Posts

Shani Shinganapur Temple: శని శింగణాపూర్ ఆలయం

Image
మహారాష్ట్రలోని ఆహ్మద్ నగర్ జిల్లాలో ఉంది శింగనాపూర్ గ్రామం. ఇక్కడ శనిశ్చరుని ఆలయం చాలా ప్రాచూర్యం పొందింది. అది కాకుండా ఈ ఊరిలోని ఏ ఇంటికీ కూడా ప్రధాన ద్వారానికి తలుపులు ఉండవు. ఇళ్లకే కాదు షాపులకు కూడా తలుపులు, గొళ్లాలు ఉండవు. అలాగే ఇక్కడి ఆలయాలకు కూడా తలుపులు ఉండవు. అక్కడి శనిశ్వరుడి ఆలయానికైతే ఏకంగా పైకప్పే ఉండదు. ఇక్కడ శనీశ్వరుడు స్వయంభూగా నల్లనిరాయి రూపంలో వెలిశాడని నమ్మకం గొర్రెల కాపరులు ఈ శనీశ్వరుని కనుగొన్న రోజు రాత్రి ఒక గొర్రెల కాపరి కలలో శనీశ్వరుడు కనిపించి తనను ఎలా సంతుష్టుడిని చెయ్యాలో, ఎలా ఆరాధించాలో విధివిధానాలను వివరించడాడని చెబుతారు. కొన్ని ప్రత్యేక నియమాలను, విధులను శనీశ్వరుడు స్వయంగా ఆ గొర్రెల కాపరికి వివరించాడట. అప్పుడు ఆ కాపరి ’మరి ఆలయ నిర్మాణం చేపట్టాలా‘ అని శనీశ్వరుని అడిగినపుడు ఆలయానికి పైకప్పు అవసరం లేదని ఆయన చెప్పాడట. ఈ అనంత నీలాకాశమే తనకు పైకప్పు అని చెప్పినట్టు స్థల పురాణం. అందుకే ఇక్కడి మూలవిరాట్టు తలమీద పై కప్పు లేకుండా ఆవరణలో ఉంటుంది. ఈ ఆలయానికి కిలోమీటరు పరిధిలో ఉన్న ఏ వ్యాపారస్థలానికైనా, ఇంటికైనా సరే ప్రధాన ద్వారానికి తలుపులు గడియలు ఉండవు. ఎందుకంటే శనీశ్

Mehandipur Balaji Temple: మెహందీపూర్ బాలాజీ ఆలయం - రాజస్థాన్

Image
రాజస్థాన్ ఆరావళి పర్వతాల సమీపం నడుమ దౌసా అనే జిల్లాలో ఉందీ మెహందీపూర్ బాలాజీ ఆలయం.  రాజస్థాన్ నుంచి మాత్రమే కాదు..ఆ చుట్టుపక్క రాష్ట్రాల నుంచి మెహందీపూర్ బాలాజీ దర్శనానికి వస్తుంటారు.  వేల సంవత్సరాలకు ముందు ఓ భక్తుడికి ఆంజనేయుడు బాలుడి రూపంలో కనిపించి తన జాడ చెప్పాడట.ఆ భక్తుడు ఎంత వెతికినా హనుమంతుడు కనిపించకపోవడంతో మళ్లీ కఠినమైన సాధన చేశాడట..అప్పుడు మరోసారి కలలో కనిపించి తాను వెలసిన ప్రదేశం గురించి స్పష్టత నిచ్చాడట.అప్పుడు ప్రతిష్టితమైన వాయుపుత్రుడు నిత్యం పూజలందుకుంటున్నాడు.   స్వామి బాలహనుమంతుడిగా వెలిసిన ఈ ప్రదేశంలోనే మరో రెండు విగ్రహాలు దర్శించుకోవచ్చు. శివుని ఉగ్రరూపమైన భైరవుని సూచించే విగ్రహం ఒకటి...దుష్టశక్తులకు రాజుగా భావించే ‘ప్రేతరాజు’ విగ్రహం మరొకటి. వేల ఏళ్ల క్రితమే ఇక్కడ పూజలు మొదలైనాకానీ...ఆంజనేయుడి అసాధారణ  మహిమలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దుష్టశక్తులతో బాధలు పడేవారు, మానసికరోగులు, మూర్ఛరోగులు, సంతాన సమస్యలతో బాధపడుతున్నవారు మెహందీపూర్ బాలాజీ ఆశీస్సులు  పొందితే పరిష్కార మార్గం దొరుకుతుందని భక్తుల నమ్మకం. ఉగ్రుడైన స్వామి వారి పాదాలదగ్గర నిత్యం నీరు ప్రవహిస్తుంటుంది. ఆ 

Ganga Snan: కాశీ గంగ స్నాన మహత్యం (స్కాంద పురాణం)

Image
   కలిదోషాల్ని పరిహరించటంలో గంగానదితో సమానమైన తీర్థం మరొకటి లేదు. అలాగే ముక్తిని ప్రదానం చేసే దివ్యక్షేత్రాలలో కాశీ క్షేత్రాన్ని మించిన క్షేత్రం లేదు. గంగానదిలో తిథివార నక్షత్ర నియమాలు లేకుండానే స్నానం చేయవచ్చు. కాశిలో ఉన్న గంగని సేవించినవాడు, గంగా దేవికి మందిరాన్ని నిర్మించినవాడు సమస్త సుఖభోగాల్ని పొందుతాడు. గంగాదేవిని స్మరించినా, ఆమె మహిమని విన్నా, వినిపించినా వారికి గంగాస్నానఫలం దక్కుతుంది. పితృదేవతల్ని ఉద్దేశించి వారి పేర్లు స్మరిస్తూ గంగలోని నీళ్ళతో ఏ శివలింగానికి  అభిషేకం చేసినా, వారి పితరులకి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. గంగాజలంతో సూర్యుడికి అర్హ్యాలు సమర్పిస్తే ఆరోగ్యం పెంపొందుతుంది. గంగాస్నానం చేసే వారి జోలికి యమదూతలు ఎప్పుడూ రారు. కాశీలోని గంగా తీరంలో గోదానం, భూదానం, సువర్ణదానం, అన్నదానం చేసిన వారికి పునర్జన్మ ఉండదు. మకరసంక్రమణం, ఉత్తర, దక్షిణాయనాలు, సూర్య చంద్రగ్రహణాలు తదితర పర్వదినాలలో కాశీ గంగలో చేసే స్నానం అనంతమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. జ్యేష్ఠమాసం శుద్ధ దశమీ హస్తానక్షత్రం ఉన్న రోజు గంగాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆ రోజు దశహర గంగాస్తోత్రాన్ని శ్రద్ధగా పఠించి గంగాస్

Human Duties: మానవ ధర్మములు

Image
1. ఉదయం నిద్రనుండి లేచినపుడు కుడి ప్రక్కకు తిరిగి లేవండి ఆరోగ్యం. 2. లేచిన వెంటనే రెండు అరచేతులు చూస్తూ॥ కరాగ్రే వసతేలక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేస్థితే గౌరి ప్రభాతే కరదర్శనం" అని అనుకోండి. 3. కుడికాలు మంచంమీద నుండి క్రింద పెడుతూ “సముద్ర వసనేదేవి పర్వతస్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శక్షమస్వమే” అని భూమాతకు నమస్కరించండి 4. లేచిన వెంటనే కప్పుకున్న దుప్పటిని, ప్రక్క బట్టలను అన్నింటినీ చక్కగా మడతపెట్టండి. తదుపరి కాలకృత్యాలు పూర్తి చేయండి. 5. ఉదయాన్నే ముందురోజు రాత్రి రాగిపాత్రలో పోసిఉంచిన నీరు త్రాగండి. 6. వ్యాయామం (నడక) కనీసం ఉదయం 9 ని॥ల నడవండి. 7. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి సర్మడే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అనుకుంటూ చన్నీటి స్నానం చేయండి. 8. సూర్యునకు ఎదురుగా గాని, నడుస్తూగాని దంతధావన చేయరాదు. 9. మూత్రవిసర్జన సూర్య, చంద్రులకు ఎదురుగా చేయరాదు. 10. స్నానానికి చన్నీటి స్నానం ఉత్తమమైనది. 11. తెల్లవారు ఝామున 4-5 గంటల మధ్య చేసే స్నానం ఋషి స్నానం 5-6 గంటల మధ్య చేసే స్నానం దైవ స్నానం 6-7 గంటల మధ్య చేసే స్నానం మానవ స్నానం 7-8 గంటల మధ్య చేసే స్నానం రాక్షస స్నానం 12. చన్

Bhadrachalam Temple: శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం - భద్రాచలం

Image
శ్రీరామచంద్రమూర్తి పాదధూళితో పునీతమైనదివ్యస్థలం. పవిత్రగోదావరినదీ తీరంలో పుణ్యపురాశిగా విరాజిల్లుతూ ఉన్న మహిమాన్వితపుణ్యక్షేత్రం భద్రాచలం. ఈ క్షేత్రం. ఖమ్మంజిల్లాలో ఉంది.  భద్రాచలానికి ఒకప్పుడు దండకారణ్య మని పేరు. పితృవాక్యపాలకుడైన శ్రీరాముడు అరణ్యవాసం చేస్తూ కొంతకాలం ఈ దండకారణ్యంలో గడిపాడు. ఈ సమయంలో ఒక శిలపై విశ్రమించి, ఆ శిలను ఆశీర్వదించగా, ఆ శిల మరుజన్మలో మేరువు, మేరుదేవిదంపతులకు భద్రుడుగా జన్మించి, నారదుడినుంచి రామమంత్రోపదేశాన్ని పొంది, తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి, శ్రీరాముడు ప్రత్యక్షమై, భద్రుడికోరికపై అక్కడే కొలువుదీరినట్లు కథనం.  బ్రహ్మపురాణం ప్రకారం పర్వతరాజు అయిన మేరువు బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. తపస్సును మెచ్చి, బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాగా మేరువు రామభక్తిపరుడైన కుమారుడిని ప్రసాదించ మని వరం కోరాడు. బ్రహ్మవరం ప్రసాదించాడు. వరంమేరకు మేరువుకు రామభక్తిపరుడైన 'భద్రుడు' కుమారుడిగా జన్మించాడు. భద్రుడు రామదర్శనం కోరి ఘోరతపస్సు చేశాడు. తపస్సును మెచ్చి శ్రీరాముడు శంఖ, చక్ర, ధనుర్భాణాలను ధరించి ప్రత్యక్షంకాగా ఆ రూపంలోనే తన శిరస్సుపై నివాసం ఉండ మని భద్రుడు వరం కోరాడు. అ

Ahobilam Temple: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం - అహోబిలం

Image
అహోబిలం... ప్రసిద్ధి గాంచిన ఈ పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని  కర్నూలు జిల్లాలోని 'నంద్యాల' నుండి 42 కి. మీ దూరంలో ఉంది. నవనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన ఈ క్షేత్రం క్రీ.శ.1398లో స్థాపితమైనదవటం విశేషం. ఈ క్షేత్రం అతిపురాతనమైనదని నృసింహ పురాణం ప్రకారం వెల్లడవుతోంది. 108 దివ్యక్షేత్రాలలో మొదటిది తిరుమల కాగా రెండవది అహోబిలం. స్వామి యొక్క తొమ్మిది రూపాలు ఇక్కడ ఒకేచోట నెలకొని ఉండటం ఈ ఆలయ ప్రాముఖ్యత అని చెప్పుకోవచ్చు. అయితే దిగువ అహోబిలం, ఎగువ అహోబిలంగా స్వామి రెండు ప్రదేశాలలో దర్శనమిస్తారు. దిగువ అహోబిలంలో స్వామి సమీపంలోనే భార్గవ, యోగానంద, ఛత్రవట నారసింహులు దర్శనమిస్తారు. ఇంక ఎగువ అహోబిలమునకు సమీపంలో వరాహ, కారంజ, మాలోల, జ్వాలా, పావన నారసింహలు దర్శనమిస్తారు.  నృసింహ పురాణం ప్రకారంగా ఈ ప్రదేశమునందే తన భక్తుడైన ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుని బారినుంచి రక్షించుటకు స్వామి స్తంభం నుంచి ఉగ్రాకారమైన నృసింహ ఆకారంలో ఉద్భవించాడు. ఇప్పటికీ ఉగ్రస్తంభం అక్కడ కనిపిస్తుంది.  ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు భైరవుడు. నల్లమల కొండలపై నెలకొన్నది అహోబిలం. నల్లమల కొండలు శేషుని ఆకారమనీ, శేషుని శిరస్సుపై తిరుమల

Subramanya Swamy Temple: మట్టిని ప్రసాదంగా ఇచ్చే సుబ్రమణ్య స్వామి ఆలయం

Image
మృత్తికా ప్రసాదం అంటే ప్రసాదరూపంగా మట్టిని ఇచ్చే దేవాలయం మన దేశంలో ఒక్కటే ఉంది. అన్ని దేవాలయాల్లో ప్రసాదంగా భక్తులకు విభూది, కుంకుమ, చందనం తదితరాలను ఇస్తే, కర్నాటకలోని కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి వెళ్ళితే అక్కడి దేవాలయంలో భక్తులకు వల్మీక మృత్తిక (పుట్టమన్ను) ను ప్రసాదరూపంలో అందిస్తారు. ఉడిపి సమీపంలో ఉన్న నాగబనగహళ్లి పట్టణంలో ఉండే ఈ దేవాలయంలో ఇచ్చే మృత్తికా ప్రసాదం అత్యంత పవిత్రమైంది. మహిమాన్వితమైంది.  మృత్తికా ప్రసాదాన్ని ఎవరు ధరిస్తారో వారికి నాగుల భయం ఉండదు. నాగ దేవతల అనుగ్రహం ఉంటుంది. ఎవరైతే పాములను చూసి భయపడతారో, ఎవరికైతే కలలో పాములు ఎక్కువగా కనబడుతుంటాయో అటువంటి వారు మృత్తికా ప్రసాదాన్ని ధరిస్తే సర్పాల భీతి తొలగిపోతుంది. ఆడపిల్లలు ఒక చిటిక మృత్తికను మరో చిటికెడు పసుపును స్నానం చేసే నీటిలో వేసి స్నానం చేసి, తరువాత శ్రీ సుబ్రహ్మణ్యుడికి నేతి దీపాన్ని వెలిగిస్తే వివాహం త్వరగా అవుతుంది. నోటిపళ్ళను కొరుకుతూండటం, కిందపడి కొట్టుకోవడం, ఒకేవైపు తదేకంగా చూస్తూండటం, అదే పనిగా ఏడుస్తూండటం చేసే చిన్నపిల్లల నుదుటన మృత్తికను బొట్టుగా పెడితే వారు ఆరోగ్యంగా ఎదుగుతారు. అనారోగ్యంతో బాధ

Random posts