Rama Ekadasi: రమా ఏకాదశి
ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని రమా ఏకాదశిగా జరుపుకుంటారు.
పద్మపురాణం ప్రకారం రమా ఏకాదశి వ్రతం ఆచరించే వారికి శ్రీ విష్ణుమూర్తి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి ఆదాయం కూడా పెరుగుతుంది.
ఈ ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఈ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి.
ముందుగా సూర్యోదయంతో నిద్ర లేచి తలారా స్నానం చేసి పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని శ్రీ లక్ష్మీ నారాయణుల చిత్ర పటాలను గంధం కుంకుమలతో అలంకరించాలి. ఆవునేతితో దీపారాధన చేయాలి.
తులసి దళాలతో అర్చిస్తూ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.
చక్ర పొంగలి, పరమాన్నం వంటి ప్రసాదాలను నివేదించాలి.
ఏకాదశి రోజు సాయంత్రం ఇంట్లో యధావిధిగా పూజ చేసుకొని సమీపంలోని విష్ణు ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి.
రాత్రి భగవంతుని కీర్తనలతో, పురాణ కాలక్షేపంతో జాగరణ చేయాలి.
పురాణాలలో వివరించిన ఏకాదశి వ్రత కథలను చదువుకోవాలి.
ఈ రోజు చేసే దానధర్మాలు విశేషమైన పుణ్యాన్ని ఇస్తాయని శాస్త్రం చెబుతోంది.
ఈ రోజు అన్నదానం, వస్త్రదానం, జలదానం చేయడం వలన విశేషమైన ఫలితం ఉంటుంది.
ఏకాదశి రోజు గోసేవ చేస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.
ఎవరైతే భక్తిశ్రద్ధలతో, నియమ నిష్టలతో రమా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.
2024: అక్టోబరు 28
Comments
Post a Comment