Posts

Showing posts from May, 2025

Ramba Vratam: రంభావ్రతం

Image
వివాహం ఆలస్యమవుతున్న యువతులకు శీఘ్రంగా వివాహం కుదిరేలా... మంచి భర్త లభించేలా చేసే వ్రతం-"రంభావ్రతం". 'రంభాతృతీయ' అని కూడా పేరున్న ఈ వ్రతాన్ని జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష తదియనాడు ఆచరించాలని శాస్త్రవచనం. 'రంభ' అనే సంస్కృత శబ్దానికి 'అరటి' అని అర్థం. అరటి చెట్టుతో ముడిపడి వున్న వ్రతం కనుక దీనికి 'రంభావ్రతం" అనే పేరు ఏర్పడింది. పూర్వం ఈ వ్రతాన్ని భృగుమహర్షి సలహా మేరకు పార్వతీదేవి ఆచరించి పరమ శివుడిని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్రతం ఆచరణలోకి రావడం వెనుక ఆసక్తికరమైన పురాణగాథ వుంది. పిలవకుండానే దక్షయజ్ఞానికి వెళ్ళిన శివుడి దేవేరి సతీదేవిని, ఆమె తండ్రి దక్షప్రజాపతి తీవ్రంగా అవమానించడంతో సతీదేవి యోగాగ్నిని రగుల్చుకుని అందులో దూకి ఆహుతైనది. మరుజన్మలో ఆమె పర్వతరాజు అయిన హిమవంతుడు, మేనకలకు కుమార్తెగా పార్వతీదేవిగా జన్మించింది. పార్వతీదేవి యుక్త వయస్కురాలైన తర్వాత తపస్సు చేస్తున్న శివుడికి సేవ చేసేందుకు హిమవంతుడు ఆమెను నియమించాడు. శివుడికి సేవచేస్తున్న పార్వతీదేవికి శివుడిపట్ల అనురాగం పెరిగి శివుడినే భర్తగా పొందాలనుకుంది. కాగా, తారకాసురు...

Jyestha Masam 2025: జ్యేష్ఠ మాసం - ఈ నెలలో ముఖ్యమైన పండుగలు, తిథులు

తెలుగు మాసాలలో మూడవ మాసం జ్యేష్ఠ మాసం బ్రహ్మ దేవునికి ప్రీతికరమైనది. గ్రీష్మ ఋతువులో వచ్చే జ్యేష్ఠ మాసంలో ఎన్నో పండుగలు, మరెన్నో పుణ్య తిధులు ఉంటాయి. ఈ కథనంలో జ్యేష్ఠ మాసంలో రానున్న పండుగలు, విశేషమైన తిధుల గురించి తెలుసుకుందాం. మే 28 వ తేదీ బుధవారం నుంచి జ్యేష్ఠ మాసం ప్రారంభం అవుతుంది. ఇక ఈ మాసంలో మనం జరుపుకోబోతున్న పండుగ విశేషాలు తెలుసుకుందాం. మే 28 వ తేదీ బుధవారం జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి/ విదియ: జ్యేష్ఠ మాసం ప్రారంభం చంద్ర దర్శనం, కర్తరి త్యాగం. మే 29 వ తేదీ గురువారం జ్యేష్ఠ శుద్ధ తదియ: రంభావ్రతం మే 30 వ తేదీ శుక్రవారం జ్యేష్ఠ శుద్ధ చవితి: మహతి చతుర్థి జూన్ 1 వ తేదీ ఆదివారం జ్యేష్ఠ శుద్ధ షష్టి: అరణ్యక వ్రతం జూన్ 2 వ తేదీ సోమవారం జ్యేష్ఠ శుద్ధ సప్తమి: తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం జూన్ 3 వ తేదీ మంగళవారం జ్యేష్ఠ శుద్ధ అష్టమి: శుక్ల దేవ్యారాధనం జూన్ 5 వ తేదీ గురువారం జ్యేష్ఠ శుద్ధ దశమి: దశ పాపహరవ్రతం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 6 వ తేదీ శుక్రవారం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి: నిర్జల ఏకాదశి జూన్ 7 వ తేదీ శనివారం జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి: అప్...

Vaishaka Puranam Telugu: వైశాఖ పురాణం 30 వ అధ్యాయం

పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో నిత్యపారాయణగా చెప్పుకుంటున్న వైశాఖ పురాణం చివరి అధ్యాయంలో శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుకు తెలియజేసిన వైశాఖమాస మహత్యం గురించి నారద అంబరీషుల సంవాదం ద్వారా తెలుసుకుందాం. శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుల సంవాదం శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో "మహారాజా! వైశాఖమాసం శుక్ల పక్షంలో వచ్చే మూడు తిధుల ప్రాముఖ్యతను వివరిస్తాను వినుము" అంటూ ఈ విధంగా చెప్పసాగెను. తిథి పుష్కరిణి వైశాఖమాసంలో శుక్ల పక్షం చివరలో వచ్చే త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి తిథులకు తిథి పుష్కరిణి అని పేరు. పుష్కరిణి అంటే సర్వ పాపాలు పోగొట్టేది అని అర్ధం. ఈ తిథులకు ఇంతటి మహత్యం రావడానికి కారణం ఏమిటంటే పూర్వం దేవదానవులు క్షీరసాగర మధనం చేసినప్పుడు ఏకాదశి రోజు అమృతం పుట్టింది. ద్వాదశి రోజు శ్రీహరి రాక్షసుల నుంచి అమృతాన్ని కాపాడుతాడు. త్రయోదశి రోజు శ్రీహరి అమృతాన్ని దేవతలకు అందజేస్తాడు. చతుర్దశి రోజు శ్రీహరి రాక్షసులను సంహరిస్తాడు. పౌర్ణమి రోజు దేవతలందరు తమ సామ్రాజ్యాలను తిరిగి పొందుతారు. అందుకే ఈ మూడు తిథులను పుష్కరిణి అంటారు. వైశాఖ మాసం మొత్తం నదీస్నానం చేయలేనివారు ఈ మూడు తిథులలో స్నానం ...

Vellala Sanjeevaraya Swamy Temple: శ్రీ సంజీవరాయ స్వామి ఆలయం - వెల్లాల

Image
హనుమంతుడు ఆవిర్భవించిన అతి ప్రాచీన క్షేత్రాలలో 'వెల్లాల' ఒకటి. కడప జిల్లా ప్రొద్దుటూరుకు సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఇక్కడ హనుమంతుడు సంజీవరాయుడుగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. ఆలయ స్థల పురాణం శ్రీరామాయణ గాథతో ముడిపడి ఉన్న ఈ ఆలయ స్థల పురాణం గురించి వింటే ఆశ్చర్యం కలుగుతుంది. రామరావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సంజీవని కోసం హిమాలయాలకు బయలుదేరిన హనుమంతుడు మార్గమధ్యంలో సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడానికి ఇక్కడికి సమీపంలోని 'కుందూ' నది దగ్గర కొంతసేపు ఆగాడట. సూర్యునికి అర్ఘ్యం సమర్పించుకుని తిరిగి బయలు దేరే సమయంలో హనుమను ఆ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న మహర్షులు చూసారంట! మహర్షుల కోరిక మేరకు వెలసిన హనుమ కుందూ నది తీరంలో హనుమను దర్శించుకున్న మహర్షులు స్వామిని అక్కడే కొంతసేపు ఉండమని అడిగారట! కానీ లక్ష్మణుని ప్రాణాలు కాపాడటం కోసం సంజీవని త్వరగా తేవాలన్న ఆతృతలో హనుమ 'వెళ్లాలి వెళ్లాలి' అంటూ తొందరపడ్డాడంట! కాలక్రమేణా హనుమ ఉచ్చరించిన 'వెళ్లాలి వెళ్లాలి' అనే మాటలే ఈ గ్రామానికి 'వెల్లాల' అనే పేరుతో స్థిరపడ్డాయని స్థానికుల కధనం. అటు తర్వాత హ...

Kudavelli Sri Ramalingeswara Temple: శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం - కూడవెల్లి

Image
త్రేతాయుగంలో శ్రీరామునితో ముడిపడి ఉన్న ఈ ప్రాచీన ఆలయం తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో భూంపల్లి మండలం దుబ్బాక చేరువలో ఉన్న రామేశ్వరం పల్లి గ్రామంలో వెలసి ఉంది. దక్షిణ కాశీగా పిలువబడే ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఆలయ స్థల పురాణం రావణాసుర సంహారం తరువాత శ్రీరాముడు అయోధ్య తిరిగి వెళ్లేముందు బ్రహ్మహత్యా దోషం నుంచి విముక్తి పొందడానికి అనేక చోట్ల శివలింగాలు ప్రతిష్టించాడని ప్రతీతి. అందులో ఈ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించడానికి శ్రీరాముడు కాశీ నుంచి లింగం తెమ్మని హనుమంతుని కోరాడట! శ్రీరాముని ఆదేశం మేరకు హనుమ కాశీకి వెళ్లి లింగాన్ని తీసుకుని బయలుదేరాడు. హనుమ రావడం ఆలస్యం కావడంతో ఆలోపు శ్రీరాముడు ఇసుకతో సైకత లింగాన్ని తయారుచేసి ప్రతిష్టిస్తాడు. తీరా హనుమంతుడు శివలింగాన్ని తీసుకువచ్చేసరికి అక్కడ మరో లింగం ఉండడంతో హనుమ దిగులు చెందుతాడు. అది చూసి శ్రీరాముడు హనుమతో "హనుమా! దిగులు చెందకు... భక్తులు ముందుగా నీవు తెచ్చిన లింగాన్ని పూజించిన తర్వాతనే నేను ప్రతిష్టించిన సైకత లింగాన్ని పూజిస్తారు' అని వరం ఇస్తాడు. అందుకే ఈ ఆలయంలో రెండు లింగాలు దర్శనమిస్తాయి. వాగుల కూడలి - కూడవెల...

Vaishaka Puranam Telugu: వైశాఖ పురాణం 29 వ అధ్యాయం

శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుకు వైశాఖ శుద్ధ ద్వాదశి మహాత్యాన్ని వివరించిన విధానాన్ని నారద అంబరీషుల సంవాదం ద్వారా తెలుసుకుందాం. ద్వాదశి మహాత్యం శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో "మహారాజా! వైశాఖ మాసంలో అన్ని తిథులలోకెల్లా శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథి సర్వపాపములను పోగొట్టును. ఈ రోజు చేసే గోదానం, అన్నదానానికి విశేషమైన ఫలితం కలదు. ఈ రోజు యముని, పితృదేవతలను, గురువులను, దేవతలను, విష్ణువును అర్చించి జలంతో నిండిన కలశాన్ని, శ్రీహరికి నివేదించిన పెరుగు అన్నాన్ని దానం చేసిన వచ్చే ఫలం అనంతం. ఈ సత్కర్మలు తప్పనిసరి వైశాఖ ద్వాదశి రోజు శ్రీహరిని పాలతో అభిషేకించడం, సాలగ్రామ దానం చేయడం, పానకం, దోసపండ్లు, చెరుకుగడలు, మామిడిపండ్లు, ద్రాక్షరసం దానం చేయడం అత్యంత పుణ్యప్రదం. ఈ ద్వాదశి మహిమను వివరించే ఒక కథను చెబుతాను వినుము" అంటూ శ్రుతదేవ మహాముని ఈ విధంగా చెప్పసాగెను. సత్యశీలుడు మాలిని కథ పూర్వం కాశీదేశమున దేవవ్రతుడను బ్రాహ్మణుడు కలడు. వానికి మాలిని అనే అందమైన కుమార్తె కలదు. దేవవ్రతుడు తన కుమార్తెను సత్యశీలునికిచ్చి వివాహము చేసెను. సత్యశీలుడు తన భార్యయగు మాలినిని తన దేశమునకు తీసికొనిపోయెను. ...

Vaishaka Puranam Telugu: వైశాఖ పురాణం 28 వ అధ్యాయం

పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో ముప్ఫయి రోజుల పారాయణగా చెప్పుకొంటున్న వైశాఖ పురాణంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఈ అధ్యాయంలో శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వివరించిన అక్షయ తృతీయ మహిమను నారద అంబరీషుల సంవాదం ద్వారా తెలుసుకుందాం. శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుల సంవాదం శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో "మహారాజా! వైశాఖశుద్ధ తృతీయ మిక్కిలి పవిత్రమైనది. దీనినే అక్షయ తృతీయ అంటారు. ఆనాడు చేసిన కొద్దిపాటి పుణ్యమైన సర్వపాపహరమై, శ్రీహరి సన్నిధిని చేరుస్తుంది. అక్షయ తృతీయ రోజు దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. ఈ రోజు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విన్నవారు ముక్తిని పొందుతారు. ఈ రోజు చేసే దానాలు అక్షయ ఫలాన్ని ఇస్తాయి. ఈ తిధి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును. ఈ తిధికి ఇంతటి మహిమ రావడానికి గల కారణం చెబుతాను వినుము" అంటూ ఈ విధంగా చెప్పసాగెను. ముని పత్ని పట్ల ఇంద్రుని దురాగతం పూర్వం ఇంద్రునికి, బలి చక్రవర్తికి పాతాళంలో యుద్ధం జరిగింది. ఇంద్రుడు బలిని జయించి స్వర్గానికి తిరిగిపోతూ మార్గమధ్యంలో భూలోకంలోని ఉతధ్య మహాముని ఆశ్రమములోనికి వెళ్లెను. త...

Vaishaka Puranam Telugu: వైశాఖ పురాణం 27 వ అధ్యాయం

పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న వైశాఖ పురాణంలో భాగంగా శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుకు వైశాఖ మాసంలో వచ్చే పుణ్యతిథులను గురించి, కలిధర్మములు, పితృవిముక్తి గురించి వివరించిన విధానాన్ని నారద అంబరీషుల సంవాదం ద్వారా ఈ కథనంలో తెలుసుకుందాం. శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుల సంవాదం శ్రుతకీర్తి మహారాజు శ్రుతదేవ మహామునితో "ఓ మహాముని! వైశాఖ మాసంలో ఉత్తమమైన తిధుల గురించి, చేయాల్సిన దానాల గురించి వివరంగా తెలియజేయమని ప్రార్ధించగా శ్రుతదేవుడు ఈ విధంగా చెప్పసాగెను. శ్రుతదేవుడు బోధించిన వైశాఖ ధర్మాలు శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో "ఓ రాజా! వైశాఖ మాసంలో ముప్ఫయి రోజులు పుణ్యతిథులే! కానీ ఏకాదశి రోజు చేసే పుణ్యకార్యాలు కోటిరెట్ల అధికఫలాన్ని ఇస్తాయి. వైశాఖ ఏకాదశి నాడు చేసే నదీస్నానం, దానము, తపము, హోమము, దేవతార్చన, సత్కర్మలు, హరికథా శ్రవణము వలన సర్వపుణ్య కార్యములు చేసిన ఫలం లభించును. ఏకాదశి మహత్యం వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశి రోజు పితృదేవత ప్రీత్యర్ధం తర్పణాలు, పిండప్రదానాలు, శ్రాద్ధ కర్మలు చేసినవారు గయలో కోటిమార్లు పిండప్రదానము చేసిన పుణ్యఫలము కల్గును. ఇందుకు సంబంధించి...

Vaishaka Puranam Telugu: వైశాఖ పురాణం 26 వ అధ్యాయం

 వైశాఖ పురాణం ఇరవై ఆరో అధ్యాయంలో శంఖుడు కిరాతునికి రామాయణ మహాకావ్యం రచించిన వాల్మీకి జన్మ గురించి, రామనామ తారకమంత్ర రహస్యం గురించి బోధించిన సంగతులను శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుకు వివరించాడు. శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుల సంవాదం శ్రుతదేవముని శ్రుతకీర్తిమహారాజుకు శంఖుడు కిరాతుల సంభాషణను ఈ విధంగా వివరించసాగెను. తమ ఎదురుగా ఉన్న మర్రిచెట్టు కూలి, దాని తొర్ర నుంచి వచ్చిన భయంకర సర్పము దివ్యరూపమును ధరించి తలవంచి నమస్కరించి నిలుచుటను చూచి శంఖుడు, కిరాతుడు ఇద్దరు ఆశ్చర్యపోయారు. శంఖుడు ఆ దివ్యపురుషుని చూసి 'ఓయీ! నీవెవరవు? నీకు ఈ సర్ప రూపం ఎలా కలిగింది? ఇప్పుడు సర్ప రూపం నుంచి విముక్తి ఎలా వచ్చింది? నీ వృత్తాంతం వివరంగా చెప్పమని" కోరాడు. దివ్యపురుషుని వృత్తాంతం శంఖుని మాటలకు దివ్యపురుషుడు అతడికి సాష్టాంగ నమస్కారం చేసి "స్వామి! నేను పూర్వం ప్రయాగ క్షేత్రంలో నివసించే బ్రాహ్మణుడను. నాపేరు రోచనుడు. కుసీదుడను ముని పుత్రుడను. మంచి రూపయౌవనాలు కలిగి ఉన్నానన్న గర్వంతో చేయరాని పనులు ఎన్నో చేశాను. మితిమీరిన బద్ధకం, అత్యాశతో చేసే వడ్డీ వ్యాపారం, జూదం, పర మహిళ సాంగత్యం అనే వ్యసనాలు న...

Jyestha Masam Significance: జ్యేష్ఠ మాసం ప్రాముఖ్యత

తెలుగు మాసాలలో జ్యేష్ఠ మాసం మూడవ నెల. చైత్రం, 'వైశాఖం తర్వాత వచ్చేది జ్యేష్ఠమాసం. ఈ మాసంలో చేసే పూజలు, జపాలు, పారాయణాదులకు విశేష ఫలితాలుంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి.  జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైనదిగా చెబుతారు. ఈ మాసంలో బ్రహ్మదేవుడిని ఆరాధిస్తే ఆయన సులభంగా అనుగ్రహిస్తాడని పండితులు చెబుతారు. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెల రోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలు పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.  ఈ మాసంలో చేసే విష్ణుసహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది. అలాగే నీళ్ళను దానం చేయడం వలన చాలా ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయి.  జ్యేష్ఠ శుద్ధ తదియనాడు రంభా తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతి దేవిని పూజించడమే కాకుండా, దానాలకు శుభకాలం.ముఖ్యంగా అన్న దానం చేయడం ఉత్తమం. జ్యేష్ఠశుద్ధ దశమిని దశపాపహర దశమి అంటారు. అంటే పది రకాల పాపాలను పోగొట్టే దశమి అని అర్ధం. పాపాలను హరించే శక్తి కలిగిన దశమి రోజున గంగా స్నానం లేదా ఏదైనా నదిలో పదిసార్లు మునకేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. నల్ల నువ్వులు, నెయ్యి, పేలాలు, బెల్లం నదిలో వేయాలి. ఈ రోజున ఇష్ట దైవాన్న...

Tiru Arimeya Vinnagaram Divyadesam: శ్రీ కుడమాడుకూత్తన్ దేవాలయం - తిరు అరిమేయ విణ్ణగరం

Image
తిరునాంగూరు దివ్యదేశాలలో కుడమాడుకూత్తన్ దేవాలయం అని పిలవబడే ఈ తిరుఅరిమేయవిణ్ణగరం ఒకటి. మూడు అంతస్థులతో కూడియున్న రాజగోపురంలో గర్భగృహం, అర్థ మండపం మహామండపాలు ఇక్కడ ఉన్నాయి. శీర్గాళి అనేక్షేత్రం నుండి 8 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం వెలసియున్నది. ఈ దేవా లయంలోని మూలమూర్తి తూర్పుదిక్కున కుడిపాదాన్ని అలా కిందకు చాపి, ఎడమపాదాన్ని మడచిపెట్టుకుని కూర్చున్న భంగిమలో శ్రీభూసమేతుడై విరాజిల్లుతున్నాడు. స్వామివారు మూలవరులు : కుడమాడుకూత్తన్ ఉత్తరమూర్తులు : చతుర్భుజ గోపాలన్ అమ్మవారు మూలవరులు : అమృతఘటవల్లీ తాయార్ ఉత్సవమూర్తులు : అమృతఘటవల్లీ తాయార్ స్థలవృక్షము : పురసమార వృక్షము పుష్కరిణి : కోటి తీర్థము, అమృత తీర్థము విమానం : ఉచ్యశృంగ విమానము ప్రత్యక్షం : ఉదంక మహర్షికి ముఖము/స్థితి : తూర్పు / కూర్చున్న సేవ మంగళాశాసనం : తిరుమంగై ఆళ్వారు (10) స్థలపురాణం వినత, కద్రువ ఇరువురు కశ్యపమహర్షి ధర్మపత్నులు. పెద్దభార్య వినత గరుత్మంతుని తల్లి, చిన్నభార్య కద్రువ నాగమాత. వినతని తన దాసిగా చేసుకోవాలనే దురుద్దేశంలో కద్రువ దేవేంద్రుని అశ్వమైన ఉచ్ఛైశ్రవం తోక నల్లనివర్ణం అని వినతతో వాదానికి దిగింది. వినత గుర్రంతోక తెల్లని వర్ణమే ...

Shani Jayanti: శని జయంతి

Image
వైశాఖ బహుళ అమావాస్య శని జయంతిగా చెప్పబడుతోంది. శని దేవుడు, సూర్య భగవానుడు మరియు ఛాయా దేవి పుత్రుడు  శనిదేవుడు మానవుల కర్మల ఫలితంగా చెడు లేదా మంచి కలిగిస్తాడు. శనిదేవుని మన కర్మల ఆధారంగా ప్రతి మానవుడి జీవితం మీద ఉంటుంది. శని గ్రహ దోషాలు పోగట్టడానికి శనివారాలు శనిదేవుడిని పూజించాలి  శని జయంతి రోజు తైలాభిషేకం , శని శాంతి పూజ జరిపించాలి  ఈ పూజలు నవగ్రహాల వున్నా దేవాలయంలో కాని, శని దేవుని ఆలయంలో కాని చేయాలి  ఈ రోజు ఉపవాసం ఉండాలి  నల్లని వస్త్రాలు, నువ్వులు, ఆవనూనె దానం ఇవ్వాలి.  ఏమి చేయాలి  తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి, ఉత్తికిన వస్త్రాలు ధరించాలి  నువ్వలా నూనెతో దీపం వెలిగించాలి  హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి  బ్రహ్మచర్యం పాటించాలి  శక్తికొలది దానం ఇవ్వాలి  ఏమి చేయకూడదు  ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు  మాంసాహారం తినరాదు  పొగత్రాగడం మరియు మద్యం వంటి వాటికీ దూరంగా ఉండాలి  మాటల వల్ల కాని మన చర్యల వల్ల కాని ఒకరిని బాధ పెట్టకూడదు   2025: మే 27.

Vaishaka Amavasya: వైశాఖ అమావాస్య

వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య విశేష ప్రాముఖ్యత కలిగి ఉంది. పురాణ వచనం ప్రకారం, ఈ పవిత్ర దినాన్ని పూర్వీకులను శాంతింపజేయడానికి, వారి ఆశీర్వాదం పొందడానికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. ఈ రోజు భగవంతుని ప్రార్థించడం ద్వారా మోక్షం లభించడమే కాకుండా పాపాలు కూడా తొలగిపోతాయి. పితృ తర్పణం: తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం నీరు, ఆహారం సమర్పించడం నదీ స్నానం: గంగ, యమునా, గోదావరి వంటి పవిత్ర నదులలో పుణ్యస్నానం దానం: అన్నదానం, వస్త్రదానం, ఇతర పుణ్య కార్యాలు వృక్షారోపణ: మొక్కలు నాటడం వలన మోక్షం పొందవచ్చని విశ్వాసం పూజ విధానం పూజ ప్రారంభించడానికి ముందుగా ఇల్లును, పూజగదిని శుభ్రపరిచి పువ్వులు, ముగ్గుల ద్వారా అలంకరించాలి. - గణపతిని ప్రార్థించి అగరుబత్తీలు వెలిగించాలి. - శ్రీమహావిష్ణువు ఆలయానికి వెళ్లి, విష్ణు సహస్రనామం పఠించాలి. - పితృ తర్పణం చేసి వారికి ఆహారం, నీరు సమర్పించాలి. - విష్ణుమూర్తికి పాలు, తేనె, నీరు సమర్పించి పుష్పాలు సమర్పించాలి. - హారతి ఇచ్చి, ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు పంచాలి. పురాణ గాధలు ✔ సతీ సావిత్రి తన భర్త సత్యవంతుడిని వైశాఖ అమావాస్య రోజునే యముని మెప్పించి తిరిగి పొందింది. ✔ సత్య హరిశ్చ...

Apara Ekadasi: అపర ఏకాదశి

Image
వైశాఖ బహుళ ఏకాదశిని ‘అపర ఏకాదశి’గా జరుపుకుంటారు . ఈ పవిత్ర రోజు కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో భద్రకాళి జయంతిగా జరుపుకుంటారు. పురాణ కథనాల ప్రకారం, దక్షయజ్ఞ సమయంలో సతీదేవి తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అగ్నికి ఆహుతి అవుతుంది. ఆ సమయంలో పరమేశ్వరుడు తన జటాజూటంనుంచి భద్రకాళిని సృష్టించాడు. ఈ దేవత ఉగ్రరూపంగా కనిపించినా భక్తులకు మాత్రం శాంతమూర్తిగా ఆరాధ్యురాలు. అపర ఏకాదశి మహత్యం   ఇతర ఏకాదశి రోజుల్లాగానే, అపర ఏకాదశి నాడు ఉపవాసం, భగవంతుని పూజ, జాగరణ ముఖ్యం.  ఈ ఏకాదశి ఉత్తరాది రాష్ట్రాల్లో భద్రకాళి పూజకు సంబంధించిన విశిష్టతను కలిగి ఉంది. ఒడిషాలో ఈ రోజును జలకృద ఏకాదశిగా పిలుస్తారు, ఈ సందర్భంగా జగన్నాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. "అపర" అనే పదానికి వేదాంతంలో లౌకికత అనే అర్థం ఉంది. ఈ ఏకాదశి ఆచరణ ద్వారా సాంసారిక కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. మరో అర్థంలో, "అపర" అంటే శిశువుని కప్పి ఉండే మాయపొర, భగవంతుని ఆరాధన ద్వారా ఆ మాయ తొలగిపోతుందని శాస్త్ర వచనం చెబుతోంది. ఉపవాస పద్ధతులు    దశమి నాడు సాయంకాలం నుంచి ఉపవాసాన్ని ప్రారంభించాలి. ఏకాదశి రోజు తల స్నానం చ...

Saraswathi Pushkaralu 2025: సరస్వతి నది పుష్కరాలు

Image
సరస్వతీ అతిపురాతనమైన వేదకాలపు నది. ఈ నదీప్రసక్తి వేదాలలోను, రామాయణ భారత, భాగవతాలలోను కనిపిస్తుంది. బ్రహ్మాండపురాణంలో సరస్వతీ నదీ ఆవిర్భావం గురించి ఉంది. పూర్వం పరమశివుని ఆద్యం తాలను కనుక్కోదలచి బయలుదేరిన బ్రహ్మదేవుడు ఎంత వెదకినా కనుక్కోలేకపోయాడు. చివరికు శివుని వద్దకు వచ్చాడు. బ్రహ్మను చూచిన శివుడు నా ఆద్యంతాలు కనుగొన్నావా? అని అడిగాడు. పరాభవం చెందుతానని భావించిన బ్రహ్మ “నీ ఆద్యం తాలు చూచి వచ్చాను" అని అబద్దం చెప్పాడు. ఈ విషయాన్ని గ్రహించిన శివుడు అతడి వాక్కగు సరస్వతిని నదిని కమ్మని శపించాడు. అందువల్లనే విద్యాధిదేవతైన సరస్వతి నదీదేవతగా మారిందని కథనం. బ్రహ్మవైవర్త, దేవీభాగవత పురాణాలలో గంగ, సరస్వతులు ఒకరినొకరు శపించుకుని భూలోకంలో నదులుగా జన్మించినట్లు కథనం. మహాభారతంలో సరస్వతీనది పూర్వం బ్రహ్మ చేసిన యాగానికి ‘సుభద్ర' అనే పేరుతో, నైమిశారణ్యంలో మునులు చేసిన యాగానికి 'కనకాక్షి' అనే పేరుతో, గయుడు చేసిన క్రతువుకు ‘విశాల' అనే పేరుతో, ఉద్దాలకుడు చేసిన అధ్వరానికి సురతన్వి' అనే పేరుతో, వశిష్టుడు చేసిన యాగానికి 'ఓఘమాల' అనే పేరుతో, బృహస్పతి చేసిన సత్రానికి 'సువేణ...

Vaishaka Puranam Telugu: వైశాఖ పురాణం 25 వ అధ్యాయం

పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో నారదుడు అంబరీషునికి చెబుతున్న వైశాఖ పురాణం నిరంతరాయంగా కొనసాగుతోంది. వైశాఖ పురాణం 25 వ అధ్యాయంలో శ్రుతదేవముని శ్రుతకీర్తిమహారాజుతో శంఖుడు కిరాతుల సంభాషణను ఈ విధంగా వివరించసాగాడు. కిరాతుడు శంఖమునుల సంవాదం కిరాతుడు శంఖునితో "స్వామీ! బ్రహ్మజ్ఞానీ! ప్రభువగు శ్రీహరిచే సృష్టింపబడిన కోట్ల కొలదిగా వేలకొలదిగా ఉన్న జీవులు విభిన్న కర్మలు ఆచరిస్తూ భిన్న స్వభావులై ఉండడానికి గల కారణాలు వివరించండి" అని అడుగగా శంఖుడు ఈ విధంగా చెప్పసాగాడు. జీవుల స్వభావ భేదాలను వివరించిన శంఖుడు శంఖుడు కిరాతునితో "ఓ కిరాతా! సత్వ, రజో, తమో గుణాలను అనుసరించి జీవులు ఏర్పడ్డారు. రాజసులు రాజసకర్మలను, తామసులు తామసకర్మలను, సాత్వికులు సాత్వికకర్మలను చేయుచుందురు. జీవులు తాము చేసిన కర్మల ఫలితంగా పాపపుణ్యాలను అనుభవిస్తారు. తామస గుణ స్వభావులు తామస బుద్ధితో ఉన్నవారు అనేక పాపాలు చేసి దుఃఖంతో రాక్షస, పిశాచాలుగా జన్మిస్తుంటారు. రజోగుణ స్వభావులు రజోగుణ స్వభావం కలవారు మిశ్రమబుద్దితో పుణ్యపాపములను రెండిటిని చేయుచుందురు. పుణ్యము ఎక్కువగా చేస్తే స్వర్గమును, పాపాలు ఎక్కువైతే నరకాన్ని పొందుచున్నారు. కా...

Hanuman Jayanti: హనుమాన్ జయంతి

Image
స్వామి భక్తికి ప్రతీక హనుమ. ఎక్కడెక్కడ శ్రీరామ నామజపం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఏదో ఒక రూపంలో ఉంటాడంట! ఏడాదిలో రెండుసార్లు హనుమాన్ జయంతి జరుపుకుంటాం. అయితే చైత్ర మాసంలో శ్రీరామనవమి తరువాత జరుపుకునేది హనుమత్ విజయోత్సవం అని అసలైన హనుమజ్జయంతి వైశాఖ మాసంలోనే అని పురాణాలూ చెబుతున్నాయి.  మహా పర్వదినం హనుమజ్జయంతి శ్రీరామ భక్తులకు హనుమజ్జయంతి మహా పర్వదినంగా పండితులు చెబుతారు. ఏడాదికి రెండుసార్లు జరుపుకునే హనుమజ్జయంతి పర్వదినాన్ని ఈ ఏడాది చైత్రమాసంలో హనుమద్ విజయోత్సవం పేరిట ఘనంగా జరుపుకున్నాం. ఇప్పుడు వైశాఖ మాసంలో కూడా జరుపుకోనున్న హనుమజ్జయంతి మరింత ప్రత్యేకమని పండితులు చెబుతున్నారు. హనుమజ్జయంతి ఏడాదిలో రెండు సార్లు ఎందుకు ? రామాయణం సుందరకాండలో వివరించిన ప్రకారం సీతను రావణుడు అపహరించినప్పుడు సీతాన్వేషణకై లంకకు బయలుదేరిన హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ చివరకు ఓ మంగళవారం తెల్లవారుజామున అశోకవనంలో సీతాదేవి ఆచూకీ కనుగొన్నాడు. ఆరోజు చైత్రమాసం, చిత్రా నక్షత్రం, పౌర్ణమి రోజు. సీతమ్మను కనుగొన్న ఆనందంలో హనుమంతుడు అశోక వనాన్ని ధ్వంసం చేసి, రావణ సైనికులను హతమారుస్తాడు. అనంతరం రావణాసురుని సైన్యం హనుమంతుని ...

Vaishaka Puranam Telugu: వైశాఖ పురాణం 24 వ అధ్యాయం

 శంఖముని కిరాతునికి వివరించిన విష్ణువు మహత్యాన్ని శ్రుతదేవ మహాన్ముని శ్రుతకీర్తి మహారాజుకు ఎలా వివరించాడో నారద అంబరీషుల సంవాదం ద్వారా ఈ కథనంలో తెలుసుకుందాం. శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుల సంవాదం శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో "ఓ రాజా! కిరాతుడు కోరినట్లుగా శంఖముని విష్ణువు మహత్యాన్ని వివరించిన తీరును చెబుతాను శ్రద్ధగా వినుము" అంటూ ఈ విధంగా చెప్పసాగెను. విష్ణు మహత్యాన్ని చెప్పమని కోరిన కిరాతుడు వైశాఖమాస ధర్మాలను బోధించిన శంఖమునితో కిరాతుడు "ఓ మహానుభావా! వైశాఖ మాసంలో విష్ణువు పూజించడం, వైశాఖ ధర్మాలు పాటించడం ఉత్తమమని చెప్పారు కదా! అసలు ఇంతకూ ఆ విష్ణువు ఎటువంటి వాడు? అతని లక్షణాలు ఏమి? అతనిని ఎలా కనుగొనాలి?" అని ప్రశ్నిస్తాడు. శంఖుడు వివరించిన విష్ణు మహత్యం కిరాతుని మాటలకు శంఖుడు "ఓ కిరాతుడా! శ్రీ మహావిష్ణువు సర్వాంతర్యామి. నారాయణుడు నిష్కలుడు, అనంతుడు, సచ్చిదానందరూపుడు. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మ అని భావిస్తారు. శాస్త్రములు, వేదములు, స్మృతులు, పురాణములు, యితిహాసములు ద్వారా నారాయణుని ఉనికిని తెలుసుకొనవచ్చును. శ్రీహరి సర్వశక్తిసంపన్నుడు. శ్రీహ...

Vaishaka Puranam Telugu: వైశాఖ పురాణం 23 వ అధ్యాయం

ఆ శ్రీహరి అనుగ్రహముతో వైశాఖ పురాణం ఇరవై మూడవ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఈ అధ్యాయంలో శంఖుడు తెలిపిన కిరాతుని పూర్వజన్మ వృత్తాంతం గురించి శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుల సంవాదం ద్వారా తెలుసుకుందాం. నారద అంబరీషుల సంవాదం శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుకు శంఖకిరాతుల వృత్తాంతము వివరించిన విధానాన్ని నారదుడు అంబరీష మహారాజుకు ఈ విధంగా చెప్పసాగాడు. కిరాతుని పూర్వజన్మ వృత్తాంతం కిరాతుడు శంఖుని చూసి "ఓ మహానుభావా! దుష్టుడను నాకు నీ అనుగ్రహం కలిగింది. అసలు కిరాతుడనైన నాకు ఇలా పుణ్య కార్యాల పట్ల ఆసక్తి కలగడానికి కారణమేమి? నీ సాంగత్యం కోరి, నిన్ను సదా సేవించాలన్న నా కోరికను మన్నించి నన్ను శిష్యునిగా స్వీకరింపుము" అన్న కిరాతుని మాటలకు శంఖుడు ఆశ్చర్యపోయి ఇదంతా వైశాఖ మహిమ అని తలచి కిరాతునితో ఇట్లు పలికాడు. శంఖుడు కిరాతునితో చల్లని ప్రదేశానికి పోవుట శంఖుడు కిరాతునితో "ఓ కిరాతుడా! సంసార సాగరాన్ని దాటించే విష్ణు ప్రీతి కలిగించే వైశాఖ ధర్మాలను ఆచరింపుడు. ఇవి ఆచరణలో చాలా సులభమైనను, ఫలితం మాత్రం అనంతం. ఈ ఎండ నన్ను మిక్కిలి బాధించుచున్నది. ఇక్కడ నీరు, నిలువ నీడ లేవు. అవి ఉన్న ప్రదేశానికి పోదాం....

Vaishaka Puranam Telugu: వైశాఖ పురాణం 22 వ అధ్యాయం

పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో శ్రుతదేవ మహాముని వివరించిన శంఖుడనే బ్రాహ్మణుని కథను నారద అంబరీషుల సంవాదం ద్వారా తెలుసుకుందాం. శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుల సంవాదం శ్రుతకీర్తి మహారాజు శ్రుతదేవ మహామునితో "మహామునీ! యిహపరసౌఖ్యముల నిచ్చు వైశాఖ మహిమల గురించి ఎంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు. కావున నా యందు దయయుంచి యింకను శ్రీహరికి ప్రియములగు దివ్యములగు వైశాఖ ధర్మములను వివరింపగోరుచున్నాను" అని ప్రార్థించెను. ఆ మాటలకూ శ్రుతదేవ మహాముని సంతోషించి "ఓ రాజా! వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరియొక కథను చెప్పుదును వినుము" అంటూ ఈ విధంగా చెప్పసాగెను. శంఖుడు కిరాతుల వృత్తాంతం పూర్వం పంపానది తీరంలో శంఖుడను పేరుగల బ్రాహ్మణుడుండెను. అతడొకప్పుడు బృహస్పతి సింహరాశియందుండగా గోదావరీ ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమరధీనదిని దాటి ముళ్లురాళ్లు గల అడవిలో ప్రయాణము చేయుచు వైశాఖ మాసపు ఎండ వేడికి తాళలేక బాధితుడై మధ్యాహ్న సమయమున ప్రయాణ శ్రమతో అలిసిపోయి ఒక చెట్టు నీడలో కూర్చుండెను. బ్రాహ్మణుని దోచుకున్న కిరాతుడు అదే సమయంలో ఆ అడవిలో దారికాచి జనాలను దోచుకునే ఒక కిరాతుడు అక్కడకు వస్తాడు. బ్రాహ్మణుని చూసి ...

Vaishaka Puranam Telugu: వైశాఖ పురాణం 21 వ అధ్యాయం

పురుయశుడు చేసిన వైశాఖ వ్రతానికి సంతుష్టుడైన శ్రీహరి అతనికి శంఖచక్రగదాధారియై దర్శనమిస్తాడు. అప్పుడు పురుయశుడు పరవశంతో శ్రీహరిని ఏ విధంగా స్తుతించాడో నారద మహర్షి వివరించిన శృతదేవ మహాముని, శ్రుతకీర్తి మహారాజుల సంవాదం ద్వారా తెలుసుకుందాం. నారదుడు అంబరీష మహారాజుల సంవాదం నారదుడు అంబరీష మహారాజుతో శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుకు వివరించిన వైశాఖ వ్రత మహత్యాన్ని వివరించసాగాడు. శృతదేవ మహాముని వివరించిన శ్రీహరి స్తోత్ర మహత్యం శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో " ఓ రాజా! పురుయశుడు తన ఎదుట ప్రత్యక్షమైన శ్రీహరిని చూసి పరవశంతో కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుచుండగా శ్రీహరి పవిత్ర పాదాలను కడిగి ఆ నీటిని తన శిరసుపై చల్లుకున్నాడు. విలువైన వస్త్రములు ఆభరణములు, గంధ పుష్పాదులు, పుష్పమాలలు, ధూపములు, అమృతప్రాయములగు నివేదనలు, తన శరీరము, తన ధనము, తన మనసు, తన సర్వస్వమును ఆ శ్రీహరికి సమర్పించెను. అనంతరం శ్రీహరిని పరిపరి విధాలుగా స్తుతించెను. ప్రీతి చెందిన శ్రీహరి పురుయశుడు చేసిన స్తుతికి శ్రీహరి ప్రీతి చెందుతాడు. పరమ ప్రసన్నంగా పురుయశుని చూస్తూ "నాయనా! నీ భక్తికి ప్రీతి చెందాను. నీకు పదివేల సంవత్సర...

Vaishaka Puranam Telugu: వైశాఖ పురాణం 20 వ అధ్యాయం

పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న వైశాఖ పురాణంలో శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో వివరించిన వైశాఖ వ్రతమహాత్యాన్ని నారదమహర్షి అంబరీష మహారాజుతో ఏ విధంగా వివరించాడో ఈ కథనంలో తెలుసుకుందాం. శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుల సంవాదం శ్రుతదేవుడు "ఓ శ్రుతకీర్తిమహారాజా! వినుము. శ్రీహరికి మిక్కిలి యిష్టమైన వైశాఖమాస వ్రతమును, దాని మహిమను వెల్లడించు మరియొక కథను చెబుతాను జాగ్రత్తగా వినుము" అంటూ ఈ విధంగా చెప్పసాగెను. పురుయశ రాజు కథ పూర్వం పాంచాల దేశమున పురుయశుడనే రాజు కలదు. అతను పుణ్యశీలుడనే రాజు కుమారుడు. తన తండ్రి మరణానంతరం పురుయశుడు రాజయ్యాడు. పురుయశుడు ఎంతో ధర్మబద్ధంగా తన రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డలవలె కాపాడుతూ, ప్రజారంజకంగా పరిపాలిస్తుండేవాడు. తన బలపరాక్రమాలతో రాజ్యాన్ని సువిశాలంగా విస్తరించాడు. భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలతో తులతూగుతుండే పురుయశుడు కొంతకాలానికి పూర్వజన్మ కర్మవశాత్తు తన సకల సంపదలను, అపారమైన సైన్యాన్ని కోల్పోయాడు. దురదృష్ట వశాత్తు రాజ్యంలో కొన్ని సంవత్సరాలపాటు వర్షాలు కురవక కరువు కాటకాలు ఏర్పడ్డాయి. శత్రువుల దండయాత్ర ఎప్పుడైతే పురుయశుడు బలహీనమయ్యాడ...