Bhavani Deeksha Rules: భవాని దీక్ష నియమాలు
భవాని దీక్ష విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ కోసం స్వీకరిస్తారు. ఈ దీక్ష కార్తీక మాసంలోని ఉత్థాన ఏకాదశి రోజు లేదా కార్తీక పౌర్ణమి రోజు నుండి దీక్ష స్వీకరిస్తారు.ఈ దీక్ష మండలం( 41 రోజులు) లేదా అర్ధ మండలం( 21 రోజులు) కొనసాగుతుంది.
పురుషులకు
- దీక్షా ప్రారంభమునకు ముందుగా సోమ-బుధ- గురు వారములలో ఒక మంచిరోజున శిరోముండ నము (గుండు) చేయించుకొని (మీసము ఉంచు కొనరాదు), (శిఖపెట్టుకునట్లైతే విశేషము) భవానీ దీక్షను ప్రారంభము చేయవలెను.
- దీక్షాకాలమంతయు రెండు పూటల శిరఃస్నానము (తలస్నానము) చేయవలెను.
- దీపారాధన తడివస్త్రములతో చేయరాదు. ఆరిన (పొడిగానున్న) దుస్తులు ధరించి దీపారాధన చేయ వలెను.
- ఒక వస్త్రము మాత్రమే ధరించి (భుజం పై రెండవ వస్త్రము లేకుండా) దీపారాధన చేయకూడదు.
- నుదుట విభూతి రేఖలు గంధము. కుంకుమబొట్టు ధరించవలెను.
స్త్రీలకు
- దీక్షా ప్రారంభమునకు ముందు తలంటు స్నానము చేసి పవిత్రముగ దీక్షను ప్రారంభము చేయవలెను.
- రెండు చేతులకు గాజులు, నుదుట కుంకుమ బొట్టు కాళ్ళకు పసుపు విధిగా ధరించవలెను.
- దీపారాధన చేయునపుడు పూజచేయునపుడు తల జుట్టు (జడ) ముడివేసికొని చేయవలెను.
- స్నానముచేసి తడిసిన వస్త్రములతో దీపారాధన చేయరాదు.
- ఆరిన (పొడిగానున్న) దుస్తులు ధరించి దీపారాధన చేయవలెను.
- ప్రతిరోజు పొద్దున శిరఃస్నానము సాయంత్రము కంఠస్నానము చేసిన చాలును.
ఆహార నియయములు
- పవిత్రముగు ఆహారము భుజించవలెను.
- ఉల్లి, పుట్టగొడుగులు, మద్యము, మాంసము, స్వీకరించరాదు.
- పొగత్రాగకూడదు.
- ఛద్ది అన్నము తినకూడదు.
- ఎంగిలి భుజంచరాదు.
- రోజులో ఒక పూట మాత్రమే భోజనము చేయవలెను.
- ఇద్దరు కలిసి ఒక పాత్రలో భుజించకూడదు.
భవానీదీక్షలలో స్త్రీ-పురుషులందరు ఆచరించవలసిన నియమములు
- దీక్షా ప్రారంభము నుండి దీక్షా సమాప్తివరకు ఎఱ్ఱని దుస్తులు ధరించుట-భవానీ మాలా ధారణ (మాలిక ఎప్పుడు మెడలో నుండుట) చేయవలెను.
- భవానీ నామమును లేక అమ్మవారి నామమును జపించుచుండవలెను.
- రోజూ దుర్గాదేవిని కొంతసేపు ధ్యానించాలి.
- మైల సోకకుండా పవిత్రముగా ఉండవలెను.
- పవిత్రమైన-ప్రశాంతమైన మనస్సుతో ఉండవలెను.అహంకారము లేకుండా
- ప్రతి రోజు రెండు పూటల అమ్మవారి పటమునకు గాని లేక చిన్న పసుపు ముద్దకు గాని పూజ చేయవలెను.
- దీక్షా కాలములో కనీసము ఒకరోజైనా కృష్ణా నదీ స్నానము చేయుట మంచిది.
- అశ్లీలము, అబద్ధములు పల్కకూడదు.
- పగటివేళ నిద్ర పోకూడదు.
- కాళ్ళకు తోలు చెప్పులు వేయకూడదు
- సూర్యోదయ సూర్యాస్తమయ సమయములలో పడుకొనుట, నిద్రపోవుట నిషేధము.
- కాలకృత్యములకు వెళ్ళిన తర్వాత కాళ్ళు కడిగి కొని 3 పర్యాయములు నీరు పుక్కిలిచేయుట చేయవలెను.
- సినిమాలు చూడకూడదు.
- బ్రహ్మచర్యము చేయవలెను.
- దీక్షాకాలములో జాతాశౌచ-మృతాశౌచములు వచ్చినచో - దీక్ష పనికిరాదు. మాలిక తీసివేసి ఆశౌచము పాటించవలెను.
- చాపమీద పడుకొనవలెను.
- ఉదయం - సాయంత్రం ఉపాహారము స్వీకరించవచ్చును.
Comments
Post a Comment