Posts

Showing posts from February, 2025

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Image
యాదగిరిగుట్ట ఆలయం త్రేతాయుగం కాలం నాటిది.శ్రీరాముని బావగారైన ఋష్యశృంగ మహర్షి కుమారుడే యాదర్షి. ఆయన తపస్సు వల్లనే లక్ష్మీనరసింహ స్వామి యాదగిరిపై పంచనారసింహ రూపాలలో వెలిశాడు. ఆనాడు యాదమహర్షి చూసిన ఉగ్రనారసింహ రూపమే యాదగిరి గుట్ట అయిందని చెబుతారు. యాదాద్రికి క్షేత్రపాలకుడు ఆంజనేయుడు. ఆయన ఆజ్ఞ మేరకే యాదర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేయడానికి వచ్చాడు. యాదర్షి తపస్సుకు కూడా ఆంజనేయుడు ఎంతో సహాయం చేసినట్లు స్థలపురాణం చెబుతోంది. యాదాద్రిలో ప్రసన్నాంజనేయుని మనం దర్శించుకోవచ్చు. అక్కడే గండభేరుండ స్వామి దర్శనం కూడా అవుతుంది. ఆయనకు ప్రదక్షిణలు చేస్తే సర్వరోగాలు, భూతప్రేత పిశాచాదుల బాధలు పోతాయి. యోగానంద నారసింహుడు. దక్షిణాభిముఖుడై యోగముద్రలో జ్ఞానదాయకునిగా ప్రసిద్ధి పొందాడు. దేవప్రాచీదిశలో వెలిసిన లక్ష్మీనృసింహస్వామి దర్శన మాత్రంతో కోరికలను నెరవేరుస్తాడు. రెండు శిలాఫలకాల మధ్య సర్పాకారంలో శ్రీచూర్డరేఖను ధరించివున్న రూపం జ్వాలానృసింహమూర్తి. ఇక యాదాద్రి కొండంతా ఆవరించివున్న మహారూపం ఉగ్రనృసింహమూర్తి. మూలమూర్తిగా విరాజిల్లుతున్న స్వయం భూనృసింహమూర్తి ఈ పంచనృసింహుల సమ్మేళన రూపం. యాదగిరిగుట్టలోని గుహలో కృతయుగం ను...

Thondamanadu Temple: శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు 2025 - తొండమనాడు

Image
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి  జిల్లా తొండమనాడులోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర ఆలయం. పురాతనమైన ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఏ ఆలయంలోనైనా వేంకటేశ్వరుని విగ్రహం నిలువెత్తుగా కనిపిస్తుంది. కానీ తొండమనాడులో మాత్రం స్వామి యోగముద్రలో ఆసీనుడై ఉంటాడు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 25 నుండి మార్చి 07 వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. వాహన సేవలు  ఫిబ్రవరి 25 - అంకురార్పణ  ఫిబ్రవరి 26 - ధ్వజారోహణం, శేష వాహన సేవ ఫిబ్రవరి 27 - హంస వాహన సేవ ఫిబ్రవరి 28 - సింహ వాహన సేవ మార్చి 01 - హనుమాన్ వాహన సేవ మార్చి 02 - కల్యాణోత్సవం, గరుడ వాహన సేవ మార్చి 03 - గజ వాహన సేవ మార్చి 04 - చంద్రప్రభ వాహన సేవ మార్చి 05 - అశ్వ వాహన సేవ మార్చి 06 - చక్ర స్నానం, ధ్వజావరోహణ  మార్చి 07 - పుష్ప యాగం  

Venkatagiri Poleramma: శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం - వెంకటగిరి

Image
  దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతరకు ఎంతో ప్రత్యేకత ఉంది. శతాబ్దాలుగా జరుగుతున్న ఈ జాతరలో అమ్మవారి భక్తులు ప్రపంచంలో ఎక్కడున్నా ఆ సమయానికి వెంకటగిరి వస్తారు. జాతరలో అన్ని మతాల వారు పాల్గొని మొక్కులు చెల్లిస్తారు. జాతర వేడుక వెంకటగిరిలో ఎప్పుడు మొదలైందో కచ్చితంగా చెప్పలేకపోయినా 1714లో జాతర జరిగినట్లు చరిత్ర ఆధారాలున్నాయి. 1913 నుంచి ఈ జాతర వైభవం ఏటేటా పెరుగుతూ వస్తోంది. 1919లో కలరా వ్యాధికి పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం వాటిల్లడంతో అప్పటి వెంకటగిరి రాజా 29వ తరానికి చెందిన గోవింద కృష్ణ యాచేంద్ర శీతల యాగం జరిపించి ఆ ఏడాది గ్రామశక్తి జాతరను వేడుకగా నిర్వహించారని పెద్దలు చెబుతారు. అప్పటి నుంచి ఏటికేడు అమ్మవారి జాతరకు ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది. ఆది నుంచి వెంకటగిరి రాజాల ఆధ్వర్యంలో గ్రామశక్తి పోలేరమ్మ జాతర జరిగేది. ఈ జాతరకు ఏటేటా భక్తులు లక్షలాదిగా పోటెత్తుతుండటంతో రెండు దశాబ్దాల కిత్రమే దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుని జాతర నిర్వహిస్తోంది. అయినప్పటికీ సంప్రదాయం ప్రకారం నేటికీ జాతర చాటింపు జరిగేది రాజాల అనుమతి తీసుకున్న తర్వాతే జాతరకు మూడు వారాల ముందుగానే చాటి...

Tarigonda Narasimha Swamy: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - తరిగొండ

Image
తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో మార్చి 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వ‌హించ‌నున్నారు. మార్చి 5వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు : తేదీ 06-03-2025 ఉదయం – ధ్వజారోహణం(ఉదయం 8 నుండి 8.30 గంటల మధ్య మీన లగ్నంలో) రాత్రి – హంసవాహనం, 07-03-2025 ఉదయం – ముత్యపుపందిరి వాహనం రాత్రి – హనుమంత వాహనం 08-03-2024 ఉదయం – కల్పవృక్ష వాహనం రాత్రి – సింహ వాహనం 09-03-2025 ఉదయం – తిరుచ్చి ఉత్స‌వం రాత్రి – పెద్దశేష వాహనం 10-03-2025 ఉదయం – తిరుచ్చి ఉత్స‌వం రాత్రి – గజవాహనం 11-03-2025 ఉదయం – తిరుచ్చి ఉత్స‌వం రాత్రి – స‌ర్వ‌భూపాల వాహ‌నం(సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు) కల్యాణోత్సవం (రాత్రి 8 నుండి 10 గంటల వరకు), గరుడ వాహనం( రాత్రి 11 నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు) 12-03-2025 ఉదయం – రథోత్సవం రాత్రి – ధూళి ఉత్సవం 13-03-2025 ఉదయం – సూర్యప్రభవాహనం రాత్రి – చంద్రప్రభ వాహ...

Magha Puranam Telugu: మాఘ పురాణం 30వ అధ్యాయం - సకల సంపదలు, దీర్ఘాయుష్షునిచ్చే మాఘమాస వ్రతం

Image
గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షితో "ఓ జహ్నువూ! చూసావుగా! మాఘమాసం ఎంతటి విశిష్టమైనదో! ధర్మ సాధనకు ఉపయోగపడే అన్ని సాధనములలోకెల్లా మాఘమాస వ్రతం అమిత శ్రేష్టమైనది. మాఘ మాస వ్రతం సర్వవిధ తపస్సుల సారం. కోటి అశ్వమేధ యాగాల ఫలం మాఘమాస వ్రతంతో కలుగుతుంది. శ్రీహరికి, పరమశివునికి ప్రీతికరమైనది మాఘమాసం. మాఘమాస వ్రత ప్రభావం గురించి వినడానికి నీవు ఆసక్తి చూపించావు కాబట్టి నీకు వివరించాను. శ్రీహరి భక్తులు ఏ ధర్మాన్ని నిర్వహింపకపోయినా ఒక్క మాఘ మాస వ్రతాన్ని నిర్వహిస్తే చాలు సకల ధర్మాలను నిర్వర్తించిన ఫలం కలుగుతుంది. మాఘమాసంలో మాఘ పురాణాన్ని భక్తిశ్రద్దలతో చదివినా, విన్నా సమస్త పాపముల నుంచి ముక్తిని పొంది వైకుంఠాన్ని చేరుతారు." అని గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షికి మాఘమాస వ్రతమహాత్యాన్ని వివరించాడు. శివపార్వతులు సంవాదం కైలాసంలో పరమశివుడు పార్వతితో "పార్వతీ! సకల ధర్మవిదురుడైన గృత్సమద మహర్షి చెప్పిన మాఘమాస ప్రభావమును జహ్ను మహర్షి విని మాఘ వ్రతాన్ని ఆచరించి మోక్షాన్ని పొందాడు. ముల్లోకాలలో మాఘ వ్రతంతో సమానమైన వ్రతం ఇంకొకటి లేదు. ఇది బహురహస్యమైన విషయం. నీవు నాకు అర్ధాంగివి కాబట్టి నీకు ఈ విషయాన్ని తె...

Sri Ramanavami: శ్రీరామనవమికి వడపప్పు, పానకం ఎందుకు పంచిపెడతారు?

Image
  ప్రతి పండుగకు, పూజలు వ్రతాలు నిర్వహించే సమయంలో పిండివంటలతో పాటు వడపప్పు, పానకం కూడా దేవతలకు నివేదిస్తూ ఉంటాం. కేవలం శ్రీరామనవమికే పరిమితం కాదు. అయితే శ్రీరామనవమికి అన్నిచోట్లా చలువ పందిళ్లు వేసి వడపప్పు, పానకం పెద్దఎత్తున పంచిపెడతారు. పెసరపప్పును నీటిలో నానబెట్టి, నీటిని తీసివేస్తే వడపప్పు తయారవుతుంది. పెసరపప్పు చలవచేస్తుంది. శరీరం ఉష్ణాన్ని తగ్గిస్తుంది. కేవలం శ్రీరామనవమికే పరిమితం కాదు. మండుతున్న ఎండల్లో వడకొట్టకుండా ఉంటుంది. ఇక పానకంలో ఉపయోగించే బెల్లం, మిరియాలు, ఏలకులు ఔషధంలా పనిచేస్తాయి. దాహం తీరుతుంది. వేసవికాలంలో దాహం తీర్చడం పుణ్యకార్యం.

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Image
జూబ్లీహిల్స్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 5వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 25 నుండి మార్చి 7 వరకు జరుగుతాయి. ఫిబ్రవరి 25 న సా.6.30 ఈ- 8.30 వరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ ఫిబ్రవరి 26 న ఉ. 9.45 – 10.10 గం.ల మధ్య మేష లగ్నములో ధ్వజారోహణం, రాత్రి 7 – 8 గం.ల వరకు పెద్దశేష వాహనం ఫిబ్రవరి 27 న ఉ: చిన్న శేష వాహనం రా: హంస వాహనం ఫిబ్రవరి 28 న ఉ: సింహ వాహనం రా: ముత్యపు పందిరి వాహనం మార్చి 1 న ఉ – కల్పవృక్ష వాహనం రా- సర్వభూపాల వాహనం మార్చి 2 న ఉ : పల్లకి ఉత్సవం (మోహిని అవతారం) రా : గరుడ వాహనం మార్చి 3 న ఉ: హనుమంత వాహనం రా: గజ వాహనం మార్చి 4 న ఉ : సూర్య ప్రభ వాహనం రా : చంద్ర ప్రభ వాహనం మార్చి 5 న ఉ : రథోత్సవం (8 – 10 గం. మధ్య) రాత్రి: అశ్వ వాహనం మార్చి 6 న ఉ: చక్రస్నానం ( 8 – 10.15 గం.ల మధ్య) రాత్రి: 6 – 8 గం.ల మధ్య ధ్వజ అవరోహణం మార్చి 7 న సాయంత్రం 3 – 5 గం.ల మధ్యన పుష్పాయాగం ప్రతి రోజూ వాహన సేవలు ఉదయం 8 నుండి 9 గం.ల వరకు, రాత్రి 7 – 8 గం.ల వరకు

Phalguna Masam 2025: ఫాల్గుణ మాసం విశేషమైన పండుగల, పుణ్య తిధులు

తెలుగు పంచాంగం ప్రకారం ఫాల్గుణ మాసం తెలుగు మాసాలలో చివరిది.మాఘమాసం పూర్తయిన వెంటనే వచ్చే ఫాల్గుణ మాసం వేసవికి ఆరంభంగా చెబుతారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 29 వరకు ఉంటుంది. ఫిబ్రవరి 28 వ తేదీ శుక్రవారం ఫాల్గుణ శుద్ధ పాడ్యమి:తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు సమాప్తం మార్చి 1 వ తేదీ శనివారం ఫాల్గుణ శుద్ధ విదియ:చంద్రోదయం మార్చి 6 వ తేదీ గురువారం ఫాల్గుణ శుద్ధ సప్తమి: తరిగొండ శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి బ్రహోత్సవాలు ప్రారంభం మార్చి 10 వ తేదీ సోమవారం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి: అమలక ఏకాదశి మార్చి 11 వ తేదీ మంగళవారం ఫాల్గుణ శుద్ధ ద్వాదశి:నృసింహ ద్వాదశి మార్చి 12 వ తేదీ బుధవారం ఫాల్గుణ శుద్ధ త్రయోదశి:పక్ష ప్రదోషం మార్చి 14 వ తేదీ శుక్రవారం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి:హోళికా పున్నమి, హోలీ పండుగ, కాముని పున్నమి, శ్రీలక్ష్మి జయంతి, కుమారధార తీర్ధ ముక్కోటి, మీన సంక్రమణం. మార్చి 17 వ తేదీ సోమవారం ఫాల్గుణ బహుళ తదియ/చవితి : సంకష్టహరచవితి మార్చి 18 వ తేదీ మంగళవారం ఫాల్గుణ బహుళ చవితి : శుక్రమౌడ్యారంభం మార్చి 25 వ తేదీ మంగళవారం ఫాల్గుణ బహుళ ఏకాదశి: సర్వేషాం పాపవిమోచన ఏకాదశి, శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యా...

Magha Puranam Telugu: మాఘ పురాణం 29వ అధ్యాయం - కోడల్ని హింసించి సర్పాలుగా మారిన క్రూర దంపతులు- మాఘ వ్రతంలో మోక్షం ప్రాప్తి

Image
  గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షుల సంవాదం గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షితో "ఓ జహ్నువూ! మాఘమాస వ్రతమహాత్యాన్ని వివరించే మరో కథను చెబుతున్నావు శ్రద్ధగా వినుము" అంటూ మాఘ పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయమును ఈ విధంగా చెప్పసాగెను. శూద్ర దంపతుల కథ ద్వాపరయుగంలో విదేహదేశమందు క్రూర అనే పేరుగల ఓ శూద్ర స్త్రీ ఉండేది. ఆమె ఒక రైతు భార్య. మిక్కిలి కోపస్వభావం కలిగిన ఆమె మిక్కిలి పరాక్రమవంతురాలు కూడా! ఆ దంపతులకు సదాచారుడై, సర్వభూతములయందు దయ కలిగిన పుణ్యమూర్తి అయిన ఓ కుమారుడు ఉండేవాడు ఇతనికి నిత్యం భర్త అత్తమామలను సేవిస్తూ, దైవభక్తి పరాయణురాలై మహాపతివ్రత అయిన భార్య ఉండేది. కోడలిపై క్రూర దాష్టీకం అత్త అయిన క్రూర తన భర్తతో కలిసి ప్రతినిత్యం అకారణంగా తన కోడలిని తిడుతూ, కొడుతూ హింసిస్తూ ఉండేది. అత్తమామలు పెట్టే హింసలు భరిస్తూ కూడా ఆ కోడలు మౌనంగా ఉంటూ అత్తమామలకు, భర్తకు సేవలు చేస్తుండేది. ఆమె భర్త కూడా తల్లిదండ్రులకు ఎదురు చెప్పలేక మౌనంగా ఉండేవాడు. తల్లిదండ్రులకు హితోపదేశం చేసిన కుమారుడు ఒకనాడు తన తల్లిదండ్రులు తన భార్యను పెట్టే బాధలు చూడలేక క్రూర కుమారుడు తన తల్లిదండ్రులతో "తల్లీ! తండ్రీ! మీకు నమస్కార...

Magha Amavasya: మాఘ అమావాస్య

మాఘ మాసంలో చివరి రోజు మాఘ అమావాస్యగా జరుపుకుంటారు  మాఘ అమావాస్య రోజున మౌనం పాటించడం వలన సహనం, స్వీయ విగ్రహం పెంపొందుతుంది. అందుకే దీనిని మౌని అమావాస్య అనికూడా అంటారు. ఈ రోజు, దానాలు, విరాళాలు ఇవ్వడానికి శ్రేష్టమైన రోజు. అలాగే నదీ స్నానాలకు కూడా ఈ రోజు చాలా మంచి దినం. చాలా మంది స్త్రీలు తమ భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం పాటించేందుకు ఈ రోజును ఎంచుకుంటారు. మాఘ అమావాస్య శాంతి కలిగిస్తుంది. ఈ రోజు, స్నానం చేసేటప్పుడు నిశ్శబ్దం పాటించాలి. ఈ రోజున గాయత్రీ మంత్రం జపిస్తూ బ్రహ్మదేవుడిని పూజిస్తారు. ఈ రోజు నువ్వులు పిండిలో కలిపి రొట్టెలు తయారు చేయాలి. వాటిని ఆవులకు తినిపించాలి. ఇది కుటుంబంలో శాంతి, శ్రేయస్కర వాతావరణాన్ని కలిగిస్తుంది. మాఘ అమావాస్య రోజు పిండి ముద్దలను చేపలకు తినిపించాలి. దీనివల్ల అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతికూలతలు తొలగిపోతాయి. పూర్వీకులను స్మరించుకుంటూ పేదలకు దానం చేయాలి. పవిత్ర భగవద్గీతలోని ఏడవ అధ్యాయం పఠించాలి. ఈ రోజు పాలలో మీ ప్రతిబింబాన్ని చూడండి. ఆ పాలను నల్ల కుక్కకు తాగించాలి. దీంతో మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. మాఘ అమావాస్య రోజ...

Tripurantakam Temple: శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారి ఆలయంలో వివిధ ఉత్సవాల వివరాలు

Image
ఈ ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి  విజయదశమి సందర్భంగా అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి  ఉగాది సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి, స్వామివారికి గ్రామోత్సవం జరుగుతుంది  వైశాఖ పౌర్ణమికి, శ్రావణ పౌర్ణమికి అమ్మవారికి లక్ష పుష్పార్చన, నవధానార్చన , స్వామివారికి లక్ష బిల్వార్చన నిర్వహిస్తారు.  ప్రతి అమావాస్యకు నిమ్మకాయల పూజ జరుగుతుంది.  ప్రతేక్య సందర్భాలలో చండి హోమం, రుద్రా హోమం, సహస్ర చండి , రుద్రచండి పూజలు జరుగుతాయి.  ప్రతి రోజు అమ్మవారికి అభిషేకం , ప్రాతః కాల పూజలు, బాలభోగం, కుంకుమార్చనలు, ఖడ్గమాల పూజలు నిర్వహిస్తారు. 

Mahashivaratri: శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ ఎక్కడ చేస్తే మంచిది ?

Image
  శివనామస్మరణతో ఎక్కడ ఉపవాస, జాగరణలు చేసినా శివరాత్రి వ్రతఫలం సిద్ధిస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉండడం ముఖ్యం.  మహాశివరాత్రి ఉపవాస, జాగరణలు ప్రశాంతమైన ప్రదేశాల్లో చేసినప్పుడు ఫలితం వెంటనే లభిస్తుంది. ఆలయంలో స్వామిని దర్శించి ఇంటిలోనే స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలిసి శివధ్యానంలో గడపడం మంచిది. 

Vaddukunatha Swamy Temple: శ్రీ వడక్కునాథ స్వామి ఆలయం - త్రిసూర్

Image
  ఈ ఆలయం కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ అనే పట్టణంలో వెలసింది. ఈ క్షేత్రానికి పూర్వం తిరుశివవేరూర్, వృషాచలం అనే పేర్లు ఉండేవి  తిరు అంటే శ్రీ, లక్ష్మీదేవి రూపం  ఈ ఆలయంలో శ్రీమహావిష్ణువు శంకరనారాయణుడిగా శివుడితో కొలువై ఉన్నాడు. పురాణ కాలం నుండే ఈ స్వామి పూజలు అందుకుంటున్నాడు  ఆదిశంకరుల తల్లితండ్రులు స్వామివారిని పూజించిన తరువాత శంకరులు జన్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. సుమారు 9 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయం ఉంది. గర్బాలయంలో స్వామివారు నెయ్యతో కప్పబడి ఉంది పది అడుగుల ఎత్తులో దర్శనమిస్తారు. అనేక సంవత్సరాల నుండి స్వామివారి మీద పోసిన నెయ్య అలాగే నిలిచి ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎప్పుడైనా నెయ్య కరిగితే దానిని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. స్వామివారి ఆలయం వెనుక తూర్ప అభిముఖంగా పార్వతీదేవి కొలువుదీరి ఉంది. శంకరనారాయణ స్వామి, వినాయక స్వామి, శ్రీరాములవారు ఆలయ ప్రధాన ప్రాంగణంలో దర్శనమిస్తారు. ప్రాకార ప్రదక్షిణ మార్గంలో అయ్యప్పస్వామి, శ్రీకృష్ణుడు, ఆదిశంకరుల ఉపాలయాలు వున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతావృక్షాలు దర్శనమిస్తాయి. ఈ ఆలయంలో ఏప్రిల్, మే నెలలో పూరం ఉత్సవం అంగరం...

Mogileswara Swamy Temple: శ్రీ మొగిలేశ్వర స్వామి వారి ఆలయం - మొగిలి

Image
శ్రీ మొగిలేశ్వర స్వామి వారి దేవస్థానం బంగారుపాలెం మండలం, మొగిలి గ్రామం చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలసింది.  ఈ ఆలయంలో ప్రధాన దైవమైన శివుడు మొగిలేశ్వర స్వామిగా, అమ్మవారు కామాక్షిదేవిగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయాన్ని దక్షిణ కైలాసంగా పిలుస్తారు. ఈ ఆలయంలో విశేషం ఎండాకాలంలో కూడా పుష్కరిణిలో నీరు నిండుగా ఉంటుంది, నంది విగ్రహం నోటిలోనుంచి నీరు పుషరిణిలోకి వస్తుంది.  ఈ ఆలయాన్ని 10 వ శతాబ్దంలో నిర్మించారు.  ఆలయ ప్రాంగణంలో వినాయక స్వామి, దక్షిణామూర్తి, బ్రహ్మ, దుర్గాదేవి కూడా దర్శనమిస్తారు.  ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు విష్ణువు  ఈ ఆలయంలో వివాహము చేసుకున్న వారికి కచ్చితంగా సంతానం కలుగుతుంది అని విశ్వాసం.  మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి  స్థల పురాణం  శివుని శాపానికి గురియైన మొగిలి పూవు పలు విధాలుగా ప్రార్ధించి తన తప్పును మన్నించమని వేడుకుంది. అంతట పరమేశ్వరుడు భూలోకములో నీ పేరు మీదగా స్వయముగా అవతరించి పూజలు అందుకోనేదని వరము ఇచ్చెను. ఆ విధముగా పరమశివుడు స్వయముగా లింగా ఆకారములో మొగలి పొదల పక్కన ఒక చెలిమిలో అవతరించెను. మొగిలి...

Mahashivaratri: మహాశివరాత్రి రోజు ఏమి చేయాలి ?

Image
పరమ శివునికి ప్రధానమైన పర్వదినం మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి విధులలో పగలు ఉపవాసం, రాత్రి జాగరణ చేయడం ముఖ్యమైనవి. ఈ రోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేయాలి, అవకాశం ఉంటే నదిలోకాని, సముద్రంలోకాని పుణ్యస్నానం చేయడం మంచిది. శివాలయానికి వెళ్లి పరమేశ్వరుని దర్శించాలి. ఇంట్లో కాని, శివాలయంలో కాని స్వామికి అభిషేకం చేసి, అష్టోతర శతనామాలతో అర్చించాలి. ఓం నమఃశివాయ అనే మంత్రం స్మరిస్తూ ఉండాలి ఈ విధంగా పూజించాక, ఆ రోజు ఉపవసించి జాగారం చేయాలి. జాగారం అంటే రాత్రంతా శివప్రార్థనలతో, శివగాథలతో, భజనలతో గడపాలి. మరుసటి రోజు స్నానం చేసి మళ్ళి శివుడిని పూజించాలి. వీలైతే దానాలు చేయవచ్చు. 

Maha Shivaratri Puja: మహాశివరాత్రి పూజ నియమాలు

Image
మహాశివరాత్రి రోజు పూజా చేసే సమయంలో ఏఏ నియమాలను పాటించాలి. మహా శివరాత్రి రోజున ప్రాతఃకాలాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి. ముఖ్యంగా శివుడికి పంచామృతాలు, ఆవు పేడ, ఆవు పంచకం, పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేయాలి.  ఈ అభిషేకాలు చేస్తున్నంతసేపు ఓం నమః శివాయ పంచాక్షరీ మంత్రం ఉచ్చరిస్తూనే ఉండాలి. ముందుగా చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారలాతో శివుడిని పూజించి అగ్నిలో నువ్వులు, బియ్యం, నెయ్యితో కలిపిన అన్నం వేయాలి. ఇలా చేసి పుర్ణాహుతి నిర్వహించాలి. శివకథలు వింటూ జాగరణ చేయాలి. అలాగే రథరాత్రి మూడు, నాలుగో జాములో మరోసారి ఆహుతులను సమర్పించాలి. తెల్లవారి శివ భక్తులకు అన్న వస్త్రాలు, ఛత్రం ధానం చేయాలి. లింగోద్భవం జరిగిన అర్థరాత్రి రోజూ వస్తుంది కాబట్టి ప్రతిరోజూ శివరాత్రే. ఇంటి దగ్గరే శివపార్వతులను పుష్పాలు, బిల్వదళాలు, పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఉపవాస, జాగరణ శివస్మరణలతో ఉండాలి. ఆ మరుసటి రోజు ఉత్తమ విప్రులు, శివభక్తులకు అన్నదానం చేయాలి. సూర్యోదయం వరకూ మౌనవ్రతం చేయదలచినవారు 'ఓం నమః శివాయ' మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి.

Phalguna Month: పాల్గుణ మాసం విశిష్టత

Image
వినీల ఆకాశంలో ,శ్వేత వర్ణంతో దండకారంగా ప్రకాశిస్తున్న రెండు  నక్షత్రాలతో కూడిన మండలమే ఫల్గుణి నక్షత్రం. చాంద్రమానంలోని పన్నెండు మాసాలలో పాల్గుణమాసం చివరిది. ఈ నెలలోని పౌర్ణమినాడు చంద్రుడు పూర్వఫల్గుణి లేదా ఉత్తరఫల్గుణి నక్షత్రానికి దగ్గరగా ఉండటం చేత ఇది పాల్గుణమాసం అయింది. ఆరు ఋతువులలో ఆఖరిదైనా శిశిర ఋతువు ఈ మాసంతో ముగుస్తుంది. సూర్యుడు ఫాల్గుణ మాసంలో మీనా రాశిలో ప్రవేశిస్తాడు. ఈ మాసం విష్ణువుకు ప్రీతికరం అని భాగవతం చెబుతోంది. ఈ నెలలో విష్ణువుని పూజించడం విశేష ఫలదాయకం. ఈ మాసంలో చేసే దానాల వల్ల గోవిందుని అనుగ్రహం లభించి అరిష్టాలు హరింపబడుతాయి. ఈ మాసంలో గోదానం చెప్పలేనంత ఫలితాన్నిస్తుంది. పాల్గుణ పాడ్యమి రోజునే రామ, రావణ యుద్ధంలో ముఖ్య ఘట్టం. రావణ సంహారం జరిగింది పాల్గుణ అమావాస్య. మహాభారతంలో ధర్మరాజు, భీమసేనుల జననం ఈ మాసంలోనే జరిగింది. భారతంలో ప్రతి నాయకుడైన దుర్యోధనుడు అతని సహోదరుడైన దుశ్యాసనుడు ఈ మాసంలోనే జన్మించారు. ఫాల్గుణ శుద్ధ పాడ్యమినాడు గుణావాప్తి వ్రతం, తదియనాడు మాధుక వ్రతం చేస్తారు. ఈ మాస శుద్ధ చవితిని తిల చతుర్థి   అని అంటారు. ఈ రోజు ఉపవాసం...

Srisailam Temple: శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం - శ్రీశైలం

Image
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలుకు 180 కి.మీల దూరంలో నల్లమల అడవుల్లో పచ్చని పర్వతాలు, లోయలు, దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. శ్రీశైలం విశిష్టత శ్రీశైలం క్షేత్రాన్ని ఒక్కసారి దర్శిస్తే గంగా నదిలో రెండు వేల సార్లు మునిగిన పుణ్యం, కాశీ క్షేత్రంలో లక్షలాది సంవత్సరాలు నివసిస్తే లభించేంత పుణ్యం లభిస్తుందని శాస్త్రవచనం. ఆలయ స్థలపురాణం పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపాదాలచే, చతుష్పాదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంత వరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెబుతుంది. తర్వాత దేవతలు ఒక పథకం ప్రకారం తమ గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి నా రాకలో వింత ఏమి లేదని చెబుతాడు. అందుకు అరుణాసురుడు దేవత...

Jyotirlingas: ద్వాదశ జ్యోతిర్లింగములు

Image
సౌరాష్ట్రే సోమనాధంచ , శ్రీశైలే మల్లికార్జున మ్  ఉజ్జయిన్యాం మహాకాళ , మోంకారే పరమేశ్వరమ్  కేదారం హిమవత్ప్సెషే , ఢాకిన్యాం భీమశకరం  వారణస్యాం చ విశ్యేశం , త్ర్యంబకం గౌతమీతటె  వైద్యనాధం చితా భూమౌ , నాగేశం దారుకావనే  సేటుబంధె చ రామేశం , ఝృశ్మేశం చ గుహాలయే పుణ్యక్షేత్రాలు , పుణ్యతీర్ధలు గల భారత దేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అనే పన్నెండు  జ్యోతిర్లింగాలు స్వయం ప్రతిష్టితాలు. అనగా వాటికవే ఆవిర్భవించిన మహిమాన్విత  లింగాలు. అనంతమైన తేజస్సుతో, వేదకాలమునాటికి పూర్వంనుండి భక్తజనాన్ని తరింప  చేస్తున్న లింగాలే ఈ "ద్వాదశ జ్యోతిర్లింగాలు".  1. సౌరాష్ర (గుజరాత్) దేశంలో సొమేశ్వరుడు.  2. ఆంధ్రప్రదేశములోని శ్రీ శైలంలో మల్లికార్జునుడు.  3. ఉజ్జయినిలో(మద్య ప్రదేశ్) శిప్రా నది తీరాన మహా కాలేశ్వరుదు.  4. మాలవ్యదేశంలొ(మద్య ప్రదేశ్) నర్మదానది తీరాన ఓంకారేశ్వరుడు.  5. హిమాలయాల్లో(ఉత్తరాంచల్) మందాకినీ శిఖరాన కేదారేశ్వరుడు.  6. ఢాకిని నగరాన(మహా రాష్ట్రం) భీమశంకరుడు.  7. కాశీ క్షేత్రంలో(ఉత్తర ప్రదేశ్) గంగానది తీరాన విశ్వేశ...

Magha Puranam Telugu: మాఘ పురాణం 28వ అధ్యాయం - మాఘ పురాణం విన్నా, చదివినా- ఇహలోకంలో భోగభాగ్యాలు- తరువాత వైకుంఠ ప్రాప్తి తథ్యం

Image
  గృత్స్నమద మహర్షి, జహ్ను మహర్షుల సంవాదం గృత్స్నమద మహర్షి, జహ్ను మహర్షితో "ఓ జహ్నువూ! ఓ వైపు బాలుడు అడవిలో శ్రీహరిని పూజిస్తూ కాలం గడుపుతుంటే, మరోవైపు సులక్షణుడు తన చిన్న భార్య కోసం తన పరివారాన్ని పంపించి అంతటా వెతికించినా ప్రయోజనం లేక, చేసేదేమి లేక మిన్నకుండెను. తల్లి, తండ్రి శ్రీహరియే ! అరణ్యంలో బాలుడు మిక్కిలి జ్ఞానవంతుడై శ్రీహరిని తల్లి, తండ్రిగా, స్నేహితుడిగా, సంకలన బంధువులుగా భావించి, సదా భక్తితో ఆ పుండరీకాక్షుని సేవిస్తూ ఆ తులసి చెట్టునే శ్రీహరిగా భావించి పూజిస్తూ ఆరు మాసములు గడిపాడు. ఎంతకూ శ్రీహరి ప్రసన్నుడు కాకపోవడం వల్ల ఆ బాలుడు విచారంతో ఉండెను. బాలునికి కర్తవ్యం బోధించిన ఆకాశవాణి ఒకనాడు ఆకాశవాణి బాలునితో "ఓ రాజపుత్రా! నీకు సమీపంలో ఉన్న సరస్సులో మాఘమాసమున మకరరాశియందు సూర్యుడు ఉండగా ప్రాతఃకాలమున స్నానం చేసి శ్రీహరిని పూజించిన శ్రీహరి ప్రసన్నుడు కాగలడు" అని పలికింది. బాలునికి శ్రీహరి సాక్షాత్కారం అశరీరవాణి మాటలు విన్న బాలుడు మాఘమాసంలో సూర్యోదయ సమయంలో సరస్సులో స్నానం చేసి షోడశోపచారాలతో శ్రీహరిని పూజించాడు. మాఘశుద్ధ చతుర్దశి రోజు ఆ శ్రీహరి బాలునికి ప్రత్యక్షమై తన ప...

Magha Puranam Telugu: మాఘ పురాణం 27వ అధ్యాయం - పూర్వజన్మ పాపం వల్ల పుత్రశోకం- పులి చేతిలో చిన్న భార్య దుర్మరణం- సులక్షణ రాజు కథ

Image
  గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షుల సంవాదం గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షితో "ఓ జహ్నువు! మాఘ మాస మహాత్యమును ఇంకా చెబుతున్నావు శ్రద్ధగా వినుము" అంటూ మాఘ పురాణం ఇరవై ఏడవ అధ్యాయాన్ని చెప్పడం ప్రారంభించాడు. మాఘ పురాణం ఇరవై ఏడవ అధ్యాయము సులక్షణ రాజు కథ ద్వాపరయుగంలో సూర్యవంశంలో జన్మించిన అంగదేశాధిపతి అయిన సులక్షణుడనే రాజు కలడు. ఇతను మిక్కిలి ధర్మాత్ముడు. ప్రజారంజకంగా పరిపాలిస్తుండేవాడు. ఈ రాజుకు నూరుమంది భార్యలు ఉన్నప్పటికినీ సంతానం లేకుండెను. సులక్షణుడు పుత్రసంతానం కోసం అనేక ధర్మకార్యములు చేసినప్పటికిని పుత్రులు కలగక పోవడంతో చింతాక్రాంతుడై తనలో తాను 'పూర్వజన్మలో నేను ఎలాంటి పుణ్యకార్యాలు చేసి ఉండలేదు కాబట్టి నాకు పుత్రులు కలగలేదు. ఈ లోకంలో దరిద్రునకు, సంతానం లేనివారికి, చేసిన మేలు మరచిన వాడికి, వేదము రాని విప్రునకు సద్గతులు ఉండవని అంటారు కదా! నేను ఎలాగైనా మునీశ్వరులు ఆశ్రమాలకు వెళ్లి వారికి సేవచేసి నా అభీష్టం తెలిపి సంతానం పొందే ఉపాయం తెలుసుకుంటాను" అనుకొని విచిత్రమైన రథమెక్కి పరివారంతో కలిసి నైమిశారణ్యానికి చేరుకున్నాడు. మునీశ్వరులను సేవించిన సులక్షణుడు సులక్షణుడు నైమిశారణ్యాని...

Maha Shivaratri: శివయ్య పూజలో చేయాల్సినవి, చేయకూడనివి

Image
 శివరాత్రి రోజున భక్తులు శివాలయానికి వెళ్లి రోజంతా ఉపవాసం ఉండి శివలింగానికి శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలు, గంగాజలం, పాలు, పెరుగు, ఉమ్మెత్త పువ్వులు వంటి వాటితో అభిషేకం చేస్తారు. మహా శివరాత్రి నాడు ఏమి చేయాలంటే ..  మహా శివరాత్రి నాడు ఉదయాన్నే స్నానమాచరించి, ఉపవాస దీక్ష చేపట్టి పూజించాలి. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించిన తరువాత ఇంటికి సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్లి శివలింగానికి జలాభిషేకం చేయండి. శివయ్యకు జలాభిషేక సమయంలో శివలింగంపై బిల్వ, జమ్మి, పాలు, గంగాజలం, పువ్వులు, తేనె, ఉమ్మెత్తను సమర్పించండి. అంతేకాదు మహాశివరాత్రి రోజున  మహామృత్యుంజయ మంత్రంతో పాటు అన్ని శివ మంత్రాలను పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. మహా శివరాత్రి నాడు ఏమి చేయకూడదంటే .. మహా శివరాత్రి రోజున మాంసం, మద్యం, ఉల్లి-వెల్లుల్లి వంటివి తీసుకోకూడదు. అంతేకాదు శివాలయంలో కొన్ని వస్తువులను సమర్పించడం నిషేధం. తులసి ఆకులు, పసుపు, కుంకుమ, కొబ్బరి నీళ్లు సమర్పించకూడదు. అంతేకాదు కాదు.. శివలింగ పూజలో శంఖాన్ని ఉపయోగించకూడదు.

Maha Shivaratri: మహా శివరాత్రి రోజున ఉపవాస సమయంలో ఏమి తినాలి, ఏమి తినకూడదు

Image
శివరాత్రి రోజున జాగారానికి, ఉపవాసానికి విశిష్టమైన స్థానం ఉంది. మహాశివరాత్రి పండుగ రోజున చాలా మంది ‘నిర్జల వ్రతాన్ని’ ఆచరిస్తారు. అంటే కొందరు భక్తులు నీరు మాత్రమే తాగుతారు. మరికొందరు పండ్లు, పాలు, తృణధాన్యాలు  తిని ఉపవాసం ఉంటారు. మహా శివరాత్రి ఉపవాసం.. శివరాత్రి రోజు ఉదయం ప్రారంభమై మరుసటి రోజు ఉదయం ముగుస్తుంది. ఉపవాస నియమాలు అన్ని శివరాత్రిలకు ఒకే విధంగా ఉంటాయి. మహా శివరాత్రి జాగరణ-ఉపవాసం నియమాలు మహాశివరాత్రి జాగరణ, ఉపవాసం చేయాలి అనుకుంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. సూర్యోదయం తర్వాత నిద్రలేచిన వారు చేసే జాగరణ ఫలితాన్నివ్వదు వేకువజామునే స్నానమాచరించి భక్తిశ్రద్ధలతో భోళాశంకరుడిని పూజించాలి పూజ సమయంలో శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. జాగరణ అంటే భౌతికంగా మేల్కొని ఉండాలన్న ఆలోచనతో ఏదో టైమ్ పాస్ చేయడం కాదు... రోజంతా పంచాక్షరి నామస్మరణలో, శివయ్య నామస్మరణలో గడపాలి శివరాత్రి రోజున శివ లింగం దగ్గర నేతి దీపం వెలిగించడం శుభప్రదం శివరాత్రి ఉపవాసం ఫలితం సంపూర్ణంగా దక్కాలంటే మర్నాడు చతుర్థశి తిథి ముగిసేలోగా ఉపవాసం విరమించాలి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఒక్కపూట భోజనం చేసి శివనామస...

Shiva Tandavam: శివ తాండవం

Image
శివుడు నాద శరీరుడు. ప్రతిరోజు సంధ్యాసమయంలో ఆయన మహోత్సాహంతో చేసే వీరతాండవాన్ని చూడటానికి బ్రహ్మాదిదేవతలు పోటీపడి వస్తూ ఉంటారని అంటారు. వివిధ వాయిద్యాలతో తాళమేళాలతో అనునిత్యం ప్రతిరోజు కొనసాగే ఈ తాండవంతో కైలాసం కదిలిపోతుందని ప్రతీక. ముఖ్యంగా శివుడి తల పై ఉన్న గంగ గజగాజలాడుతూ తొణికి పోతుందనీ ఎక్కడ శివుడు ఆగ్రహంతో మూడవ కన్ను తెరుస్తాడో అన్న భయంతో దేవతలు కూడ హడలి పోతారని అంటారు. ఇలాంటి శివ తాండవంలో ఒక పరమాణువుల శక్తి దాగుందని 1972 లో ఫ్రిట్జఫ్ కాప్రా అనే భౌతిక శాస్త్ర వేత్త తన పరిశోధనలో తెలియచేసాడు. పరమాణువులు నిరంతరంగా జనిస్తూ ఉండే ఈ శివ నాట్యంలోని లయ నేటి భొతిక శాస్త్రం కనిపెట్టిన అణుబాంబుకు దగ్గరలో ఉంటుందనీ ఆ విదేశీ భౌతిక శాస్త్రవేత్త తెలియ చేయడమే కాకుండా ప్రతి అణుబాంబులో ఉండే ప్రోటాన్ సృష్టికి శివతాండవం నిదర్శనం అంటూ మరో విదేశీ భౌతిక శాస్త్రవేత్త కెన్నెత్ ఫోర్డ్ అభిప్రాయ పడ్డారు అంటే శివతాండవంలో చైతన్యం ఏస్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. శివుడు శివతాండవంలో ఢమరుకం మోగిస్తాడు. అయితే ఆ ఢమరుక శబ్దాల వెనుక వేదాలలో ఉండే నమక చమక శబ్దాల అర్ధాలు వినిపిస్తాయి అని అంటారు. అందువల్లనే ఐదు రూపాలతో శివ ...

Maha Shivaratri: మహాశివరాత్రి

Image
మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రిగా ప్రసిద్ధం. పరమశివునికి ప్రధానమైన పర్వదినం ఈ మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి విధులలో పగలు ఉపవాసం చేయడం, రాత్రి జాగరణ చేయడం ముఖ్యమైనవి. మహాశివరాత్రి రోజు వేకువ జామున నిద్రలేచి,స్నానాదికాలు ముగించి,శివాలయానికి వెళ్లి పరమేశ్వరుని దర్శించాలి. అవకాశం ఉంటే నదిలో కానీ, సముద్రంలో కానీ పుణ్య స్నానం చేయడం మంచిది. తరువాత శివాలయంలో కానీ, ఇంటి లో కానీ పరమశివుని అభిషేకించి బిల్వదళాలతోను,పలు రకాల పూలతోను అర్చించాలి. మహాశివరాత్రి నాటి నాలుగు జాములలో విధి విధానంగా, క్రమపద్ధతిలో శివుని అర్చించాలి అని శాస్త్రవచనం. ఆలా వీలుకానప్పుడు ప్రదోష కాలంలో శివునికి అభిషేకం చేయాలి. ఈ విధంగా శివుని అర్చించక ఆ రాత్రి అంతా జాగారం చేయాలి. అంటే రాత్రి అంతా నిద్రచకుండా శివప్రార్ధనతో, స్తోత్ర  పారాయణలతో, శివగాథలతో, భజనలతో గడపాలి. మరుసటి రోజున స్నానాన్ని ఆచరించి, పరమశివుని షాడోపచారాలతో పూజించాలి. ఈ శివరాత్రి ఆచరణ వల్ల చెప్పలేనంత శుభా ఫలితాలు లభిస్తాయి.సర్వ పాపాలు హరించబడి, అనంతమైన పుణ్యం లభిస్తుంది.  2025: ఫిబ్రవరి 26.

Shiva Puranam: శివమహాపురాణం

Image
అష్టాదశ పురాణాలలో శివపురాణం నాలుగోది. వాస్తవానికి ఇది చాలా పెద్దది. తొలుత 12 సంహితలతో లక్ష శ్లోకాలతో ఉండేదంటారు. ప్రస్తుతం ఈ పురాణాన్ని 24వేల శ్లోకాలకు కుదించారు.వాయువేయ సంహితలో శివమహాపురాణానికి సంబంధించిన ఎన్నెన్నో అంశాలు ప్రస్తావితమై ఉన్నాయి. శివమహా పురాణంలో ఉన్న సంహితలు, ఖండాల్లో శివతత్త్వసారం తేటతెల్లమవుతుంది. ఈ పురాణానికి సంబంధించి విద్యేశ్వర సంహితలో 25 అధ్యాయాలున్నాయి. ప్రత్యేకించి సృష్టి ఖండం అనే దానిలో 20. సతీ ఖండంలో 43, పార్వతీ ఖండంలో 55, కుమారఖండంలో 20, యుద్ధఖండంలో 59 అధ్యాయాలున్నాయి. ఉమాసంహితలో 51, కైలాస సంహితలో 23 అధ్యాయాలున్నాయి. శివపురాణానికి సంబంధించిన వాయవీయ సంహిత రెండు భాగాలుగా ఉంటుంది. మొదటిదానిలో 35. రెండో దానిలో 41 అధ్యాయాలున్నాయి. ఈ సంహితలన్నింటిలోని ఖండాలు, అధ్యాయాలన్నింటిలోనూ శివ సంబంధమైన ఎన్నెన్నో ఉపాఖ్యానాలతో పాటు శివపూజా విధానాలు కూడా ఉంటాయి. బ్రహ్మాది దేవతలు శివుణ్ణి స్తుతించిన స్తోత్రాలు, శివుని గురించి తపస్సు చేసిన భక్తుల, దేవతల విశేషాలు కనిపిస్తాయి. అలాగే దక్షమహాయజ్ఞలాంటి వాటి వివరాలు పూర్తిగా ఇందులో వర్ణితమయ్యాయి. శివుడు చంద్రుణ్ణి ధరించడానికి కారణం, సృష్...

Shivalayam Pradakshina: శివాలయ ప్రదక్షిణ

Image
'ప్ర' అంటే భయాన్ని పోగొట్టేది. 'డ' అంటే మోక్షాన్ని ఇచ్చేది. 'క్షి' అంటే రోగాలను పారద్రోలేది. 'ణ' అంటే సకలసాభాగ్యాలను కలిగించేది. ఈ నాలుగు అక్షరాలను కలిపితే ప్రదక్షిణం అవుతుంది. ఈ ప్రదక్షిణ వలన కలిగే లాభాలు ఇన్ని అన్ని కావు. కానీ దాన్ని నియమంగా ఆచరిస్తేనే సత్ఫలితం కలుగుతుంది. ప్రదక్షిణ సూత్రాలు : మెల్లగా నడవాలి  తనచుట్టూ తాను కుడివైపుగా తిరగడం ఆత్మప్రదక్షిణం అంటారు.  ఒక ప్రదక్షిణం చేస్తే బ్రహ్మహత్యాదిపాతకాలు, రెండు ప్రదక్షిణాలతో శివానుగ్రహం, మూడు ప్రదక్షిణలతో ఇంద్రుని వంటి ఐశ్వర్యం కలుగుతుంది.  ఇదంతా మానవులచే నిర్మించబడిన శివాలయంలో చేస్తే కలిగే ఫలితం. ప్రదక్షిణ ఫలం : మానవులచే నిర్మించబడిన శివాలయాలలో చేసే ప్రదక్షిణం కంటే ఋషులతో ప్రతిష్ఠించబడిన శివాలయాల్లో చేసే ప్రదక్షిణ రెండు రెట్లు ఫలితాన్ని ఇస్తుంది.  దేవతలచే ప్రతిష్ఠించబడిన శివాలయాలలో మూడు రెట్లు  గాణపలింగాల చుట్టూ చేస్తే నాలుగురెట్లు  శ్రీశైలం వంటి స్వయంభులింగం చుట్టూ చేస్తే ఐదు రెట్లు ఫలితం కలుగుతుంది.  ఒక వేళ ప్రయాణాలలో ఈ ప్రదక్షిణ భాగ్యం కలగకపోతే ఆయా లింగాలను స్మరించి ఆత్మ ప్రదక్షిణ చేసుకుంటే అంత ...