Tiru Arimeya Vinnagaram Divyadesam: శ్రీ కుడమాడుకూత్తన్ దేవాలయం - తిరు అరిమేయ విణ్ణగరం
తిరునాంగూరు దివ్యదేశాలలో కుడమాడుకూత్తన్ దేవాలయం అని పిలవబడే ఈ తిరుఅరిమేయవిణ్ణగరం ఒకటి. మూడు అంతస్థులతో కూడియున్న రాజగోపురంలో గర్భగృహం, అర్థ మండపం మహామండపాలు ఇక్కడ ఉన్నాయి. శీర్గాళి అనేక్షేత్రం నుండి 8 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం వెలసియున్నది. ఈ దేవా లయంలోని మూలమూర్తి తూర్పుదిక్కున కుడిపాదాన్ని అలా కిందకు చాపి, ఎడమపాదాన్ని మడచిపెట్టుకుని కూర్చున్న భంగిమలో శ్రీభూసమేతుడై విరాజిల్లుతున్నాడు.
స్వామివారు మూలవరులు : కుడమాడుకూత్తన్
ఉత్తరమూర్తులు : చతుర్భుజ గోపాలన్
అమ్మవారు మూలవరులు : అమృతఘటవల్లీ తాయార్
ఉత్సవమూర్తులు : అమృతఘటవల్లీ తాయార్
స్థలవృక్షము : పురసమార వృక్షము
పుష్కరిణి : కోటి తీర్థము, అమృత తీర్థము
విమానం : ఉచ్యశృంగ విమానము
ప్రత్యక్షం : ఉదంక మహర్షికి
ముఖము/స్థితి : తూర్పు / కూర్చున్న సేవ
మంగళాశాసనం : తిరుమంగై ఆళ్వారు (10)
స్థలపురాణం
వినత, కద్రువ ఇరువురు కశ్యపమహర్షి ధర్మపత్నులు. పెద్దభార్య వినత గరుత్మంతుని తల్లి, చిన్నభార్య కద్రువ నాగమాత. వినతని తన దాసిగా చేసుకోవాలనే దురుద్దేశంలో కద్రువ దేవేంద్రుని అశ్వమైన ఉచ్ఛైశ్రవం తోక నల్లనివర్ణం అని వినతతో వాదానికి దిగింది. వినత గుర్రంతోక తెల్లని వర్ణమే అని వాదించింది. కద్రువ కాదు నల్లనివర్ణమే అని నేను నిరూపిస్తే నీవు వాళ్లు నాకు దాస్యం చేయాలి. ఒకవేళ తోక తెల్లనివర్ణం కలదైతే నీకు మేమందరమూ దాస్యం చేస్తామనిపందెం కట్టింది. ఈ పందెంలో ఎలాగైనా గెలవాలనే పట్టు దలతో కద్రువ తన కుమారుడైన కర్కోటకుణ్ణి పిలిచి ఉచ్ఛైశ్రవం తోకను బాగా చుట్టుకోమని చెప్పింది. అలా కద్రువ ఉచ్ఛైశ్రవం తోక నల్లనివర్ణమే ఉందని నిరూపించి వినతను దాసిగా చేసు కుంది. తర్వాత వినత దాస్యవిముక్తి కోసం కద్రువనే ఉపాయం అడిగితే ఆమె దేవలోకం నుండి అమృతాన్ని తీసుకొని వచ్చి తనకు అప్పగిస్తే విముక్తి కలిగిస్తానని చెప్పింది. తమ దాస్యాన్ని పోగొట్టుకోవడానికి గరుడుడు దేవలోకానికి వెళ్లి, అక్కడ అనేక ఆటంకాలను ఎదుర్కొని అమృతకలశాన్ని సాధించి తన తల్లికి, తనవాళ్లకు దాస్యవిముక్తి కలిగించాడు. మాయావి అనే అసురుడు అమృతకలశాన్ని అపహరించి పరిగెత్తడం ప్రారంభించగా భగవం తుడు ఒక బాణాన్ని సంధించగ అది తగిలి ఆ అసురుని చేయి ఖండించబడి ఈ అమృతకలశం అరిమేయవిణ్ణగరమ్ అనే దివ్య దేశంలో పడి అమృతంపారి అదే అమృతపుష్కరిణిగా అయింది.
ఉదంకమహర్షి తన భార్య ప్రభతో కలిసి స్నానం చేస్తుండగా ఆమె కొట్టుకుపోయింది. ఇందుకు బాధపడుతున్న ఉదంకుడికి అరిమేయవిణ్ణగరమ్ ఉత్సవమూర్తి గోపాలకృష్ణుడు నాలుగుభుజాలతో సాక్షాత్కరించి మహర్షి భార్య ప్రభ ముక్తిని పొందింది అని తెలియజేసి మహర్షి బాధను పోగొట్టాడు.
పాంచరాత్రాగమోక్తంగా పూజలందుకునే ఈ దేవదేవుణ్ణి సేవించిన వారికి భగవంతుని శ్రీపాదాలందు తప్ప ఎక్కడా దాస్యముండదు.
Comments
Post a Comment