గ్రామదేవతలందరూ శక్తి స్వరూపిణులే. నూట ఎనిమిది మంది గ్రామదేవతలు వారి సోదరుడైన పోతురాజుతో కలిసి గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారు. ఆ దేవతలకు శిష్టసంప్రదాయంలోని దేవతల మాదిరిగా ఆలయం, ధ్వజస్తంభం వంటివన్నీ ఇటీవలి కాలంలో భక్తులు నిర్మించుకుంటున్నారు. ఒకప్పుడు బొడ్రాయినే గ్రామదేవతగా పూజించే ఆచారం ఉండేది. అన్నివర్ణాలవారూ గ్రామదేవతలను ఆరాధిస్తారు. రహదారివెంట వెళుతున్న అందరికీ గ్రామదేవతల దర్శనం సులభంగా జరగాలి. గ్రామదేవతల ఆలయాల్లోకి తరచుగా వచ్చి దర్శనం చేసుకోని శిష్టాచార సంపన్నులు సైతం దసరా రోజుల్లో గ్రామదేవతలకు నైవేద్యాలు సమర్పిస్తారు.
ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్ష పూర్ణిమ కోజాగరి పూర్ణిమ. ఈనాడు ఆచరించే వ్రతానికి కోజాగరి పూర్ణిమవ్రతం, కోజాగరి వ్రతం అని పేర్లు. శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రియమైన ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల దారిద్ర్యాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు, సకల సంపదలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. ఆశ్వయుజ పూర్ణిమనాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని శిరస్నానం చేసి శ్రీమహాలక్ష్మీదేవిని పూజించాలి. తిరిగి సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత మరాలా లక్ష్మీ దేవినే పూజించి పాలు, పంచదార, ఏలకుల పొడి, కుంకుమపువ్వు వేసి వండిన క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించి దానిని తీసుకువెళ్లి ఆరుబయట వెన్నెలలో కొద్దిసేపు ఉంచాలి. తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ వ్రతంలో రాత్రి జాగరణ చేయాలని నియమం. జాగరణ సమయంలో పాచికలు లేదా గవ్వలను ఆడుతూ గడపలెను. ఆశ్వయుజ పూర్ణిమనాడు రాత్రి లక్ష్మీదేవి భూలోకంలో తిరుగుతూ ఎవరైతే జాగరణ చేస్తూ ఉంటారో వారికి సర్వసంపదలను ప్రసాదిస్తుందని కథనం. ఈ విధంగా జాగరణ చేసి మరునాడు పునఃపూజ చేసి వ్రతాన్ని ముగించాలి. ఈ విధంగా కోజాగరి పూర్ణిమను జరుపుకోవడం వల్ల లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు లభిస్తాయి. పూర్వం ఈ వ్
Comments
Post a Comment