Posts

Showing posts from June, 2025

Jyestha Amavasya: జ్యేష్ఠ అమావాస్య

జ్యేష్ఠ మాసంలో లో కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యను  జ్యేష్ఠ అమావాస్య అంటారు. జ్యేష్ఠ అమావాస్య పూర్వీకులను స్మరించుకోవడానికి, గౌరవించుకోవడానికి, వారి నుండి ఆశీస్సులు పొందడానికి మంచి రోజు. పూజలు, దానం మొదలైన అనేక కార్యక్రమాలతో పాటు పిండ ప్రదానం లేదా తర్పణం ఇవ్వడం జ్యేష్ఠ అమావాస్య నాడు పితృదేవతల పట్ల గౌరవాన్ని ప్రదర్శించడానికి చేస్తారు. ఇలా చేయడం వలన పితృదేవతలు ప్రశాంతంగా ఉండగలుగుతారు. జ్యేష్ఠ అమావాస్య రోజు శివుడిని పూజించడం వలన ప్రతికూలతలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతుంది. ఈరోజున ఉపమా కలుగుతుంది. ఉపవాసం ఆత్మ శుద్ధి కలుగుతుంది. కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున పవిత్ర నదులు, జలాశయాలలో స్నానం చేయాలి. ఇలా చేస్తే పాపాలు తొలగిపోతాయి, జ్యేష్ఠ అమావాస్య రోజున వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం, ఆనందకరమైన వైవాహిక జీవితం గడపడానికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారు. పెళ్లికాని అమ్మాయిలు కూడా తాము కోరుకున్న వరుడిని పొందడానికి ఈ రోజున రావి చెట్టును పూజించడం, సావిత్రి కథను చదువుతారు లేదా వింటారు. ఈ రోజున పవిత్ర నది లేదా ఆలయ ప్రాంతాన సంధ్యా సమయంలో దీప దానం చేయాలి. రావి చెట్టు ముందు దీపం...

Angaraka Chaturdasi: కృష్ణ అంగారక చతుర్దశి

బహుళ పక్షంలో వచ్చే  చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దానిని కృష్ణ అంగారక చతుర్దశిగా వ్యవహరిస్తారు. ఈ తిథికి సూర్యగ్రహణంతో సమానమైన శక్తి ఉంటుంది. సూర్యగ్రహణం రోజు స్నానం, దానం, పితృ కార్యాలు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ తిథి రోజున స్నానం, దానం చేస్తే అలాంటి ఫలితాలే కలుగుతాయని పంచాంగకర్తలు చెబుతున్నారు. కృష్ణ అంగారక చతుర్దశి రోజు రుణ విమోచన అంగారక స్తోత్రం చదివితే తీవ్రమైన అప్పులతో బాధపడుతున్నవారు ఆ బాధలనుండి ఉపశమనం పొందుతారు. చదవలేనివారు ఎవరితోనైన చదివించుకొని విన్నాకూడా ఎంత పెద్ద అప్పులైనా తీరిపోతాయి. “ఓం అం అంగారకాయ నమః" అనే మంత్రాన్ని స్మరించుకున్నా మంచి ఫలితాలుంటాయి. ఇవి పాటించినా శుభమే : కృష్ణ అంగారక చతుర్దశి రోజు స్నానం చేసే నీటిలో గంగాజలం కలిపి చేస్తే మంచిది. గంగాజలం లేకపోతే స్నానం చేసేటప్పుడు గంగను ఆవాహన చేసి స్నానం చేసినా మంచిదే. దానం చేసినా మంచి మంచి ఫలితాలుంటాయి. గ్రహ దోష తీవ్రత కూడా తగ్గుతుంది. ఆరోజున గోధుమలను దానం చేస్తే మరీ మంచిది. ఈ తిథి రోజున యమధర్మరాజుకు తర్పణం ఇచ్చినా మంచి జరుగుతుంది. సూర్యునికైనా తర్పణం ఇవ్వవచ్చు. ఈ రోజు కందులు దానం ఇస్తే సొంతింటి కల నెర...

Skanda Panchami: స్కంద పంచమి

Image
ఆషాడ శుద్ధ పంచమి రోజున స్కంద పంచమి జరుపుకుంటారు.  దేవతలు కుమారస్వామిని దేవసేనానిగా చేసింది ఈ పంచమి రోజునే  ఈ పంచమి తరువాత షష్ఠి కూడా కుమార షష్ఠిగా పిలవబడుతుంది. స్కందపంచమి రోజున ఉపవాసం ఉంది కుమార షష్ఠి రోజున కుమారస్వామిని షోడశోపచారాలతో పూజించాలి. ఈ రోజున బ్రహ్మచారికి భోజనం పెట్టి వస్త్రదానం చేయడం మంచిది. స్కంద పంచమి రోజున ఉపవాసం ఉండి, కుమారషష్టి రోజున స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ రెండు రోజుల్లో వల్లీదేవసేన సమేతంగా ఉన్నా స్వామి ఆలయానికి వెళ్లి వారిని దర్శించుకుంటే సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. ఈ రోజుల్లో స్వామికి అభిషేకం చేయించినా, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకున్నా కూడా ఆయన అనుగ్రహం లభిస్తుంది. వీలైతే దగ్గరలో ఉన్న నాగరాళ్లు లేదా పుట్ట దగ్గర చిమ్మిలి ప్రసాదాన్ని ఉంచి నమస్కరించినా మంచిదే. స్కందపంచమి, కుమారషష్టి రోజులలో కుమారస్వామిని ఆరాధిస్తే జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. సంపదలు రావాలన్నా ఈ రోజు స్వామిని పూజించాలి. కోర్టు లావాదేవీలలో విజయం సాధించాలన్నా, పరీక్షలలో మంచి మార్కులు రావాలన్నా ఈ స్కందపంచమి, షష్టి తిథులలో స్వామిని ఆరాధించాలి. 2025:...

Shrinkhala Devi Temple: శ్రీ శృంఖలాదేవి ఆలయం - ప్రద్యుమ్నం

ఈ చరాచర సృష్టికంతటికీ తల్లి అయిన ఆ జగన్మాత నిత్యం బాలింతరాలుగా నడికట్టుతో కొలువుదీరి, తన బిడ్డలను రక్షించే తల్లిగా పేరుపొందిన దేవి-'శృంఖలాదేవి', శృంఖలాదేవి కొలువుదీరిన దివ్యక్షేత్రం ‘ప్రద్యుమ్నం.’ ప్రద్యుమ్నం అష్టాదశ శక్తిపీఠాలలో మూడవది. అష్టాదశ శక్తులలో తృతీయశక్తి అయిన 'శృంఖలాదేవి' ఆలయం హుగ్లీ జిల్లాలోని 'పాండుపా' అనే గ్రామంలో వుంది. 'పాండుపా' కలకత్తా నగరం నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. పురాణగాధ ఇక్కడ శ్రీ శృంఖలాదేవి కొలువుదీరడానికి సంబంధించినపురాణ గాథలు, స్థలపురాణాలు అనేకం ప్రచారంలో వున్నాయి. త్రేతాయుగంలో 'ఋష్యశృంగ మహర్షి' శృంఖలాదేవిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. ఋష్యశృంగుడి తండ్రి విభాండకుడు. తల్లి చిత్రరేఖ, చిత్రరేఖ ఒక అప్సరస. ఒకనాడు ఇంద్రసభలో చిత్రరేఖ నాట్యం చేస్తున్న సమయంలో కొన్ని 'లేళ్ళు' సభామండపంలోకి వచ్చాయి. నాట్యం చేస్తూ ఉన్న చిత్రరేఖ వాటిని చూస్తూ తనను తాను మైమరచి ఇంద్రుడిని గురించి పట్టించుకోలేదు. దీనితో కోపోద్రిక్తుడైన ఇంద్రుడు చిత్రరేఖను ‘మృగి జన్మించు' అని శపించాడు. తేరుకున్న చిత్రరేఖ శాపవిమోచనమునకై ఇంద్రుడి...

Kolhapur Mahalaxmi Temple: శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం - కొల్హాపూర్

Image
శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కొల్హాపూర్ లోని ఒక శక్తి పీఠం. ఒకనాడు పాలసముద్రంలో విష్ణుమూర్తి శేషతల్పంపై శయనించి ఉండగా, శ్రీలక్ష్మి నారాయణుని పాదసేవ చేస్తోంది. ఆ సమయంలో భృగు మహర్షి వచ్చాడు. ఈ మహర్షికి అరికాలిలో కన్ను ఉంటుంది. ఇతనికి తాను అందరికంటే గొప్పవాడినని అహంకారం ఎక్కువ. పరధ్యానంలో ఉన్న శ్రీ మహావిష్ణువు భృగు మహర్షి రాకను గుర్తించలేదు. అందుకు ఆగ్రహించిన మహర్షి విష్ణుమూర్తి వక్షస్థలంపై తన పాదాన్ని ఉంచాడు. శ్రీమహావిష్ణువు వక్షస్థలం లక్ష్మీస్థానం అన్న సంగతి తెలిసిందే కదా! తన నివాస ప్రదేశాన్ని భృగు మహర్షి అవమానించడాన్ని కోపంతో అలిగి లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి భూలోకాన్నిచేరుకుంటుంది. భృగు మహర్షి గర్వాన్ని అణిచిన విష్ణువు తన వక్షస్థలంపై పాదంతో తన్నిన భృగు మహర్షిని శాంతింపజేయడానికి విష్ణువు ఆయనకు పాదసేవ చేస్తున్నట్లుగా నటిస్తూ ఋషి అరికాలిలో ఉన్న కన్ను నలిపివేసి మహర్షి గర్వాన్ని అణిచివేస్తాడు. వైకుంఠాన్ని వీడి భూలోకం చేరిన లక్ష్మీదేవి సహ్యాద్రి పర్వత ప్రాంతంలోని కొల్హాపూర్‌లో వెలిసిందని విష్ణు పురాణం, బ్రహ్మాండ పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. లక్ష్మీదేవికి ...

Yogini Ekadasi: యోగిని ఏకాదశి

Image
జ్యేష్ట బహుళ ఏకాదశికే యోగిని ఏకాదశి అని పేరు. ఈ ఏకాదశి మహిమ బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడింది. ఈ ఏకాదశి మహిమను శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు వివరించాడు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. భయాలు తొలగిపోయి దైర్యం సిద్ధిస్తుంది. కొన్ని వేలమంది బ్రాహ్మణులకు సంతర్పణ చేయగా వచ్చే ఫలం కేవలం ఈ యోగిని ఏకాదశి వ్రతం వలన కలుగుతుంది. ఇది మనిషి యొక్క సమస్తపాపాలను నశింపచేసి అమిత పుణ్యాన్ని చేకూరుస్తుంది. యోగిని ఏకాదశి మహిళ పురుష భేదం లేకుండా పిల్లలు, పెద్దలు అందరూ ఆచరించవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ వ్రతం ఆచరించడం వలన మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చునని శాస్త్రవచనం. యోగిని ఏకాదశి పూజా విధానం యోగిని ఏకాదశి రోజు సూర్యోదయానికి పూర్వమే తలారా స్నానం చేసి శుచియై పూజా మందిరం శుభ్రం చేసుకొని లక్ష్మీనారాయణుల విగ్రహాలకు కానీ చిత్రపటాలకు కానీ గంధం కుంకుమలతో బొట్లు పెట్టి సుందరంగా అలంకరించాలి. ఆవు నేతితో దీపారాధన చేయాలి. చామంతి, గులాబీ, మల్లెపూలతో లక్ష్మీనారాయణులను అర్చించాలి. ఏకాదశి పూజలో ముఖ్యంగా తులసి దళాలను సమర్పించాలి. తులసి లేని పూజ అసంపూర్ణం అవుతుంది. ఆవు నేతి...

Vat Savitri Vrat: వట సావిత్రి వ్రతం

Image
ఈ వ్రతాన్ని జ్యేష్ట పూర్ణిమ రోజు చేస్తారు. కొన్ని ప్రాంతాలలో త్రయోదశి నుండి ప్రారంభించి మూడు రోజుల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. జ్యేష్ట పౌర్ణమి రోజు చేయలేనివారు జ్యేష్ట అమావాస్య రోజు ఈ వ్రతాన్ని చేసుకుంటారు  ఈ వ్రతాన్ని ఆచరించేవారు ముందు రోజు ఉపవాసం ఉండాలి. తరువాత రోజు వేకువజామునే నిద్రలేచి, స్నానం చేసి గృహదేవత అర్చన చేసిన తరువాత సమీపంలోని వట వృక్షానికి చేరుకోవాలి. వట వృక్షం మొదలు వద్ద అలికి, ముగ్గులు పెట్టాలి సావిత్రి, సత్యవంతుల ప్రతిమలు, త్రిమూర్తుల ప్రతిమలు  పెట్టి అలంకారం చేయాలి. వ్రతం ముగిసిన తరువాత వటవృక్షానికి 108 ప్రదక్షిణాలు చేయాలి  ఇలా ప్రదక్షిణాలు చేసే సమయంలో వృక్షానికి నూలు దారం చుడుతూ ఉండాలి. ప్రదక్షిణాలు తరువాత త్రిమూర్తి స్వరూపమైన వృక్షానికి నమస్కరించి ముత్తైదువులకు వాయనం ఇచ్చి భోజనం పెట్టాలి.  పూర్వం అశ్వపతి, మాళవి దంపతులకు ‘సావిత్రి’ అనే కుమార్తె వుండేది. యుక్తవయస్కురాలెైన సావిత్రికి నీకు ఇష్టమైనవాడిని వరించమని తల్లిదండ్రులు అనుమతినిచ్చారు. రాజ్యం శత్రువులపాలు కావడంతో అరణ్యంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తోన్న ద్యుమత్సేనుడి కుమారుడెైన సత్య వంతు...

Jyestha Purnima: జ్యేష్ట పూర్ణిమ

Image
జ్యేష్ట మాసం శుక్ల పక్ష పౌర్ణమి విశిష్టమైన విశిష్టమైన రోజు. ఈ రోజుకు ప్రత్యేకత ఉంది. ఈ రోజున నదుల్లో స్నానం చేయడం, దానాలు చేయడం మంచిది. అంతేకాకుండా ఈ రోజు వట పూర్ణిమ ఉపవాసం కూడా పాటిస్తారు. జ్యేష్ఠ పూర్ణిమ అనేక శుభాలు చేకూరుస్తుందని శాస్త్ర వచనం. ఈ శుభ తిథిన కొన్ని పద్దతులు పాటిస్తే ఆనందంతో పాటు శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. అంతేకాకుండా లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా పొందవచ్చని జ్యోతిషశాస్త్రం పేర్కొంది. పౌర్ణమి రాత్రి మహాలక్ష్మీ, విష్ణువులను ఆరాధించాలి. అంతేకాకుండా రాత్రిపూట ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని విశ్వసిస్తారు. జ్యేష్ఠ పూర్ణిమను అదృష్ట తిథిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున లక్ష్మీ స్తోత్రాలు, కనకధార స్తోత్రాలు పఠించడం వలన సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. స్తోత్రాలు,మంత్రాలు పఠించడం ద్వారా లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది. సాయంత్రం లక్ష్మీదేవిని ధ్యానించడం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయి. ఆర్థిక పరమైన సమస్యలనుంచి బయటపడటానికి పౌర్ణమి తిథినాడు చంద్రోదయం తర్వాత ముడిపాలు, బియ్యం, చక్కెరను నీటిలో కలపి, అనంతర...

Snana Purnima: స్నాన పూర్ణిమ

Image
జ్యేష్ట పౌర్ణమి తిథి సందర్భంగా పూరీ జగన్నాథునికి వార్షిక స్నానోత్సవం జరుగతుంది. ఈ తిథి ఈ సంవత్సరం జూన్ 11 వ తేదీన వస్తుంది. రథయాత్రకు ముందు జరిగే ఈ ఉత్సవంలో భాగంగా శ్రీ మందిరం రత్న వేదిక నుంచి మూల విరాట్లు (సుదర్శనుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథుడు) ఒక్కోక్కటిగా బహిరంగ స్నాన మండపానికి తరలిస్తారు. దీనినే పొహండి కార్యక్రమం అంటారు. ఇది రెండురోజులపాటు జరుగుతుంది. మూల విరాట్లకు 108 కలశాలతో సుగంధ జలాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం గజానన అలంకారంతో ముస్తాబు చేస్తారు. అశేష భక్త జనానికి బహిరంగ వేదికపై దర్శనం ఇవ్వడం స్నానోత్సవ విశిష్టత. మహా రాష్ట్ర నుంచి 15వ శతాబ్దంలో విచ్చేసిన గణపతి భక్తుని అభీష్టం మేరకు ఏటా స్వామి గజానన అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నట్లు పండితులు చెబుతారు. అనంతరం తిరుగు పొహండి స్నాన మండపం నుంచి శ్రీ మందిరం లోనికి మూల విరాట్లను తరలిస్తారు. శ్రీజగన్నాథునికి జరిగే సేవలు పరిశీలిస్తే కొంత ఆశ్చర్యం కలుగుతుంటుంది. స్వామివారికి జరిగే కొన్ని క్రతువులు సామాన్య మానవులకు జరిగినట్టుగానే నిర్వహిస్తుంటారు. జగన్నాథుడు యాత్ర ప్రియుడు. ఈ యాత్రకు ముందు భారీగా స్నానం ఆచరించడంతో శారీరక ప...

Guru Moudyami: గురుమౌఢ్యమి

విశ్వావసునామ సంవత్సరంలో  గురుమౌఢ్యమి జూన్ 9 వ తేదీనుండి జూలై 9 వ తేదీ వరకు ఉంటుంది. అనగా జ్యేష్ఠ శుద్ధ త్రయోదశినుండి ఆషాఢ శుద్ధ చతుర్ధశి వరకు గురుమౌఢ్యమి ఉంటుంది. గ్రహాలు సూర్యునికి అతి దగ్గరగా ఉండే కాలాన్ని మౌఢ్యమి అంటారు. గురుగ్రహం సూర్యునికి దగ్గరగావుంటే గురుగ్రహం అంటారు. ఇది అన్ని గ్రహాలకు జరుగుతుంది. కాని జ్యోతిషశాస్త్రం మాత్రం గురు, శుక్ర గ్రహాల మౌఢ్యమిలను మాత్రమే దోషంగా పరిగణిస్తుంది. దీనిని వాడుక భాషలో మూఢం అంటారు. మౌఢ్యమి కాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు. అందువల్ల మౌఢ్య కాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రించినప్పటికంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి. మౌఢ్యమి అంటే చీకటి అని అర్థం. ఈ కాలం శుభకార్యాలకు పనికిరాదని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. మౌఢ్యమిలో చేయకూడనవి పెళ్ళిచూపులు, వివాహం, ఉపనయనం, గృహారంభం,గృహప్రవేశం, యజ్ఞాలు చేయుట, మంత్రానుష్టానం, విగ్రహా ప్రతిష్టలు, వ్రతాలు, నూతన వధువు ప్రవేశం, నూతన వాహనం కొనుట, బావులు, బోరింగులు, చెరువులు తవ్వటం, పుట్టువెంట్రుకలకు, వేదవిధ్యా ఆరంభం, చెవులు కుట్టించుట, నూతన వ్యాపార ఆరంభాలు మొదలగునవి చే...

Vengamamba Perantalu 2025: శ్రీ వెంగమాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు (పేరంటాలు) - 2025

Image
అమ్మవారి బ్రహ్మోత్సవాలు జూన్ నెలలో ప్రారంభం కానున్నాయి. ఈ ఆలయం నర్రవాడ గ్రామం నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో ఉంది  ప్రతి సంవత్సరం జ్యేష్ట మాసంలో పౌర్ణమి తరువాత వచ్చే ఆదివారం నుండి గురువారం వరకు అమ్మవారి పేరంటాలు జరుగుతాయి. టన్నుల కొద్దీ ఎండుకొబ్బరి అగ్నిగుండంలో వేయడం ప్రత్యేక ఆకర్షణ. ముఖ్యమైన తేదీలు 2023  : జూన్ 15 - నిలుపు, పసుపుదంచు కార్యక్రమం జూన్ 16 - రథోత్సవం జూన్ 17 - రథోత్సవం జూన్ 18 - కల్యాణోత్సవం (పగలు), పసుపు కుంకుమ ఉత్సవం ప్రదానోత్సవం(రాత్రి) జూన్ 19  - పొంగళ్లు, ఎడ్ల ప్రదర్శన జూన్ 20 - మొదటి గురువారం జులై 03 - రెండవ గురువారం (అమ్మవారి పదహారు రోజుల పండుగ) జులై 10 - మూడవ గురువారం జులై 17 - నాలుగవ గురువారం (నెల పొంగళ్ళు) జులై 24 - అయిదవ గురువారం

Eruvaka Punnami: ఏరువాక పున్నమి

Image
జ్యేష్ఠపౌర్ణమి ఏరువాక పున్నమిగా చెప్పబడుతోంది. ఈ ఏరువాక పున్నమి పూర్తిగా రైతుల పండుగ. ఈనాడు రైతులు ఉదయాన్నే ఎద్దులను కడిగి, వాటి కొమ్ములకు రంగులను పూసి వాటిని గంటలు, గజ్జెలతో అలంకరింప జేస్తారు. తరువాత ఎద్దులను కట్టివేసే గాడిని ధూప, దీప, నివేదనలతో పూజించి, ఎద్దులకు పొంగలిని పెడతారు. ఈనాటి సాయంకాలం నాగలిని ఎర్రమట్టి పట్టెలతో అలంకరించి, ఎద్దులను ఊరేగింపుగా పొలం వద్దకు తీసుకొని వెళ్ళి, దుక్కిని అంటే పొలం దున్నటాన్ని ప్రారంభిస్తారు. పొలం దున్నటానికి వెళ్ళేముందు ఊరి వాకిలిలో గోగునారతో చేసిన తోరణాన్ని కట్టి, దానిని చేరుకోలలతో కొడుతూ, ఎవరికి దొరికినంత నారపీచును వారు తీసుకుంటారు. ఈ విధంగా చేయటంవల్ల పశువులకు మేలు కలుగుతుందని రైతులు నమ్ముతారు. కాగా ఈ వ్యవసాయ ప్రారంభ పండుగను గురించి వ్రత గ్రంథాలలో చెప్పకపోవడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే వేదకాలంలోనే ఈ రైతుల పండుగ ఆచరణలో వుండేదని చెప్పేందుకు కొద్ది పాటి ఆధారాలున్నాయి. వర్ష ఋతువు ప్రారంభమైన వెంటనే పూజాదికాలతో రైతులు దుక్కిని ప్రారంభించేవారని ఋగ్వేదం  చెబుతోంది. విష్ణుపురాణంలో  కూడా ఈ రైతుల పండుగ సీతయజ్ఞంపేర పిలువబడేదని పేర్క...

Pavagada Shani Temple: శ్రీ శనీశ్వరుడి ఆలయం - పావగడ

Image
  ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులోని పావగడలో వెలిసిన శనీశ్వరాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. పావగడలో వెలసిన శనీశ్వరుని దర్శనం కోసం ప్రతిరోజు ఎంతోమంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో స్వామి వారిని దర్శనం చేసుకున్న భక్తులకు ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుందని, ఆగిపోయిన పనులు పూర్తవుతాయని విశ్వాసం. ఆలయ చరిత్ర పావగడను హొయసులు, మొఘలులు, మైసూర్ రాజులు ఇలా ఎందరో పాలించారు. సుమారు 400 సంవత్సరాల క్రితం ఈ ఊరికి ఒక పెద్ద కరువు సంభవించింది. ఆ కరువు నుంచి గట్టెక్కేందుకు ఆ ఊరి ప్రజలంతా కలిసి సమీపాన అరణ్యంలో ఉన్న సిద్ధులు, మునుల వద్దకు వెళ్లి తమ గోడు చెప్పుకున్నారు. అప్పుడు ఆ మునులు ఒక నల్లరాతిని తీసుకొని, శీతలాదేవి మహాబీజాక్షర యంత్రాన్ని రాశారు. అందులో అమ్మవారిని ఆవాహనం చేసి భూమిపై ప్రతిష్టించారు. తీరిన కరువు భూమిని కాపాడే ఆ తల్లి చల్లని చూపుల ఫలితంగా ఆ ఊర్లో వర్షాలు బాగా కురిసి కరువు కాటకాల నుంచి ప్రజలకు విముక్తి లభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చుట్టుపక్కల ఏ ఊరిలో కరువు వచ్చినా అమ్మవారి యంత్రాన్ని పూజించడం మొదలుపెట్టారు. అలాగే వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణ యాగాలు జరిపిస్తుంటారు. శనీశ్వరుని వ...

Jyestha Suddha Trayodashi: దౌర్భాగ్య నాశక త్రయోదశి

Image
జ్యేష్ఠ మాసంలో వచ్చే త్రయోదశినే దౌర్భాగ్య నాశక త్రయోదశి అంటారు. ఇది జ్యేష్ఠ పౌర్ణమికి ముందు వస్తుంది. ఈ సంవత్సరం ఈ తిథి జూన్ 9 వ తేదీన వస్తుంది. వివాహం కాకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, చెడు వ్యసనాలకు బానిస కావడం, మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితి బాగుండకపోవడంలాంటి వాటిని దౌర్భాగ్యాలని అంటారు. ఈ త్రయోదశినాడు కొన్ని నియమాలు పాటించడం వలన దౌర్భాగ్యాలు నాశనమైపోతాయి. కాబట్టే దీనిని దౌర్భాగ్య నాశన త్రయోదశి అంటారు. శివునికి అభిషేకాలు ఆర్థిక సమస్యలున్నవారు ఈ త్రయోదశినాడు శివాలయంలో శివలింగానికి పంచదారతో అభిషేకం చేయాలి. వివాహ సమస్యలున్నవారు చెరుకురసంతో అభిషేకం చేయాలి. సంతానంకానివారు తేనెతో అభిషేకం చేయాలి. అప్పుల బాధలు ఉన్నవారు పంచామృతాలతో అభిషేకం చేయాలి. శివాలయంలో ఈ త్రయోదశి రోజున జాగారం చేస్తే తప్పకుండా మానవులు ఎదుర్కునే అనేక సమస్యలు శీఘ్రంగా తొలగిపోతాయి. జాగారం చేయడం వీలుకానివారు ఈ రోజున శివాభిషేకాలు చేసుకొని ఉపవాసం పాటించినా మంచి ఫలితాలుంటాయి. లక్ష్మీదేవి ఆరాధన శివాభిషేకాలే కాకుండా జ్యేష్ట త్రయోదశి రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం వలన కూడా అనేక సమస్యలు తొలగిపోతాయి. శ్రీమహా...

SKANDAGIRI SUBRAMANYA SWAMY TEMPLE: స్కందగిరి సుబ్రమణ్యస్వామి ఆలయం - సికింద్రాబాద్

Image
దక్షిణ భారతంలో సుబ్రహ్మణ్యేశ్వరుని కార్తికేయుడు, మురుగన్, స్కందుడు, కుమారస్వామి, ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో స్వామివారిని అర్చిస్తారు. కుమార స్వామి కారణజన్ముడనీ తారకాసురుణ్ణి వధించడం కోసమే పుట్టాడనేది పురాణ కథనం. పేరులోనే స్కందుని నిలుపుకున్న స్కందగిరి సుబ్రహ్మణ్యుని ఆలయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో గల పద్మారావు నగర్​లో వెలసి ఉంది. అత్యంత మహిమాన్వితమైన ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యుడు శ్రీవల్లీదేవసేన సమేతంగా కొలువై ఉన్నాడు. ఆలయ స్థల పురాణం స్కందగిరి ఆలయ స్థల పురాణం పరిశీలిస్తే ఇక్కడ స్థానికంగా ఉండే ఓ భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కలలోకి కనబడి గుడిని కట్టాలని ఆదేశించారు. ఆయన సికింద్రాబాద్​లోని పద్మారావునగర్​లో ఆంజనేయుడి విగ్రహం సమీపంలో ఉన్న ఎత్తైన కొండ మీద స్కందుడి ఆలయానికి దాతల సహాయంతో శ్రీకారం చుట్టారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఉన్న సహస్ర నామాలలో ఒకటైన 'స్కంద' అనే పేరు ఏర్పడగా, కొండమీద ఆలయాన్ని నిర్మించిన కారణంతో 'గిరి 'అన్న పదం చేర్చి 'స్కందగిరి'గా ఈ ఆలయానికి సార్ధక నామధేయం ఏర్పడింది. ఆలయ సముదాయం స్కందగిరి ఆలయంలో ప్రధాన మూలవిరాట...

Kamakhya Devi Temple: శ్రీ కామాఖ్యాదేవి ఆలయం

Image
కామాఖ్యాదేవి క్షేత్రంలో అమ్మవారికి విగ్రహ రూపం ఉండదు. యోని ఆకారంలో ఉన్న శిలనే విగ్రహంగా భావించి కొలుస్తారు. దశ మహావిద్యలకు ప్రతీకగా పూజిస్తారు. భక్తుల కోర్కెలను తీర్చడానికి కామాఖ్యాదేవి అనేక రూపాలను ధరించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం వెనుక పురాణగాథను తెలుసుకుందాం. ఆలయ పురాణ గాథ సతీదేవి తండ్రి దక్షప్రజాపతి. దక్షుడు పరమేశ్వరుణ్ని ఆహ్వానించకుండా యాగం చేస్తాడు. ఎందుకిలా చేశావని ప్రశ్నించిన సతీదేవిని అవమానిస్తాడు. యజ్ఞంలో శివనింద జరగడం సహించలేని సతీదేవి యజ్ఞ గుండంలో దూకి అగ్నికి ఆహుతై పోతుంది. ఆగ్రహోదగ్రుడైన పరమేశ్వరుడు వీరభద్రుణ్ని సృష్టించి యాగాన్ని భగ్నం చేయిస్తాడు. శివుడు విరాగిలా మారి సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకొని తిరుగుతుంటాడు. సుదర్శన చక్రంతో ఖండించిన విష్ణువు ఈశ్వరుడు తన కర్తవ్యాన్ని మరచి బాధతో అలా తిరుగుతుండటం వల్ల సృష్టి లయ తప్పుతుందని భావించిన శ్రీ మహావిష్ణువు సతీదేవి దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. ఆ ముక్కలన్నీ వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడతాయి. ఆలా అమ్మవారి శరీరభాగాలు పడిన ప్రాంతాలన్నీ అష్టాదశ శక్తిపీఠాలుగా విరాజిల్లుతున్నాయి. అత్యంత మహిమాన్విత కామాఖ్యా ...

Govindaraja Swamy Brahmotsavam: శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - తిరుపతి

Image
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 02 నుండి జూన్ 10వ తేదీ వరకు వైభవంగా జరుగనున్న నేపథ్యంలో టిటిడి విస్తృత ఏర్పాట్లు చేప్టటింది. జూన్ 01వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు : జూన్ 02 ఉదయం – ధ్వజారోహణం రాత్రి – పెద్దశేష వాహనం జూన్ 03 ఉదయం – చిన్నశేష వాహనం రాత్రి – హంస వాహనం జూన్ 04 ఉదయం – సింహ వాహనం రాత్రి – ముత్యపుపందిరి వాహనం జూన్ 05 ఉదయం – కల్పవృక్ష వాహనం రాత్రి – సర్వభూపాల వాహనం జూన్ 06 ఉదయం – మోహినీ అవతారం రాత్రి – గరుడ వాహనం జూన్ 07 ఉదయం – హనుమంత వాహనం రాత్రి – గజ వాహనం జూన్ 08 ఉదయం – సూర్యప్రభ వాహనం రాత్రి – చంద్రప్రభ వాహనం జూన్ 09 ఉదయం – రథోత్సవం రాత్రి – అశ్వవాహనం జూన్ 10 ఉదయం – చక్రస్నానం రాత్రి – ధ్వజావరోహణం

Appalayagunta Brahmotsavam 2025: శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 2025 - అప్పలాయగుంట

Image
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 07  నుండి జూన్ 14వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్నాయి.జూన్ 06వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వ‌హిస్తారు. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి. జూన్ 07 -   ధ్వజారోహణం -పెద్దశేష వాహనం జూన్ 08   - చిన్నశేష వాహనం   హంస వాహనం జూన్ 09  -  సింహ వాహనం  ముత్యపుపందిరి వాహనం జూన్ 10 -   కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం జూన్ 11 -   మోహినీ అవతారం గరుడ వాహనం జూన్ 12 -   హనుమంత వాహనం  గజ వాహనం జూన్ 13 -  సూర్యప్రభ వాహనం   చంద్రప్రభ వాహనం జూన్ 14 -   రథోత్సవం   అశ్వవాహనం జూన్ 15 -   చక్రస్నానం  ధ్వజావరోహణం బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. 

Jyestha Masam: జ్యేష్ట మాసంలో ముఖ్యమైన తిధులు

జ్యేష్ఠ మాసంలో ముఖ్యమైన రోజులు, ఏ తిధిలో ప్రాముఖ్యత వివరాలు : జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి : కరవీర వ్రతం ఆచరిస్తే సౌభాగ్యం కలుగుతుంది. గన్నేరు పూలతో అమ్మవారిని పూజించాలి జ్యేష్ఠ శుద్ధ విదియ : ఈ రోజును సోపపడము అంటారు శ్రాద్ధ కర్మలు ఆచరించాలి. జ్యేష్ఠ శుద్ధ విదియ : ఈ రోజును సోమపదము అంటారు. శ్రాద్ధకర్మలు ఆచరించాలి. జ్యేష్ఠ శుద్ధ తదియ : ఈ రోజు ప్రతిమ రూపంలో అరటి చెట్టువద్ద పార్వతీదేవిని పూజించి, వస్త్ర దానం చేస్తే సంపద, సౌభాగ్యాలు కలుగుతాయి. జ్యేష్ఠ శుద్ధ చవితి : పార్వతీ మాత ఉమాదేవిగా అవతారం దాల్చిన రోజిది.ఉమాదేవి ఆరాధన చేస్తే స్త్రీలకు సౌభాగ్యవృద్ధి కలుగుతుందని బ్రహ్మపురాణ వచనం. జ్యేష్ఠ శుద్ధ షష్ఠి : అరణ్యక గౌరీ వ్రతం, వింధ్యవాసిని ఆరాధన ఆచరించిన స్త్రీలకు సౌభాగ్యం వర్ధిల్లుతుందని స్కాంద పురాణం చెబుతోంది. జ్యేష్ఠ శుద్ధ అష్టమి : శుక్లాదేవి ఆరాధన సంపత్కరం. అష్టమి రోజు పూజ చేయాలి. మరునాడు నవమి తిథి నాడు ఉపవాసం చేసి తిరిగి శుక్లాదేవి, బ్రహ్మణీ దేవిని పూజించాలి. జ్యేష్ఠ శుద్ధ దశమి : దీన్ని దశపాపహర దశమి అంటారు.సేతుబంధన రామేశ్వర ప్రతిష్ట జరిగిన రోజు. ఈ రోజున నదీ స్నా...

Nirjala Ekadasi: నిర్జల ఏకాదశి

Image
జ్యేష్ఠా శుద్ధ ఏకాదశి రోజున నిర్జల ఏకాదశి జరుపుకుంటారు. ఈనాడు నీళ్లను కూడా త్రాగకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పబడింది. ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మిగతా ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాన్ని ఆచరించనంత ఫలితం వస్తుంది. పూర్వం శ్రీకృష్ణుడు సూచనా మేరకు భీముడు ఈ వ్రతాన్ని ఆచరించి అనేక ఫలితాలు పొందాడు అని పురాణం కధనం.  అన్ని నియమాలతో ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించినవాడు పాపవిముక్తుడు అవుతాడు. ఈ ఏకాదశిని  పాటించడం ద్వారా మానవుడు సకల తీర్థక్షేత్ర దర్శన పుణ్యాన్ని పొందుతాడు. మరణ సమయంలో యమదూతలు కనపడరు, విష్ణు దూతలు విష్ణులోకానికి తీసుకువెళతారు. ఈ ఏకాదశి వ్రతం తరువాత జలాన్ని,గోవులను దానం చేసేవాడు సకల పాపవిముక్తుడు అవుతాడు. ఈ నిర్జల ఏకాదశి రోజు చేసే తీర్థస్నానం, దానం, వేదమంత్రోచారణం, యజ్ఞ నిర్వహణం వంటి పుణ్య కార్యాలు నశింపలేనివిగా అవుతాయని శ్రీకృషుడు భగవానుడు చెప్పాడు. ఈ ఏకాదశి మహిమను భక్తితో చదివేవాడు లేదా వినేవాడు వైకుంఠ లోకానికి వెళ్తాడు. నిర్జల ఏకాదశి నాడు సూర్యోదయంనుండి మరుసటి రోజుసూర్యోదయం వరకు 24 గంటలు ఉపవాసం పాటించాలి. ఇతర ఏకాదశుల మాదిరిగానే, ఏకాదశినాడు కూ...