Jyestha Amavasya: జ్యేష్ఠ అమావాస్య
జ్యేష్ఠ మాసంలో లో కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అంటారు. జ్యేష్ఠ అమావాస్య పూర్వీకులను స్మరించుకోవడానికి, గౌరవించుకోవడానికి, వారి నుండి ఆశీస్సులు పొందడానికి మంచి రోజు. పూజలు, దానం మొదలైన అనేక కార్యక్రమాలతో పాటు పిండ ప్రదానం లేదా తర్పణం ఇవ్వడం జ్యేష్ఠ అమావాస్య నాడు పితృదేవతల పట్ల గౌరవాన్ని ప్రదర్శించడానికి చేస్తారు. ఇలా చేయడం వలన పితృదేవతలు ప్రశాంతంగా ఉండగలుగుతారు. జ్యేష్ఠ అమావాస్య రోజు శివుడిని పూజించడం వలన ప్రతికూలతలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతుంది. ఈరోజున ఉపమా కలుగుతుంది. ఉపవాసం ఆత్మ శుద్ధి కలుగుతుంది. కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున పవిత్ర నదులు, జలాశయాలలో స్నానం చేయాలి. ఇలా చేస్తే పాపాలు తొలగిపోతాయి, జ్యేష్ఠ అమావాస్య రోజున వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం, ఆనందకరమైన వైవాహిక జీవితం గడపడానికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారు. పెళ్లికాని అమ్మాయిలు కూడా తాము కోరుకున్న వరుడిని పొందడానికి ఈ రోజున రావి చెట్టును పూజించడం, సావిత్రి కథను చదువుతారు లేదా వింటారు. ఈ రోజున పవిత్ర నది లేదా ఆలయ ప్రాంతాన సంధ్యా సమయంలో దీప దానం చేయాలి. రావి చెట్టు ముందు దీపం...