Skip to main content

Bhogi Festival: భోగ భాగ్యాల భోగి

నాలుగు రోజుల సంక్రాతి పండుగకు సంబంధించి మొదటి రోజు భోగి.


  • ధనుర్మాసంలో చివరి రోజు భోగి.
  • భోగినాడు తలంటు స్నానము చేయాలి, ఈ స్నానంతో భోగి పీడ వదిలింది అని సంతోషించాలి.
  • ఇంటిని మంగళ తోరణాలతో , గడపను పసుపుకుంకుమలతో అలంకరించాలి.
  • తెల్లవారకముందే వేసిన భోగిమంటలు చుట్టూ ఇంటిళ్లిపాది చేరి చలి కాచుకోవడం, స్నానం చేసి, కొత్త బట్టలు కట్టడం ఒక సరదా.
  • మధ్యాహన వేళ బొమ్మల కొలువు పెట్టాలి.
  • సూర్యాస్తమయం లోపల ఎనిమిది సంవత్సరాల వయస్సు ఉన్న బాలబాలికలకు భోగి పళ్లు పోయాలి.
  • భోగి నాడు సజ్జ రొట్టెలు తినడం ఆచారం, నువ్వులు అద్దిన సజ్జ రొట్టెలు ఈనాడు భోజనంలో తప్పకుండ ఉండాలి.
  • భోగినాడు శివునికి నేతితో అభిషేకం చేయడం మంచిది అని శివరహస్యం  అనే గ్రంధం చెపుతుంది.
  • గోదాదేవి రంగనాధుని ధనుర్మాసం ముపైరోజులు సేవించి ఆనాడే స్వామిని కళ్యాణం చేసుకుని స్వామిలో లీనమైంది అని వైష్ణవ గ్రంధాలూ వర్ణిస్తాయి.
  • ఆ రోజు శ్రీరంగ క్షేత్రంలో మహావైభవంగా గోదారంగనాధుల తిరుకల్యాణం నిర్వహిస్తారు.
  • కొన్ని వైష్ణవ ఆలయాలలో కూడా  గోదారంగనాధుల కళ్యాణం నిర్వహిస్తారు.
  • ఈ రోజు వస్త్రదానం చేస్తే మహాపుణ్యం అని విష్ణు ధర్మోత్తర పురాణం చెపుతుంది.
  • నువ్వులు దానం ఇస్తే రోగాలు నశిస్తాయి అని స్కంద పురాణం చెబుతుంది. 
  • భోగినుంచి సూర్యకిరణాలు సర్వ ఔషధాలను  పునర్ జీవింప చేసేవిగా మారుతాయి అని తైత్తరీయ వేదం వాక్కు. 
  • ఈ రోజు గుమ్మడికాయ దానం ఇస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయి అని ధర్మప్రవృతి అనే గ్రంధం స్పష్టం చేస్తుంది. 
  • పూర్వకాలంలో భోగినాడు యజ్ఞాలు కూడా నిర్వహించేవారు. 
రాయలసీమ లో 

రాయలసీమ ప్రాంతాలలో భోగి మంటలు లేవు కానీ, భోగి నాడు అని కూరగాయలు కలిపి కలగూర అన్న పేరుతో ఒక వంటకం చేస్తారు. పసుపు రంగుల దుస్తులు ధరించడం మరో ఆచారం.
మహిళలు తప్పకుండ ఈ రోజు కొత్త గాజులు ధరిస్తారు.

తెలంగాణ లో 

భోగినోము పేరిట మట్టికుండలో నువ్వుల ఉండలు, చెరుకు ముక్కలు, జీడిపళ్లు, చిల్లర డబ్బులు వేసి యముణ్ణి చెల్లలు యమున నోచుకున్నట్టుగా ఆ మట్టి ముంతను మూసి వాయునాలుగా ఇవ్వడం ఆచారం.

మహారాష్ట్రలో భోగినాడు ఇంటికోడలు చుక్కలు ఉన్న నల్ల చీర ధరిస్తుంది, నువ్వులు బెల్లం ముక్కలను అందరు పంచుకుంటారు.

కర్ణాటకలో  భోగినాడు నువ్వులు, బెల్లం ముక్కలు , కొత్త బట్టలు చేతలో ఉంచి వాటిని వాయనంగా సువాసినులకు పంచిపెడతారు.  

2025: జనవరి  13.

Comments

Popular posts from this blog

Karthika Masam: కార్తీకమాస మహత్యం (స్కంద పురాణం)

  దీపారాధన  కార్తీకమాసంలో శివాలయ గోపురంలో, ద్వారం దగ్గర, శిఖరం మీద శివలింగం సన్నిధిలో దీపారాధన చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి. ఎవరైతే కార్తీక మాసంలో ఆవునేతితో గానీ, నువ్వుల నూనెతో గానీ విప్పనూనెతో గానీ, నారింజనూనెతో గానీ శివాలయంలో భక్తిగా దీపారాధన చేస్తారో వారు సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందుతారు. కేవలం ఆముదంతో కార్తీక దీపాన్ని వెలిగించినా అఖండమైన పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో యోగ్యుడైన విప్రుడికి దక్షిణతో సహా దీపదానం చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుంది. వన భోజనం  కార్తీకమాసంలో చేసే వనభోజనం చాలా విశేషమైన ఫలితాన్నిస్తుంది. ఎన్నో రకాల  వృక్షాలతో వున్న వనంలోకి వెళ్ళాలి. అక్కడ ఉసిరి చెట్టు తప్పకుండా ఉండాలి. ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామాన్ని ఉంచి గంధపుష్పాక్షతలతో యథావిధిగా పూజించాలి.  ఆ తరువాత శక్తికొద్దీ విప్రుల్ని దక్షిణ తాంబూలాలతో తగిన విధంగా సత్కరించి తరువాత భోజనం చేయాలి. ఈ విధంగా శాస్త్ర బద్ధంగా కార్తీకమాస వనభోజనాన్ని చేస్తే సకల పాపాలూ నశించి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది గీతాపారాయణం కార్తీకమాసంలో శ్రీహరి సన్నిధిలో భగవద్గీతని పారాయణ చేస్తే అనంతమైన పుణ్యం కలుగుతుంది...

Shani Trayodashi: శని త్రయోదశి

త్రయోదశి తిధినాడు శనివారం వస్తే ఆ రోజు శని త్రయోదశి అవుతుంది. ఆ రోజు శనిభగవానుడిని  విశేషంగా పూజిస్తారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకల్పము ప్రకారం శని పుష్యమాసంలోని శుక్ల పక్షంలో నవమి తిధినాడు జన్మించాడు. ఆ రోజు శనివారం, భరణి నక్షత్రంలో శని జన్మించాడు. శాంతిపీఠికలోని వివరాలు మరోరకంగా చెబుతున్నాయి. మహాతేజస్సుతో వెలుగొందే శని నిలవర్ణంలో ఉంటాడు. అయన ఛత్రం రంగు కూడా నీలమే. ఇక్కడ నిలవర్ణం అంటే నలుపు అని అర్ధం. అయన సౌరాష్ట్ర దేశంలో జన్మించాడు. అతనిది కాశ్యపస గోత్రం. మాఘ బహుళ చతుర్దశినాడు శని జన్మించాడు. ఉత్తర భారతదేశంలో శనిత్రయోదశినాడు కాకుండా అమావాస్యనాడు నిర్వహించుకుంటారు. పుర్ణిమాంత పంచాంగాలను అనుసరించి జ్యేష్ఠా అమావాస్య నాడు శనిజయంతి. తెలుగు పంచాంగాల ప్రకారం వైశాఖ అమావాస్యనాడు వస్తుంది. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య తిధులు శని ఆరాధనకు తగినవని మనకు   తెలుస్తుంది. శని త్రయోదశి నాడు శనిని పూజిస్తే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఏలినాటి శని, అష్టమ, అర్ధాష్టమ శని జరుగుతున్న రాశులు వారు శనిని ఆరాధించాలి. శని మహర్దశ లేదా అంతర్దశ జరుగుతున్న వారుగాని, జాతకంలో శని చేదు స్థానాలలో ఉండగా జన...

Karthika Masam: కార్తీకమాసం ఈ నెలరోజులూ ఏం చేయాలి - ఏం చేయకూడదు

  కృతయుగంతో సమానమైన యుగం, వేదాలకు సమానమైన శాస్త్రం, గంగకు సమానమైన నది, కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. కార్తీక మాసం శివుడికి, మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. కార్తీక పురాణంలో కార్తీక సోమవారం,  జ్వాలాతోరణం  మహాశివుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే  బలి పాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువు  ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తాయి. కార్తీక పురాణం లో కూడా మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుడి ప్రాముఖ్యతను, ఆఖరి 15 అధ్యాయాలు శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తాయి.  కార్తీక మాసంలో ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు స్నానం కార్తీక మాసంలో సూర్యుడు తులా రాశిలో ఉండటం వల్ల నదిలో నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం ఆచరించడం వల్ల శరీరానికి శక్తి కలిగి ఆరోగ్యంగా ఉంటారు. పురాణాల పరంగా కార్తీక నెలరోజులూ సూర్యోదయానికి ముందు నదీస్నానం చేస్తే సకల పాపాలు నశిస్తాయని అంటారు. దీపం ‘దీపం జ్యోతి పరబ్రహ్మం.. దీప జ్యోతి జనార్దన.. దీపో మేహరతు పాపం.. సంధ్యాదీపం నమోస్తుతే!’.దీపమే పరబ్రహ్మం. దీపంలో లక్ష్మీ దేవి ఉందనీ.. దీపం నుంచి వచ్చే తేజస్సులో బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు ఉన్నారనీ పురాణాలు...

Kanuma Festival: కనుమ

తెలుగువారి సంక్రాంతి మూడురోజుల పండుగ. భోగి, మకర సంక్రాంతి తరువాత మూడవ రోజు కనుమ పండుగ. కనుమ పండుగను కనుమూపులు పండుగ అని అంటారు. కనుము అంటే పశువు అని అర్ధం, పులు అనే తెలుగు మాటకు రత్నాలపై పేరుకునే మాలిన్యం, అల్పమైనది, కసువు అనే అర్ధాలున్నాయి. కసువు అంటే గడ్డి, కనుమ పండుగ నాడు పశువులకు కనీసం గడ్డిని వేసి తినిపించడం కర్తవ్యం అందుకే ఈ పండుగను " కనుమూపులు" అని పిలిచారు. కనుము రోజు పూజ కార్యక్రమాలు ముగించుకొని, పశువుల అలంకరణకు సిద్ధం అవుతారు పశువులను శుభ్రంగా కడిగి, వాటికీ పసుపు పూసి బొట్లు పెట్టి పూల దందాతో అలంకరిస్తారు మేడలో గంటలు కడతారు. పొంగలి వండి, దేవునికి నైవేద్యం పెట్టిన తరువాత వాటిని పశువులకు తినిపిస్తారు. కనుమరోజు పశువులతో పాటు పక్షులను కూడా పూజించుకునే ఆచారం ఉంది. ఇళ్లలో , దేవాలయంలో వరికంకులు కుచ్చుగా కట్టి పక్షులు తినేందుకు ఆహారంగా పెడతారు. బహిరంగ ప్రదేశాలలో పక్షులు ఎక్కువగా గుమ్ముగూడె చోట గింజలు చల్లి, పక్షులకు ఆహారం తినిపిస్తారు. అలనాడు గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలితో పైకి ఎత్తి శ్రీకృష్ణ పరమాత్మా నందగోకులాని రక్షించింది కనుమ పండుగ రోజే అనే చెబుతారు.  కనుమ తరువాత రో...

Pushya Pournami: పుష్య పౌర్ణమి

పుష్య పౌర్ణమి పర్వదినాన చంద్రునితో పాటు లక్ష్మీనారాయణుడిని పూజిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఆచరించడంవల్ల కుటుంబంలో ఎలాంటి ఆటంకాలు రావని, జీవితాంతం ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ పుష్య పూర్ణిమను శాకంబరి పూర్ణిమ అని కూడా పిలుస్తారు.  ఈ రోజున బ్రహ్మ ముహుర్తంలో నిద్రలేవాలి. గంగానదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయడంవల్ల సకల పాపాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. నదిలో స్నానం చేసేందుకు వీలు కాని వారు ఇంట్లో ఉన్న నీటిలో కొంత గంగాజలం వేసి స్నానం చేయాలి. శుభ్రమైన బట్టలు ధరించి ఉపవాస వ్రతం ఆరంభించిన అనంతరం సింధూరం, ఎర్రని దారం, పసుపు రంగు పువ్వులు, పండ్లు, తీపి పదార్థాలు, పంచామృతాలతో లక్ష్మీ నారాయణులను పూజించాలి. శ్రీహరి భజనలో పాల్గొనాలి. ఇదే రోజున సాయంత్రం పాలలో పంచదార, వండిన అన్నం కలిపి చంద్రునికి నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేయడంవల్ల లక్ష్మీదేవి తమ ఇంట్లో నివసిస్తుందని పురాణ వచనం. రాత్రి సమయంలో దక్షిణవర్తి శంఖంలో గంగాజలం, కుంకుమ కలిపి శ్రీహరికి అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కరుణించి ఆర్థిక ఇబ్బ...

Yemmiganur Jatara 2025: శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి జాతర 2025 - ఎమ్మిగనూరు

ఎమ్మిగనూరులో నీలకంఠేశ్వరుడి రథోత్సవం నెలరోజుల పాటు ఘనంగా జరుగుతుంది. ఆంధ్ర - కర్ణాటక సరిహద్దు ప్రాంతాల ఇలవేల్పు ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామి. ఏటా పుష్యమాసంలో స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతాయి. అటు కర్ణాటకలోని బళ్లారి, రాయచూరు ప్రాంతాల నుంచీ ఇటు తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా నుంచీ వేలాది భక్తులు తరలివస్తారు. కర్నూలు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఒకటైన ఎమ్మిగనూరు ఒకప్పుడు కుగ్రామం. చేనేతకళకు ప్రసిద్ధి పొందింది.  ఇక్కడి నీలకంఠేశ్వరుణ్ణి నేతకార్మికులే కాశీ నుంచి తెచ్చి ప్రతిష్ఠించినట్లు చెబుతారు. స్వామి స్వయంభువని మరో ఐతిహ్యం కూడా ఉంది. మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానాధీశులకు ఎమ్మిగనూరు నీలకంఠేశ్వరుడు ఇష్టదైవం. వారే స్వామికి రథోత్సవ సంప్రదాయాన్ని ప్రారంభించారు. వీరప్ప అనే శిల్పి 30 అడుగుల ఎత్తుతో స్వామి రథాన్ని రూపొందించాడు. నీలకంఠేశ్వర స్వామి ఆలయం వెలసిన ప్రాంతాన్ని ఒకనాడు ఎనమలూరుగా పిలిచేవారు. పూర్వం ఈ ఊరి సంతలో ఎనుములను (గేదెలు) భారీగా విక్రయించేవారు. ఇప్పటికీ ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా పెద్ద పశువుల సంత జరుగుతుంది. శ్రీకృష్ణదేవరాయలు నీలకంఠేశ్వరుని సన్ని...

Makara Sankranti: సంక్రాంతి పండుగ విశిష్టత

సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం.సూర్యుడు ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి ప్రవేశించాడని సంక్రమణం అని అంటారు.అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. తెలుగువారి పండుగ, ముఖ్యంగా ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి.ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఈ సంక్రాంతి పండుగను కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు,కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు జరుపుకుంటారు. నిజానికి ధనుర్మాసారంభంతో నెలరోజులు మూమూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట ప్రారంభమవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతాయి. ఈ పండుగకు రైతుల ఇంటికి ధనధాన్యరాశులు చేరతాయి.  పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహప్రాంగణాలతో, ఇళ్ళు లోగిళ్ళు ఒక నూతన వింత శోభ సంతరించుకుంటాయి.  ఈ పండుగకు నవసొబగులు తీసుకురావడానికి పది రోజుల ముందే...

Harivarasanam: హరివరాసనం.. విశ్వమోహనం (అర్ధం తో )

  శబరిమల అయ్యప్ప స్వామి పవళింపు పాత హరివరాసనం. ఈ పాట వింటుంటే మది ఆనంద తాండవం చేస్తుంది. ఈ పాట పాడుతుండగా గర్భాలయంలో ఒక్కొక్క దీపం కొండెక్కిస్తారు.చివరికి ఒక దీపం మాత్రం ఉంచుతారు.  1950 వ దశకంలో శబరిమల నిర్మానుష్యంగా ఉండేది. ఆ కాలంలో గోపాలమీనన్ అనే భక్తుడు స్వామివారికి ప్రత్యేక పూజల సందర్భంగా ఈ పాటను పారాయణ  చేసేవాడు. గోపాలమీనన్ మరణ వార్త తెలుసుకున్న అప్పటి తంత్రిగా (పూజారి) వున్న ఈశ్వర్ నంబూద్రి ఆ రోజు ఆలయం మూసే సమయంలో హరివరాసనం గానం చేశాడు. అప్పటి నుండి శబరిమలలో ఆలయం మూసే ముందు ఈ పాట పాడడం సంప్రదాయంగా మారింది. హరివరాసనం విశ్వమోహనం - హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకం అరివిమర్ధనం నిత్యనర్తనం - హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా సమున్నతమైన ఆసనాన్ని అధిష్టించినవాడివి, విశ్వాన్ని మోహింపచేసేవాడివి, సూర్యునిచే పాదపూజలందుకునేవాడివి, శత్రులను(ఆత్మశత్రులు, బాహ్య శత్రులు) నాశనం చేసేవాడివి, హరిహరులు పుత్రడవు అయిన ఓ అయ్యప్ప దేవా నీ ఆశ్రయం కోరుతున్నాను. శరణకీర్తనం శక్తమానసం - భరణలోలుపం నర్తనాలసం అరుణభాసురం భూతనాయకం - హరిహరాత్మజం దే...

Saphala Ekadasi: సఫల ఏకాదశి

  మార్గశిర మాసంలో వచ్చే కృష్ణ పక్ష ఏకాదశిని సఫల ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ఏకాదశి గురించి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. ఈ ఏకాదశి గురించి శ్రీ కృష్ణభగవానుడు, ధర్మరాజుకు వివరించాడు. మాహిస్మతుడనే రాజు ఈ ఏకాదశిని ఆచరించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ ఏకాదశిని ఆచరించేవారు ధన్యులు. ఈ రోజున ఉపవాసం, జాగారం చేసి శ్రీమన్నారాయణుని అనుగ్రహం కోసం పూజిస్తారు. చేపట్టిన పనులు సఫలం కావాలంటే సఫల ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులను పూజించడం సహా దానాలు చేయడం మంచిది. సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి ఆలయాల్లో దీపాలను వెలిగిస్తే ఐదువేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కుతుందని అంటారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువును లక్ష్మీ సమేతంగా పూజిస్తారు. ఈ ఏకాదశి రోజున చేసే ఉపవాసం, లక్ష్మీనారాయణుల పూజ, జాగారం వలన చేపట్టిన పనులు సఫలం అవుతాయని విశ్వాసం. సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్లు ఉదయాన్నే తలస్నానం చేసి, ఇంటినీ, పూజా మందిరాన్ని శుభ్రపరిచి లక్ష్మీనారాయణుల చిత్ర పటాలు గంధం, కుంకుమ, పసుపు రంగు పుష్పాలతో అలంకరించాలి. ఏకాదశి పూజలో తులసి తప్పనిసరి. ఆవునేతితో దీపారాధన చేయాలి. లక్ష్మీనారాయణులకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు చ...