Konda Bitragunta Brahmotsavam 2025: శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - కొండ బిట్రగుంట - HINDU DHARMAM

Latest Posts

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, March 12, 2025

Konda Bitragunta Brahmotsavam 2025: శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - కొండ బిట్రగుంట

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన  కొండబిట్రగుంట బిలకూట క్షేత్రంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామికి వైఖానస ఆగమశాస్త్రానుసారం ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఫాల్గుణ పూర్ణిమ రోజున స్వామివారికి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. తదుపరి రథోత్సవం నేత్రపర్వంగా జరిపిస్తారు. భక్తుల పాలిట ప్రసన్నుడిగా, ఆపద మొక్కులవాడిగా పేరొందిన స్వామివారిని ఉత్సవాల్లో దర్శించి, తరించేందుకు లక్షలాది మందికి పైగా భక్తులు తరలి వస్తారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన గరుడ సేవ, మొక్కుబడులు, కళ్యాణోత్సవం రోజుల్లో బిలకూట క్షేత్రం భక్తజన సంద్రంగా మారుతుంది. 

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు స్వామివారికి వరసగా జరిగే క్రతువులు ఈ విధంగా ఉంటాయి. గిరిప్రదక్షిణ, అంకురార్పణతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. ధ్వజారోహణ (కొడిముద్దలు), శేషవాహన సేవ, హనుమంతసేవ, మోహినీ ఉత్సవం, గరుడసేవ, స్వామివారికి మొక్కుబడులు, తెప్పోత్సవం, గజ వాహనసేవ, కళ్యాణోత్సవం, రథోత్సవం, అశ్వవాహన సేవ, పుష్పయాగం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏకాంతసేవతో ఉత్సవాలు పూర్తవుతాయి. ప్రతీ రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి పర్యటకులను ఆకట్టుకుంటాయి.

స్థల పురాణం ప్రకారం సప్త ఋషుల కోపానికి గురైన నారదమహర్షి శాపవిమోచనం కోసం ఈ క్షేత్రంపై గుహ ఏర్పాటు చేసుకుని తపస్సు చేశాడు. ఈ విషయం శాసనాల్లో కూడా ఉంది. గజేంద్రున్ని రక్షించే తొందరలో శంఖుచక్రాలు స్థానాలు మారినా పట్టించుకోకుండా పరుగున వెళ్లిన మహా విష్ణువు, తిరుగు ప్రయాణంలో నారద మహర్షి తపస్సుకు మెచ్చి ప్రసన్న వదనంతో ప్రత్యక్షమయ్యాడు. శాప విమోచనం పొందిన నారద మహర్షి కోరికమేరకు విష్ణుమూర్తి ప్రసన్న వెంకటేశ్వరుని రూపంలో అంగుష్ట ప్రమాణంలో కొండపై కొలువయ్యేందుకు అంగీకరించాడు. అనంతరం ప్రసన్నవెంకటేశ్వర స్వామి అవతారంలో విష్ణు రూపాన్ని నారదమహ చేశారని ప్రతీతి. నారదమహర్షి ఇక్కడ అంగుష్ట ప్రతిష్ఠఇక్కడ స్వామివారికి జరిగే బ్రహోత్సవాల్లో చక్రస్నానం ప్రత్యేకతగా నిలుస్తుంది. బ్రహోత్సవాల సమయంలో ప్రసన్నంగా ఉండే స్వామివారిని దర్శించుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. వాహన సేవల్లో పాల్గొన్న భక్తుల కోరికలు నెరవేరుతాయి. గరుడసేవలో పాల్గొంటే మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు.భక్తులకోసం పెద్దపెద్ద చలువ పందిర్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. రాత్రి వేళల్లో విద్యుద్దీపాల అలంకరణతో స్వామివారి కొండ దేదీప్యంగా వెలిగిపోతుంది. 

బిలకూట క్షేత్రం పై వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి 09 నుండి ప్రారంభం కానున్నాయి 

సేవల వివరాలు 

మార్చి 09 - గిరిప్రదక్షిణ, అంకురార్పణ

మార్చి  10 - తిరుమంజనం, ధ్వజారోహణ, కొడిముద్దలు , శేష వాహన సేవ

మార్చి  11 - సుప్రభాత సేవ, హనుమంత వాహన సేవ

మార్చి  12 - మోహిని అవతారం, గరుడ వాహన సేవ

మార్చి  13 - చందన అలంకారం, తెప్పోత్సవం, గజ వాహన సేవ 

మార్చి  14 - కల్యాణ మహోత్సవం, అశ్వ వాహన సేవ, ధ్వజ అవరోహణ, పూర్ణాహుతి 

మార్చి  15 - పుష్పయాగం, ఏకాంత సేవ 

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages