకి నేరుగా ప్రసరిస్తాయి. దానిని లక్ష్మీదేవికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. దీనివల్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వృద్ధి పొందుతాయి.  ఆశ్వయుజ పూర్ణిమ నాడు గొంతెమ్మరూపంలో ఉన్న కుంతీదేవిని ఆరాధించే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది.  ఈ రోజున దానం

Karthika Masam: కార్తీకమాస మహత్యం (స్కంద పురాణం)

  దీపారాధన  కార్తీకమాసంలో శివాలయ గోపురంలో, ద్వారం దగ్గర, శిఖరం మీద శివలింగం సన్నిధిలో దీపారాధన చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి. ఎవరైతే కార్తీక మాసంలో ఆవునేతితో గానీ, నువ్వుల నూనెతో గానీ విప్పనూనెతో గానీ, నారింజనూనెతో గానీ శివాలయంలో భక్తిగా దీపారాధన చేస్తారో వారు సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందుతారు. కేవలం ఆముదంతో కార్తీక దీపాన్ని వెలిగించినా అఖండమైన పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో యోగ్యుడైన విప్రుడికి దక్షిణతో సహా దీపదానం చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుంది. వన భోజనం  కార్తీకమాసంలో చేసే వనభోజనం చాలా విశేషమైన ఫలితాన్నిస్తుంది. ఎన్నో రకాల  వృక్షాలతో వున్న వనంలోకి వెళ్ళాలి. అక్కడ ఉసిరి చెట్టు తప్పకుండా ఉండాలి. ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామాన్ని ఉంచి గంధపుష్పాక్షతలతో యథావిధిగా పూజించాలి.  ఆ తరువాత శక్తికొద్దీ విప్రుల్ని దక్షిణ తాంబూలాలతో తగిన విధంగా సత్కరించి తరువాత భోజనం చేయాలి. ఈ విధంగా శాస్త్ర బద్ధంగా కార్తీకమాస వనభోజనాన్ని చేస్తే సకల పాపాలూ నశించి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది గీతాపారాయణం కార్తీకమాసంలో శ్రీహరి సన్నిధిలో భగవద్గీతని పారాయణ చేస్తే అనంతమైన పుణ్యం కలుగుతుంది. కార్తీకంలో భగవద్గీతలోన

Jonnawada Temple: శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం - జొన్నవాడ

  శ్రీ పొట్టిశ్రీ రాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళ్లెం మండలం జొన్నవాడ గ్రామంలో పవిత్ర పెన్నానధి తీరాన ఈ ఆలయం కొలువైంది.  త్రేతాయుగంలో కశ్యపమహర్షి ఈ ప్రాంతంలో యజ్ఞం చేసినట్లు కథనం. కశ్యప మహర్షి యజ్ఞవాటిక కనుక ఆ అర్థం వచ్చే జన్నవాడ అనే పేరు ఈ ప్రాంతానికి ఏర్పడింది. అది కాలక్రమంలో జొన్నవాడ అయినట్లు స్థలపురాణం వెల్లడిస్తోంది. స్థలపురాణం పూర్వం కశ్యపమహర్షి వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ పెన్నానది తీరంలోని వేదాద్రికి చేరుకొని ఆ ప్రాంతంలో ఒక యజ్ఞాన్ని చేయదలచి యజ్ఞ వాటికను నిర్మించుకుని యజ్ఞం చేయడం ప్రారంభించాడు.ఈ విధంగా కశ్యపమహర్షి యజ్ఞం చేయడం పూర్తికాగాన ఆ యజ్ఞవాటిక నుంచి పరమేశ్వరుడు ఉద్భవించి క్రీ మల్లికార్జునస్వామిగా పూజలందుకున్నాడు. కైలాసంలో పరమ శివుడు లేకపోవడంతో పార్వతీదేవికి దిక్కుతోచలేదు. చివరకు పరమేశ్వరుడు భూలోకంలో ఉన్న విషయం తెలుసుకున్న పార్వతీదేవి భూలోకానికి చేరుకుంది. పార్వతీదేవిని చూసిన పరమేశ్వరుడు ఈ జొన్నవాడ  నేను వదిలిపెట్టను కనుక నువ్వు కూడా ఇక్కడే ఉండి పూజలందుకుంటూ ఉండు అని పలికాడు. అందుకు అంగీకరించిన పార్వతీదేవి శ్రీకామాక్షితాయిగా కొలువుదీరినట్లు స్థలపురాణ కథనం. కాగా ప్రచా