భగవంతుని అవతారాలు మొత్తం 21 అని భాగవతం పేర్కొంది. అయితే వాటిలో అందరికీ సుపరిచితమైనవి, సుప్రసిద్ధమైనవి దశావతారాలు. రాబోయే తరాలకు మన పురాణ విజ్ఞానం అందచేయడానికే బొమ్మల కొలువు సంస్కృతి ఏర్పడింది. దసరాలాంటి విశేష పర్వదినాల సందర్భాల్లో బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి అనేక దేవతా స్వరూపాలను పిల్లలు నెలకొల్పుతారు. వాటితో పాటు మన సంస్కృతిని ప్రతిబింబించే బొమ్మలు కూడా ఉంటాయి. ఈ కొలువును అవకాశం ఉన్నవారు పది రోజులూ ఉంచుకోవచ్చు. ఏడు వరసల్లో బొమ్మల్ని అందంగా పేర్చాలి. వాటిలో జీవ కోటి, ప్రాణికోటి, వృక్షకోటి, పక్షులు, భగవంతుని అవతారాలు, భక్తుల మూర్తులు, దేశ భక్తులు, వీరులు మహా కవులు తదితరులనందరినీ అలంకరించుకోవచ్చు. బొమ్మలకొలువు చూడగానే మన భారతీయ సనాతన సంప్రదాయమంతా స్పష్టంగా కనబడేలా ఉండాలి. ఏడువరసల బొమ్మలు అంటే ఏడు లోకాలకు ప్రతీకలుగా భావిస్తారు. బొమ్మల కొలువులో బొమ్మలకు ప్రతిరోజూ హారతి సమర్పించాలి. నైవేద్యం అవసరం లేదు. బొమ్మల కొలువు చూడడానికి వచ్చినవారికి తాంబూలం అందించాలి.
ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్ష పూర్ణిమ కోజాగరి పూర్ణిమ. ఈనాడు ఆచరించే వ్రతానికి కోజాగరి పూర్ణిమవ్రతం, కోజాగరి వ్రతం అని పేర్లు. శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రియమైన ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల దారిద్ర్యాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు, సకల సంపదలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. ఆశ్వయుజ పూర్ణిమనాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని శిరస్నానం చేసి శ్రీమహాలక్ష్మీదేవిని పూజించాలి. తిరిగి సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత మరాలా లక్ష్మీ దేవినే పూజించి పాలు, పంచదార, ఏలకుల పొడి, కుంకుమపువ్వు వేసి వండిన క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించి దానిని తీసుకువెళ్లి ఆరుబయట వెన్నెలలో కొద్దిసేపు ఉంచాలి. తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ వ్రతంలో రాత్రి జాగరణ చేయాలని నియమం. జాగరణ సమయంలో పాచికలు లేదా గవ్వలను ఆడుతూ గడపలెను. ఆశ్వయుజ పూర్ణిమనాడు రాత్రి లక్ష్మీదేవి భూలోకంలో తిరుగుతూ ఎవరైతే జాగరణ చేస్తూ ఉంటారో వారికి సర్వసంపదలను ప్రసాదిస్తుందని కథనం. ఈ విధంగా జాగరణ చేసి మరునాడు పునఃపూజ చేసి వ్రతాన్ని ముగించాలి. ఈ విధంగా కోజాగరి పూర్ణిమను జరుపుకోవడం వల్ల లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు లభిస్తాయి. పూర్వం ఈ వ్
Comments
Post a Comment