Posts

Showing posts from January, 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 3వ అధ్యాయం- శివపార్వతుల సంవాదం- సుమిత్రుడు తపస్సు చేసి మోక్షం పొందిన కథ

Image
 శివపార్వతుల సంవాదం కైలాసంలో పార్వతీదేవి పరమ శివునితో "నాథా! సుదేవుని కుమార్తె తన భర్తతో కలిసి మోక్షం పొందిన తర్వాత ఏ పాపం తెలియని సుమిత్రుడు ఏమయ్యాడు? అతని పాపాలకు ఏ విధంగా పరిహారం లభించింది? సవివరంగా తెలియజేయండి" అని కోరగా పరమ శివుడు పార్వతితో "పార్వతీ! సుదేవుని శిష్యుడు సుమిత్రుడు కొంత కాలానికి తన గురువుతో 'గురువర్యా! మీ కుమార్తె ప్రోద్భలంతోనే నేను చేయరాని పాపం చేశాను. తాను చెప్పినట్లుగా వినకపోతే ఆమె ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. నాతో కలిసి వచ్చిన గురు పుత్రిక మరణిస్తే మీరు నన్ను శపిస్తారేమో అన్న భయంతో ఆ రోజు ఆమె చెప్పినట్లుగా చేయరాని పాపానికి ఒడిగట్టాను. ఇప్పుడు నేను ఏ ప్రాయశ్చిత్తం చేసుకుంటే నా పాపం పోతుందో మార్గం చెప్పండి' అని దీనంగా వేడుకుంటున్నాడు. దీనితో సుమిత్రుని చూసి గురువు అనునయంగా ఇలా పలికాడు. సుమిత్రునికి పాపవిమోచనం చెప్పిన సుదేవుడు సుదేవుడు సుమిత్రునితో "నీవు వెంటనే గంగానదీ తీరానికి వెళ్లి అక్కడ 12 సంవత్సరాలు కఠినమైన తపస్సు చేస్తే నీకు పాపం నుంచి విముక్తి కలుగుతుంది" అని చెప్పగా, సుమిత్రుడు వెంటనే గంగా నది తీరానికి బయలు దేరాడు. మార్గమ...

Magha Puranam Telugu: మాఘ పురాణం 2వ అధ్యాయం- వ్రత మహత్యంతో స్వర్గానికి వెళ్లిన దంపతులు కథ

Image
కైలాసంలో పరమ శివుడు పార్వతితో "ఉమాదేవి! మాఘ స్నానం మహత్యం ఎంత చెప్పినా తనివితీరదు. పూర్వం మాఘ స్నానం ఆచరించి ఓ బ్రాహ్మణ స్త్రీ తన భర్తతో కలిసి స్వర్గానికి చేరుకున్న కథను చెబుతాను వినుము" అంటూ ఇలా చెప్పసాగెను. బ్రాహ్మణ స్త్రీ వృత్తాంతం పూర్వం సౌరాష్ట్ర ప్రాంతమందు బృందారకమనే గ్రామంలో సుదేవుడను బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదవేదాంగాలను చదివిన సుదేవుడు ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని సమస్త వేదసారాలను గ్రహించిన అనేకమంది శిష్యులతో కలిసి సదాచారవంతుడై జీవిస్తూ ఉండేవాడు. ఈ బ్రాహ్మణునికి సునంద అనే యవ్వనవతియైన అపురూప సౌందర్యవతియైన కుమార్తె ఉండేది. సుదేవుడు ఇంతటి సౌందర్యవతి అయిన కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయాలా అని నిరంతరం ఆలోచిస్తుండేవాడు. సుమిత్రునితో కలిసి అరణ్యానికేగిన సునంద ఒకనాడు గురువుగారి పూజ కోసం, హోమం కోసం పూవులు, సమిధలు తేవడానికి సుదేవుని శిష్యులలో ఒకడైన సుమిత్రుడు అరణ్యానికి బయల్దేరాడు. ఆశ్రమంలో బంతాట ఆడుకుంటున్న సునంద ఆడుకుంటూ ఆడుకుంటూ సుమిత్రునితో పాటు అరణ్యానికి వెళ్లింది. అరణ్యంలో చాలా దూరం వెళ్లాక కావలసినవి సేకరించిన తర్వాత అలసిపోయిన సుమిత్రుడు ఓ ప్రదేశంలో సేదతీరాడు. ముగ్ద మనోహ...

Magha Navaratri 2025: మాఘ గుప్త నవరాత్రి

Image
మాఘ శుద్ధ పాడ్యమి నుండి మాఘ గుప్త నవరాత్రులు జరుపుకుంటారు. ఇవి తంత్ర సాధనకు చాలా ముఖ్యమైనవి. ఈ తొమ్మది రోజులపాటు దుర్గమాతను ఆరాధిస్తారు.నవరాత్రుల్లో ముందుగా కలశ స్థాపన చేస్తారు. నవరాత్రి తొలి రోజు నీరు లేదా ముడి బియ్యంతో నిండిన కలశాన్ని, కొబ్బరి, మామిడి ఆకులతో అలంకరించి దుర్గాదేవిని ఆరాధించే స్థలంలో ఉంచుతారు. అనంతరం ఆ మాతకు ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు. ఈ ఆరాధన కోరికలు నెరవేర్చు కోవడం కోసం, విజయాలు సాధించుకోవడానికి ప్రత్యేకంగా చేస్తారు. గృహస్థులు ఈ నవరాత్రులలో సాత్విక దేవిని మాత్రమే పూజించాలి. తామసిక పూజను తాంత్రికులు, అఘోరీలు మాత్రమే చేస్తారు. గుప్త నవరాత్రుల ధ్యాన కాలంలో తపస్సు, కర్మలు, ధ్యానం మొదలైన వాటిని రహస్య మార్గంలో పఠించడంవల్ల జీవితంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఈ నవరాత్రుల్లో సాధకులు ఉపవాసం పాటిస్తారు. మాఘ గుప్త నవరాత్రులు భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా జరుపుకుంటారు. మాఘ గుప్త నవరాత్రులలో భక్తులు సూర్యోదయానికి ముందే లేచి, స్నానం చేయాలి. పూజా గదిని శుభ్రం చేసి, అలంకరించుకోవాలి....

Vasantha Panchami: వసంత పంచమి

Image
మాఘమాసంలో వచ్చే అయిదో తిధి వసంత పంచమి.  సరస్వతి అనే పదం నుంచి సారస్వతమనే మాట పుట్టింది.  మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి, మదన పంచమి, సరస్వతి జయంతి అనే పేరులతో వ్యవహరిస్తారు. మాఘమాసం నుండి ఐదు మాసాలపాటు అన్ని శుభకార్యాలు మనం ఆచరిస్తూ ఉంటాం. కనుక మాఘ మాసమే వసంత రుతు శోభలకు ఆరంభ మాసం. మాఘమాసంలో తొలిగా చదువుల తల్లి సరస్వతి దేవిని పూజించాలి. శ్రీ పంచమి నాడు ఆలయాలలో పిల్లలకు అక్షరాబ్యాసం చేస్తారు. సరస్వతి మాతతో పాటు వినాయకుడిని, భూదేవి, విష్ణువు, శివుడు, సూర్యుడిని కూడా శ్రీ పంచమి రోజు పూజిస్తారు. బృహస్పతి దేవతలకు గురువు. విద్యాసంపద గల్ల బృహస్పతి కూడా విద్యాసిద్ధి కోసం సరస్వతి అమ్మవారిని ఆశ్రయించాడు. ఆదిశేషుడు కూడా సరస్వతి దేవిని ఉపాసించి భూదేవికి జ్ఞానబోధ చేయగలిగాడు అని బ్రహ్మపురాణంలో ఉంది. ప్రకృతి మూడో రూపమైన శ్రీ మహాసరస్వతి పరబ్రహ్మ నుండి అవిర్భించింది. మాట, బుద్ధి, విద్యకు ఆమె అధిదేవత . శ్రావణ పౌర్ణమి రోజు వేదం అధ్యాయం ప్రారంభించి, మాఘ శుద్ధ పంచమి తిధి రోజు పరిసమాప్తి చేసే ఆచారం ఉంది. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, స్కంద పురాణం, బ్రహ్మ పురాణంలో అమ్మవారి వైభవం వర్ణి...

Rathasaptami: రథసప్తమి

Image
రథసప్తమిని మాఘసప్తమి అని కూడా పిలుస్తారు. మాఘ మాసం లో వస్తుంది కాబట్టి మాఘ సప్తమి అని అంటారు. ఈ పండుగ మాఘమాసంలో శుక్ల పక్ష సప్తమి రోజు వస్తుంది. ఈ రోజు సూర్యభగవానుని పుట్టినరోజుగా భావించి దీనిని సూర్య జయంతిగా కూడా పిలుస్తారు. మాఘ సప్తమి రోజు సూర్యభగవానుడు తన రథంని ఉత్తర వైపు త్రిప్పుతాడు కాబట్టి దీనికి రథసప్తమి అని పేరు.  ఈ పండుగను భారతదేశంలోని హిందువులు అత్యంత భక్తి శ్రద్ధల తో జరుపుకుంటారు . అని సూర్య దేవాలయాలులలో ఈ పండుగ సంబరాలు ముందు గానే మొదలు అవుతాయి. రథ సప్తమి తో వసంత ఋతువు మొదలు అవుతుంది,కొంత మంది రైతులు సాగుకి అనువైన సమయంగా భావిస్తారు. సూర్యభగవానుడు రథానికి  వున్నా ఏడు తెల్ల  గుర్రాలు ,ఇంద్రధనస్సులోని  ఏడు రంగులను సూచిస్తాయి, అలాగే వారంలోని ఏడు రోజులుకు గుర్తు. రథానికి వున్నా పన్నెండు చక్రాలు సంవత్సరానికి వున్నా పన్నెండు నెలలు సూచిస్తాయి.రథ సప్తమి నుంచి దక్షిణ భారతదేశంలో క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. పురాణాల ప్రకారం శ్రీరామచంద్రుడు కూడా రావణుని చంపడానికి ముందు సూర్యభగవానుడుని పూజించి ఆదిత్య హృదయం పఠించాడు అని చెప్తారు.మహాభారతం లో కుంతీ దే...

Govinda Namalu: శ్రీ గోవింద నామాలు

Image
ప్రతి రోజు గోవిందా నామాలు చదవడం వల్లనా మనసు ప్రశాంతంగా ఉంటుంది. శ్రీ శ్రీనివాసా గోవిందా |  శ్రీ వేంకటేశా గోవిందా | భక్తవత్సల గోవిందా | భాగవతప్రియ గోవిందా | గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా | గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా | నిత్యనిర్మలా గోవిందా | నీలమేఘశ్యామ గోవిందా | పురాణపురుషా గోవిందా | పుండరీకాక్ష గోవిందా | నందనందనా గోవిందా | నవనీతచోర గోవిందా | పశుపాలక శ్రీ గోవిందా | పాపవిమోచన గోవిందా | శిష్టపరిపాలక గోవిందా | కష్టనివారణ గోవిందా | దుష్టసంహార గోవిందా | దురితనివారణ గోవిందా | వజ్రమకుటధర గోవిందా | వరాహమూర్తివి గోవిందా | గోపీజనప్రియ గోవిందా | గోవర్ధనోద్ధార గోవిందా | దశరథనందన గోవిందా | దశముఖమర్దన గోవిందా | పక్షివాహన గోవిందా | పాండవప్రియ గోవిందా | మత్స్యకూర్మా గోవిందా | మధుసూదనహరి గోవిందా | వరాహనరసింహ గోవిందా | వామన భృగురామ గోవిందా | బలరామానుజ గోవిందా | బౌద్ధకల్కిధర గోవిందా | వేణుగానప్రియ గోవిందా | వేంకటరమణ గోవిందా | సీతానాయక గోవిందా | శ్రితపరిపాలక గోవిందా | దరిద్రజనపోషక గోవిందా |...

Tila Chaturthi: తిలచతుర్థి

Image
మాఘమాసంలో వచ్చే శుద్ధ చతుర్థిని 'తిలచతుర్థి' అంటారు. ఈ వ్రతానికి సాయంకాలం చవితి ముఖ్యం. ఈ రోజు గణపతిని పూజించాలి. నువ్వులతో వండిన పదార్ధాన్ని నివేదించాలి.  నువ్వులతో హోమం చేయాలి, రాగి పంచపాత్రను నువ్వులతో నింపి బ్రాహ్మణుడికి దానం చేయాలి. అతనికి తిలలతో చేసిన పదార్థంతో భోజనం పెట్టాలి. నువ్వులతో చేసిన వాటిని స్వయంగా తినాలి.  ఈ విధంగా అయిదు 'చవితి' లు అంటే ఆషాడ శుద్ధ చవితి వరకు చేయాలి.  ఆ తరువాత పూజించిన గణపతి మూర్తిని బ్రాహ్మణునికి దానం చేయాలి. దీనినే  వరాహపురాణం ' అవిఘ్నకరవ్రతం' అంటోంది. సగరుడు అశ్వమేధయాగానికి ముందు, శివుడు త్రిపురాసుర సంహారానికి ముందు, శ్రీ మహావిష్ణువు సముద్ర మధనానికి ముందు ఈ వ్రతాన్ని ఆచరించినట్లు తెలుస్తోంది.  తిల చతుర్థి పూజా విధానం తిల చతుర్థి పూజా విధానం గురించి స్కంద పురాణంలో వివరంగా ఉంది. ఈ రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి శుచియై నిత్య పూజాదికాలు ముగించుకొని గణపతి సమక్షంలో దీక్ష తీసుకోవాలి. పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం గణపతిని పూజించాలి. ఇంట్లో కానీ, ఆలయంలో కానీ గణేశుని పంచామృతాలతో అభిషేకించి, జిల్లేడు పూలు, గరిక సమర్పించాలి. అష్ట...

Magha Snanam Importance: మాఘస్నానం విశిష్టత

Image
మాఘ స్నానాలకు సాటివచ్చే క్రతువులుగాని, క్రియలుకాని లేవని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పుణ్యస్నానం విశేషాలు బ్రహ్మపురాణంలోను, పద్మపురాణంలోను వివరించబడాయి. పుష్యబహుళ అమావాస్య రోజున అంటే మాఘమాసం ప్రారంభమయే ముందురోజు ఆరంభించి, మాఘమాసం అంత నియమంగా ప్రతి రోజు చేయాలి. అన్ని రోజులు వీలుకానప్పుడు మాఘశుద్ధ పాడ్యమి, విదియ, తదియలలో మూడురోజులు చేయవచ్చు. మాఘ స్నానాలను పుణ్యనదులలో చేయడం విశేష ఫలదాయకం. అందుకు అవకాశం లేకపోతే చెరువుల వద్ద, బావుల వద్ద కనీసం బోరు బావుల దగ్గరైనా ఈ మాఘ స్నానాలు చేయవచ్చు. ఈ స్నానాన్ని నక్షత్రాలు ఉండగా తెల్లవారుజామున చేయడం ఉత్తమం. మాఘ స్నానాలు నూనె రాసుకొని చేయకూడదు అని శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. ఈ మాఘస్నానాలు చేయడం వల్ల కాయిక, వాచిక , మానసిక దోషాలు తొలగిపోతాయి. అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. ఆయురారోగ్యాలు చేకూరతాయి. మాఘమాసంలో ప్రతి రోజు నియమానుసారంగా మాఘమాస స్నానం చేస్తే వారి వారి కోరికలన్నీ నెరవేరుతాయని పద్మపురాణంలో పేర్కొన్నారు. మాఘస్నానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. మాఘస్నానం వలన మహాపాపాలు కూడా నశిస్తాయని నిర్ణయ సింధులో చెప్పారు. వర్ణ, వర్గ, ప్రాంత బేధాలు లేకుండా అందరూ మాఘస్నా...

Magha Puranam Telugu: మాఘ పురాణం మొదటి అధ్యాయం - శంకరుడు పార్వతిదేవికి మాఘ మాస మహిమ తెల్పుట

Image
మాఘ పురాణం మొదటి అధ్యాయం వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణ లోని మాఘ పురాణం మొదటి అధ్యాయం - పరమ శివుడు పార్వతికి మాఘమాసం మహిమ తెలుపుట శివపార్వతుల సంవాదం పూర్వం కైలాసంలో శివ పార్వతులు కూర్చుని ఉండగా పార్వతి పరమ శివునితో "నాధా మీ అమృత వాక్కులచే నేను ఎన్నో పురాణాలు విన్నాను. విన్న కొద్దీ ఇంకా వినాలని కుతూహలం కలుగుతున్నది. ప్రయాగ మహాత్య సహితమగు మాఘ మాస మహాత్యమును నాకు సవివరంగా తెలియజేయుము" అని ప్రార్థించగా ఆ కైలాసనాథుడు ప్రసన్న చిత్తుడై "ఓ పార్వతీ! అత్యంత మహిమాన్వితమైన మాఘ మాస మహత్యంను వివరిస్తున్నాను. శ్రద్ధగా వినుము" అంటూ ఇట్లు చెప్పసాగెను. మాఘ స్నాన మహత్యం సూర్యుడు మకర రాశిలో ఉండగా ఏ మనుజుడు మాఘ మాసమున ప్రాతఃకాలమందు నదీ స్నానం చేయునో అతడు అన్ని పాపముల నుంచి విముక్తుడై అంత్యమున మోక్షాన్ని పొందును. మాఘ మాసంలో ప్రాతః కాలమందు ప్రయాగలో ఎవరైతే స్నానం చేస్తారో వారు వైకుంఠమును చేరుదురు. మాఘ మాసంలో ఊరి చివర చెరువులో కానీ, బావులలో కానీ, కడకు గోవు పాదం మునిగినంత గుంటలో అయినా స్నానం చేసిన వారు సమస్త పాతకముల నుంచి విముక్తులవుతారు. మాఘ మాసంలో మొదటి రోజు నదీ స్నానం చేస్తే సమస్త పాపం ...

Magha Month: మాఘ మాసం 2025

Image
మాఘ మాసం హిందూ కేలండర్ ప్రకారం 11వ  నెల. మాఘ మాసం అంటే సంస్కృతం లో పాపాలను హరించే మాసం అని అర్ధం.  శివకేశవులిద్దరికి ప్రీతికరమైనది మాఘమాసం. పల్లకి ఆకారంలో వుండే అయిదు నక్షత్రాల మండలం ముఖ నక్షత్రం. అటువంటి  ముఖ నక్షత్రంలో పౌర్ణమి తిధినాడు పూర్ణకళలతో చంద్రుడు ఉంటాడు కాబట్టి మాఘమాసం అనే పేరు వచ్చింది.  మాఘమాసంలో సూర్యుడు  కుంభ రాశిలో సంచరిస్తాడు. అధిష్ఠాన దేవత వినాయకుడు, ఈ మాసంలో వినాయక ఆరాధన సర్వవిఘ్ననాశిని.సూర్యుని కిరణాలూ నేలపై జలాలను తేజోమయంగా మార్చేది మాఘమాసంలోనే. ఈ మాసంలో చేసే నది, సముద్ర స్నానాలు సర్వపాపహరణాలు, ముక్తి ప్రదాయకాలు. కార్తీక మాసం లో దీపారాధనకు ఎంత ప్రాముఖ్యత ఉందొ, మాఘ మాసం లో నది లేదా సముద్ర స్నానాలకు అంత ప్రాధాన్యం వుంది. ఈ నెలలో చేసే అరుణోదయ స్నానం సంపూర్ణ ఆరోగ్యాన్ని, తేజస్సును కలుగచేస్తుంది.  ఈ మాసం లో నే వసంత ఋతువు  మొదలు అవుతుంది కాబట్టి ప్రకృతి కొత్త అందాల తో ముస్తాబు అవుతుంది. పవిత్ర తీర్థమైన శ్రీ కాళహస్తి స్వర్ణ ముఖి నది, రామేశ్వరం సేతు సంగమం, ప్రయాగ  త్రివేణి సంగమంలో, ఇతర పవిత్ర నదులలో చేసే మాఘస్నానాలు పుణ్యబలంతో పాటు శక...

Shodasha Samskaras: షోడశ సంస్కారాలు

 వేదాలు, పురాణాలలో చెప్పబడిన కొన్ని కర్మలను, విధులను నిర్వహించడం ద్వారా మనస్సు, శరీరాలకు ఒక గొప్ప విశేషం లేదా పవిత్రత కలిగించడాన్ని సంస్కారం అని చెప్పవచ్చు. అంటే దోషాలను పోగొట్టి గొప్ప గుణములను కలిగించుట సంస్కారం. ఉన్న స్థితినుండి ఉన్నత స్థితికి చేరుకునేలాగా చేయడమే సంస్కారం. ఇంకోరకంగా చెప్పాలంటే సంస్కారం అంటే మంచి చేయడం. సంస్కారాల వల్ల మనిషి సంస్కరించబడి దయ, ఓర్పు వంటి ఆత్మసంబంధమైన గొప్ప గుణాలు కలిగి చివరకు బ్రహ్మపదం పొందగలరని గౌతమాది మహర్షులు పేర్కొన్నారు. వివిధ రంగులతో ఒక ఆకారం ఎలా ఏర్పడుతుందో సంస్కారాల వల్ల ఉత్తమస్థితి కలుగు తుందని అంగిరస మహర్షి పేర్కొన్నారు. ఋగ్వేదం మొదలుకొని నాలుగు వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, స్మృతులు, పురాణాలు, నిబంధన గ్రంథాలు, ధర్మశాస్త్ర గ్రంథాలలో సంస్కారాల వివరాలు కనిపిస్తాయి. మనువు, బృహస్పతి, దక్షుడు, గౌతముడు, వశిష్ఠుడు, అంగిరసుడు, యోగీశ్వరుడు, యాజ్ఞవల్క్యుడు, పరాశరుడు, వ్యాసుడు, సత్యవ్రతుడు, ఋష్యశృంగుడు వంటి మహనీయు లెందరో సంస్కారాలను ఈ లోకానికి అందించారు. ఈనాడు 16 సంస్కారాలు అమల్లో ఉన్నాయి. వీటిని "షోడశ సంస్కారాలు" అనే పేరుతో పిలవడ...

NAGALAMADAKA SUBRAMANYA SWAMY: శ్రీ సుబ్రమణ్య స్వామి వారి ఆలయం - నాగలమడక

Image
కర్ణాటక రాష్ట్రంలో మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. అవి ఆది సుబ్రహ్మణ్య క్షేత్రమైన కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం, మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రమైన ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం, అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రమైన నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రం. ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది. ఈ మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో, వారికి ఉన్న సకల కుజ, రాహు, కేతు దోషాలు, సకల నవగ్రహ దోషాల నుంచి పరిహారం లభించి, స్వామి అనుగ్రహంతో సకల అభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. నాగలమడక ప్రదేశం విజయనగర రాజుల ఆస్థానానికి చెందినదని అంటారు. నాగలమడక కర్ణాటక రాష్ట్రంలోని పావగడ పట్టణం నుంచి 14 కి.మీ. దూరంలో ఉందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పురాణ ప్రాశస్త్యం శ్రీరామచంద్రుడు వనవాస కాలంలో నాగలమడక లో నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ కొన్ని రోజులు గడిపిన తర్వాత శ్రీరాముడు ఈ ప్రదేశం వదలి కామనదుర్గ కాకాద్రి కొండకు ప్రయాణమైనట్లు చెబుతారు. ఈ కొండనే కామిలకొండ అని పిలుస్తారు. ఈ కొండపై శ్రీ రామచంద్ర స్వామి వారి గుడి ఇప్పటికీ ఉండడం విశేషం. ఆలయ స్థల పురాణం నాగలమడకలో అన్నంభట్టు అనే బ్రాహ...

Magha Masam 2025: మాఘమాసంలోని విశేషమైన పండుగలు- పుణ్య తిథులు

Image
మాఘమాసంలో వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ మాసంలో 30 రోజులు పుణ్య తిధులే. మాఘ మాసం జనవరి 30 (గురువారం) నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 28 శుక్రవారంతో ముగుస్తుంది. జనవరి 30 మాఘ శుద్ధ పాడ్యమి: పరమ పవిత్రమైన మాఘ మాసం ప్రారంభం. నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఆరంభం. ఆలయాలలో మాఘ పురాణం ప్రారంభం. జనవరి 31 మాఘ శుద్ధ విదియ: చంద్రోదయం. మాఘ మాసంలో శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది. ఫిబ్రవరి 2 మాఘ శుద్ధ చవితి : దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి గరుడ సేవ. తిల చతుర్థి, కుంద చతుర్థి. ఫిబ్రవరి 3 మాఘ శుద్ధ పంచమి/ షష్ఠి : వసంత పంచమి , శ్రీ పంచమి. దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం. మహా కుంభ మేళాలో నాలుగవ రాజస్నానం. ఫిబ్రవరి 4 మాఘ శుద్ధ సప్తమి : రథసప్తమి. తిరుమల శ్రీవారి ఆలయంలో సకల వాహన సేవలు. ఫిబ్రవరి 5 మాఘ శుద్ధ అష్టమి : భీష్మాష్టమి ఫిబ్రవరి 6 మాఘ శుద్ధ నవమి: మధ్వనవమి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవం ప్రారంభం. దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సమాప్తం. ఫిబ్రవరి 7 మాఘ శుద్ధ దశమి: తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వా...

Nava Narasimha Temples: నవ నారసింహ క్షేత్రాలు

Image
నృసింహావతారం దాల్చిన స్వామిని పూజించే గుడులు అంతటా ఉన్నప్పటికీ స్వామి స్వయంభూగా వెలిసిన తొమ్మిది ఆలయాలు ఎక్కువ ప్రాచుర్యం చెందాయి. వీటినే నవ నారసింహ క్షేత్రాలు అని పిలుస్తారు.  యాదగిరిగుట్ట : నవనారసింహ క్షేత్రాల్లో ఒకటి తెలంగాణలో ప్రముఖ దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్న యాదగిరిగుట్ట. పూర్వం రుష్యశృంగుని కొడుకు యాద రుషి ఈ కొండమీద నరసింహుణ్ణి చూడాలని తపస్సు చేయగా, ఉగ్ర నరసింహుడు ప్రత్యక్షమయ్యాడట. ఆ ఉగ్రరూపం చూడలేక శాంతస్వరూపంతో కనిపించమని యాద రుషి కోరగా అప్పుడు స్వామి కరుణించి, లక్ష్మీసమేతుడై కొండపై కొలువుదీరాడట. ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే సకల రోగాలూ నయమైపోతాయనేది భక్తుల విశ్వాసం. ధర్మపురి : ఇది కరీంనగర్‌ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీతీరంలో ఉంది. రాక్షసవధ అనంతరం స్వామి ఇక్కడే తపస్సు చేశాడనీ, ఆపై స్వయంభూగా వెలిసి యోగానందుడిగా భక్తుల కోరికలు తీరుస్తున్నాడని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతాన్ని ధర్మవర్మ అనే రాజు పాలించినందుకే ధర్మపురి అని పేరు వచ్చిందనీ, ఆయన తపస్సు చేయడంవల్లే స్వామి ఇక్కడ వెలిశాడనేది ఇంకో కథనం. అహోబిలం : ఈ ఆలయం నవ నారసింహ క్షేత్రాల్లో ప్రధానమైనది...

Mauni Amavasya: మౌని అమావాస్య

Image
సూర్యుడు మకర సంక్రాతి పర్వదినాన ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశిస్తాడు.  ఆ తరువాత వచ్చే పుష్యమాస అమావాస్యను ‘మౌని అమావాస్య’ అంటారు.  ఆ రోజున పితృతర్పణాలూ, నదీ స్నానాలు చేయడం, మౌన వ్రతం పాటించడం (అంటే రోజంతా మాట్లాడకుండా ఉండడం) పుణ్యప్రదమన్నది శాస్త్రోక్తి.  మౌని అమావాస్యనాడు గంగానది అమృతంగా మారుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి.  ఆ రోజున వారణాసిలోని గంగానదిలో, అలహాబాద్‌ (ప్రయాగ)లోని త్రివేణీ సంగమంలో లక్షలాది ప్రజలు స్నానాలు ఆచరిస్తారు.  గంగా స్నానానికి అవకాశం లేనివారు సమీపంలో ఉన్న నదిలో, ఇతర నీటి వనరుల్లో గంగా దేవిని తలచుకొని స్నానం చేసి, ఆపన్నులకు దానాలు చేయడం మంచిదన్నది పెద్దల మాట. మౌని అమావాస్య రోజున పూర్వీకులకు తర్పణం సమర్పించడంవల్ల శుభ ఫలితాలొస్తాయని పురాణ వచనం.  మౌని అమావాస్య రోజున తమ మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజున మీ మాటలపై, మనసుపై నిగ్రహం కలిగి ఉండాలి. ఈ రోజున ఎవరికీ కీడు చేయకూడదు.వాగ్వాదం, తగాదాలకు దూరంగా ఉండాలి. కాకి, శునకం, గోమాతను పూర్వీకులకు సంబంధించినదిగా భావిస్తారు. కాబట్టి వీటికి ఏదైనా ఆహారం ఇవ్వడం మరచిపోవద్దు.  మౌని అమావాస్య రోజ...

Masa Shivaratri: మాస శివరాత్రి

Image
ప్రతినెలా ఒక మాస శివరాత్రి వస్తుంది. అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి తిథి పరమేశ్వరుని జన్మ తిధి. అందుకే ప్రతి నెలా పరమేశ్వర ప్రీత్యర్ధం మాస శివరాత్రిని విశేషంగా జరుపుకుంటాం. అయితే మాస శివరాత్రి జరుపుకోవాలంటే చతుర్దశి తిథి సాయంత్రం సమయంలో తప్పనిసరిగా ఉండాలి. మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి ? పరమశివుడు లయ కారకుడు. అంటే సృష్టిని అంతం చేసే వాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లయానికి కారకుడు కేతువు. అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి రోజు చంద్రుడు క్షీణంగా ఉంటాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనః కారకుడు. అంటే ఒక మనిషి మానసికంగా సంతోషంగా ఉండాలంటే జాతకంలో చంద్రబలం బాగుండాలి. అమావాస్య ముందు చతుర్దశి రోజున చంద్రుడు క్షీణించి ఉన్నప్పుడు కేతు ప్రభావం వ్యక్తులపై ఎక్కువగా ఉంటుంది. నవగ్రహాలలో కేతువు లయం అంటే మృత్యు కారకుడు కాబట్టి చంద్రుడు బలహీనంగా ఉన్న సమయంలో శారీరక, మానసిక ఆరోగ్యాలపై కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి అమావాస్య ముందు ఆరోగ్యం బాగోలేకపోవడం, కొన్ని రకాల మానసిక సమస్యలు ఎక్కువ కావడం, అనుకోని ప్రమాదాలు జరిగి మృత్యు వాత పడటం మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కేతు ప్రభావాలే! అంతేకాదు చ...

Masa Shivaratri: మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి ?

Image
ఈ రోజు జరుపుకోవడం వల్ల మన జాతకంలోని క్షీణ చంద్ర దోషాల తీవ్రత తగ్గు ముఖం పడుతుంది. సంతానలేమి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. వృత్తికి సంబందించిన అవరోధాలలో మార్పు కలుగుతుంది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. 

Types of Shivaratri: శివరాత్రి మొత్తంగా 5 రకాలు

Image
నిత్యశివరాత్రి : ఇది ప్రతి రోజు రాత్రి 12 గంటల సమయంలో వస్తుంది. పక్ష శివరాత్రి : ఇది పున్నమి ముందు వచ్చే త్రయోదశితో కూడిన చతుర్దశినాటి రాత్రి వస్తుంది. మాస శివరాత్రి : ప్రతి నెల అమావాస్య ముందు వస్తుంది. యోగ శివరాత్రి : యోగులు తపస్సమాధిలో వుండే కాలం ఈ యోగ శివరాత్రి కాలం మహా శివరాత్రి : అందరం దీక్షగా, ఒక పండుగగా ఏడాది ఒకసారి జరుపుకునే పర్వదినం.

Shiva Deeksha: శివదీక్ష నియమాలు

Image
శివదీక్షను 41 రోజులు కొనసాగేలా ఆచరిస్తారు.మహాశివరాత్రి  బ్రహ్మోత్సవ పూర్ణాహుతి తో ముగిస్తారు. శ్రీరాముడు శ్రీరామలింగేశ్వరుని దీక్షగా పూజించాడు.శ్రీ కృష్ణుడు ఉపమన్యువు ద్వారా శివదీక్షను, అర్జునుడు పాశువత దివ్యదీక్షను స్వీకరించి తమ జన్మలని చరితార్థం చేసుకున్నారు అని పురాణ, ఇతిహాసాల ద్వారా తెలుస్తోంది. శివదీక్ష పట్టిన వారిలో మొట్టమొదటి భక్తురాలు పార్వతిదేవి. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతలు , శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, భక్త కన్నప్ప మొదలు పర్వతుడు, భక్త సిరియాళుడు మొదలైనవారు  శివదీక్షను పాటించినట్లు పౌరాణిక ఆధారాల ఉన్నాయి. కార్తీకేయుడు కూడా శివదీక్షను పూని దేవతసైన్యాలకు అధిపతి అయినాడు. ఇంతటి దివ్య మహిమగల శివదీక్ష ఎంతో ప్రాచీనమైనది. నియమాలు  శివదీక్షను స్వీకరించినవారు స్వయంగా శివభావన కలిగి నిరాడంబరులై చందన వర్ణం(గోధుమవర్ణం) గల వస్త్రాలను ధరించాలి. సూర్యోదయ, మధ్యాహన, సాయంకాల సమయంలో పూజను ఆచరించాలి. వీలైనంతగా మౌనంగా ఉండాలి. సూర్యోదయ, సూర్యాస్తమయలకు పూర్వమే చన్నీటి స్నానం ఆచరించాలి. అష్టోత్తర శతనామ పూజలను చేసేందుకు సాధ్యపడని స్వాములు బిల్వాష్టకంతో పూజించి ల...

Lingodbhavam: శివలింగం ఎలా ఆవిర్భవించింది ?

Image
సాదారణంగా ప్రతీనెలా వచ్చే చతుర్దశి తిధిని మాసశివరాత్రి అంటాము, మాఘమాసంలో బహుళ చతుర్ధశినాడు వచ్చేది మహా శివరాత్రి. శివలింగోద్భవం గురించి స్కంద పురాణం లో వివరించబడినది. ఒక మహా ప్రళయానంతరం బ్రహ్మ, విష్ణువుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు ఎవరు గొప్పో తేల్చుకొనేంత దాకా వచ్చి యుద్ధానికి దారి తీసింది. ఇరువురు ఒకరిపై ఒకరు పాసుపతాస్త్రాలను ప్రయోగించుకొన్నారు. దీనిని గమనించిన పరమేశ్వరుడు మరో మారు ప్రళయం జరుగకుండా రెండు అస్త్రాల మధ్య కోటి సూర్యకాంతితో ఆది మధ్యాంతరాలు తెలియరాని విధంగా ఒక మహాగ్నిస్తంభాన్ని ఆవిర్భవింపజేసి అందులో అందరికి దివ్య దర్శనం ఇచ్చాడు. పుష్కలా వర్తక మేఘాలను రప్పించి జలాన్ని వర్షింపజేసి ఆ శాంభవనల స్తంభాన్ని చల్లార్చాడు అదే శివలింగం.  మాఘ బహుల చతుర్దశినాడు అర్ధరాత్రి సమయంలో జరిగింది కాబట్టి దీనినే లింగోద్భవ కాలం అంటారు. ఈ లింగం యొక్క ఆది అంతాలను తెలుసుకొనేందుకు విష్ణుమూర్తి వరాహ రూపంలో జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని, బ్రహ్మదేవుడు హంస రూపం దాల్చి ఆది భాగాన్ని తెలుసుకొనేందుకు వెళ్లి దానిని కనుగొనలేక చివరకు పరమేశ్వరుడ్నే శరణు వేడుకొంటారు. అప్పుడు పరమశివుడు తన నిజరూపంతో దర్శనమిచ్...

Saibaba Shraddha and Saburi: శిర్డీ సాయి దివ్య సందేశం - శ్రద్ధ, సబూరి

Image
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా షిర్డిలో ఫకీర్‌ అవతారంలోఅనేక మహిమలు ప్రదర్శించిన సాయినాధుడు ఇప్పటికీ సమాధి నుంచే భక్తులకు అభయమిస్తాడని అసంఖ్యాక సాయి భక్తుల నమ్మకం. సాయి మందిరాన్ని దర్శించుకునేందుకు రోజు వేలాది భక్తులు శిర్డీకి వస్తుంటారు. శ్రద్ధ సబూరి శ్రద్ధ అంటే విశ్వాసం. సబూరి అంటే ఓర్పు. సాయిబాబా తనను ఆశ్రయించిన భక్తులను ఎప్పుడూ రెండు పైసలు దక్షిణ అడిగేవారు. ఆ రెండు పైసలు శ్రద్ధ, సబూరి మాత్రమే. జీవితంలో ఏదైనా సాధించాలనుకునే వారికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు శ్రద్ధ, సబూరి. అలాగే భగవంతుని ఆశ్రయించి భక్తి మార్గంలో పయనించాలనుకునే వారికి కూడా ఉండాల్సిన రెండు లక్షణాలు భగవంతునిపై అచంచలమైన విశ్వాసం, భగవంతుని అనుగ్రహం లభించే వరకు ఓర్పుగా వేచి ఉండడం. నిరాడంబరమే సాయితత్వం శిర్డీ సాయిబాబా తన జీవితకాలంలో ఎలాంటి హంగులూ, ఆర్భాటాలూ చూపలేదు. మంత్రాలూ తంత్రాలూ ప్రదర్శించలేదు. నిరాడంబర జీవితం గడిపి చూపారు. సాయిబాబాకు మసీదే మహలు అయింది. అందరూ, అన్ని జీవులూ తినగా మిగిలిన పదార్ధాలనే పంచ భక్ష్య పరమాన్నాలుగా భావించి స్వీకరించేవారు. జీవిత సత్యాలు బోధన సాయి ఎంతో సాదా సీదాగా మసీదులో స్తంభాన్ని ఆనుకునో, ని...

Navavidha Bhakti: నవవిధ భక్తి మార్గాలు

Image
బమ్మెర పోతనామాత్యుడు రచించిన భాగవతం ప్రకారం భగవంతుని చేరుకోడానికి నవవిధ భక్తి మార్గాలున్నాయి. 'నవ' అనగా 9 రకాలైన భక్తి మార్గాలు భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉంది. 'శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం! సఖ్యమాత్మ నివేదనం' ఈ శ్లోకం ప్రకారం భగవంతుని చేరడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి.  శ్రవణం : శ్రవణం అంటే వినడం. సత్పురుషుల వాక్యాలు, సద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి వీలవుతుంది. భగవంతునికి చేరువ కావడానికి శ్రవణం సులభమైన మార్గం. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది, దీని వలన మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. 7 రోజుల్లో మరణిస్తానని తెలిసి కూడా 7 రోజుల్లో భాగవతం విని మోక్షాన్ని పొందిన పరీక్షిత్తు మహారాజు శ్రవణ భక్తి నాశ్రయించి మోక్షాన్ని పొందాడు. కీర్తనం : భగవంతుని మహిమలను నిరంతరం కీర్తించుట కీర్తనా భక్తి విధానం. భగవంతుని సాక్షాత్కరింప చేసుకోడానికి కీర్తన భక్తి ఉత్తమమైనది. నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, ఆళ్వారులు, నయనార్లు, అన్నమయ్య, రామదాసు మొదలైన వారు కీర్తన భక్తితో పరమపదం పొంది భగంతుని చేరారు. స్మరణం : భగవంతుని లీలలను మన...

Sampath Vinayaka Temple: శ్రీ సంపత్ వినాయక స్వామి ఆలయం - విశాఖపట్నం

Image
విశాఖ నగరానికి మణిహారం సంపత్ వినాయకుని మందిరం, విశాఖకు వెళ్లిన వారు ఈ ఆలయాన్ని దర్శించకుండా తిరిగిరారు. పాకిస్థాన్​ సబ్​మెరైన్ ఘాజీని ముంచేసిన బొజ్జ గణపయ్య 1971 సంవత్సరంలో ఇండియా - పాకిస్థాన్​ల మధ్య యుద్ధం తీవ్రంగా జరుగుతున్న సమయంలో, తూర్పు నావెల్ కమాండ్‌కి చెందిన అడ్మిరల్ కృష్ణన్ విశాఖలోని సంపత్ వినాయక ఆలయానికి వచ్చి వైజాగ్​ను కాపాడాల్సిందిగా కొబ్బరికాయలు కొట్టారని అంటారు. ఆ తరువాత కొద్దిరోజులకే విశాఖ పై దాడి కోసం రహస్యంగా వచ్చిన పాకిస్థాన్​ సబ్​మెరైన్ PNS ఘాజీ 4 డిసెంబర్ 1971న సముద్రంలోనే పేలి, మునిగిపోయింది. ఘాజీ నాశనం స్వామి మహిమే సంపత్ గణపతి వల్లే పాకిస్థాన్​ సబ్​మెరైన్‌ని విజయవంతంగా పేల్చి వేయగలిగామని భావించిన కృష్ణన్ ఆనాటి నుంచి విశాఖలో ఉన్నంత వరకూ ప్రతీ రోజూ సంపత్ వినాయక స్వామిని దర్శించి ఆ తరువాతే విధులకు వెళ్లేవారట. ఆ ఘటన తరువాత వైజాగ్​లోని సంపత్ వినాయక ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. నిజంగా ఇక్కడ స్వామిని మహిమాన్వితుడని భక్తులు అంటారు. విశాఖపట్నంలోని సిరిపురం జంక్షన్ వద్ద గల సంపత్ వినాయక మందిరాన్ని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కలిసి కట్టించారని ఆలయ స్థల పురాణం ద్వ...

Antarvedi Tirukalyanam 2025: శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవములు 2025 - అంతర్వేది

Image
శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవములు మాఘ శుద్ధ సప్తమి నుండి మాఘ బహుళ పాడ్యమి వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.   04/02/2025 - జయవారం :- రథసప్తమి రోజున ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 5:30 గంటలకు స్వామి వారి అభిషేకం, 10 గంటల కు సుదర్శన హోమం, సాయత్రం 4:30 గంటలకు ' సూర్య వాహనం ' పై గ్రామెత్సవం. -> సాయంత్రం 6:30 గంటలకు శ్రీస్వామివారిని పెండ్లి కుమారుని, అమ్మవారిని పెండ్లికుమార్తె ( ముద్రికాలంకరణ) ను చేస్తారు.. ◆ రాత్రి 7గంటలకు చంద్రప్రభ వాహనం పై గ్రామోత్సవం. ¤ 05/02/2025 - బుధవారం  : ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 5:30 గంటలకు స్వామి వారి అభిషేకం, 10 గంటల కు సుదర్శన హోమం, అష్టమి రోజు సాయంత్రం  -> సాయంత్రం 4.గంటలకు ' గరుడ పుష్పక' వాహనం పై గ్రామోత్సవం.. ->  సాయంత్రం 7 గంటలకు థూపసేవ అనంతరం " పుష్పక వాహనం ' పై గ్రామోత్సవం. ¤ 06/02/2025 :: నవమి, గురువారం, రోజున ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 5:30 గంటలకు స్వామి వారి అభిషేకం, 10 గంటల కు సుదర్శన హోమం, -> సాయంత్రం 4.గంటలకు ' హంస వాహనం ' పై గ్రామోత్సవం. -> సాయంత్రం 6:30 గంటలకు థూపసేవ, "ధ్వజార...

Shattilla Ekadasi: షాట్ తిల ఏకాదశి

Image
పుష్య మాసంలో వచ్చే బహుళ ఏకాదశినే షట్తిల ఏకాదశి అంటారు. ఈ రోజు తలస్నానం చేసేటప్పుడే నువ్వుల పిండిని ఒంటికి రాసుకుని స్నానం చేయాలి. స్నానం తరువాత తిల తర్పణం వదలాలి. తెల్ల నువ్వులతో దేవతలకు నివేదన చేయాలి. నల్ల నువ్వులతో పితృ దేవతలకి తర్పణం వదలాలి. నువ్వులు నీళ్ళలొ వేసుకుని ఆ నీరు తాగాలి. ఒక రాగి లేదా కంచు పాత్రలో నువ్వులు పోసి దానం చేయాలి. నువ్వులు దేవుడికి నివేదన చేసి, అందరికి నువ్వుల ప్రసాదం పెట్టాలి. ఏకాదశి వ్రతం అయిన తర్వాత నువ్వుల ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని పక్కనపెట్టి ద్వాదశి రోజున పారణ తరువాత తినాలి. షట్ అంటే ఆరు. తిల నువ్వులు. షట్తిల ఏకాదశి రోజున నువ్వులతో ఆరు విశిష్ఠ కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఏకాదశికి షట్తిల ఏకాదశి అని పేరు వచ్చింది. నువ్వులతో స్నానం(తిలాస్నానం), స్నానానంతరం నువ్వులముద్ద చేసి ఆ చూర్ణాన్ని శరీరానికి పట్టించడం ఇంటిలో తిల హోమం నిర్వహించడం పితృ దేవతలకు తిల ఉదకం సమర్పించడం నువ్వులు కాని, నువ్వుల నూనె కాని దానం ఇవ్వడం చివరగా తిలాన్నం భుజించడం. (బియ్యం ఉడికే సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం) ఈ రోజున తిలలతో ఈ ఆరు కార్యక్...