Guru Dwadasi: గురు ద్వాదశి
గురు ద్వాదశి ని ఆశ్వయుజమాసం కృష్ణపక్షం 12వ రోజున జరుపుకుంటారు. ఇది మహారాష్ట్ర లో ప్రముఖంగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశం ఇది కార్తీక మాసం లో వస్తుంది. ఇదే రోజు గోవత్స ద్వాదశిని కూడా జరుపుకుంటారు. దత్త అవతారమైన శ్రీ పాద శ్రీ వల్లభ ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి. కొన్ని ప్రాంతాలలో ఈ రోజు నుంచి దీపావళి సంబరాలు మొదలు అవుతాయి. గురుద్వాదశి దత్తాత్రేయ స్వామిని ఆరాధించే వారికీ చాల ముఖ్యమైన రోజు. శ్రీ పాద శ్రీ వల్లభుడు కలియుగం లో మొదటి దత్త అవతారం. ఈయన జన్మస్థలం తూర్పు గోదావరి జిల్లాలో ని పిఠాపురం.ఇది ఆంధ్రప్రదేశ్ లో వున్నది ఈయన ఆశ్వయుజ బహుళ ద్వాదశి రోజున అవతారం సమాప్తి కావించారు. గురుద్వాదశి ని కర్ణాటకలో ని గంగాపూర్ దత్తాత్రేయ క్షేత్రం లో ఘనంగా నిర్వహిస్తారు. కొంత మంది ఈ రోజు గురుచరిత్రని పారాయణ చేస్తారు. 2024: అక్టోబరు 29.