Posts

Amrutha Lakshmi Vrat: అమృత లక్ష్మీ వ్రతం

Image
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్ల పక్ష విదియ రోజున జరుపుకుంటారు. ఈ వ్రతం సంపదలకు ప్రతిరూపమైన లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ఆచరిస్తారు. ఈ వ్రతం చేసేవారు ఈ రోజు ఉపవాసం ఉంటారు. ఈ రోజున అన్నదానం, వస్త్రదానం వంటి వివిధ రకాల దానాలను చేయడం శ్రేష్ఠం. భౌతిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం అమృత లక్ష్మీ వ్రతం చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన లక్ష్మీదేవి శీఘ్రంగా అనుగ్రహిస్తుందని పండితులు చెబుతారు. అమృత లక్ష్మీ వ్రతం ఆచరించేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాదులు ముగించుకొని పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. ఒక పీఠంపై ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహం ఉంచి పసుపు కుంకుమ, పూలతో అలంకరించుకోవాలి. మొదట గణపతిని ప్రార్థించి లక్ష్మీపూజ ప్రారంభించాలి.లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి, శ్రీ సూక్తం లేదా లక్ష్మీదేవికి సంబంధించిన ఇతర స్తోత్రాలను పారాయణం చేయాలి. కొబ్బరికాయ కొట్టి పండ్లు, తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. వీలయితే బంగారం, వెండి నాణేలు సమర్పించాలి. ఇవి సమర్పించడం వలన లక్ష్మీదేవి సంతుష్టురాలై మనకు మరిన్ని సంపదలు ప్రసాదిస్తుంది. చివరగా హారతి ఇచ్చి పూజ ముగించాలి. 2025: జూన్ 27.

Puri Ratha Yatra: పూరీ జగన్నాధుని రథయాత్ర

Image
  జగన్నాథ రథయాత్ర ఏటా ఆషాఢ శుక్ల విదియ రోజున జరుగుతుంది.  అయితే, రథయాత్ర వేడుక కోసం సన్నాహాలు మాత్రం వైశాఖ శుక్ల తదియ నాడు జరిగే అక్షయ తృతీయ పర్వదినం నుంచే మొదలవుతాయి. వేసవి వల్ల విగ్రహాలకు చందన లేపనాన్ని పూస్తారు. దీనినే ‘గంధలేపన యాత్ర’ అని అంటారు. అక్షయ తృతీయ రోజున పూరీ క్షేత్రంలో రథాల తయారీ మొదలవుతుంది. అదే రోజు నుంచి జగన్నాథుని చందనయాత్ర కూడా మొదలవుతుంది. ఈ యాత్ర 42 రోజుల పాటు కొనసాగుతుంది. మొదటి 21 రోజులను ‘బాహొరొ చందనయాత్ర’ (బహిర్‌ చందనయాత్ర) అంటారు.ఈ యాత్రలో ఉత్సవ విగ్రహాలను మాత్రమే నరేంద్రతీర్థంలో పడవలో ఊరేగిస్తారు. తరువాత 21 రోజులను ‘భితొరొ చందనయాత్ర’ (అంతర్‌ చందనయాత్ర) అంటారు.ఈ యాత్రలో మాత్రం కేవలం నాలుగు రోజులు మాత్రమే (అమావాస్య,  షష్టి, ఏకాదశి, పౌర్ణమి) ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకొస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరిగే ‘స్నానయాత్ర’తో చందనయాత్ర వేడుకలు పూర్తవుతాయి.ఈ రోజు ఆలయ పూజారులు మంత్రోక్తంగా జగన్నాథునికి స్నాన వేడుకను నిర్వహిస్తారు. అందుకే జ్యేష్ఠపౌర్ణమిని ‘స్నానపూర్ణిమ’గా వ్యవహరిస్తారు. స్నానపూర్ణిమ రోజు ‘సునా కువొ’ (బంగారు బావి) నుంచి తెచ్చిన 108 కుండల పవిత...

Bonalu Dates 2025: బోనాల పండుగ తేదీలు 2025

Image
  ఆషాఢ మాసం పరాశక్తిని ఆరాధించే మాసం. ఈ మహాశక్తియే గ్రామగ్రామాన జగదాంబికగా, మహంకాళిగా, ఎల్లమ్మతల్లి, పోచమ్మతల్లి, నూకాలమ్మ, పెద్దమ్మతల్లి, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మలుగా ఆయా చోట్ల కొలువుదీరి, ఆ జగన్మాత అందరిచేత ఆరాధనలందుకుంటోంది. పేర్లు వేరైనా తల్లి ఒక్కటే. తెలంగాణలో అత్యంత గొప్ప పండుగలలో బోనాల పండుగ ఒకటి. బోనాల పండుగ: వెయ్యేళ్ల చరిత్ర, తెలంగాణ సంస్కృతి బోనాల పండుగ వైభవానికి వెయ్యేళ్ళ చరిత్ర ఉంది. తెలంగాణలోని ప్రతి ఇంటి ఆడపడుచు అమ్మవారి అవతారంగా మారి ఈ పండుగలో పాల్గొంటుంది. ఆషాఢ మాసంలో నాలుగు ఆదివారాలు నాలుగు విభిన్న ప్రాంతాలలో జరిగే ఈ పండుగ, తెలంగాణ అంతటా జరిగినా, ముఖ్యంగా జంట నగరాలు (హైదరాబాద్-సికింద్రాబాద్) బోనాల పండుగకు కేంద్ర బిందువుగా మారుతాయి. ఈ మహత్తర పండుగ సంబరానికి శ్రీకారం చుట్టేది మాత్రం గోల్కొండ కోటలో వేంచేసి ఉన్న జగదంబిక బోనాలు. ఆ తల్లికే తొలి బోనం సమర్పిస్తారు. వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న జగదంబికా తల్లికి తొలి బోనం అందించే ఆచారాన్ని మహావీరుడైన ప్రతాపరుద్రుడే స్వయంగా ప్రారంభించాడు. స్వయంగా జగదంబికా తల్లికి పూజలు చేసి అమ్మ అనుగ్రహంతో తమ సామ్రాజ్యాన్ని సుభిక్షం చేసుకున...

Ashada Navratri 2025: ఆషాడ నవరాత్రి, వారాహి నవరాత్రి

Image
వారాహి దేవి హిందూ ధర్మంలో ఒక శక్తివంతమైన దేవత, ఆమె గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. "వారాహి" అనే పదానికి భూమి అని కూడా అర్థం ఉంది. ఆమె విష్ణుమూర్తి యొక్క యజ్ఞవరాహ అవతారం యొక్క శక్తి స్వరూపం. వరాహ ముఖంతో దర్శనమిచ్చే ఈ తల్లి అన్నప్రదాయిని. ఆమె చేతిలో ధరించే నాగలి, రోకలి వంటి ఆయుధాలు అన్నోత్పత్తిని, అన్నపరిణామాన్ని సూచిస్తాయి. దేవతలకు హవ్యం, మానవాది జీవులకు యోగ్యమైన అన్నాన్ని అందించే ఆహార శక్తి ఆమె. వారాహి దేవి - ఒక పరిచయం 'సర్వం శక్తిమయం' అనే భావనే భక్తి, అదే ముక్తి అవుతుంది. ఇది మానవ జీవిత సార్థకతకు మార్గం. వారాహి దేవి అనుగ్రహమే అసలైన వరం, అందరూ దానినే కోరాలి. ఆమె శివుడికి పరిచర్యలు చేసే దేవతలలో ఒకరు, సప్త మాతృకలలో ఒక శక్తి. ఆమె భూసంబంధ దేవత. ఈమెకు ప్రత్యంగిరాదేవి అని కూడా పేరు ఉంది. భూ సంపాదన, భూ సంబంధ వివాదాల పరిష్కారానికి మార్గనిర్దేశనం చేసే దేవత ఈమె. కాశీ క్షేత్రాన్ని రక్షించే దేవతగా ప్రసిద్ధి చెందారు. ఆమె రాత్రంతా కాశీలో సంచరిస్తుందని నమ్ముతారు. కాశీలో అమ్మవారు గ్రామ దేవతగా ప్రసిద్ధి. ఈ అమ్మవారి దర్శనం వేకువన మాత్రమే లభిస్తుంది. వారాహి దేవిని శైవులు, వైష్...

Ashada Month Significance: ఆషాఢ మాసం: ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆరోగ్యపరమైన ప్రాముఖ్యత

ఆషాఢ మాసం, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకతో సహా భారతదేశంలోని పలు ప్రాంతాలలో విశేషమైన సాంస్కృతిక, మతపరమైన, సాంప్రదాయక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది వేసవి (గ్రీష్మ ఋతువు) తీవ్రత నుండి రుతుపవనాల (వర్ష ఋతువు) ఆరంభానికి వారధిగా పరిగణించబడుతుంది. ఆషాఢ మాసం ప్రాముఖ్యత ఆషాఢ మాసం మొదటి రోజు, పాడ్యమి, తొలి మేఘాల ఆగమనంతో రుతుపవనాలను ఆహ్వానిస్తుంది. మండు వేసవి నుండి ఉపశమనాన్ని కలిగించినప్పటికీ, ఆషాఢ మాసాన్ని శూన్య మాసం అని కూడా పిలుస్తారు. దీని అర్థం కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. అందుకే, ఈ నెలలో క్రింది ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేస్తారు: * వివాహాలు * గృహప్రవేశాలు * ఆస్తి కొనుగోళ్లు * కొత్త వ్యాపారాలు ప్రారంభించడం * కొత్త వాహనాల కొనుగోలు సాంప్రదాయ పద్ధతులు, నమ్మకాలు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో ముఖ్యంగా పాటించే ఒక సంప్రదాయం ఏమిటంటే, కొత్తగా పెళ్లయిన దంపతులను, అత్తా-కోడళ్లను ఈ మాసంలో దూరంగా ఉంచడం. ఆషాఢ మాసంలో గర్భం దాల్చితే, వేసవిలో ప్రసవం అవుతుందని, తల్లీ-బిడ్డలకు ఆరోగ్య సమస్యలు రావచ్చని పూర్వం భావించేవారు. సరైన వైద్య సదుపాయాలు లేని ఆ రోజుల్లో, ఈ సంప్రదాయం ఆరోగ్యపరమైన...

Pandharpur Yatra 2025: పండరీపుర్ యాత్ర – భక్తి, ఐక్యతకు ప్రతిరూపం

Image
ప్రతి ఏడాది మహారాష్ట్రలో జరిగే పండరీపుర్ యాత్ర అనేది కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రయాణం కాదు – అది వేలాది మంది భక్తుల అనురాగం, ఆత్మీయత, భగవంతుని పట్ల నిబద్ధతకు నిదర్శనం. శ్రీమహావిష్ణువు అవతారమైన విఠోబా (విఠల్) ఆలయంలో భక్తులు ఆషాఢ ఏకాదశి రోజున దర్శనానికి చేరుకునే ఈ యాత్ర, భక్తి, సంగీతం, సమానత్వం, సేవా దృక్పథాల సమ్మేళనం. యాత్ర ప్రారంభం & ముగింపు : తేదీలు (2025) తుకారాం మహారాజ్ పాల్కీ: జూన్ 18, 2025 → జూలై 5, 2025 జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్కీ: జూన్ 19, 2025 → జూలై 5, 2025   దర్శనం: జూలై 6, 2025 (ఆషాఢ శుద్ధ ఏకాదశి) యాత్ర విశేషాలు: మొత్తం దూరం: సుమారు 250 కిలోమీటర్లు వ్యవధి: సుమారు 20 రోజులు ఆరంభం: దేహు గ్రామం నుంచి తుకారాం మహారాజ్ పల్లకీ అలంది పట్టణం నుంచి జ్ఞానేశ్వర్ మహారాజ్ పల్లకీ ఈ పల్లకీలలో వారి పాదుకలు ఊరేగింపుగా తీసుకెళ్లడం, వారి ఆధ్యాత్మిక ఉనికిని గుర్తుచేస్తుంది. తుకారాం మహారాజ్ బోధనలు – ఆదర్శాల దారిదీపం: భక్తి మేకు మార్గం: హృదయపూర్వకమైన భక్తి ద్వారా మాత్రమే భగవంతుని చేరుకోవచ్చు. సమానత్వం: దేవుని ముందు అందరూ సమానమే – కుల, వర్గ, లింగభేదం తలవించకూడదు. సరళత జీవితం: తక్కువలో తృప్తిగా ఉం...

Ashada Month 2025: ఆషాడ మాసం

Image
  చాంద్రమానంలో నాల్గవ మాసం ఆషాడ మాసం. ఈ మాసంలోని పౌర్ణమి నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రంలో కాని లేదా ఉత్తరాషాఢ నక్షత్రంలో కాని కలిసివుండటం చేత ఈ మాసం ఆషాఢంగా పేరుపొందింది. ఈ మాసం శుభకార్యాలకు అంతగా అనువుకానప్పటికీ, ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. ఈ మాసంలో ఒంటిపూట భోజన నియమాన్ని పాటించడం వల్ల ఐశ్వర్యం లభించి మంచి సంతానం కలుగుతుంది అని శాస్త్రం. ఈ నెలలో గృహనిర్మాణాన్ని ఆరంభించడం వల్ల గోసంపద లభిస్తుంది అని మత్య్స పురాణం చెబుతోంది. ఈ నెలలో ఆడవారు కనీసం ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలంటారు, అలాగే ఆహారంలో మూలగాకు ఎక్కువగా వాడాలి. జపపారాయణలకు ఈ మాసం అనువైనది. కొన్ని ప్రాంతాలలో ఈ మాసంలో కూడా పుణ్య స్నానాలు చేస్తారు. ఈ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది.సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి నప్పటినుండి మకరరాశిలోకి ప్రవేశించే అంత వరకు గల కాలం దక్షిణాయనం. దక్షిణాయన ప్రారంభసమయంలో పుణ్యస్నానాలను, ధాన్యజపాదులను చేయడం ఎంతో మంచిది. ఈ సంక్రమణ సమయంలో చేసే పుణ్య స్నానాల వల్ల రోగాలు నివారించడమే కాక దారిద్య్రం నిర్ములింపబడుతుంది. ఈ మాసంలో చేసే దానాలు విశేష ఫలితాలు ఇస్తాయి. పాదరక్షలు, గొడు...